-
సంకటంలో సెంథిల్
అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ సంకట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. కోట్లాది రూపాయల మేరకు పన్ను చెల్లించకుండా మోసానికి పాల్పడ్డట్టుగా ఆదాయ పన్నుశాఖ వర్గాలు గుర్తించినట్టు సమాచారం. సోదాల్లో పెద్ద ఎత్తున బంగారం, నోట్ల కట్టలు బయటపడ్డట్టుగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నాలుగో రోజు విచారణ ముగించిన అధికారులు 35 మందికి సమన్లు జారీచేయడానికి తగ్గ కసరత్తులో ఉన్నట్టు సమాచారం. సాక్షి, చెన్నై: మాజీ మంత్రి, అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీని గురిపెట్టి సాగుతున్న ఐటీ దాడుల గురించి తెలిసిందే. రాష్ట్రంలో ఇదివరకు ఎన్నడూ లేని రీతిలో ఒకే వ్యక్తిని గురిపెట్టి ఏకంగా నాలుగు రోజుల పాటు ఆదాయ పన్ను శాఖ వర్గాలు దాడులు నిర్వహించడం గమనించదగ్గ విషయం. నిన్నటివరకు కరూర్ జిల్లాలో ముప్ఫై చోట్ల ఆదాయ పన్ను శాఖవర్గాలు తనిఖీలు సాగించాయి. నాలుగో రోజు ఆదివారం కూడా సోదాలు కొనసాగాయి. సెంథిల్ బాలాజీకి అత్యంత సన్నిహితులుగా ఉన్న మిత్రులు, కళాశాలల అధిపతి, పలు సంస్థలకు యజమాని, కాంట్రాక్టర్లు త్యాగరాజన్, నవరంగ్ సుబ్రమణియన్, శంకర్ల చుట్టూ నాలుగో రోజు విచారణ సాగాయి. ఇందులో శంకర్కు చెందిన కార్యాలయాన్ని ఏకంగా అధికారులు సీజ్ చేయడం చర్చకు దారితీసింది. రూ.వంద కోట్లకు పైగా పన్ను ఎగవేత ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న సెంథిల్ బాలాజీ మరింత సంకట పరిస్థితుల్ని ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన సన్నిహితులు, బంధువుల ఇళ్లల్లో మొత్తంగా 35 చోట్ల దాడులు నిర్వహించారు. ఇందులో కోట్లాది రూపాయల మేరకు పన్ను ఎగవేత వ్యవహారం వెలుగులోకి వచ్చినట్టు ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. వంద కోట్ల మేరకు ఎగవేసి ఉండవచ్చని భావిస్తున్నా, దానిని దాటే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. అలాగే, మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని అక్రమార్జనగా వచ్చిన రూ.ఐదు కోట్లకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు, రూ.1.20 కోట్ల నగదుతో పాటు బంగారు ఆభరణాలను సైతం ఈ దాడుల్లో ఐటీ వర్గాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఆదివారం నాటికి విచారణను ముగించిన అధికారులు , పెద్దఎత్తున తమకు లభించిన వాటన్నింటినీ వాహనాల్లో తరలించారు. ఇక, సెంథిల్ మిత్రుడు శంకర్ కార్యాలయం నుంచి రెండు సూట్కేసులను తీసుకెళ్లడంతో అందులో నోట్ల కట్టలు ఉన్నట్టు సమాచారం. బిగుస్తున్న ఉచ్చు ప్రస్తుతానికి అధికారులు దాడుల్ని ముగించినా, విచారణ కొనసాగించే విధంగా ఐటీ వర్గాలు పరుగులు తీస్తుండడంతో సెంథిల్ బాలాజీ మెడకు ఉచ్చు రోజురోజుకు బిగిసే అవకాశాలు ఎక్కువే. ప్రస్తుతం దాడులు జరిగిన ప్రాంతాల్లో లభించిన వాటన్నింటికి వివరాలు, ఆధారాలను సేకరించే విధంగా విచారణ సాగనున్నట్టు ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకోసం ఆయా ప్రాంతాలకు చెందిన ముప్ఫై ఐదు మందిని విచారించేందుకు నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రధానంగా సెంథిల్ బాలాజీ సన్నిహితులు ముగ్గుర్ని తొలుత తమ విచారణ పరిధిలోకి తీసుకొచ్చి విధంగా సమన్లు సిద్ధం చేస్తుండడం గమనార్హం. అలాగే, సెంథిల్ బాలాజీకి సైతం సమన్లు జారీ చేయడానికి రంగం సిద్ధం అవుతోంది. కాగా, పెద్ద ఎత్తున నగదు, నగలు పట్టుబడిన నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వర్గాలు, గతంలో సాగిన అవినీతిపై ఏసీబీ దృష్టి సారించి, సెంథిల్ను కటకటాల్లోకి నెట్టే రీతిలో దూకుడు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. -
దినకరన్ వర్గానికి షాక్!
ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ ఇంటిపై ఐటీ దాడులు సాక్షి, చెన్నై: తమిళనాడులో తిరుగుబాటు రాజకీయాలను నడుపుతున్న దినకరన్ వర్గం ఎమ్మెల్యేలపై తాజాగా కేంద్ర సంస్థలు దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. దినకరన్ వర్గంలో కీలక నేత, ఇటీవల అనర్హత వేటు ఎదుర్కొన్న ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ ఇళ్లపై ఆదాయపన్నుశాఖ దాడులు నిర్వహించింది. సెంథిల్ బాలాజీకి సంబంధించిన ఆస్తులపై పదిచోట్ల ఐటీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. పళనిస్వామి ప్రభుత్వానికి ఎదురుతిరిగిన దినకరన్ వర్గం ఎమ్మెల్యేలపై స్పీకన్ ధనపాల్ ఇటీవల వేటువేసిన సంగతి తెలిసిందే. పళనిస్వామి సర్కారు అసెంబ్లీలో బలనిరూపణకు సిద్ధమవుతున్న వేళ దినకరన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటువేయడంతో తమిళనాడు రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. స్పీకర్ అనర్హత వేటు ఉత్తర్వులను తప్పుబడుతూ దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తాజా పరిణామాల నేపథ్యంలో తమ ఆదేశాలు వచ్చేవరకు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించకూడదంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు మొన్నటివరకు రిసార్ట్లో గడుపుతూ క్యాంపు రాజకీయాలు నడిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెంథిల్ బాలాజీపై ఐటీశాఖ దాడులు జరపడంతో కేంద్ర సంస్థలు దినకరన్ వర్గాన్ని టార్గెట్ చేసినట్టు వినిపిస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement