-
ఒక్క క్షణంలోనే...
సోమవారం వేకువజాము 2.30 గంటలకు నాందేడ్ ఎక్స్ప్రెస్లోని ప్రయాణికులు మంచి నిద్రలో ఉన్నారు. అదే సమయంలో భయకరమైన శబ్ధంతో 25 టన్నుల బరువైన గ్రానైట్ రాయి ఏసీ ఫస్ట్క్లాస్ బోగీలోకి వచ్చిపడింది ఏం జరిగిందో గుర్తించే లోపు ఐదుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఘటనలో దేవదుర్గ ఎమ్మెల్యే, గిరిజన నేత అరికేర వెంకటేష్ నాయక్ దుర్మరణం చెందారు. ఆ దెబ్బకు రైల్వేట్రాక్లోని స్లీపర్లు పగిలిపోయాయి. కుదుపులకు మూడుబోగీలు పట్టాలు తప్పాయి. రైలుమొత్తం 500 మీటర్ల మేర అదుర్లతో ప్రయాణించింది. చిమ్మచీకట్లో బాంబు పేలిన శబ్దం... కుదుపుల ప్రయాణంతో అసలు రైలులో ఏం జరిగిందో? ప్రయాణీకులకు అర్థం కాలేదు. పట్టాలు తప్పిన బోగీలు కిందకు పడిపోకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. - బెంగళూరు -
హత విధీ...
అనంతపురం జిల్లాలో రైలు ప్రమాదం నాందేడ్ ఎక్స్ప్రెస్ను ఢీకొన్న గ్రానైట్ లారీ ఎమ్మెల్యే వెంకటేష్ నాయక్ సహా ఐదుగురి దుర్మరణం పలువురికి గాయాలు బెంగళూరు- నాందేడ్ ఎక్స్ప్రెస్... సోమవారం... తెల్లవారుజామున 2.27 గంటలు... ప్రయాణికులంతా నిద్రమత్తులో ఉన్నారు. రైలు 40 మైళ్ల వేగంతో ముందుకు వెళుతోంది. ఒక్కసారిగా భయకరమైన శబ్ధం.. వెనువెంటనే 25 టన్నుల బరువైన రాయి బోగిలోకి దూసుకువచ్చింది.ఐదుగురి ప్రాణాలను బలిగొంది. బెంగళూరు: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా పెనుగొండ వద్ద రైల్వే ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో రాయచూరు జిల్లా దేవదుర్గ నియోజకవర్గ ఎమ్మెల్యే అరికెరె వెంకటేష్నాయక్ సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. వివరాలు... నాందేడ్ వెళ్లే ఎక్స్ప్రెస్(16594) రైలు ఆదివారం రాత్రి 10:30 గంటలకు బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్ నుంచి బయలు దేరింది. సోమవారం వేకువజామున 2:30 గంటలకు రైలు 132-200/300 కిలోమీటరు వద్ద(పెనుగొండ రైల్వేస్టేషన్ సమీపంలో) లెవెల్ క్రాసింగ్ దాటుతుండగా గ్రానైట్ రాళ్లతో కూడిన టారస్ లారీ వేగంగా వచ్చి రైల్వే గేట్ను ఢీకొని రైలును బలంగా తాకింది. దీంతో లారీలోని గ్రానైట్ రాళ్లు ఎగిరి మొదటి తరగతి ఏసీ కోచ్ (హెచ్-1)పై పడ్డాయి. ఫలితంగా కోచ్ నుజ్జునుజ్జైంది. ఈ బండరాళ్ల కింద పడి హెచ్-1 కోచ్లోని కూపే ఈ, డీలలో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే అరికెర వెంకటేష్ నాయక్ (79), టీఎస్డీ రాజు (53), కాబిన్ ఎఫ్లో ఉన్న ఈదర పుల్లారావు(48)లతో పాటు ఏసీ కోచ్ మెకానిక్గా విధుల్లో ఉన్న సయ్యద్ అహ్మద్ (52), టారస్ లారీ క్లీనర్ నాగరాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లారీలోని బండరాళ్లు ఎగిరిపడటంతో హెచ్1తోపాటు బీ-1, ఎస్-1, ఎస్-2 కోచ్లు కూడా పట్టాలు తప్పాయి. దీంతో ఈ కోచ్ల్లో ఉన్న ప్రయాణికుల్లో దాదాపు 20 మంది గాయపడ్డారు. వీరికి రైల్వే శాఖలోని వైద్య విభాగం అధికారులు అక్కడికక్కడే చికిత్స అందించారు. మరోవైపు గాయపడిన వారిలో పరిస్థితి విషమంగా ఉన్న జగదీష్, శాంతి, సురేష్లను బెంగళూరులోని రైల్వే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గేటు వేసే ఉంది... ప్రమాదం జరిగిన సమయంలో రైల్వే గేటు (నం:77) వేసే ఉందని బెంగళూరు రైల్వే డివిజన్ ఓ మీడియా ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా రెడ్లైట్ వెలుగుతూ ఉండటమే కాకుండా సైరన్ కూడా మోగుతోందని అందులో తెలిపింది. లారీ వేగానికి రైల్వే గేటు కూడా విరిగిపోయిందని రైల్వేశాఖ పేర్కొంది. 20 ప్రత్యేక బస్సులు.... ప్రమాదం తెలిసిన వెంటనే బెంగళూరు డివిజినల్ రైల్వే మేనేజర్ సంజయ్ అగర్వాల్ నేతృత్వంలోని అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వీరితో పాటు బెంగళూరు, గుంతకల్ నుంచి మెడికల్ రిలీఫ్ వ్యాన్లు, యాక్సిడెంట్ రిలీఫ్ రైళ్లులో వైద్య, పారా మెడికల్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు సహాయం అందించారు. మరోవైపు ప్రమాదానికి గురైన రైలులోని మిగిలిన ప్రయాణికులను వారి స్వస్థలాలకు చేర్చడానికి రైల్వే శాఖ 20 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా ప్రయాణికుల బంధువులు, స్నేహితులకు సమాచారం అందించడానికి బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్లో రైల్వేశాఖ ప్రత్యేక హెల్ప్లైన్ను ఏర్పాటు చేసింది. సంతాపం వ్యక్తం చేసిన సిద్ధు రైలు ప్రమాదంలో దేవదుర్గ శాసనసభ్యుడు అరికెర వెంకటేష్నాయక్ చనిపోవడం పట్ల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అతి సౌమ్య మనస్కుడిగా గుర్తింపు పొందిన వెంకటేష్ నాయక్ మరణం పార్టీకు తీరనిలోటని పేర్కొన్నారు. మహదాయి నదీ నీటి పంపకం విషయమై జరిగిన అఖిల పక్షం సమావేశానికి హాజరైన వెంకటేష్ నాయక్ అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం తనను కలిచివేస్తోందని సోమవారం సాయంత్రం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ మాజీ సీఎం ధరంసింగ్ కూడా వెంకటేష్ నాయక్ మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. రెండు రైళ్ల సర్వీసులు రద్దు దుర్ఘటన వల్ల హిందూపూర్-గుంతకల్ ప్యాసింజర్ (57438), బెంగళూరు కంటోన్మెంట్-విజయవాడ ప్యాసింజర్ (56503) రైల్వే సర్వీసులను అధికారులు రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లిం చారు. హెల్ప్లైన్నం:080-23339162, 22354108,22156554, 08023339163,09701374062,09493548005,9731666751,09448090399
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
అతనితో డేటింగ్.. తొలిసారి నోరువిప్పిన ముద్దుగుమ్మ!
త్వరలో లాంచ్ కానున్న కొత్త బెంట్లీ కారు ఇదే.. ఫోటోలు
AP: ఎన్నికల హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు
ఐపీఎల్లో విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే!
Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
స్వాతి మలివాల్పై దాడి.. ఆమ్ ఆద్మీ సంచలన ఆరోపణలు
దేవర సాంగ్ ప్రోమో.. ఆ రోజు ఇక గూస్బంప్సే!
Sangeetha Sringeri: పునీత్ రాజ్కుమార్ సమాధి వద్ద నటి బర్త్డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
ఇదే చివరిది: అతిచిన్న, పాపులర్ వ్లాగర్ ఎమోషనల్ వీడియో వైరల్
తప్పక చదవండి
- Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
- కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
- కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
- పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- విద్యుత్ షాక్తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన డాక్టర్
- T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
Advertisement