-
పర్యావరణ హితం ప్రతి ఒక్కరి బాధ్యత
అనంతపురం కల్చరల్: మట్టి వినాయక విగ్రహాలను వినియోగించడం వల్ల పర్యావరణానికి మేలు చేసిన వారమవుతామని, అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆ మేరకు కృషి చేయాలని ఎస్పీ అశోక్కుమార్ పిలుపునిచ్చారు. గురువారం ఆయన సరోజినీరోడ్డులోని శ్రీపాద కాంప్లెక్స్ ఆవరణలో హిందూ ధార్మిక ప్రచార మండలి జిల్లా అధ్యక్షుడు శ్రీపాద వేణు ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరవాసులు భారీ సంఖ్యలో హాజరై విగ్రహాలు తీసుకువెళ్లారు. కార్యక్రమంలో ధర్మప్రచార మండలి ప్రధాన కార్యదర్శి నాగేశ్వరి, డాక్టర్ నారాయణ, సోమనాథ్ పాల్గొన్నారు. అలాగే ప్రముఖ యోగా సంస్థ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలోనూ ఉచిత మట్టి వినాయకుల పంపిణీ జరిగింది. యోగా శిక్షకులు పొడమల రమేష్బాబు, మమత తదితరులు పర్యావరణాన్ని పాడు చేసే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను వాడబోమని ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. విగ్రహాలు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ అనంతపురం సప్తగిరి సర్కిల్: పర్యావరణహితాన్ని కాంక్షిస్తూ సాయి అప్న డ్రైవింగ్ స్కూల్ వారు తయారు చేసిన మట్టి వినాయక విగ్రహాలను గురువారం ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి పంపిణీ చేశారు. -
రూపాయి ఖర్చు లేకుండా..
♦ అధికారంలోకి వస్తే ఒక్కో గాలిమర కింద 10 మందికి ఉద్యోగాలు ♦ పరిటాల సునీత వల్ల రాప్తాడు నియోజకవర్గంలో 74వేల ఎకరాల ఆయకట్టు కోల్పోతున్నాం ♦ ఆర్నెళ్లలో పట్టిసీమను పూర్తిచేశాననే ముఖ్యమంత్రి.. దమ్ముంటే పేరూరుకు నీళ్లివ్వాలి ♦ తాగునీళ్లు కూడా ఇవ్వలేని మంత్రి పదవి ఉంటే ఎంత? లేకుంటే ఎంత? ♦ రాప్తాడు నియోజకవర్గంలో అరాచక పాలన సాగుతోంది : తోపుదుర్తి ప్రకాశ్ ♦ కరువుపై చంద్రబాబు మొండిగా వ్యవహరిస్తున్నారు : ఎమ్మెల్యే విశ్వ, ఎమ్మెల్సీ గోపాల్రెడ్డి ♦ చంద్రబాబు చర్యలతో ‘అనంత’కు తీరని నష్టం : మాజీ ఎంపీ అనంత (సాక్షిప్రతినిధి, అనంతపురం): ‘కర్నూలు జిల్లా మల్యాల నుంచి జీడిపల్లికి నీళ్లు తెచ్చేందుకు రూ.వెయ్యికోట్లు కేటాయించారు. జీడిపల్లి నుంచి పేరూరుకు నీళ్లిచ్చేందుకు రూ.1300కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దోపిడీ చేయడం మినహా నీళ్లిచ్చే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు. మడకశిర బ్రాంచ్ కెనాల్ పరిధిలో లిఫ్ట్ల సామర్థ్యం పెంచితే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా తురకాలాపట్నం నుంచి నీళ్లు ఇస్తా!’ అని వైఎస్సార్సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ‘రైతు పోరుబాట’ పేరుతో శనివారం చెన్నేకొత్తపల్లిలో భారీ బహిరంగసభ నిర్వహించారు. టీడీపీ నేతలు ఇటీవల వైఎస్ విగ్రహాన్ని కూల్చేయడం, ప్రత్యేకించి రాప్తాడు నియోజకవర్గంలో తరచూ ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంతో నిరసన తెలిపేందుకు నియోజకవర్గం నుంచి పార్టీ కార్యకర్తలు, వైఎస్ అభిమానులు భారీగా తరలివచ్చారు. మొదటగా ఇటీవల వైఎస్ విగ్రహాన్ని తొలగించిన స్థానంలో నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రోజా, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, నాయకులు తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, చందులు విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బహిరంగసభలో ప్రకాశ్రెడ్డి మాట్లాడారు. ‘రాప్తాడు నియోజకవర్గంలో ఓట్లు బడుగు, బలహీనవర్గాలవి. పెత్తనం దొరలది. మండలానికో పెత్తందారిని నియమించి రాచరిక పాలన సాగిస్తున్నారు. చెన్నేకొత్తపల్లి మండలంలో ఏదైనా పనికోసం పేదలు పోలీస్స్టేషన్, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలకు వెళితే ‘పెద్దయ్యతో ఫోన్ చేయించు!’’ అంటారు. ఎవరు పెద్దయ్య? ఎవరికి పెద్దయ్య? చెన్నేకొత్తపల్లిలో ఎన్నో గ్రామాలకు తాగునీళ్లు లేవు. నీళ్లు కూడా ఇవ్వలేని మంత్రి పదవి సునీతకు అవసరమా? ఇలాంటి పరిస్థితి ఉంటే సిగ్గు, ఎగ్గూ లేకుండా వైఎస్ విగ్రహాలు కూల్చేస్తున్నారు. మా మంచితనాన్ని చేతకానితనంగా భావించొద్దు. గాలిమరల కంపెనీలతో డబ్బులు దండుకుని నియోజకవర్గంలోని నిరుద్యోగుల కడుపుకొడుతున్నారు. మేం అధికారంలోకి వస్తే ఒక్కో గాలిమర పరిధిలో 10మందికి ఉద్యోగాలు ఇస్తాం. నియోజకవర్గంలో అరాచక పాలన సాగుతోంది. బోయ ఓబులేసును కొట్టినా, కురబ రాజేంద్ర ఎంపీపీ కాకుండా రాజకీయం చేసినా చర్యలు లేవు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని గ్రహించాలి’ అని అన్నారు. ధనార్జనే లక్ష్యంగా పని చేస్తున్నారు ‘గొల్లపల్లి రిజర్వాయర్ పనులను పాతకాంట్రాక్టర్కు రద్దు చేయించి, నామినేషన్ కింద రూ.53కోట్లతో సునీత తన బినామీ కాంట్రాక్టర్కు పనులు కట్టబెట్టింది. ఇందులో రూ.6.73కోట్లు మేర ఎక్కువ చెల్లింపులు జరిగాయని కాగ్ పేర్కొంది. అయినా ఎలాంటి చర్యలు లేవు. 2, 3 ప్యాకేజీల్లో కూడా చంద్రబాబు, సునీత బినామీ కంపెనీలైన సీఎం రమేశ్, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్కు పనులు కట్టబెట్టారు. సునీత పాత కాంట్రాక్టు రద్దు చేయడం వల్ల రాప్తాడు నియోజకవర్గంలో 74వేల ఎకరాల ఆయకట్టును కోల్పోయాం. హంద్రీ–నీవా వెడల్పు చేస్తామని చంద్రబాబు అంటున్నారు. వైఎస్ డిజైన్ చేసింది 100 క్యూబిక్ మీటర్లు. మీరు చెబుతోంది అంతే! ఎకరా ఆయకట్టుకు కూడా నీళ్లు ఇవ్వలేనపుడు పనులు ఎందుకు చేయాలి. మట్టిపనులు తవ్వి నిధులు స్వాహా చేయడం మినహా ఇందులో మరో ఉద్దేశ్యం లేదు. పట్టిసీమను 6నెలల్లో పూర్తి చేశామని చంద్రబాబు గొప్పలు చెబుతున్నారు. అదే చిత్తశుద్ధి పేరూరుపై ఉంటే ఆర్నెళ్లలో నీళ్లు ఇస్తామని చంద్రబాబు చెప్పగలడా?’ అని ప్రకాశ్రెడ్డి నిలదీశారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ తోపుదుర్తి కవిత, వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, మాజీ మేయర్ రాగే పరుశురాం, రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్రెడ్డి, ట్రేడ్యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆదినారాయణరెడ్డి, రైతు విభాగం రాయలసీమ అధ్యక్షులు శరత్ చంద్రారెడ్డి, నాయకులు ఆలమూరు శ్రీనివాసరెడ్డి, మీసాల రంగన్న, శ్రీదేవి, రంగంపేట గోపాల్రెడ్డి, మహానందిరెడ్డి, కృష్ణవేణి, దేవి, నాగేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డి, రామాంజనేయులు, బాలకృష్ణారెడ్డి , సాధిక్వలి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ విగ్రహం కూల్చడంపై క్షమాపణ చెప్పాలి ‘ప్రజల గుండెల్లో నుంచి వైఎస్ను చెరిపివేయాలనుకోవడం కాదు.. చేతనైతే వైఎస్ కంటే మంచిపాలన అందించండి. అంతేకానీ విగ్రహాలు కూల్చేయడం కాదు. వెంటనే విగ్రహం కూల్చివేతపై ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి. 130 ఏళ్లలో భయంకర కరువు ఇది. బతకలేక ప్రజలు వలసెళ్లారు. మూడేళ్లలో 200మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయినా ‘అనంత’పై చంద్రబాబుకు కనికరం లేదు. కరువుపోగొడతా అని రెయిన్గన్లకు రూ.160కోట్లు ఖర్చు చేశారు. ఖర్చుల పేరుతో మరో రూ.100 కోట్లు కాజేసేందుకు స్కెచ్చేశారు. ‘సాక్షి’లో కథనం రాగానే ఆగారు. పంటకుంటలు తవ్వాలని చంద్రబాబు చెబుతున్నారు. పంట కుంటల్లో కాంక్రీట్ వేస్తారు. ఆ నీరు భూమిలోకి ఇంకదు. జిల్లాలో ఆవిరి నష్టం ఎక్కువ. నీరు వృథా అవుతుంది. ఇదే జరిగితే భూగర్భజలాలు తగ్గి లక్షల బోర్లు ఎండిపోతాయి. చంద్రబాబు లెక్కప్రకారం 1.10కోట్ల ఖాతాల్లో రూ.87 వేలకోట్ల రుణాలను మాఫీ చేయాలి. మాఫీ జరగకపోవడంతో 40లక్షల ఖాతాలు డిఫాల్డ్ అయ్యాయి. ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ఓ జోకర్లా మారిపోయాడు. –ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి బాబు చర్యలతో రైతులకు తీరని నష్టం ‘రూ.1070కోట్లతో ఇన్పుట్ సబ్సిడీ కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపితే అందులో 50 శాతం రూ.535కోట్లు కేంద్రం విడుదల చేసింది. రాష్ట్రవాటా 535కోట్లు కలిపి 1070కోట్లు ఇన్పుట్సబ్సిడీ రావాలి. మరో 450కోట్లు ఇన్సూరెన్స్ రావాలి. కానీ ఇన్సూరెన్స్ను తమ వాటాగా రాష్ట్ర ప్రభుత్వం భావించి ఇన్సూరెన్స్, ఇన్పుట్సబ్సిడీ అన్నీ కలిపి రూ.1030 కోట్లు ఇస్తామంటోంది. ఇలా చేయడం ‘అంనత’ రైతులకు తీరని మోసం చేయడమే! చంద్రబాబు తన జేబు కంపెనీ అయిన బజాజ్కు ప్రీమియం చెల్లించేలా చేశారు. వారికున్న లావాదేవీలతో ఇన్సూరెన్స్పై నిలదీయలేకపోతున్నారు. రైతులు ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోద్దు. ప్రభుత్వం మెడలు వంచైనా మన హక్కులు సాధించుకుందాం’. – అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీ విగ్రహాలపై ప్రతాపమెందుకో? రైతులకు మూడు పూటలా అన్నం పెట్టిన పెద్ద దిక్కు, ఇళ్లు లేని నిరుపేదలు తలదాచుకునేందుకు 45 లక్షల గృహాలు నిర్మించిన మహోన్నత నేత విగ్రహాలను ధ్వంసం చేయడం బాధాకరం. దౌర్జన్యాలు చాలాకాలం నిలవవు. రైతులకు చెల్లించాల్సిన ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ను ఇప్పటిదాకా చెల్లించకుండా కాలయాపన చేస్తున్న మహానుభావుడా? రైతుల ప్రాణాలతో ఆడుకోవద్దు. వారి స్వేదం పది మందికీ అన్నం పెడుతుంది. అలాంటి రైతుల ఉసురు తీసేలా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ పాపాన్ని మూటగట్టుకోవద్దు. – ఎమ్మెల్సీ గోపాల్రెడ్డి పోరుబాటకు మీరే బాసట ప్రజల సంక్షేమ కోసం తలపెట్టిన ఈ రైతు పోరుబాటకు ప్రజలు బాసటగా నిలవడం చూస్తే గర్వంగా ఉంది. కరువుతో రైతుల ఆత్మహత్యలు ఓవైపు, వర్షాలు రాక తాగేందుకు గుక్కెడు నీరు లభించని దుర్భిక్ష పరిస్థితులు మరోవైపు నాట్యం చేస్తుంటే ముఖ్యమంత్రి ఈ జిల్లాలోనే పుట్టినరోజు వేడుకలు జరుపుకొంటానని చెప్పడం సిగ్గుచేటు. అయ్యా..! ఈ జిల్లాలో ఇకపై మీ జన్మదిన వేడుకలు జరుపుకోవద్దు. కరువుతో పోట్లాడలేక ఇబ్బంది పడుతున్న మాపై మీ పుట్టినరోజు వేడుకల ఖర్చులు కూడా మోపి మరింత దెబ్బతీయొద్దు. – వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులా? ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినా అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారు. టీడీపీ నేతలు చట్టాన్ని పూర్తిగా చేతుల్లోకి తీసుకుని ప్రజాస్వామాన్ని ఖూనీ చేసేలా వ్యవహరిస్తున్నారు. ప్రజలు గుండెల్లో గుడి కట్టుకుని పూజించే వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని ఏ ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు. – రాయదుర్గం సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డి 70 ఏళ్ల నాటి కరువు చూస్తున్నాం 70 ఏళ్ల క్రితం నాటి కరువు స్పష్టం కనిపిస్తోందని పెద్దలు చెబుతున్నారు. పాలకులు రైతు సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రకృతి కూడా సహకరిస్తుంది. వైఎస్సార్ మనసు మంచిది కావడంతోనే ఆయన పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండేది. – కదిరి సమన్వయకర్త సిద్దారెడ్డి ఏం ఒరగబెట్టావు ‘బాబూ’ ‘అనంత’ అంటే అమితమైన ప్రేమని చెబుతున్నావు. మూడేళ్లలో జిల్లాకు ఏం ఒరగబెట్టావు. పలానా కార్యక్రమం చేశానని చంద్రబాబు కానీ, టీడీపీ నేతలు కానీ చెప్పగలరా?. ఇలాంటివారు అనంతకే మొదటి ప్రాధాన్యత అని చెప్పడం సిగ్గుచేటు. ప్రతీసారి ప్రజలు మోసపోరు. వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతారు. – నదీం అహ్మద్, మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జేసీని మెడబట్టి బయటకు నెడతారు తాడిపత్రికి చెందిన జేసీకి బయటి వారిపైనే నోటి దురుసు. బయట మాట్లాడే మాటలు ఇంట్లో పిల్లల్ని అంటే కుటుంబ సభ్యులే వారిని మెడబట్టి బయటకు నెడతారు. కేవలం బాబును ప్రసన్నం చేసుకునేందుకు ఇంత దిగజారి వ్యవహరించాల్సిన అవసరం లేదు. – తాడిపత్రి సమన్వయకర్త పెద్దారెడ్డి గూండాలను ఎన్నుకున్నామా? ప్రభుత్వ ఉద్యోగులను చెప్పుతో కొట్టేవారు కొందరు.. ఆత్మహత్య చేసుకునేదాకా వేధించేవారు మరికొందరు.. మహిళలు అని కూడా చూడకుండా అధికారులపై దాడి చేసేవారు ఇంకొందరు.. ఓట్లేసి గూండాలను ఎన్నుకున్నట్లయింది. – మడకశిర సమన్వయకర్త తిప్పేస్వామి 20 సార్లు పర్యటించినా ప్రయోజనం శూన్యం ఆరొందల అబద్ధాలతో మూడేళ్లపాటు కాలం వెళ్లదీస్తున్న చంద్రబాబు ఈ జిల్లాకు 20 సార్లు వచ్చి వెళ్లినా ఒక్క పైసా కూడా జిల్లా అభివృద్ధిని కాంక్షించి ఖర్చు చేయలేదు. వైఎస్సార్ విగ్రహాలను ఈ ప్రాంతంలో ధ్వంసం చేసిన వారిని శిక్షించాల్సిన పోలీసులు చిల్లర దొంగలపై కేసులు బనాయించి చేతులు దులుపుకొంటున్నారు. – రాష్ట్ర యువజన కార్యదర్శి ధనుంజయయాదవ్ -
నిరుద్యోగ భృతిపై బాబును నిలదీస్తాం
- ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి బనగానపల్లె: నిరుద్యోగ భృతిపై సీఎం చంద్రబాబును నిలదీస్తామని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బనగానపల్లె నియోజకవర్గం నుంచి 75శాతం వైఎస్ఆర్సీపీకే ఓట్లు లభించడంతో అందుకు సహకారం అందించిన వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కాటసానిరామిరెడ్డిని ఆయన స్వగృహంలో బుధవారం కలిశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వెన్నపూస గోపాల్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీని టీడీపీ అధినేత మరిచారన్నారు. నిరుద్యోగులకు న్యాయం జరిగేలా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభిస్తే 13 జిల్లాల్లో లక్షమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. వెనుబడిన రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్పీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్రెడ్డి మంచి మెజార్టీతో విజయం సాధించారన్నారు. వైఎస్సార్సీపీని ఆదరించిన పట్టభద్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
'జ్యోతిష్యం బలంగా నమ్ముతా.. తెలుగులో నటించడం అదృష్టం భావిస్తున్నా'
కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (ఫొటోలు)
భారీగా బయటపడ్డ అక్రమ ఆస్తుల చిట్టా
లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామంటున్న గజల్ అలఘ్.. ఎవరీమె?
ఏసీపీ ఉమామహేశ్వరరావు కేసులో బిగ్ ట్విస్ట్
గ్లామర్ షో, వరుణ్ ధావన్ బేబీ జాన్ తో కీర్తి సురేష్ ఓకే
గ్లామర్ షో, వరుణ్ ధావన్ బేబీ జాన్ తో కీర్తి సురేష్ ఓకే
T20: బంగ్లాకు షాకిచ్చిన పసికూన.. మినీ టీమిండియా అంటూ..
నేను గీతాంజలిలా కాదు.. ఒక్కొక్కరి అంతు తేల్చేస్తా
లాభాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- చనుగొండ్లలో చిరుత పిల్లల సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు
- ఇజ్రాయెల్ హెచ్చరిక.. రాయబారులు వెనక్కి రండి
- మూడేళ్ల చిన్నారిపై విద్యుత్ చౌర్యం కేసు
- నిర్మాత మోసం.. నిజాలు బయటపెట్టిన హీరోయిన్ నమిత
- వరంగల్లో అర్ధరాత్రి బాంబుల మోత, కారణం ఏంటంటే..
- నేమ్ప్లేట్ మార్చేసిన సూపర్ మామ్ సానియా మీర్జా ఫోటోలు వైరల్
- స్టార్లైనర్ క్యాప్సుల్ ప్రయోగం మళ్లీ వాయిదా..కారణం..
- RR vs RCB: వార్ వన్సైడ్.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం
- Kalki 2898: 12 సెకన్లు.. రూ.3 కోట్లు, రాజమౌళిని ఫాలో అవుతున్న ‘కల్కి’టీమ్!
- ‘కంగనా కాలు మోపిన ఆలయాలను శుద్ధి చేయాలి’
Advertisement