-
చుండూరు కేసులో దోషులెవరు?
ఎమ్మెల్సీ లక్ష్మణరావు చుండూరు: చుండూరు కేసులో దళితులను చంపిన దోషులెవరో న్యాయవ్యవస్థ తెలిపాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. మంగళవారం కులవివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో చుండూరు రక్తక్షేత్రం నుంచి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చుండూరు కేసు తీర్పులో రాష్ట్ర హైకోర్టు తీరుపై ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఈ కేసులోని ముద్దాయిలందరూ నిర్దోషులైతే మరి దోషులెవరో తెలపాలని డిమాండ్చేశారు. పాదయాత్ర ద్వారా న్యాయవ్యవస్థకు కనువిప్పు కలిగించి సుప్రీంకోర్టులో సంఘటితంగా పోరాడాలన్నారు. కుల వివక్షపోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షురాలు డి.రమాదేవి మాట్లాడుతూ దళితుల కేసుల్లో అగ్రవర్ణ జడ్జీలను నియమించి అన్యాయమైన తీర్పులు ఇచ్చారన్నారు. కేసును వేరొక బెంచ్కి మార్చమని కోరితే కోర్టు ధిక్కారం కేసులతో బాధితులను, బాధితుల తరపు న్యాయవాదులను భయబ్రాంతులకు గురిచేయడం సరికాదన్నార. చుండూరు దళిత బాధిత పోరాట కమిటీ కన్వీనర్ జాలాది మోజెస్ మాట్లాడుతూ సుప్రీంకోర్టులో కేసు తెలేవరకు రాష్ట్ర హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం స్టే కోరాలన్నారు. ముందుగా రక్త క్షేత్రంలోని మృతవీరుల సమాధులపై పూలమాలలతో నివాళులర్పించిన నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్ర చేపట్టారు. ఎస్ఎఫ్ఐ కళాజాత బృందాలతో అంబేద్కర్నగర్లోని ప్రధాన వీధుల్లో పాదయాత్ర చేపట్టి అమృత లూరు మండలంలోకి ప్రవేశించారు. కార్యక్రమంలో హైదరాబాద్ ఉర్దూ యూనివర్సిటీ ప్రొఫెసర్ రత్నాకర్, కెవీపిఎస్ నేతలు జాలా అంజయ్య, తురుమెళ్ల కృష్ణమోహన్, అంబేద్కర్ నగర్ సర్పంచ్ పెరిశమ్మ, జాలాది రూబేన్, పాశం రామారావు, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. చుండూరు సీఐ కళ్యాణ్రాజ్ ప్రత్యేక పోలీస్ బలగాలతో బందోబస్తు నిర్వహించారు. -
సివిల్స్తో సమాజసేవకు అవకాశం
నరసరావుపేట రూరల్,న్యూస్లైన్: సాఫ్ట్వేర్ ప్రపంచం కుటుంబానికే పరిమితమైతే సివిల్స్ వల్ల సమాజానికి సేవచేసే అవకాశం ఉంటుందని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. జొన్నలగడ్డ శివారు అమరా ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయస్థాయి టెక్నికల్ సింపోజియం ప్రారంభోత్సవం గురువారం నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రోజారాణి అధ్యక్షత వహించగా.. ముఖ్యఅతిథి లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 700 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయన్నారు. ఏటా లక్ష మంది ఇంజినీరింగ్ విద్య పూర్తిచేసుకుని బయటకు వస్తున్నారని, అందరూ సాఫ్ట్వేర్ రంగం వైపు మొగ్గుచూపితే సమాజసేవలో ఎవరు పాల్గొంటారని ప్రశ్నించారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి అఖిలభారత సర్వీసులు సాధిస్తే సమాజసేవ చేసే అవకాశం ఉంటుందన్నారు. కళాశాల చైర్మన్ అమరా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఏడాది తమ కళాశాలలో నిర్వహిస్తున్న టెక్నికల్ సింపోజియంలో అనేక ప్రాంతాల ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్యనభ్యసించి ఉన్నతస్థానాలను అధిరోహించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. తొలుత ఎమ్మెల్సీ లక్ష్మణరావు, కళాశాల చైర్మన్ అమరా వెంకటేశ్వరరావులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా.. మొద టిరోజు సింపోజియంలో పేపర్, పోస్టర్ ప్రజంటేషన్, ప్రాజెక్ట్ ఎక్స్పో క్విజ్ పోటీలు నిర్వహించారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
పరిపూర్ణం.. కోన సంబరం
ఉపాధికి మెండైన పాలి‘టెక్నిక్’
● ఢిల్లీ రోడ్డు ప్రమాదంలో చౌడేపల్లె యువకుడు మృతి ● ఒక్కగానొక్క కుమారుడి మృతితో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు ● దుఃఖంలోనూ అవయవదానానికి అంగీకారం
షోకాజ్ నోటీసులను ఉపసంహరించండి
ట్రాన్స్కో వర్క్ ఆర్డర్లు పూర్తి చేయాలి
కౌంటింగ్పై అవగాహన తప్పనిసరి
● మగబిడ్డకు జన్మనిచ్చిన గంటలోపే బాలింత మృతి ● వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న కుటుంబ సభ్యులు ● ఆస్పత్రి వద్ద ధర్నా.. పోలీసులకు ఫిర్యాదు
న్యాయమూర్తులకు ముగిసిన శిక్షణ
● మరో పదిరోజుల్లో ఓట్ల లెక్కింపు ● ఎన్నికల ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ ● జూన్ 4వ తేదీన తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
వైభవం.. వసంతోత్సవం
తప్పక చదవండి
- కిషన్ లీలలెన్నో..!
- అన్నమయ్య: YSRCP కార్యకర్త దారుణ హత్య
- Hyderabad: విమానం గాల్లో ఉండగా డోర్ తెరిచే ప్రయత్నం..
- నాగోలు: మద్యం తాగుతూ.. గొడవ పడుతూ యువతి హల్చల్
- జువెలర్ల ఆదాయమూ ‘బంగారమే’
- హైదరాబాద్పై బీజేపీ, కాంగ్రెస్ కుట్ర
- మేడిన్ ఇండియా రేంజ్ రోవర్
- గిరికీలు కొట్టిన హెలికాప్టర్
- వలపు వల విసిరి.. చర్మం వలిచి.. ముక్కలుగా నరికి
- విస్తృతంగా పోలీసుల తనిఖీలు
Advertisement