-
డిజిటల్ అడ్వర్టయిజింగ్ మార్కెట్పై.. విదేశీ పెత్తనం
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటిష్ కాలంలో కాటన్ ఎగుమతి చేసి బట్ట లు దిగుమతి చేసుకునేవాళ్లమని పెద్దలు చెబుతుంటారు. ఇదే తరహాలో మన దేశం ఒక విచిత్ర సమస్య ఎదుర్కొంటోంది. మనం సాఫ్ట్వేర్ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నాం. ప్లాట్ఫామ్లు మనమే క్రియేట్ చేసి ఇస్తున్నాం. కంటెంట్ మనదే. పాఠకులు, శ్రోతలు, ప్రేక్షకులు మనవాళ్లే. ప్రకటనలపై వెచ్చించేది మనవాళ్లే. ఆదాయం మాత్రం.. ఈ ప్రకటనలను సమీకరించి ప్రచురణకు ఇస్తున్న విదేశీ డిజిటల్ యాడ్స్ ఏజెన్సీలది. మనకు గూగుల్ కేవలం ఒక సెర్చ్ ఇంజిన్గా మాత్రమే తెలుసు. కానీ దీని ప్రధాన ఆదాయ వనరు డిజిటల్ యాడ్స్. కం పెనీల నుంచి యాడ్స్ తీసుకోవడం, డిజిటల్ పబ్లిషర్స్కు ప్రచురించేందుకు ఇవ్వడం. దీని ద్వారా డిజిటల్ పబ్లిషర్స్కు కొంత ఇవ్వడం, అది కొంత వాటా తీసుకోవడం. ఫేస్బుక్ మనకు కేవలం సోషల్ మీడియాగానే తెలుసు. కానీ మనం ఒక యాడ్ ఇవ్వాలనుకున్నా, ఒక పోస్ట్ చాలా మందికి చేరాల నుకున్నా మనం డబ్బులు వెచ్చించాలి. అంటే కేవలం తన సోషల్ మీడియా యాప్లోనే యాడ్స్ ప్రచురించి సొమ్ము చేసు కుంటుంది. యూజర్స్ మనమే. డబ్బులు వెచ్చించేది చాలావరకు భారతీయ కంపెనీలే. చూసేది మనమే. క్లిక్ చేసేది మనమే. ఆయా యాప్లను నిర్మించింది, నిర్మించే సత్తా ఉంది మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే. ఈ యాప్లు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించుకున్నాయి. కానీ మన పబ్లిషర్లకు పెద్దగా మిగిలిందేమీ లేదు. చైనా యాప్స్ బ్యాన్ ప్రభావం ఎలా ఉండబోతోంది.. 59 చైనా యాప్స్ను కేంద్ర ప్రభుత్వం నిషేధించడం, వోకల్ ఫర్ లోకల్ పిలుపు బాగా ప్రాచుర్యంలోకి రావడంతో ఇండియా డిజిటల్ అడ్వర్టయిజ్మెంట్ రంగం స్వదేశీ కంపెనీలను ఆకర్షిస్తోంది. 80 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఉన్న దేశంలో ప్రకటనలను సమీకరించి ప్రచురణకు ఇచ్చే డిజిటల్ ఏజెన్సీలకు, స్వదేశీ సోషల్ మీడియా యాప్లకు, ఆన్లైన్ వీడియో యాప్లకు, స్వదేశీ ఓటీటీలకు భారీ అవకాశాలు ముందున్నాయి. అలాగే స్వదేశీ బ్రౌజర్లు, స్వదేశీ న్యూస్ అగ్రిగేటర్లు, స్వదేశీ న్యూస్ యాప్లకు బోలెడు అవకాశాలు ఆహ్వానం పలుకనున్నాయి. కంటెంట్, యూజర్లు, ప్రకటనలకు కొదవలేనందున ప్లాట్ఫామ్లు కూడా స్వదేశీ అయితే దేశ ఆర్థిక వృద్ధిలో అవీ భాగమవుతాయి. డెంట్సూ నివేదిక ఏం చెప్పింది? గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, టిక్టాక్ యాడ్స్(టిక్టాక్ యాప్ను కేంద్రం బ్యాన్ చేసింది) ఇలాంటి డిజిటల్ యాడ్ ఏజెన్సీల హవా నడుస్తున్న ప్రస్తుత తరుణంలో డెంట్సూ ఏజిస్ నెట్వర్క్(డీఏఎన్) తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం డిజిటల్ అడ్వర్టయిజింగ్ ఇండస్ట్రీ 2019–20 నాటికి రూ. 13,683 కోట్ల టర్నోవర్తో ఉంది. అంతకుముందు ఏడాదితో పోల్చితే 26 శాతం వృద్ధి రేటు నమోదైంది. 2020–21 నాటికి ఇది రూ.17 వేల కోట్లకు చేరనుంది. అలాగే 2022 నాటికి డిజిటల్ అడ్వర్టయిజింగ్ ఇండస్ట్రీ రూ.28,249 కోట్లకు, 2025 నాటికి రూ.58,550 కోట్లకు చేరనుంది. కాగా ప్రస్తుతం వాణిజ్య ప్రకటనల ఇండస్ట్రీ టర్నోవర్ మొత్తం మన దేశంలో రూ.68,475 కోట్లు ఉండగా.. 2025 నాటికి రూ.1,33,921 కోట్లకు చేరనుంది. ఈ రంగం ఏటా 11 శాతం వృద్ధి సాధిస్తుండగా.. డిజిటల్ యాడ్స్ రంగం మాత్రం ఏటా 27.42 శాతం వృద్ధి రేటు నమోదు చేసుకోనుందని డెంట్సూ ఏజిస్ నెట్వర్క్(డీఏఎన్) తన నివేదికలో తెలిపింది. దూసుకుపోతున్న మొబైల్ యాడ్ మార్కెట్ చవకైన డేటా ప్లాన్స్, స్మార్ట్ ఫోన్ల అందుబాటు కారణంగా డిజిటల్ యాడ్స్పై వెచ్చించేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. డిజిటల్ అడ్వర్టయిజింగ్ మార్కెట్లలో మొబైల్ యాడ్స్పై వెచ్చించే మొత్తం ప్రస్తుతం 40 శాతం ఉంది. అది ఈ ఆర్థిక సంవత్సరం చివరికి 52 శాతానికి చేరనుంది. మిలీనియల్స్ను దృష్టిలోపెట్టుకుని అడ్వర్టయిజ్మెంట్లపై కంపెనీలు వెచ్చించడం ఇటీవల పెరిగింది. యువత వీటిపై రోజుకు సగటున 2.5 గంటలు వెచ్చిస్తున్నట్టు డీఏఎన్ తెలిపింది. ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ట్విట్టర్, టిక్టాక్, ఫేస్బుక్, షేర్చాట్, రొపోసో వంటి సోషల్ మీడియా యాప్స్ నిండా మిలీనియల్స్ను దృష్టిలో పెట్టుకుని కంటెంట్ ఉంటుంది. అలాగే మ్యూజిక్ యాప్లు, యూట్యూబ్ వీడియోలు.. ఇలా డిజిటల్ అడ్వర్టయిజ్మెంట్లకు వేదికగా మారాయి. డిజిటల్ అడ్వర్జయిమెంట్ వ్యయం సోషల్ మీడియాపై 28 శాతం ఉండగా.. పెయిడ్ సెర్చ్పై 25 శాతం, ఆన్లైన్ వీడియోపై 22 శాతం ఉంది. ఆన్లైన్ వీడియోలపై వెచ్చించే డిజిటల్ అడ్వర్టయిజ్మెంట్ల వృద్ధిరేటు 32 శాతంగా ఉంది. -
భవిష్యత్తు ఏఐ ప్రకటనలదే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వార్తా పత్రికలు, రేడియో, టెలివిజన్, ఇంటర్నెట్, మొబైల్స్.. ఇదీ సింపుల్గా అడ్వర్టయిజింగ్ మాధ్యమాల వరుస క్రమం! కానీ ఇపుడు ఈ జాబితాలో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చేరుతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ బ్రాండ్లు ఏఐ ఆధారిత ప్రకటనలపై పరిశోధన చేస్తున్నాయని, కొన్ని సంస్థలు త్వరలోనే దేశంలో మొబైల్ ఆధారిత ఏఐ ప్రకటనల్ని పైలెట్ ప్రాజెక్ట్గా ప్రారంభించే సంకేతాలున్నాయని ఇంటర్నేషనల్ అడ్వర్టయిజింగ్ అసోసియేషన్ (ఐఏఏ) చైర్మన్, వరల్డ్ ప్రెసిడెంట్ శ్రీనివాసన్ స్వామి చెప్పారు. ఏఐతో మొబైల్ అడ్వర్టయిజింగ్ మోసాలకు అడ్డుకట్టపడుతుందని.. అందుకే ఈ విభాగం శరవేగంగా ఏఐ వైపు మళ్లుతోందని చెప్పారాయన. కొచ్చిలో జరగనున్న 44వ ఐఏఏ వరల్డ్ కాంగ్రెస్ వివరాలను గురువారమిక్కడ విలేకరులకు తెలిపారు. ‘‘ఏఐ ప్రకటనలతో వేగం, పారదర్శకతతో పాటు ప్రకటనల కమ్యూనికేషన్ను ఎడిట్ చేసుకునే వీలుంటుంది. వీక్షకుల మానసిక స్థితి, ముఖ కవళికలను బట్టి ప్రకటనలను అందించవచ్చు. వయస్సు, లింగ భేదం వంటివి కూడా శోధించి అందుకు తగిన యాడ్స్ వస్తాయి. ఈ ప్రకటనలతో సమయం, డబ్బు వృథా జరగదు’’ అని వివరించారు. రూ.61,878 కోట్లకు ప్రకటనల పరిశ్రమ.. ప్రస్తుతం దేశీయ ప్రకటనల పరిశ్రమ పరిమాణం రూ.61,878 కోట్లుగా ఉందని.. ఇందులో రూ.14 వేల కోట్లు డిజిటల్ మీడియం వాటా అని తెలియజేశారు. ఏటా 10.62 శాతం వృద్ధి రేటుతో 2021 నాటికి ప్రకటనల పరిశ్రమ 82,250 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. మొత్తం పరిశ్రమలో టెలివిజన్, ప్రింట్ వాటా 70 శాతం, డిజిటల్ వాటా 17 శాతం వరకుంటుంది. కొచ్చిలో ఐఏఏ వరల్డ్ కాంగ్రెస్.. ఐఏఏ వరల్డ్ కాంగ్రెస్కు తొలిసారిగా మన దేశం ఆతిథ్యం ఇస్తోంది. ఫిబ్రవరి 20–22 తేదీల్లో కొచ్చిలో జరిగే ఈ సదస్సులో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, యూనీలీవర్ సీఈఓ పాల్ పోలెమన్, క్వాల్కామ్ సీఈఓ స్టీవెన్ మోల్లిన్కోఫ్, యూఐడీఏఐ మాజీ చైర్మన్ నందన్ నిలేకనీ, సాఫ్ట్బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ సీఈఓ రాజీవ్ మిశ్రా తదితరులు పాల్గొంటారు. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఐఏఏకు ప్రపంచవ్యాప్తంగా 55 దేశాల్లో చాప్టర్లుండగా, ఇండియాలో 300 మంది సభ్యులున్నారు. -
మనవాళ్లకి ఆ ప్రకటనలంటే తెగ చిరాకట
మొబైల్ వ్యాపారప్రకటనలు చాలా మంది భారతీయులకు బాధించేవిగా, మూర్ఖమైనవిగా ఉంటున్నాయట. 60శాతం మంది భారతీయులు మొబైల్ వ్యాపారప్రకటనలను చిరాగ్గా భావిస్తున్నట్టు సర్వేలు తెలిపాయి. మొబైల్ అడ్వర్ టైజింగ్ లో పాప్ -అప్ లు, వీడియో ప్రకటనలు మరింత బాధపెడుతున్నాయని 55శాతం మంది రెస్పాడెంట్లు అభిప్రాయాలు వ్యక్తంచేశారు. స్మార్ట్ ఫోన్లు వాడుతున్న జెనరేషన్ ఎక్స్, జెనరేషన్ వై, మిలినియల్స్ ను టార్గెట్ గా చేసుకుని మొబైల్ కాల్ యాప్ 'నాను' సర్వే నిర్వహించింది. 3,375 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. 46 మంది కావాలనే ప్రకటనలు ఆపివేశారని సర్వే కనుగొంది. 80శాతం మంది పాప్-అప్ లను, వీడియో అడ్వర్ట్స్ లను క్లిక్ చేయడమే నివారిస్తున్నారని తెలిపింది. అసలు మొబైల్ ప్రకటన ద్వారా కొనుగోలు నిర్ణయాలు తీసుకుంటున్నారా..? అని 75శాతం మంది సర్వేల్లో సందేహాలు వ్యక్తంచేశారని ఈ సర్వే పేర్కొంది. బ్రాండ్స్ కు ప్రకటనలు చేసేందుకు ప్రకటన దారులు ఎంచుకున్న ఈ పద్ధతులు అనుచిత స్వభావాన్ని కలిగి ఉంటున్నాయట. దీంతో యూజర్లను ఆకట్టుకోలేకపోతున్నాయని నాను యాప్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్టిన్ తెలిపారు. అయితే మొబైల్ అడ్వర్ టైజింగ్ లు అనుచితంగా ఉండకపోతే, యూజర్లకు, బ్రాండ్లకు ఉపయోగకరమైనవిగా ఉంటాయని తాము విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు. మొబైల్ వ్యాపార ప్రకటనలు హానికరమైనవిగా ఉంటుండంతో, యాప్ బ్లాకింగ్ సాప్ట్ వేర్ ను అధిక సంఖ్యలో యూజర్లు వాడుతున్నట్టు సర్వేలో తేలింది.
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Advertisement