-
భారత్లో ఈ ఏడాది 25 కోట్ల మొబైల్స్ అమ్మకాలు!
న్యూఢిల్లీ: మొబైల్ హ్యాండ్సెట్స్ మార్కెట్ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 4 శాతం వృద్ధితో 25 కోట్ల యూనిట్లకు చేరుతుందని సైబర్ మీడియా రీసెర్చ్ సంస్థ తెలిపింది. రూ.5,000 ధరకు దిగువన ఉండే హ్యాండ్సెట్స్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. 2014తో పోలిస్తే గతేడాది స్మార్ట్ఫోన్ విభాగం 32 శాతం వార్షిక సగటు వృద్ధిరేటుతో 7.7 కోట్ల యూనిట్ల నుంచి 9.5 కోట్ల యూనిట్లకు పెరిగినట్లు తెలిపింది. ఈ ఏడాది 4జీ స్మార్ట్ఫోన్స్ విక్రయాలు 5 కోట్ల యూనిట్ల మార్క్ను దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఫీచర్ ఫోన్ మార్కెట్ విషయానికి వస్తే 2014లో 18 కోట్ల యూనిట్లుగా ఉన్న ఫీచర్ ఫోన్స్ విక్రయాలు గతేడాదిలో 17 శాతం క్షీణతతో 14.4 కోట్ల యూనిట్లకు తగ్గాయి. ఇదే పరిస్థితి ఈ ఏడాది కొనసాగే అవకాశం ఉంది. కంపెనీలు గతేడాది రూ. 10,000 ధర శ్రేణిలోని మొబైల్ హ్యాండ్సెట్స్కు ప్రాధాన్యమిచ్చాయని, కానీ ప్రస్తుతం రూ.5,000 ధరకు దిగువన ఉన్న మొబైల్ హ్యాండ్సెట్స్కు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. -
30 కోట్ల యూనిట్లకు హ్యాండ్సెట్స్ మార్కెట్
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్లో మొబైల్ హ్యాండ్సెట్స్ మార్కెట్ 30 కోట్ల యూనిట్లకు చేరుతుందని ఫిక్కి-ఈవై సర్వేలో వెల్లడైంది. ఫిక్కి-ఈవై ‘స్పీడింగ్ ఎహెడ్ ఆన్ ద టెలికం, డిజిటల్ ఎకానమి హైవే’ అనే పేరుతో ఓ సర్వేను నిర్వహించింది. సర్వే వివరాలు... ఈ ఏడాది దేశీ తయారీ ఫోన్ల సంఖ్య 4.6 కోట్ల మాత్రమే వుంటుందని అంచనా. 30 కోట్ల యూనిట్ల మార్కెట్ను అందిపుచ్చుకోవడానికి దేశీయంగా ఫోన్ల తయారీ బాగా పెరగాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. వియత్నాంలాగా ఫోన్ల తయారీకి అంతర్జాతీయ కేంద్రంలా అవతరించాలంటే అన్ని దేశాలు ట్యాబ్లెట్ల, ఫోన్ల తయారీకి ప్రత్యేకమైన ప్రోత్సాహకాలను అందించటంతోపాటు సుస్థిరమైన అనుకూల వాతావరణాన్ని కల్పించాల్సి ఉంది. భారత్లో మొబైల్ హ్యాండ్సెట్స్ మార్కెట్ గణనీయమైన వృద్ధిని నమోదుచేస్తే దానిలో అధిక వాటా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఫోన్లకే దక్కుతుంది. ఎందుకంటే దేశీయంగా ఫోన్ల తయారీ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు కాబట్టి. దే శీయంగా ఫోన్ల తయారీ పెరిగితే దిగుమతులు తగ్గి, దాని వల్ల విదేశీ మారక నిల్వలు పెరిగి, చివరకు దాని ప్రభావంతో ఉద్యోగ కల్పన, స్థానిక స్థితిగతుల వృద్ధి జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం 2019 నాటికి 50 కోట్ల ఫోన్ల తయారీని లక్ష్యంగా నిర్దేశించుకున్న విషయం విదితమే.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
6000 కి.మీ ఎగురుతూ ఛత్తీస్గఢ్కు అరుదైన పక్షి!
'ఫ్యామిలీస్టార్'ను వాళ్లు కావాలనే టార్గెట్ చేశారు: ఆనంద్
BJP Vs Congress: ఈశాన్య ఢిల్లీ ఎవరిది?..
మాచర్ల టార్గెట్గా ’దేశం‘ ఆపరేషన్ దమనకాండ
‘గ్రేట్వాల్ మోటార్’ మొదటి బైక్.. (ఫొటోలు)
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ బర్త్డే స్పెషల్ ఫోటోలు
KKR vs SRH: ప్రమాదకారి.. ఫైనల్ చేరే తొలి జట్టు ఇదే!
రాయదుర్గంలో ఎన్ఐఏ దాడుల కలకలం
బరువు తగ్గాలనుకుంటే..ఆ ఆహారాలకు దూరంగా ఉండాలంటున్న నిపుణులు!
బీజేపీలోకి ‘ఎన్కౌంటర్ స్పెషలిస్ట్’?
తప్పక చదవండి
- MI: ఈ సీజన్లో నిరాశే మిగిలింది: నీతా అంబానీ వ్యాఖ్యలు వైరల్
- కవితపై ఈడీ చార్జిషీట్.. నేడు రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- వారి ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తున్న పాయల్ రాజ్పుత్
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- సానుకూల సంకేతాలు
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement