-
భూ సమీకరణ కోసం ఎన్ని కుయుక్తులో.!
మచిలీపట్నం : బందరు పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపన కోసం చేపట్టిన భూసమీకరణలో పాలకులు రైతులను ఏమార్చే పనిలో పడ్డారు. వ్యూహాత్మకంగా భూసమీకరణకు తెరవెనుక రంగం సిద్ధం చేస్తున్నారు. ఇటీవల భూసమీకరణ అంశం, పోర్టు నిర్మాణం, పారిశ్రామిక కారిడార్ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశం జరిగింది. టీడీపీ నాయకులు మచిలీపట్నం అభివృద్ధి కోసం రైతుల నుంచి భూములు సమీకరించాలని ముఖ్యమంత్రి ఇచ్చిన సూచనలతో భూసమీకరణ ప్రక్రియను వేగవంతం చేసే పనిని ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వకుండానే భూసమీకరణకు పాలకులు తెగబడడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగా టీడీపీ సానుభూతిపరులతో భూసమీకరణకు భూములు ఇస్తున్నట్లు ప్రచారం చేసి అనంతరం రైతుల నుంచి భూములు గుంజుకునే ప్రయత్నంలో టీడీపీ నాయకులు ఉన్నారు. పోర్టు నిర్మాణం జరిగే ఆరు గ్రామాలతోపాటు పారిశ్రామిక కారిడార్ కోసం భూములు సమీకరించాల్సిన మిగిలిన గ్రామాల్లోనూ అధికారులు సర్వే నిర్వహించేందుకు వెళుతున్నారు. రైతుల నుంచి ప్రతిఘటన వస్తుండడంతో వెనుదిరుగుతున్నారు. పల్లెతుమ్మలపాలెంలో ఇటీవల సర్వే నిర్వహించేందుకు ఎంఏడీఏ సిబ్బంది వెళ్లగా కరకట్ట భూమి పక్కనే ఉన్న సర్వే భూమిని సర్వే చేసుకోవాలని గ్రామస్తులు చెప్పడంతో ఆ భూముల వరకు సర్వే నిర్వహించారు. కోన–2 పరిధిలోని తుమ్మలచెరువు, చిన్నాపురం గ్రామాల పరిధిలో ఎంఏడీఏ అధికారులు సర్వేకు వెళ్లగా తుమ్మలచెరువు రైతులు సర్వే నిర్వహించవద్దని సర్వే నిర్వహిస్తే ఇబ్బందులు పడతారని హెచ్చరించి వెనక్కి పంపేశారు. లీజు ఎంత ఇస్తారు బందరు పోర్టు, పారిశ్రామిక కారిడార్ కోసం 33,177 ఎకరాల భూమిని సమీకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. సాగునీరు సక్రమంగా విడుదలైతే ఏడాదికి రెండు పంటలు పండే భూములను సైతం మెట్టభూములుగా భూసమీకరణ నోటిఫికేషన్లో చూపారు. ఈ 33,177 ఎకరాలు మెట్ట భూములుగా చూపడం గమనార్హం. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ప్రకారం మాగాణి భూములకు ఎకరానికి ఏడాదికి రూ.50వేలు, మెట్ట భూములకు రూ.30వేలు చొప్పున పదేళ్లపాటు లీజు చెల్లించాల్సి ఉంది. ఎవరైనా రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చినా, తమ భూములు మాగాణి భూములుగా పరిగణిస్తారా, లేదా అనే అంశంపై అధికారులను ప్రశ్నిస్తే ఈ అంశం మా పరిధిలో లేదని చెబుతున్నారు. ఇటీవల ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో అసైన్డ్భూములు సాగు చేసుకునే రైతులకు ఏడాదికి రూ.20 వేలు లీజు చెల్లించాలని సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నా, మాగాణి భూములుగా పరిగణించే అంశంపై స్పష్టమైన నిర్ణయానికి రాలేదు. భూమి ఇచ్చిన రైతులు రెండు పంటలకు నీటి తీరువా చెల్లించారా, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని సర్వే నిర్వహించి మెట్ట, మాగాణి భూముల్లో ఏ కేటగిరీలోకి వస్తాయో నమోదు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ అంశంపై రెండు రోజులపాటు జరిగిన సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావులను టీడీపీ నాయకులు వివరణ ఇవ్వాలని కోరారు. 1934 రెవెన్యూ రికార్డుల ప్రకారం భూసమీకరణ నోటిఫికేషన్ జారీ చేశారని, ప్రస్తుతం వేరే రైతులు అనుభవదారులుగా ఉన్నారని వారి పేరున ప్యాకేజీ ఇస్తామని స్పష్టం చేస్తేనే రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తారని టీడీపీ నాయకులు చెప్పారు. ఏ అంశంపైనా స్పష్టం చేయకుండా రైతుల నుంచి భూములు సమీకరించటం సాధ్యం కాదని అంటున్నారు. పాలకులు మాత్రం భూసమీకరణ చేసి తీరాల్సిందేనని రూ.100 కోట్లను భూములు ఇచ్చిన రైతులకు లీజుగా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం చేసిందని ప్రకటనలు చేస్తూ మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. -
బందరు పోర్టుపై నేడు భేటీ
సీఎంతో అధికారుల సమావేశం మచిలీపట్నం : బందరు పోర్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం మధ్యాహ్నాం జిల్లా అధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (ఎంఏడీఏ) ద్వారా జరిగిన పురోగతి తదితర అంశాలపై చర్చించనున్నారు. బందరు పోర్టు పోర్టు నిర్మాణం జరిగే మంగినపూడి, తపసిపూడి, గోపువానిపాలెం, కరగ్రహారం, చిలకలపూడి, బందరు ఈస్ట్ రెవెన్యూ గ్రామాల్లో 4,800 ఎకరాల భూమిని సమీకరించి తొలివిడతగా పోర్టు నిర్మాణం చేస్తామని అధికారులు ప్రకటించారు. ఆ దిశగా ఈ ఆరు గ్రామాల్లో భూముల సర్వే ఇటీవల నిర్వహించారు. 3,100ఎకరాల భూమి కి సంబంధించిన సర్వే పనులను పూర్తి చేసి నివేదికను ముఖ్యమంత్రికి ఇచ్చేందుకు ఎంఏడీఏ అధికారులు సిద్ధం చేశారు. రాష్ట్రంలోని అన్ని పోర్టులకు సంబంధించిన కీలక సమావేశం బుధవారం ముఖ్యమంత్రితో జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజధాని అమరావతికి దగ్గరలో ఉన్న బందరుపోర్టు అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మాగాణి భూములుగా పరిగణిస్తారా... మచిలీపట్నంలో పోర్టు, పారిశ్రామిక కారిడార్ నిర్మాణం కోసం ఎంఏడీఏ ద్వారా గత ఏడాది సెప్టెంబరులో 33,177 ఎకరాల భూమి కోసం ప్రభుత్వం భూసమీకరణ నోటిఫికేషన్ను జారీ చేసింది. రైతుల నుంచి తీవ్ర వ్య తిరేకత వ్యక్తం కావడంతో పోర్టు నిర్మా ణం జరిగే ఆరు గ్రామాల పరిధిలో 4,800 ఎకరాలను సమీకరించేందుకు అధికారులు సర్వే నిర్వహించారు. భూ సమీకరణ నోటిఫికేషన్ 1934 రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇచ్చారు. కాలక్రమంలో కాలువల ఏర్పాటు, సాగునీటి విడుదల జరగటంతో ఏడాదికి రెండు పంటలు పండిస్తున్నారు. సమీకరణ నోటిఫికేషన్లో మెట్టభూమిగా నమో దు చేయటంతో రైతులకు తీవ్ర అన్యా యం జరిగే అవకాశం ఏర్పడింది. మెట్ట ఎకరాకు రూ.30వేలు, మాగాణి భూమికి రూ. 50వేలు చొప్పున పది సంవత్సరాల పాటు లీజు సొమ్ముగా అందజేస్తామని నోటిఫికేషన్లో ప్రభుత్వం వెల్లడించింది. దీంతో అన్ని గ్రామాల్లోని రైతులు నష్టపోనున్నారు. -
‘సీమ’ ఎక్స్ప్రెస్వేకు 26 వేల ఎకరాలు
సమీకరణ లేదా సేకరణకు ప్రభుత్వ నిర్ణయం సాక్షి, అమరావతి: నూతన రాజధాని అమరావతి నుంచి రాయలసీమ జిల్లాలకు ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి భవిష్యత్ అవసరాల పేరుతో భారీగా భూ సమీకరణ లేదా భూ సేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణరుుంచింది. ప్రస్తుతం నాలుగు, ఆరు లేన్ల రహదారి నిర్మించాలని నిర్ణరుుంచారు. భవిష్యత్లో 8 లేన్ల నిర్మాణం చేపట్టే ఆలోచనలో భాగంగా ఏకంగా 26,890.64 ఎకరాల భూమిని ఇప్పుడే సమీకరించడం లేదా సేకరించనున్నారు. అమరావతి నుంచి అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాల్లో ఈ ఎక్స్ప్రెస్వే కోసం భూమి సేకరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. నిర్మాణానికి అవసరమైన భూమిని కొనుగోలు చేయడానికి లేదా భూ సేకరణ ద్వారా తీసుకోవడానికి వీలుగా అనంతపురం, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో ఒక్కో భూ సేకరణ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఇందులో అటవీ భూమి కూడా ఉన్నందున తగిన అనుమతులు పొందేందుకు వీలుగా మరో విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. -
వామ్మో!
పోర్టుకు లక్ష ఎకరాల భూసమీకరణపై కలకలం ఎంఏడీఏ పరిధిలోలక్షా 5 వేల ఎకరాల సేకరణకు కేబినెట్ ఆమోదంబందరు పోర్టుకు కావాల్సింది 4,800 ఎకరాలుఅనుబంధ పరిశ్రమల పేరుతో సమీకరణకు నిర్ణయం రైతుల భూములను గుంజుకునే యత్నాలపై సర్వత్రా ఆగ్రహం భూసమీకరణపై ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత వస్తున్నా.. ఎన్ని చేదు అనుభవాలు ఎదురవుతున్నా ప్రభుత్వ వైఖరి మారలేదు. ఒకపక్క రాజధాని ప్రాంతం భగ్గుమంటోంది. ఏలూరు కాల్వ కోసం భూసమీకరణ పేరెత్తితే గన్నవరం నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బందరు పోర్టు కోసం 30 వేల ఎకరాలు తీసుకుంటామంటే గతంలో బందరు ప్రాంత గ్రామాల రైతులు నాయకుల్ని తరిమితరిమి కొట్టారు. ఇంత జరిగినా ఇప్పుడు మళ్లీ పోర్టు నిర్మాణం, అనుబంధ పరిశ్రమల పేరిట లక్ష ఎకరాలు భూసమీకరణ చేయాలని నిర్ణయించడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మచిలీపట్నం / సాక్షి, విజయవాడ : నమ్మి ఓట్లు వేసిన ప్రజలను నట్టేట ముంచేం దుకు టీడీపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (ఎంఏడీఏ) పేరుతో లక్షా ఐదు వేల ఎకరాలను సేకరించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో నివ్వెరపోవటం జనం వంతయింది. అధికారం చేపట్టిన ఆరు నెలల్లో బందరు పోర్టు పనులు ప్రారంభిస్తామని చెబుతూ వచ్చిన పాలకులు ఆ విషయాన్ని పక్కన పెట్టారు. పోర్టు నిర్మాణానికి 4,800 ఎకరాల భూమి అవసరం కాగా, గత ఏడాది ఆగస్టు 31న 30 వేల ఎకరాలను పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపన కోసం సేకరించేందుకు భూసేకరణ నోటిఫికేషన్ను ప్రభుత్వం జారీ చేసింది. దీనిపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. భూసేకరణ నోటిఫికేషన్కు వ్యతిరేకంగా 4,800 మందికి పైగా రైతులు ఆర్డీవో కార్యాలయంలో తమ అభ్యంతరాలను అందజేశారు. ఎంఏడీఏ ఏర్పాటు భూసేకరణ నోటిఫికేషన్ అయితే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని, భూసమీకరణ పేరుతో ముందుకు వెళితే ఇబ్బందులు ఉండవని ఓ మాజీ ఐఏఎస్ అధికారి ఇచ్చిన సూచన మేరకు ఎంఏడీఏను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటిన జీవో నంబరు 15ను ప్రభుత్వం జారీ చేసింది. 29 గ్రామాలు కనుమరుగు? లక్ష ఎకరాలు ప్రభుత్వం భూసమీకరణ చేస్తే బందరు పురపాలక సంఘంతో పాటు 28 గ్రామాలు, పెడన మండలంలోని కాకర్లమూడి గ్రామం కలిసి మొత్తం 29 గ్రామాలు కనుమరుగవుతాయని అధికారులు చెబుతున్నారు. సుమారు 2.50 లక్షల మంది ప్రజలు ఈ గ్రామాల్లో జీవి స్తున్నారు. ఈ గ్రామాలన్నింటిలోనూ వరి, చేపలు, రొయ్యల సాగు మీదనే ఆధారపడి ప్రజలు జీవిస్తున్నారు. మొత్తం 426 చదరపు కిలోమీటర్ల పరిధిలో భూమిని తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇదే జరిగితే తమ జీవనాధారమే పోతుందని గ్రామాల ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. కేవలం పోర్టుకు కాకుండా అనుబంధ పరిశ్రమలకు కూడా భూసమీకరణ చేయడాన్ని రైతులు తప్పుపడుతున్నారు. వ్యాపారానికి పెట్టుబడిగా చేస్తారా? పోర్టు నిర్మించకుండా ఏవేవో పరిశ్రమలు నిర్మిస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతూ రైతుల భూములను గుంజుకునేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాన్ని ఎదుర్కొంటామని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి పేర్ని నాని ‘సాక్షి’కి తెలిపారు. 30 వేల ఎకరాల భూమికి నోటిఫికేషన్ ఇస్తేనే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని, 1.05 లక్షల ఎకరాల భూమిని తీసుకుంటామని ప్రభుత్వం చెబితే జీవనాధారం కోల్పోయే రైతులు పోరుబాట పడతారని ఆయన అన్నారు. రైతులను మోసం చేసి అత్యాశతో ముందడుగు వేస్తున్న టీడీపీ పాలకులకు తగిన గుణపాఠం చెబుతామని చెప్పారు. అభివృద్ధి జరిగితే దాని ఫలాలను రైతులు కూడా అనుభవించాలని, ఇది సమంజసమని, టీడీపీ నాయకులే అనుభవిస్తామంటే రైతులు ఊరుకోరని స్పష్టంచేశారు. జాడలేని పరిశ్రమలు... ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయిల్ రిఫైనరీ పరిశ్రమను బందరులో పెడతామని చెప్పారు. అప్పటి నుంచి ఒక్కడుగు ముందుకు పడలేదు. ఇక్కడ పరిశ్రమలు పెట్టేందుకు ఏ పారిశ్రామికవేత్తా ముందుకు రాలేదు. అయినా ప్రభుత్వం పెద్ద ఎత్తున భూసమీకరణ చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. -
ఉండవల్లిపై ఉక్కుపాదం
రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్ల తొలగింపు అటవీ శాఖ తొలి దశ సర్వేలో 2,500 కుటుంబాల తరలింపునకు ప్రతిపాదనలు పొమ్మనకుండా పొగ పెడుతున్న వైనం సర్కారు కుయుక్తులతో జనం గగ్గోలు విజయవాడ బ్యూరో : భూసమీకరణను వ్యతిరేకించిన తాడేపల్లి మండలంలోని ఉండవల్లి గ్రామంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రాజధాని అభివృద్ధి సాకుతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఆ గ్రామం ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా ఉన్నాయి. రాజధానిగా అమరావతిని ప్రకటించిన తొలినాళ్లలో టూరిజం హబ్గా ఉండవల్లి ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రకటించింది. భూ సమీకరణను ఆ గ్రామం ప్రతిఘటించడంతో ప్రభుత్వం ఆ తరువాత ఆ గ్రామానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటోంది. రవాణాకు మౌలిక వసతులు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటుకు ఉండవల్లిని ఎంపిక చేసింది. ఇందులో పెద్ద కుట్ర దాగి ఉందనేది స్థానికుల వాదన. టూరిజం ప్రాంతం అయితే అక్కడ భూముల ధరలు పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, రవాణా, విద్యుత్ సబ్స్టేషన్లకు ఎంపిక చేస్తే ఆ ప్రాంతానికి పెద్దగా క్రేజ్ ఉండదు. దీంతో అక్కడ భూముల ధరలు పడిపోవడంతో పాటు ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం పడి వలసలు పోవాల్సిన పరిస్థితులు దాపురిస్తాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రకటనకు ముందే కోట్లు పలికిన భూములు... రాజధాని ప్రకటన రాకముందు నుంచే ఉండవల్లి ప్రాంతంలో భూముల ధరలు కోట్ల రూపాయలు పలికాయి. ఇప్పుడు మాత్రం రాజధాని నిర్మాణం చేపట్టకముందే ఉండవల్లిలోని నివాసాలపై ప్రభావం పడుతోంది. రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లలో భాగంగా గతేడాది రోడ్ల విస్తరణ చేపట్టిన ప్రభుత్వం ఉండవల్లిలో పెద్ద ఎత్తున ఇళ్లు తొలగించింది. విజయవాడ - ఉండవల్లి - తుళ్లూరు - అమరావతి రోడ్ల విస్తరణకు ఇప్పటికే చాలా మంది నివాసాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉండవల్లి వద్ద రోడ్డును మరింత విస్తరించడంతో ఇళ్లు, దుకాణాలు, చిన్నపాటి బడ్డీకొట్లను తొలగించారు. రాజధాని నిర్మాణం, అటవీ భూముల అవసరం సాకుతో 50 ఏళ్లకు పూర్వం నుంచి ఇక్కడే నివాసం ఉంటున్న ప్రజలను తరిమేసే ప్రయత్నాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అక్కడి ప్రజలను పొమ్మనకుండా పొగపెట్టినట్టు ఇబ్బందులు పెడితే భూములైనా ఇస్తారు, ఊరైనా వదిలిపోతారు అన్నట్టు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని పలువురు గగ్గోలు పెడుతున్నారు. అయినా రోడ్ల విస్తరణ తదితర కారణాలతో ఇళ్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. రాజధాని పేరుతో పొలాలు గుంజుకున్న సర్కారు ఇప్పుడు ఇళ్లనూ కూల్చేసి ప్రజలను రోడ్డున పడేస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. అటవీ భూముల బూచి... అమరావతి రాజధాని కోసం సుమారు 50 వేల ఎకరాల అటవీ భూములను డీఫారెస్ట్ కోసం కేంద్రానికి రాష్ట్ర సర్కారు లేఖ రాయడంతో దాని ప్రభావం కూడా ఉండవల్లిపై పడనుంది. ఉండవల్లి సమీప ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ పాచిక పారకపోవడంతో ఇక్కడ అటవీ భూములను తీసుకోవడమే మేలని ప్రభుత్వం భావిస్తోంది. అటవీ శాఖ అధికారులు ఉండవల్లితో పాటు తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నులకపేట, ప్రకాష్నగర్, డోలాస్నగర్ ప్రాంతాల్లో కొన్ని ఇళ్లు అటవీ భూముల పరిధిలోకి వస్తాయని గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ఉన్న సుమారు 30 వేల ఇళ్లలో దాదాపు 10 వేలకు పైగా ఇళ్లను అటవీ ప్రాంతం నుంచి కదిలించాల్సి ఉంటుందని సీఆర్డీఏ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే ఒక పర్యాయం సర్వే నిర్వహించిన అటవీ శాఖ అధికారులు ఉండవల్లి, ప్రకాష్ నగర్, డోలాస్నగర్, నులకపేట ప్రాంతాల్లోని అటవీ భూముల్లో 2,500 ఇళ్లు ఉన్నాయని నిర్ధారించారు. వాటితో పాటు మరో ఎనిమిది వేల ఇళ్లను కూడా వేర్వేరు కారణాలు చూపి ఇక్కడి నుంచి తరలించాల్సి ఉంటుందని చెబుతున్నారు. కృష్ణా నదికి ఆనుకుని విజయవాడ-చెన్నై జాతీయ రహదారి చెంతనే ఉన్న ఉండవల్లి గ్రామం రైల్వేస్టేషన్కు కూడా కూతవేటు దూరంలో ఉండటంతో ప్రభుత్వ యంత్రాంగం ఈ గ్రామాన్ని ఖాళీ చేయించేలా పథక రచన చేస్తోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement