-
‘మోడల్’ బడి
ఉట్నూర్(ఖానాపూర్): ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యనందించేందుకు గిరిజన సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్ర వ్యాప్తంగా వంద పాఠశాలలు ఎంపిక చేసింది. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్కు జిల్లాలో 59 పాఠశాలలను మొదటి విడత ఎంపిక చేసి మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనతోపాటు పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దనుంది. ఇందుకోసం ఒక్కో బడికి గిరిజన సంక్షేమ శాఖ రూ.4లక్షల వరకు వెచ్చించనుంది. విద్యాబోధన కోసం ముగ్గురు చొప్పున ఉపాధ్యాయులను నియమించనుంది. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులను పాఠశాలలకు ఆకర్షితులను చేయడంతోపాటు అక్షరాస్యతను పెంపొందించడంలో భాగంగా ఈ చర్యలు చేపడుతోంది. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతోపాటు మెరుగైన వసతుల కల్పన, ఆటపాటలతో కూడిన విద్య అందించనున్నారు. కిచెన్షెడ్ల నిర్మాణం, మరుగుదొడ్లు, డైనింగ్హాల్, క్రీడామైదానం, వివిధ రకాల ఆట వస్తువుల సమూహం, పాఠశాలల్లో టీవీ, ప్రొజెక్టర్ తదితర సౌకర్యాలు కల్పిస్తారు. ఇందుకోసం రూ.4లక్షల వరకు ఖర్చు చేస్తారు. పాఠశాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి రంగులతో వివిధ రకాల కళాకృతులు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులకు ఆటపాటలతో కూడిన ఒత్తిడి, బరువు లేని విద్యావిధానం అమలు చేయనున్నారు. పాఠ్యపుస్తకాలను విద్యార్థులు పాఠశాలల్లోనే వదిలి ఇళ్లకు వెళ్లనున్నారు. 2236 మంది విద్యార్థులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 59 పాఠశాలల్లో 2,236 మంది గిరిజన విద్యార్థులు ఉన్నారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యనభ్యసిస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి వీరికి కార్పొరేట్ స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేయనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 28 ప్రాథమిక పాఠశాలల్లో 1,301 మంది, ఆసిఫాబాద్ జిల్లాలో 23 ప్రాథమిక పాఠశాలల్లో 730 మంది, మంచిర్యాల జిల్లాలో 5 ప్రాథమిక పాఠశాలల్లో 144 మంది, నిర్మల్ జిల్లాలో 3 ప్రాథమిక పాఠశాలల్లోని 61 మంది గిరిజన విద్యార్థులు ఉన్నారు. ప్రతీ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో ప్రత్యేక శిక్షణ పొందిన ముగ్గురు ఉపాధ్యాయులను నియమించి బోధన చేయిస్తారు. జిల్లాల వారీగా ఎంపికైన పాఠశాలలు ఇవే.. ఆదిలబాద్ జిల్లాలో కొత్త లోద్దిగూడ, గాదిగూడ, మామిడిగూడ, చోర్గాం–ఎమ్టీ, పిప్రి–జీ, గోంకొండ, ఇంద్రవెల్లి–కె, అందుగూడ, వాన్వాట్, చోర్గాం–జీ, జాలంతాండ, ఎస్ఎన్ తండా, నానాదిగూడ, గోపాల్పూర్, వంకతుమ్మ, భవానిగూడ–సీ, చింతగూడ, గోపాల్సింగ్తాండ, పర్సువాడ–బీ, దుబార్పెటఏ, పల్సి–బీ తాండ, మనుగ్రోడ్, లంకర్గూడ, జాతర్ల, అందర్బంద్, లక్ష్మిపూర్, బెల్సరాంపూర్, కాండ్వా–జీ. ఆసిఫాబాద్ జిల్లాలో అర్జున్గూడ, అందుగూడ–జీ, పోచంలోద్ది, సావాతి, పంగ్డి, లక్ష్మిపూర్గోంది, కాయచిచాల, కేస్లాగూడ–బీ, కైర్గూడ, ముంజంపల్లి, మాలిని, కాకడ్బుడ్డి, గిన్నెదరి, డోర్గాం, వీవీఆర్హెచ్కాలనీ, గోయాగాం, మార్లవాయి, చిన్న అర్డెపల్లి, మర్కగూడ, పోతపల్లి.– మంచిర్యాల జిల్లాలో హాస్టల్తండా, దమ్మన్నపేట పెద్దపూర్, దేవాపూర్, పెద్దన్పల్లి. నిర్మల్ జిల్లాలో వాకీల్నగర్, గుర్రమదిర, ఇస్లాంపూర్ ప్రాథమిక పాఠశాలలు ఎంపిక అయ్యాయి. గ్రామస్తుల భాగస్వామ్యం.. ఎంపికైన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో గిరిజన సంక్షేమ శాఖ అక్కడక్కడ గ్రామస్తులను కూడా భాగస్వాములను చేస్తోంది. ఆంగ్ల విద్య ప్రాముఖ్యత, పాఠశాలల విధానం వివరిస్తుండడంతో గ్రామస్తులు ముందుకొస్తున్నారు. చోర్గాం–ఎమ్టీ ప్రాథమిక పాఠశాలకు గ్రామస్తులు మూడెకరాల భూమి విరాళంగా ఇవ్వడంతోపాటు ఎనిమిది గదుల భవన నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించారు. గాదిగూడ ప్రాథమిక పాఠశాలకు కిచన్ షెడ్ నిర్మాణాన్ని గ్రామస్తులు చేపట్టగా, పుసిగూడ గ్రామస్తులు పాఠశాలకు కిచెన్ షెడ్ నిర్మాణం, క్రీడా మైదానం కోసం అర ఎకరం భూమి విరాళంగా సమకుర్చారు. నాగోల్కొండ గ్రామస్తులు కిచెన్షెడ్, మరుగుదొడ్లు, రెండు గదుల నిర్మాణం చేపట్టనున్నారు. జాలంతండా వాసులు పాఠశాలకు డైనింగ్ హాల్ నిర్మాణం చేయనున్నారు. అన్ని వసతులు కల్పిస్తాం.. గిరిజన సంక్షేమ శాఖ ఎంపిక చేసిన మోడల్ గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల కోసం కార్పొరెట్ స్థాయిలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ప్రాజెక్టు అధికారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు ఎంపికైన పాఠశాలల్లో పూర్తి స్థాయిలో కళాకృతులతో కూడిన రంగులు వేస్తున్నాం. వచ్చే విద్యాసంవత్సరంలో పాఠశాలలు ప్రారంభించనున్నాం. – జగన్, ఏఎంవో ఐటీడీఏ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం వచ్చే విద్యాసంవత్సరం నుంచి మోడల్ గిరిజన ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించనున్నాం. ఇందు కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. పాఠశాలల సౌకర్యాల పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. మోడల్ పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు ఐదో తరగతి వరకు ఆటపాటలతో కూడిన గుణాత్మక ఆంగ్ల విద్యాబోధన ఉంటుంది. ఇందుకోసం ప్రతీ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించనున్నారు. – చందన, డీడీటీడబ్ల్యూ ఐటీడీఏ -
అక్షరంపై నిర్లక్ష్యం
అధికారుల నిర్లక్ష్య వైఖరి మండలంలోని విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది.. చదువుకోవాలనే ఆసక్తి పిల్లల్లో ఉన్నా అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు.. అందుకే పుస్తకాలు పట్టి బడిలో ఉండాల్సిన బాలలు పలుగు, పారలు పట్టి పొలాల్లో శ్రమిస్తున్నారు.. ప్రమాదమని తెలిసినా నిర్మాణ రంగంలో పనులు చేస్తున్నారు.. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యాభివృద్ధికి తోడ్పడాలని ప్రజలు కోరుకుంటున్నారు.. కోసిగి, న్యూస్లైన్ : కోసిగి మండలం రాష్ట్రంలోనే అక్షరాస్యతలో అత్యంత వెనుకబడిన ప్రాంతం. అలాంటి ప్రాంతంలో అక్షరాస్యతను పెంచేందుకు కృషి చేయాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. విద్యాభివృద్ధిలో భాగంగా ప్రతి మండలంలో మోడల్ స్కూల్, హాస్టల్ను ఏర్పాటు చేసేందుకు 2011లో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మోడల్ స్కూల్ నిర్మాణం కోసం రూ.3 కోట్లు, హాస్టల్ కోసం రూ.1.50 కోట్ల బడ్జెట్ను 2011లోనే కేటాయించింది. ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో 2013-14 విద్యా సంవత్సరం నాటికి జిల్లాలోని 32 మండలాల్లో మోడల్ స్కూళ్లు ప్రారంభమయ్యాయి. అయితే కోసిగి మండలంలో భవనాల నిర్మాణానికి స్థలం లేకపోవడంతో పనులు త్వరగా మొదలు కాలేదు. విషయం తెలుసుకున్న కోసిగికి చెందిన నరసింహమూర్తి తన పొలంలో మూడు ఎకరాలను భవన నిర్మాణాల కోసం విరాళంగా అందజేశారు. దీంతో మోడల్స్కూల్, హాస్టల్ వస్తున్నాయని ప్రజలు ఎంతో సంతోషించారు. అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగా వారి ఆశ నెరవే రలేదు. 2013-14 విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి భవనాలు పూర్తికాలేదు. దీంతో ఆ ఏడాది అడ్మిషన్లు నిర్వహించలేదు. 2014-15 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అందుబాటులోకి వస్తుందని అధికారులు, కాంట్రాక్టర్ చెప్పినా అది కూడా సాధ్యమయ్యేలా లేదు. మరో నెల రోజుల్లో తరగతులు మొదలు కావాల్సిన పరిస్థితుల్లోనూ ఇంకా పనులు చేస్తూనే ఉండడమే దానికి కారణం. పెరుగుతున్న బాలకార్మికులు మండలంలో బాలకార్మికులు రోజు రోజుకూ అధికమవుతున్నారు. 280 మంది బాలకార్మికులు ఉన్నట్లు అధికారులు రికార్డులు చూపిస్తున్నారు. అయితే దాదాపు 2 వేలకు మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం మోడల్ స్కూల్ నిర్మాణ పనులలో బాలకార్మికులు పనులు చేస్తున్నారు. అలాగే ప్రతి రోజూ రైళ్లలో పల్లీలు అమ్ముడం, సిమెంట్ పనులు, కట్టెల కొట్టుట, చిత్తుకాగితాలు ఏరడం తదితర పనులు బాలల జీవితాలు మగ్గిపోతున్నాయి. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం : ఆంజనేయులు, ఎంఈఓ మోడల్ స్కూల్ తరగతులు ప్రారంభించాలని జిల్లా ఉన్నతాధికారులను కోరాం. అయితే తరగతి గదులు నిర్మాణంలో ఉండడంతో అధికారులు విముఖత చూపుతున్నారు. కాంట్రాక్టర్లు త్వరితగతిన పనులు చేపడితే తరగతులు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
వరల్డ్ ఫ్యామస్ మీమ్ డాగ్ ఇకలేదు.. గుండె పగిలిందంటున్న నెటిజన్లు
TG: ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
కన్నప్ప మూవీలో ఛాన్స్? మంచు లక్ష్మి రియాక్షన్ ఇదే!
ఆనందమే జీవిత మకరందం!
భారత టాలెంట్ సరిహద్దులు దాటుతోంది: రాజమౌళి
‘అగ్నిపథ్’ స్కీమ్పై వ్యాఖ్యలు... క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్
సీఎం నిర్ణయాలే ఫైనల్.. ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య గ్యాప్?
ఫ్యామిలీతో ట్రిప్.. పొట్టి డ్రెస్లో అనసూయ జలకాలాటలు (ఫోటోలు)
Pumpkin Halwa: టేస్టీ టేస్టీగా గుమ్మడికాయ హల్వా రెసిపీ, అలా.. వెన్నలా..
వంగా గీత బలం.. ప్యాకేజ్ స్టార్ బలహీనతలు ఇవే!
తప్పక చదవండి
- ‘అగ్నిపథ్’ స్కీమ్పై వ్యాఖ్యలు... క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్
- స్వాతి మలివాల్పై దాడి కేసు.. కేజ్రీవాల్ సహాయకుడికి రిమాండ్
- విరిగిపడ్డ కొండచరియలు.. భారీగా ప్రాణనష్టం
- 'బాహుబలి' నిర్మాతల హారర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
- మలాన్ని డోనేట్ చేస్తే ఏడాదికి కోటి రూపాయలు : ఓ కంపెనీ ఆఫర్
- కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్లపై పరువు నష్టం దావా: మంత్రి జూపల్లి
- BCCI: అవన్నీ అబద్ధాలే: ఆసీస్ మాజీలకు జై షా కౌంటర్
- మిర్యాలగూడ: కునుకు తీస్తూ కమిషనర్ ఇలా..
- కేన్స్లో ఇండియన్ సినిమాకు మొదటి బహుమతి
- ఆస్ట్రేలియాలో తెలుగు వ్యక్తి అనుమానాస్పద మృతి
Advertisement