-
ముంబైకర్లకు ‘మోనో’త్సాహం
ముంబై: దేశంలోనే తొలిసారిగా ప్రారంభమైన ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన రవాణా వ్యవస్థ మోనో రైలు సేవల అనుభూతిని ముంబైకర్లు ఆస్వాదిస్తున్నారు. ఈ సేవలకోసం నగరవాసులు ఎంతోకాలంగా ఎదురుచూసిన సంగతి విదితమే. ఎంతో విశ్వసనీయమే అయినప్పటికీ మురికిపట్టిన, అసౌకర్యవంతమైన శివారు రైళ్లు, బెస్ట్ సంస్థకు చెందిన బస్సుల్లో ఇన్నాళ్లూ నానాయాతన పడుతూ రాకపోకలు సాగించిన ముంబైకర ్లకు తాజాగా అందుబాటులోకి వచ్చిన మోనో రైలు ప్రయాణం ఎనలేని ఆనందం కలిగిస్తోంది. ఎన్నో విజయవంతమైన ప్రయోగాత్మక పరుగుల తర్వాత శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఈ సేవలను ప్రారంభించిన సంగతి విదితమే. ఆదివారం ఉద యం నుంచి మోనో రైలు సేవలు నగరవాసులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ రైళ్లు ఆకుపచ్చ, నీలం, నలుపు, గులాబీ రంగుల్లో అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. అంతేకాకుండా ఇవన్నీ పర్యావరణ అనుకూలమైనవి కూడా. ఇక ఈ రైళ్ల లోపలిభాగం, ప్లాట్ఫాంలు ప్రయాణికులను కట్టిపడేస్తున్నాయి. 20 అడుగుల వెడల్పు, 5.5 అడుగుల ఎత్తు లో వీటిని నిర్మించారు. కొన్ని ప్రాంతాల్లో ఐదున్నర అడుగులకంటే ఎక్కువఎత్తులో నిర్మించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఆయా స్టేషన్ల వద్ద త్వర లో ఎస్కలేటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్గం లో ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలను 20 నిమిషాల వ్యవధిలోనే చేరుకోవచ్చు. మోనో రైలు ప్రయాణికులకు గోల్ఫ్కోర్సులు, ఆకు పచ్చని మడఅడవులు, పొగమంచు ఆవరించిన పర్వతశ్రేణులు కనువిందు చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఎంఎంఆర్డీయే జాయింట్ డెరైక్టర్ డి కవత్కర్ మాట్లాడుతూ మోనో రైలు మొత్తం ఏడు స్టేషన్లలో ఆగుతుందన్నారు. ఈ మార్గం పొడవు 8.9 కిలోమీటర్లని అన్నారు. -
త్వరలో మోనో, మెట్రో సేవలు ప్రారంభం
సాక్షి, ముంబై: నగరవాసులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురుచూస్తున్న మెట్రో, మోనో రైళ్ల సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవలు అందుబాటులోకి వస్తే నగరవాసులకు ట్రాఫిక్ తిప్పలు తప్పినట్టే. మోనో రైలు సేవలను గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిపోయిన పనులను చకచకా పూర్తిచేస్తున్నారు. అంతేకాకుండా మెట్రో, మోనో రైల్వే స్టేషన్ల నుంచి బస్సు సేవల విషయమై బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్టు (బెస్ట్) సంస్థ పదాధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఈ రెండు మార్గాల ద్వారా రైలు దిగిన ప్రయాణికులకు ఏ రూట్లో, ఏ సమయంలో బస్సులు నడిపితే సౌకర్యవంతంగా ఉంటుందనే అంశంపై ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఇందుకు ముంబై మెట్రో-1 ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూడా తనవంతు సహకారం అందిస్తోంది. సాధ్యమైనంత త్వరగా మోనో రైలు సేవలను ప్రారంభించాల ని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కేవలం సేవ లు ప్రారంభిస్తే సరిపోదు కాబట్టి ముందుగా రైలు దిగిన ప్రయాణికులకు అన్ని స్టేషన్లలో ప్రజా రవాణా వ్యవస్థను సిద్ధం చేయా ల్సి ఉంటుంది. లోకల్ రైల్వే స్టేషన్ల మాదిరిగా మెట్రో, మోనో రైల్వే స్టేషన్ల వద్ద ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరగనుంది. ప్రయాణికులు స్టేషన్ నుంచి బయటపడగానే వారికి బస్సు సేవలు అందుబాటులో ఉంచేందుకు వీలుగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. త్వరలో వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మెట్రో రైలు, చెంబూర్- వడాల-జాకబ్ సర్కిల్ (సాత్ రాస్తా) మోనో రైలు తొలి విడత సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు మార్గాల రైల్వే స్టేషన్లు అత్యాధునికంగా ఉంటాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
గ్రీన్ డ్రెస్లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ.. ఆ జట్లకు హెచ్చరిక
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement