-
పెరుగుతున్న కరోనా కేసులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, తాడేపల్లి : కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒంటిపూట బడులు ఉంటాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమలవుతుందని చెప్పారు. ఉదయం 7.45 నుంచి 12.30 వరకు తరగతుల అనంతరం మధ్యాహ్న భోజనం యథావిధిగా ఉంటుందని పేర్కొన్నారు. కరోనా కేసులు, ఎండల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పాఠశాల నుంచి విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై ఉపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహణ, మాస్క్లు ధరించడం, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. చదవండి : ప్రభుత్వ ఉద్యోగులకు డిస్కౌంట్ సేల్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు కరోనా ఎఫెక్ట్ -
అంగన్ 'వేడి' కేంద్రాలు
► ఒంటి పూటపై ► అందని ఆదేశాలు ► మండే ఎండల్లోనూ రెండు పూటలు కొనసాగింపు ► పిల్లలను పంపేందుకు భయపడుతున్న తల్లిదండ్రులు ఇందూరు (నిజామాబాద్ అర్బన్): ఎండలు ముదురుతున్నాయి.. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.. ఈ నేపథ్యంలో విద్యార్థుల శ్రేయస్సు కోసం ఈ నెల 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, పాఠశాల స్థాయి విద్యార్థుల కంటే చిన్న పిల్లలు ఉండే అంగన్వాడీ కేంద్రాలను మాత్రం సర్కారు పట్టించుకోలేదు. ఒంటి పూట అమలు చేయలేదు. దీంతో రెండు పూటలా అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఎండలు ముదిరిన నేపథ్యంలో పిల్లలను కేంద్రాలకు పంపించేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. దీంతో హాజరు శాతం క్రమంగా తగ్గిపోతోంది. మరోవైపు, ఉదయం వచ్చిన పిల్లలు వేడి ప్రభావానికి తట్టుకోలేక మధ్యాహ్నానికే ఇంటికి వెళ్లిపోతున్నారు. జిల్లాలో ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో ఐదు ప్రాజెక్టు కార్యాలయాలుండగా, వీటి పరిధిలో మొత్తం మినీ, మెయిన్ కలిపి 1500 అంగన్ వాడి కేంద్రాలున్నాయి. ఆర్మూర్ ప్రాజెక్టు కార్యాలయ పరిధిలో 326, భీమ్గల్లో 282, బోధన్లో 331, నిజామాబాద్ రూరల్లో 303, నిజామాబాద్ అర్బన్ పరిధిలో 258 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఆయా కేంద్రాల్లో మొత్తం 79,538 మంది చిన్నారులు ప్రతీ రోజు పౌష్టికాహారం తినడంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అంగన్వాడీ కేంద్రాలను ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నడిపించాలి. ప్రస్తుతం ఎండలు ముదిరిన నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత కేంద్రాలను నడిపించడం పిల్లలకు, టీచర్లకు ఇబ్బందికరంగా మారింది. జిల్లాలో దాదాపు అంగన్వాడీ కేంద్రాలన్నీ ఇరుగ్గా ఉండటం, మరి కొన్ని రేకుల గదుల్లో ఉండడం మూలంగా ఉక్కపోత ఎక్కువవుతోంది. పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడంతో వడదెబ్బ, డీహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఎండలు ఎక్కువగా ఉండడంతో సిబ్బంది పిల్లలను ప్రతీ క్షణం కంట కనిపెడుతూ ఉన్నారు. మధ్యాహ్నం భోజనం తిన్న తరువాత వారిని కేంద్రాల్లోనే పడుకోబెడుతున్నారు. ఆదేశాలు రాలేవంటున్నారు... ఈ నెల 15వ తేదీ నుంచే ఒంటిపూట బడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో అంగన్ వాడీలు కూడా ఒంటిపూటను అమలు చేయాలని తల్లిదండ్రులతో పాటు టీచర్లు ఐసీడీఎస్ అధికారులను కోరారు. అయితే అంగన్ వాడీల్లో ఒంటి పూట నిర్వహణపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు రాలేదని అధికారులు చెబుతున్నారు. ఆదేశాలు వస్తే తప్ప తాము కూడా ఏమీ చేయలేమని స్పష్టం చేస్తున్నారు. ఎండల ప్రభావం ఉన్నప్పటికీ నిబంధనల ప్రకారం సాయంత్రం 4 గంటల వరకు కేంద్రాలను నడిపించాలి్సందేనని తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వానికి నివేదించాం.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని అంగన్ వాడి కేంద్రాల్లో ఒంటిపూటను అమలు చేయాలని ప్రభుత్వానికి నివేదించాం. దీనిపై త్వరలోనే ఆదేశాలు జారీ అయ్యే అవకాశముంది. ఒంటిపూట అమలైతే ఉదయం 7:30కే కేంద్రాలు తెరిచి, 12 గంటల వరకు కొనసాగించాల్సి ఉంటుంది. రాములు, ఐసీడీఎస్ రాష్ట్ర శాఖ అధికారి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement