-
పుష్ప-2 మేకర్స్కు షాక్.. అల్లు అర్జున్ ఫోటో లీక్!
ఐకాన్ స్టార్ ఫ్యాన్స్తో పాటు టాలీవుడ్ సినీ ప్రేక్షకుల మోస్ట్ అవైటేడ్ చిత్రం 'పుష్ప-2 ది రూల్'. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా మేకర్స్ ప్రకటించారు. ఇటీవల వాయిదా పడుతుందన్న వార్తల నేపథ్యంలో డైరెక్టర్ సుకుమార్ మరోసారి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. పుష్ప రూల్ బిగిన్స్ ఇన్ 200 డేస్ అంటూ మూవీ పోస్టర్ను పంచుకున్నారు. దీంతో బన్నీ ఫ్యాన్స్కు పుష్ప-2 విడుదలపై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. (ఇది చదవండి: పుష్ప-2 పై రూమర్స్.. డైరెక్టర్ సుకుమార్ పోస్ట్ వైరల్!) ఇదిలా ఉంటే తాజాగా పుష్ప-2కు సంబంధించిన అల్లు అర్జున్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. షూటింగ్ సెట్లో అల్లు అర్జున్ చీర కట్టుకుని ఉన్న నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే ఇది చూసిన ఫ్యాన్స్ ఈ ఫోటోపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే పుష్ప-2 సెట్లోని ఫోటో లీక్ అయిందా? లేదా ఎవరైనా మార్ఫింగ్ చేశారా అంటూ ఫ్యాన్స్తో పాటు నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే గతంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా షూటింగ్ సెట్లో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సుకుమార్ వెల్లడించారు. మళ్లీ పుష్ప-2 సెట్లో ఫోటో లీక్ కావడంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. కాగా.. గతంలో వచ్చిన 'పుష్ప-ది రైజ్' బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయం సాధించంది. పార్ట్-1 సక్సెస్ కావడంతో సీక్వెల్గా'పుష్ప 2' తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. మరో నటుడు ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. Pushpa 2 the rule leaked picture 💥#Pushpa2TheRule pic.twitter.com/n2eRsW2mdJ — Trending 2024 (@tren_ding20) January 29, 2024 Leaked Pic Of Syndicate King ' PUSHPA RAJ ' Wears Saree in Shooting Spot 🔥🔥🔥#PushpaKaRuleIn200Days #AlluArjun #Pushpa2 #PushpaTheRule #Pushpa2TheRule pic.twitter.com/O7u5N3z39u — FilmiFever (@FilmiFever) January 29, 2024 -
ఆ కీచకుడు నాతో పాటు నా కూతురిని కూడా టార్గెట్ చేశాడు: నటి ఆవేదన
ప్రముఖ నటి ప్రవీణా పోలీసులను ఆశ్రయించింది. గతంలో తనని వేధించిన ఓ కీచకుడు ఇప్పుడు తన కూతురిని టార్గెట్ చేశాడని ఆమె పోలీసులతో వాపోయింది. వివరాలు.. ప్రముఖ తమిళ టీవీ నటి, రాజారాణి సీరియల్ ఫేం ప్రవీణాను ఢిల్లీకి చెందిన భాగ్యరాజ్ అనే విద్యార్థి కొంతకాలంగా వేధిస్తున్నాడు. గతంలో ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసిన సోషల్ మీడియా, వెబ్సైట్లు, ఆన్లైన్లో షేర్ చేశాడు. విషయం తెలిసి ప్రవీణా కొన్ని నెలల క్రితం అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: తమన్నా ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలుసా? దీంతో పోలీసుల అతడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కొద్ది రోజుల తర్వాత అతడు బెయిల్పై బయటకు వచ్చారు. ఇక కొన్ని నెలలు గడిచిన అనంతరం మళ్లీ ఆమెను ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు. ఈసారి ప్రవీణాతో ఆమె కూతురు గైరీ నాయర్ను కూడా టార్గెట్ చేశాడు. తన కూతురి ఫొటోలను కూడా మార్ఫింగ్ చేసి ఆన్లైన్లో విడుదల చేశాడు. దీంతో ప్రవీణా తన కూతురితో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. చదవండి: మహేశ్-త్రివిక్రమ్ సినిమాలో అల్లు అర్హ స్పెషల్ రోల్? గతంలో తన ఫొటోలు మార్ఫింగ్ చేసిన వ్యక్తే ఈ సారి తన కూతురిని కూడా టార్గెట్ చేశాడని, మార్ఫింగ్ ఫొటోలతో ఇబ్బంది పెడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు తన స్నేహితులను, బంధువులను కూడా ఇబ్బంది పెడుతున్నాడని తెలిపింది. తన చూట్టూ ఉన్న మహిళలను కూడా వదలడం లేదని, వారి ఫొటోలను కూడా మార్ఫింగ్ చేసి విడుదల చేస్తున్నాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన పేరు మీద 100 ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి.. తనవి, తన కూతురు, తన బంధువుల మార్ఫింగ్ ఫొటోలను అందరికి షేర్ చేస్తున్నాడని ప్రవీణా ఫిర్యాదు పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Praveena Lalithabhai (@praveenalalithabhai) View this post on Instagram A post shared by Praveena Lalithabhai (@praveenalalithabhai) -
ఫేస్బుక్ చాటింగ్.. మార్ఫింగ్ చేసిన వీడియోలతో..
సాక్షి,బంజారాహిల్స్: ఫేస్బుక్ చాటింగ్ ద్వారా టచ్లోకి వచ్చిన ఓ అపరిచితుడు మార్పింగ్ చేసిన వీడియోలు పంపిస్తూ బ్లాక్మెయిన్ చేస్తున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకృష్ణానగర్లో నివాసం ఉంటున్న రాజీవ్ అనే వ్యక్తి ఓ ప్రైవేటు సంస్థలో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. దీంతో పాటు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల అతడి ఫేస్బుక్ ద్వారా గుర్తుతెలియని వ్యక్తి పరిచయం అయ్యాడు. ఫోన్ నెంబర్ ఇవ్వాలని కోరాడు. దాంతో అతడికి రాజీవ్ తన నెంబర్ ఇచ్చారు. కొన్నిరోజుల తర్వాత రాజీవ్ ఫేస్బుక్లో ఉన్న కొన్ని ఫొటోలను మార్ఫింగ్ చేసి వాటిని వేరొకరి శరీరాలతో కలిసి వీడియోలు తయారు చేసిన దుండగులు అతడిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. తమకు డబ్బులు ఇవ్వాలని లేకుంటే ఫేస్బుక్లోని స్నేహితుల గ్రూపులకు షేర్ చేస్తామని బెదిరించారు. దీంతో రూ. 3469 చొప్పున మూడుసార్లు పంపించినా ఇదే తీరులో బ్లాక్మెయిల్ చేస్తుండటంతో బాధితుడు రాజీవ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి👉🏻 కొత్త సినిమా లింకులని కక్కుర్తిపడితే.. ఖేల్ ఖతం -
వివాహేతర సంబంధం: ఆమె ఫోటో, నంబర్ సంపాదించి..
సాక్షి, హైదరాబాద్: తన బావతో ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఆమె పరువు తీయాలని భావించాడో యువకుడు. సామాజిక మాధ్యమాల నుంచి ఆమె ఫొటో, ఫోన్ నంబర్ సంపాదించాడు. ఫొటో ఎడిటింగ్ యాప్స్లలో బాధి తురాలి ఫొటోను మార్ఫింగ్ చేసి ఫిమేల్ ఎస్కార్ట్గా చిత్రీకరించి, అసభ్య పదజాలంతో కామెంట్లు పెట్టి ఫోన్ నంబర్తో సహా ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దీంతో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఆమెకు ఫోన్ కాల్స్, సందేశాలు రావటం మొదలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన బాధితురాలు రాచకొండ సైబర్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన రాచకొండ సైబర్ క్రైమ్స్ ఏసీపీ ఎస్.హరినాథ్ సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితుడు గుంటూరు జిల్లా మంచికల్లు గ్రామానికి చెందిన విద్యార్థి మేకల శేషు వెంకట కృష్ణ (20)ను శుక్రవారం అరెస్ట్ చేశారు. ఇతడి నుంచి సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. జ్యుడీషియల్ కస్టడీ నిమిత్తం కోర్ట్ ముందు హాజరుపరిచారు. -
కజిన్తో గొడవ.. అతని భార్యని టార్గెట్గా చేసుకుని ఎనిమిది నెలలుగా..
Delhi Man Shared Cousin Wife, Morphed Photos: వ్యక్తిగత గొడవల కారణంగా బంధువు భార్యను సోషల్ మీడియాలో వేధించిన 21 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని జగత్ పూర్ పుస్తా నివాసి హితేన్గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని జగత్పుర్ పుస్తా ఏరియాకు చెందిన హితేన్కు తన బంధువుతో గొడవ జరిగింది. దాంతో హితెన్ కక్షగట్టి ఎలాగైనా తన బంధువుని వేధించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు హితేన్ తన బంధువు భార్య సోషల్మీడియా అకౌంట్ని టార్గెట్ చేశాడు. అదే పనిగా ఇన్స్టాగ్రామ్లో ఓ నకిలీ ఖాతాని క్రియేట్ చేసి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అతను సామాజిక మాధ్యమంలో నుంచి ఆమె ఫొటోలను డౌన్లోడ్ చేసుకుని, వాటిని అశ్లీల చిత్రాల్లోని యువతుల ఫొటోలతో మార్ఫింగ్ చేసేవాడు. ఆ ఫోటోలను తిరిగి బాధితురాలితో పాటు, ఆమె భర్త స్నేహితులకు కూడా పంపేవాడు. ఈ తంతు గత ఎనిమిది నెలలుగా కొనసాగుతుండంతో విసిగిపోయిన బాధితురాలు చివరికి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా, ఈ దారుణానికి పాల్పడుతోంది ఆమె బంధువేనని తేలండంతో అతన్ని అరెస్టు చేశారు. కాగా పోలీసులు నిందితుడి కంప్యూటర్ ఐపీ అడ్రస్ ద్వారా గుర్తించగలిగారు. చదవండి: Vikarabad: ప్రమాదమా.. హత్యా! కారుతో ఢీ: కొట్టి చంపే ప్రయత్నం..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement