-
బద్దలైన అగ్నిపర్వతం.. అంతా చీకటిమయం!
-
బద్దలైన అగ్నిపర్వతం.. అంతా చీకటిమయం!
జకార్తా: ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలైంది. సుమత్రా దీవుల్లోని ‘ మౌంట్ సినాబంగ్’ సోమవారం మరోసారి విస్పోటనం చెందింది. దీంతో సుమారు ఐదు కిలోమీటర్ల మీర ఎత్తు వరకు ఎగిసిన పొగ, బూడిదతో పరిసర ప్రాంతాలన్నీ నిండిపోయాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించక పోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే గత కొన్ని వారాలుగా సినాబంగ్ యాక్టివ్గా ఉందని, సోమవారం నాటి పేలుడు మరో హెచ్చరిక వంటిదని, ఎవరూ కూడా రెడ్జోన్ ఏరియాలోకి వెళ్లవద్దని ఇండోనేషియా వోల్కనాలజీ, జియోలాజికల్ మిటిగేషన్ సెంటర్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. మరోసారి అగ్పిపర్వతం విస్పోటనం చెందే అవకాశాలు ఉన్నాయని స్థానిక అధికారులు వెల్లడించారు. ఇక ఈ విషయం గురించి మౌంట్ సినాబంగ్ పరిసరాల్లోని నమంటెరన్ గ్రామ పెద్ద మాట్లాడుతూ.. ‘‘అంతా మాయాజాలంలా ఉంది. అగ్పిపర్వతం బద్దలవగానే పొగ, బూడిద కమ్ముకువచ్చాయి. ఊరంతా దాదాపు 20 నిమిషాల పాటు చీకటైపోయింది. ప్రస్తుతానికి అంతా క్షేమంగానే ఉన్నాం’’అని పేర్కొన్నారు. ఓ వైపు కరోనా మహమ్మారి వ్యాప్తి, మరోవైపు ప్రకృతి విపత్తులతో ప్రజలు భయందోళనకు గురవుతున్నారని చెప్పుకొచ్చారు.(చదవండి: అగ్నిసాక్షిగా కాదు.. అగ్నిపర్వతం సాక్షిగా వారి పెళ్లి!) కాగా 400 ఏళ్ల తర్వాత మౌంట్ సినాబంగ్ అగ్నిపర్వతం 2010 నుంచి క్రియాశీలకంగా మారింది. 2014లో సంభవించిన విస్ఫోటనం వల్ల దాదాపు 16 మంది మరణించగా.. 2016 నాటి ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. జావా, సుమత్రా దీవుల్లో విస్తరించి ఉన్న ఈ అగ్నిపర్వతం పేలుడు ధాటికి 2018లో సముద్రంలో సునామీ చెలరేగా దాదాపు 400 మంది మృత్యువాత పడ్డారు. -
బద్దలైన అగ్నిపర్వతం
జకార్తా: ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా ప్రావిన్స్లోని సినాబంగ్ అగ్నిపర్వతం బద్దలైంది. గురువారం సాయంత్రం నుండి సుమారు రెండు కిలోమీటర్ల ఎత్తున బూడిద ఎగిసిపడుతోంది. శక్తివంతమైన వేడి బూడిద , గాలులు విస్తరిస్తున్నాయని ఇండోనేషియా అధికారులు శుక్రవారం వెల్లడించారు. దీంతో సమీపంలోని గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది. 2,475 మీటర్లు విస్తరించి ఉన్నఈ మౌంట్ సినాబంగ్ చుట్టూ సుమారు 120 అగ్నిపర్వతాలు కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ అగ్ని పర్వతం 2013, 14 సంవత్సరాల్లో తరచుగా బద్దలైంది . ఈ సంబందర్భంగా పెద్ద ఎత్తున ఎగజిమ్మిన లావా భయోత్పాతం సృష్టించింది. 15మంది పౌరులు మరణించగా, ముప్పయివేలమందిని అక్కడినుంచి తరలించారు. తాజా పరిణామాలతో నేపథ్యంలో చుట్టుపక్కల నాలుగు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఇండోనేషియా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్' పైన వుంది. ఇక్కడ భూమి పొరలు ఒకదానితోమరొకటి సంఘర్షించడంతో అగ్నిపర్వతాలు బద్దలవ్వడం, భూకంపాలు సంభవించడంలాంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తుంటాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement