-
నేడు కడపకు స్మగ్లర్ ముఖేష్ బదానీ
కడప: అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ ముఖేష్ బదానీని జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్గులాఠీ ఆదేశాల మేరకు జిల్లా ప్రత్యేక బృందం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు బదానీని కడపకు పోలీసులు తీసుకరానున్నట్టు తెలుస్తోంది. బదానీతో పాటు ప్రత్యేక పోలీస్ బృందం సాయంత్రం 8 గంటలకు కడపకు చేరుకోనున్నారు. హర్యానా రాష్ట్రం హిస్సార్ జిల్లాకు చెందిన ముఖేష్ బదానీ అంతర్జాతీయ స్థాయిలో ఎర్ర చందనం స్మగ్లర్గా పేరొందాడు. ఇప్పటికే అతనితో సన్నిహిత సంబంధాలను కొనసాగించిన వారిలో కొందరిని అట్లూరు, బద్వేలు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ముఖేష్ బదానీని జిల్లాలోని రాజంపేట డీఎస్పీ అరవిందబాబు, సీఐలు రాజేంద్రప్రసాద్, వెంకటప్ప, మరికొంతమంది సిబ్బంది అరెస్ట్ చేసి జిల్లాకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ముఖేష్ బదానీని రేపు మీడియా ముందు ప్రవేశపెట్టి కోర్టులో హాజరుపర్చనున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ముఖేష్ బదానీ తనకు స్మగ్లింగ్తో ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నాడు. తాను లైసెన్స్డ్ ఎర్రచందనం వ్యాపారి అని చెప్పినా తనను పోలీసులు అరెస్ట్ చేశారని ముఖేష్ వాదిస్తున్నాడు. -
‘ఎర్ర’ కేసులో నేడో, రేపో కడపకు ముఖేష్ బదాని?
జిల్లాలోని‘ పచ్చ’ నేతల్లో గుబులు వలపన్ని బదానీని అరెస్ట్ చేసిన ప్రత్యేక బృందం క్రైం( కడప అర్బన్ ) : అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ ముఖేష్ బదానీని జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్గులాఠీ ఆదేశాల మేరకు జిల్లా ప్రత్యేక బృందం పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని నేడో, రేపో జిల్లాకు తీసుకురానున్నారు. హర్యానా రాష్ట్రం హిస్సార్ జిల్లాకు చెందిన ముఖేష్ బదానీ అంతర్జాతీయ స్థాయిలో ఎర్ర చందనం స్మగ్లర్గా పేరొందాడు. జిల్లాలోని కొందరు ‘పచ్చ’ నేతలతో నేరుగా సంబంధాలను కలిగి ఉన్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ముఖేష్ బదానీని హర్యానాలో అరెస్టు చేసిన పోలీసులు జిల్లాకు తెస్తున్నారని తెలియగానే వారిలో వణుకు పుడుతోంది. ఇప్పటికే అతనితో సన్నిహిత సంబంధాలను కొనసాగించిన వారిలో కొందరిని అట్లూరు, బద్వేలు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ముఖేష్ బదానీని జిల్లాలోని రాజంపేట డీఎస్పీ అరవిందబాబు, సీఐలు రాజేంద్రప్రసాద్, వెంకటప్ప, మరికొంతమంది సిబ్బంది అరెస్ట్ చేసి జిల్లాకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. సోమ లేదా మంగళ వారాల్లో జిల్లాకు తీసుకొచ్చి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి. -
రెడ్ సిగ్నల్
► ఎర్రచందనం స్మగ్లర్ల భరతం పడుతున్న ఎస్పీ ► టాస్క్ఫోర్స్తో సత్ఫలితాలు ► నిన్న వెంకటరమణ..నేడు ముఖేశ్ బదాని అరెస్ట్ ► ఎర్ర దొంగల్లో గుబులు ► ‘ఎర్ర’ లింకులున్న పోలీసులపై వేటు ► ఒంటిమిట్ట ఘటనలో ఏఎస్ఐ, కానిస్టేబుల్ సస్పెన్షన్ ► సంబేపల్లి పోలీసుస్టేషన్లో ముగ్గురిపై వేటు ► చైనా స్మగ్లర్ల కోసం కొనసాగుతున్న వేట ► అటవీ ప్రాంతంలో ముమ్మరంగా సాగుతున్న కూంబింగ్ సాక్షి, కడప : ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసు యంత్రాంగం కొరడా ఝళిపిస్తోంది. అక్రమ రవాణాకు పాల్పడినా, స్మగ్లర్లకు సహకరించినా జిల్లా ఎస్పీ పోలీసు దెబ్బ రుచి చూపిస్తున్నారు. స్మగ్లింగ్ను అరికట్టడానికి ఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటైన టాస్క్ఫోర్ృ బందం ఆశించిన రీతిలో ఫలితాలు సాధిస్తోంది. ఓ వైపు కూంబింగ్ నిర్వహిస్తూనే మరో పక్క స్మగ్లర్ల ఆట కటి ్టస్తున్నారు. అంతర్జాతీయ స్మగ్లర్లను ఒక్కొక్కరినీ పట్టుకోగలుగుతున్నారు. వారి నుంచి రాబట్టిన సమాచారంతో చోటా.. మోటా స్మగ్లర్లను ఏరి పారేస్తున్నారు. సుమారు నెల రోజులుగా టాస్క్ఫోర్ృ బందం శేషాచలం అడవుల్లో విృస్తతంగా కూంబింగ్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్మగ్లర్ బొడ్డె వెంకట రమణ(టీడీపీ నేత)ను చాకచక్యంగా పట్టుకుని కోట్లాది రూపాయల విలువైన చందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా హర్యానాలో అంతర్జాతీయ స్మగ్లర్ అయిన బదానీని శనివారం అరెస్టు చేశారు. రెండు, మూడు రోజుల్లో జిల్లాకు బదాని అంతర్జాతీయ స్మగ్లర్ ముఖేశ్ బదానీని రెండు, మూడు రోజుల్లో జిల్లాకు తీసుకు రానున్నట్లు ఎస్పీ డాక్టర్ నవీన్ గులాఠీ స్పష్టం చేశారు. అన్ని కోణాల్లో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఆయన శనివారం కలెక్టరేట్ వద్ద మీడియాకు వెల్లడించారు. కాగా, బదానీకి జిల్లాలో కొంత మంది స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. బదానీని కడపకు తీసుకు వచ్చి విచారిస్తే పలువురి గుట్టు రట్టుకానుంది. చైనా స్మగ్లర్ల కోసం కొనసాగుతున్న వేట వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లోని శేషాచలం అడవుల్లో నుంచి అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని స్థానిక స్మగ్లర్ల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత మంది చైనాకు సంబంధించిన స్మగ్లర్లు కూడా ఢిల్లీలో మకాం వేసి స్థానిక స్మగ్లర్ల ద్వారా రవాణాసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం హర్యాన వెళ్లిన కడప ప్రత్యేక పోలీసృ బందం చైనా స్మగ్లర్ల కోసం కూడా వేట కొనసాగిస్తోందని సమాచారం. బెంగళూరుకు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్ అహ్మద్ను పట్టుకునేందుకు కూడా నిఘా పెట్టినట్లు తెలియవచ్చింది. ఒంటిమిట్ట ఘటనపై సీరియస్ ఒంటిమిట్ట పోలీసుస్టేషన్ ఆవరణంలోనున్న సుమారు 18 ఎర్రచందనం దుంగలు మాయం కావడాన్ని ఎస్పీ డాక్టర్ నవీన్ గులాఠి సీరియస్గా తీసుకున్నారు. ఘటనకు బాధ్యులుగా భావిస్తూ తొలుత ఏఎస్ఐతోపాటు మరో కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. ఎర్రచందనం దుంగలను దోచుకెళ్లిన దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పలువురు కానిస్టేబుళ్లపై వేటు జిల్లాలోని పలు స్టేషన్లలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లపై శనివారం జిల్లా ఎస్పీ డాక్టర్నవీన్ గులాఠి కఠిన చర్యలు తీసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారాలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై సంబేపల్లె పోలీసుస్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ మురళిరాజు, కానిస్టేబుళ్లు మోహ న్, నరేంద్రలను సస్పెండ్ చేశారు. ఇవే ఆరోపణలపై మరో ఇద్దరు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాయచోటికి చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లు విధుల్లో నిర్లక్ష్యం వహించడంతోపాటు సివిల్ పంచాయతీల్లో తల దూర్చడం మితిమీరడంతో ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. పోలీసులు.. ఎర్రలింకులు కడప అర్బన్ : ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలున్నాయనే కారణంతో ఇప్పటి దాకా పదుల సంఖ్యలో పోలీసులు, అటవీశాఖ సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. 2006లో సీఐలు, ఎస్ఐలు,ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లతో కలిపి 21 మందిని అప్పటి ఎస్పీ నాగిరెడ్డి సస్పెండ్ చేశారు. పలువురు అటవీ శాఖ సిబ్బందిపై కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు. గత ఏడాది రాజంపేట డీఎస్పీ జీవీ రమణను పోలీసు ఉన్నతాధికారులు సస్పెన్షన్ చేశారు. తాజాగా ఒంటిమిట్ట, సంబేపల్లెలలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఒక ఏఎస్ఐ, ఒక హెడ్ కానిస్టేబుల్, ముగ్గురు పోలీసులు సస్పెన్షన్కు గురయ్యారు. లోతుగా విచారిస్తే మరికొంత మంది పోలీసు దొంగలు బయటపడే అవకాశం ఉంది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement