-
ఫ్లిప్కార్ట్ నుంచి వైదొలగిన ముకేశ్
దిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ నుంచి ఇద్దరు ఉన్నతాధికారులు వైదొలిగారు. వాణిజ్య, వ్యాపార ప్రకటనల వ్యాపారాధిపతి ముకేశ్ బన్సల్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకిత్ నగోరి తమ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కీలక బాధ్యతల నుంచి తప్పుకున్నా ముకేశ్ సలహాదారుగా కొనసాగుతారని ఫ్లిప్కార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. సీఈవోగా బిన్నీ బన్సాల్ నియమితులైన తర్వాత ముకేశ్ వైదొలగడం గమనార్హం. 2014లో మింత్రాను కోనుగోలు చేయడంతో ముకేశ్... ఫ్లిప్కార్ట్ లో చేరారు. తన కుటుంబంతో గడపడం కోసమే ముకేశ్ ఈ కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకున్నారని వెల్లడించింది. ముకేశ్ ఇప్పటిదాకా నిర్వహించిన బాధ్యతలను ఇకనుంచి ఫ్లిప్కార్ట్ సీఈవో బిన్నీ బన్సాల్ చూసుకుంటారు. క్రీడల విభాగంలో వ్యాపార సంస్థను ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఫ్లిప్కార్ట్ నుంచి అంకిత్ వెలుపలికి వచ్చారు. ఆయన పెట్టబోయే కంపెనీలో ఫ్లిప్కార్ట్ సహ-వ్యవస్థాపకులైన సచిన్, బిన్నీ బన్సాల్ పెట్టుబడులు పెట్టనుండడం విశేషం. -
మింత్రా.. ప్లిప్కార్ట్ పరం
బెంగళూరు: దేశీయ ఈ-కామర్స్ రంగంలో సంచలనానికి తెరతీస్తూ... అతిపెద్ద కొనుగోలు డీల్ సాకారమైంది. ఈ రంగంలో దిగ్గజ సంస్థ ఫ్లిప్కార్ట్... ఆన్లైన్ ఫ్యాషన్ రిటైలర్ మింత్రాను చేజిక్కించుకుంది. మింత్రాలో 100 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ఫ్లిప్కార్ట్ గురువారం ప్రకటించింది. ఇరు కంపెనీలు డీల్ విలువ వివరాలను వెల్లడించనప్పటికీ... దాదాపు 33 కోట్ల డాలర్లు(సుమారు రూ.2,000 కోట్లు)గా ఉంటుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, తాజా డీల్లో దేశంలోని మొత్తం ఈ-కామర్స్ మార్కెట్లో విక్రయాల పరంగా సుమారు సగం వాటా ఫ్లిప్కార్ట్ పరం కానుందనేది పరిశ్రమ వర్గాల అంచనా. ‘మింత్రాను కొనుగోలు చేయడం ద్వారా ఈ-కామర్స్లోని అన్నివిభాగాల్లో అగ్రస్థానాన్ని దక్కించుకోవడానికి దోహదం చేయనుంది. సమీపకాలంలోనే ఫ్యాషన్ రిటైలింగ్ వ్యాపారంలో 10 కోట్ల డాలర్ల(సుమారు రూ.600 కోట్లు)ను పెట్టుబడిగా పెట్టనున్నాం. ఇరు కంపెనీలు కలిగి దేశీ ఈ-కామర్స్ రంగంలో కొత్త అధ్యాయాన్ని లిఖించనున్నాయి’ అని ఫ్లిప్కార్ట్ సహవ్యవస్థాపకుడు, సీఈఓ సచిన్ బన్సల్ వ్యాఖ్యానించారు. మింత్రా, ఫ్లిప్కార్ట్ వేర్వేరు సంస్థలుగానే కొనసాగుతాయని చెప్పారు. మరోపక్క, మింత్రా సహవ్యవస్థాపకుడు, సీఈఓ ముకేశ్ బన్సల్.. ఫ్లిప్కార్ట్ డెరైక్టర్ల బోర్డులో చేరనున్నారు. ఇరు సంస్థల ఫ్యాషన్ బిజినెస్ను ఆయన నడిపించనున్నారు. తాజా పరిణామంతో ఫ్లిప్కార్ట్ తన అపారెల్(దుస్తుల విభాగం) పోర్ట్ఫోలియోను మరింత పటిష్టం చేసుకోవడంతోపాటు అమెజాన్, ఈబే, స్నాప్డీల్ వంటి ఇతర దిగ్గజాలతో పోటీలో దూసుకెళ్లేందుకు దోహదం చేయనుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గడచిన కొన్నేళ్లుగా ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగడం, యువత ఆన్లైన్ షాపింగ్కు మొగ్గుచూపుతుండటంతో దేశంలో ఈ-కామర్స్ రంగం భారీ వృద్ధినే సాధించింది. చాలావరకూ ఈ-కామర్స్ కొనుగోళ్లలో అపారెల్, ఎలక్ట్రానిక్స్దే అత్యధిక వాటా ఉంటోంది. ప్రస్తుతం ఈ పరిశ్రమ మార్కెట్ విలువ దాదాపు 3 బిలియన్ డాలర్లు(సుమారు రూ.18,000 కోట్లు)గా అంచనా. ఇది 2018 నాటికి ఏడింతలకు పైగా ఎగబాకి 22 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా. ఇక ఫ్లిప్కార్ట్ వార్షిక ఆదాయం గతేడాది బిలియన్ డాలర్ల(సుమారు రూ.6,000 కోట్లు)ను అధిగమించింది. 2015 కల్లా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని కంపెనీ నిర్దేశించుకోగా అంతకంటే ముందే సాకారం కావడం గమనార్హం. 2007లో ఆన్లైన్ బుక్స్టోర్గా కార్యకలాపాలను ప్రారంభించిన ఫ్లిప్కార్ట్.. ప్రస్తుతం ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, గృహోపకరణాలు ఇలా దాదాపు అన్ని విభాగాల్లోనూ ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఇక మింత్రా ఆన్లైన్ స్టోర్లో విక్రయిస్తున్న ఫ్యాషన్ ఉత్పత్తుల్లో 650కి పైగా బ్రాండ్లు ఉన్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement