-
ముకుందరెడ్డి మరింత ఉన్నతి సాధించాలి
మంత్రులు పత్తిపాటి, దేవినేని ఆకాంక్ష పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘన సత్కారం మండపేట : జాతీయస్థాయిలో బిగ్గెస్ట్ లేయర్ కోళ్లరైతు అవార్డు గ్రహీత కర్రి వెంకట ముకుందరెడ్డి మరింత ఉన్నతిని సాధించాలని రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా మహేశ్వరరావు ఆకాంక్షించారు. విజయవాడలో ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ముకుందరెడ్డిని ఘనంగా సత్కరించి, మంత్రుల చేతుల మీదుగా జ్ఞాపికను అందజేశారు. బిక్కవోలు మండలం బలభధ్రపురంలో కేపీఆర్ గ్రూప్ సంస్థల్లో భాగంగా శ్రీలక్ష్మి పౌల్ట్రీస్ పేరిట రెండు దశాబ్దాల క్రితం రెండు లక్షల లేయర్ కోళ్లతో ఫారమ్ను ఏర్పాటు చేసిన ముకుందరెడ్డి అంచెలంచెలుగా శ్రీ లక్ష్మి ఎగ్ఫార్మ్ ప్రైవేటు లిమిటేడ్ పేరిట ఏపీ, కర్ణాటకల్లో 28 లక్షల లేయర్ కోళ్లతో ఫారాలు నెలకొల్పారు. ముకుందరెడ్డిని జాతీయ గుడ్ల సమన్వయ సంస్థ(నెక్) అక్టోబర్ 14న ప్రపంచ గుడ్డు దినోత్సవం సందర్భంగా కేంద్ర వ్యవసాయ మంత్రి చేతుల మీదుగా సత్కరించి అవార్డును అందజేసింది. విజయవాడ సత్కారంలో ముకుందరెడ్డి మాట్లాడుతూ పౌల్ట్రీపరిశ్రమ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని మంత్రులను కోరారు. ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ నాయకులు, జిల్లాకు చెందిన పలువురు కోళ్ల రైతులు పాల్గొన్నారు. -
జిల్లాల ఏర్పాటులో రాజకీయాలు
సీపీఎం జిల్లా కార్యదర్శి ముకుందరెడ్డి హుస్నాబాద్: హుస్నాబాద్ను కరీంనగర్ జిల్లాలోనే ఉంచాలంటూ చేపట్టిన నిరహారదీక్షలు ఆరో రోజుకు చేరుకున్నాయి. గురువారం దీక్షలో తోటపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు. దీక్షలను సందర్శిన సీపీఎం జిల్లా కార్యదర్శి ముకుందరెడ్డి మాట్లాడుతూ ప్రతి జిల్లా ఏర్పాటులో రాజకీయం నడుస్తున్నదన్నారు. హుజురాబాద్ను హన్మకొండలో చేర్పించేందుకు మంత్రి హారీష్రావు సహకారం తీసుకుంటున్న ఎమ్మెల్యే సతీష్కుమార్, హుస్నాబాద్, కోహెడ మండలాలను సిద్దిపేటలో కలుపుతున్నాడని అన్నారు. హుస్నాబాద్ ప్రాంతం నుంచి దాదాపు 3వేల మందికి పైగా గిరిజనులు కరీంనగర్లో జీవనోపాధి పొందుతున్నారని, వందలాది మంది జిల్లాకేంద్రంలో ఉన్నత చదువులు అభ్యాసిస్తున్నారని అన్నారు. ప్రజల ఆకాంక్షను గౌరవించి హుస్నాబాద్, కొహెడ మండలాలను కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశాడు. హుస్నాబాద్ పరిరక్షణ సమితి కన్వీనర్ కేడం లింగమూర్తి, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు భీమాసాహెబ్, నాయకులు కొమురయ్య, సత్యనారాయణ, శివరాజ్, సింగిల్ విండో డైరెక్టర్ ∙మల్లికార్జున్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు శంకర్రెడ్డి, శ్రీనివాస్, శ్రీనివాస్, చందు, బీజేపీ నాయకులు దేవేందర్రెడ్డి, విద్యాసాగర్, సీపీఐ నాయకులు శ్రీధర్ పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement