-
'సమైక్య ఆంధ్ర సీఎం అన్నట్లు వ్యవహారిస్తున్నాడు'
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు సమైక్య ఆంధ్రప్రదేశ్కు సీఎం అన్నట్లు వ్యవహారిస్తున్నాడని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా మూడో రోజు శుక్రవారం కర్నూలు జిల్లాలోని బానుకచర్ల డైవర్షన్ స్కీమ్ హెడ్ రెగ్యలరేటర్ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ వెంట ఉన్న మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ నాయకుడు ఎంవీ మైసూరారెడ్డి మాట్లాడుతూ.... ఇక్కడ నీళ్లు ఇస్తానంటాడు.. అక్కడ నీళ్లు ఇస్తానంటూ చంద్రబాబు ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం వల్ల సీమ ప్రజల కష్టాలు తీరుస్తానంటూ బాబు చెప్పే మాటలు నమ్మవద్దని ఆయన ప్రజలకు హితవు పలికారు. గాలేరు - నగరి ప్రాజెక్టు గోవింద అవుతుదేమోనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులు నిరర్థక ఆస్తులగా మారతాయని మైసూరారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పట్టిసీమ వల్ల ప్రయోజనం ఉండదన్నారు. పట్టిసీమ ప్రాజెక్ట్ను గోదావరి, కృష్ణా డెల్టా రైతులు వ్యతిరేకిస్తున్నారని మైసూరా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయినా చంద్రబాబు పట్టిసీమను పూర్తి చేయాల్సిందే అన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ప్రాజెక్టులన్నీ చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు పోలవరం కట్టండి... పట్టిసీమను ఆపండి... రాయలసీమను ఆదుకోండి అంటూ చంద్రబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
'రైతుల భూములు కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కుట్ర '
హైదరాబాద్: రాజధానిపై ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీతోపాటు కేంద్రప్రభుత్వం అందజేసిన మార్గదర్శకాలను చంద్రబాబు ప్రభుత్వం తుంగలోకి తొక్కిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎం.వి.మైసూరారెడ్డి ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని భూసమీకరణపై బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన మైసూరారెడ్డి మాట్లాడుతూ.... ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులకు 25 శాతమే లబ్ది చేకూరుతుందని తెలిపారు. రైతుల నుంచి తీసుకున్న భూములను కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. భూములతో చంద్రబాబు ప్రభుత్వం వ్యాపారం చేయాలనుకుంటోందని ఆయన విమర్శించారు. ఇది మంచి సంప్రదాయం కాదని మైసూరారెడ్డి... చంద్రబాబు ప్రభుత్వానికి హితవు పలికారు. అలాగే రాజధాని పేరుతో విచ్చలవిడిగా ప్రజల డబ్బును ఖర్చు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధాని విషయంలో మరోసారి పునారాలోచన చేయాలని మైసూరా ఈ సందర్భంగా చంద్రబాబుకు హితవు పలికారు. -
భుక్తిపోరు
ఎర్రగుంట్ల: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్(ఆర్టీపీపీ)లో 600 మెగావాట్ల ప్రాజెక్ట్ కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులు సోమవారం ఆర్టీపీపీని ముట్టడించారు. తమకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులకు మద్దతుగా వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి సోదరుడి కుమారుడు డాక్టర్ సుధీర్రెడ్డి ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డుమెంబర్లు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున కదలి వచ్చారు. ప్రాజెక్టు గేటు తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు, మహిళలకు మధ్య తోపులాట జరిగింది. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గేట్ వద్ద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోదరుడు శివనారాయణరెడ్డి, ఎర్రగుంట్ల మున్సిపల్ ఛైర్మన్ ముసలయ్య, వైస్ ఛైర్మన్ సుభాష్రెడ్డిలతో పాటు కౌన్సిలర్లు కూడా ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సీఐ పీటీ కేశవరెడ్డి సంఘటన స్థలానికి వచ్చి ఏపీ జెన్కో డెరైక్టర్ వై. వెంకటేశ్వరరావుతో చర్చలు జరిపేందుకు భూ నిర్వాసితులు, నాయకులు కొందరు రావాలని కోరారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి సోదరుడి కుమారుడు డాక్టర్ సుధీర్రెడ్డి మాట్లాడుతూ డెరెక్టర్, సీఈ ఇక్కడికే వచ్చి నేరుగా భూ నిర్వాసితులతో చర్చలు జరపాలని కోరారు. ఎస్ఈ శేషారెడ్డి వచ్చి భూ నిర్వాసితులు చర్చలకు రావాలని విన్నవించడంతో సీఈ ఛాంబర్లో చర్చలు జరిపారు. ఏపీ జెన్కో డెరైక్టర్తో చర్చలు ఏపీ జెన్కో డెరైక్టర్తో జరిగిన చర్చల్లో సుధీర్రెడ్డి, శివనారాయణరెడ్డిలతో పాటు భూ నిర్వాసితులు, మహిళలు పాల్గొన్నారు. భూములు కోల్పోయిన వారిందరికి ఉద్యోగాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అర్హులైన భూ నిర్వాసితులకు 95 ఉద్యోగాలు ఇస్తామని డెరైక్టర్ వైవీ రావు హామీ ఇచ్చారని భూ నిర్వాసితులు తెలిపారు. పది రోజుల్లో జాబితాను విడుదల చేస్తామని చెప్పినట్లు వారు పేర్కొన్నారు. మళ్లీ నిరసనలు చేయమని భూ నిర్వాసితులు హామీ ఇవ్వాలని డెరైక్టర్ కోరారు. కాగా తమకు చెప్పిన ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని, మాట తప్పితే మళ్లీ ఉద్యమ బాట పడతామని భూ నిర్వాసితులు హెచ్చరించారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటా.. ‘ఆర్టీపీపీ అధికారులు మా భూములు తీసుకున్నారు. ఇప్పుడు ఉద్యోగాల కోసం అడుక్కునే పరిస్థితి కల్పించారు’ అని భూ నిర్వాసితుడు సునీల్ వాపోయారు. న్యాయం చేయకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానంటూ పురుగుల మందు తాగే ప్రయత్నం చేస్తుండగా అక్కడున్న వారు అడ్డుకున్నారు. తిప్పుకుంటున్నారు.. ‘మొదట్లో భూములు తీసుకునేటప్పుడు మమ్మల్ని నమ్మించారు. ఇప్పుడేమో మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా తిప్పుకుంటున్నారు’ అని భూ నిర్వాసిత మహిళ భారతి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీపీపీ అధికారులు భూములు తీసుకుని తమకు ఉద్యోగాలు ఇవ్వకుండా బయటి వ్యక్తులకు ఇవ్వడం దారుణమన్నారు. -
ప్రభుత్వ భూములున్న చోటే రాజధాని..
* రాజధాని అంశం మరో విభజనకు బీజం కారాదు * మాజీ మంత్రి మైసూరారెడ్డి సూచన సాక్షి ప్రతినిధి, కడప: యాభై వేల ఎకరాల ప్రభుత్వ భూమి లభ్యమయ్యే ప్రాంతంలోనే నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో కల్పించిన సౌలభ్యం వల్ల ప్రభుత్వ, అటవీ భూములు సేకరించడం సులభమన్నారు. కొత్త భూసేకరణ చట్టం వల్ల ప్రైవేట్ భూములను సేకరించడం తలకు మించిన భారమవుతుందన్నారు. రాష్ర్ట ఖజానా అంత భారాన్ని మోసే పరిస్థితుల్లో లేదని, కేంద్రం కూడా నిధులు సమకూర్చదని చెప్పారు. రాజధాని అంశం తెలుగుజాతి మరో విభజనకు బీజం కారాదన్నారు. రాజధాని అంశంపై ప్రధాన మంత్రి మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబులకు ఈనెల 14న తాను రాసిన లేఖలను గురువారం కడప ప్రెస్క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మైసూరారెడ్డి విడుదల చేశారు. ‘సింగపూర్ లాంటి రాజధాని నిర్మించుకుందామంటూ చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. సింగపూర్ నగర వైశాల్యం లక్షా 50వేల ఎకరాలు. అంతటి మహానగరం కాకపోయినా అందులో సగం నిర్మించాలన్నా 50వేల ఎకరాల ప్రభుత్వ స్థలం అవసరమవుతుందని’ మైసూరారెడ్డి పేర్కొన్నారు. ఆమేరకు భూములున్న చోట రాజధాని ఏర్పాటు చేయడం అమోదయోగ్యంగా ఉంటుందని చెప్పారు. -
లగడపాటి మారీచ రాజకీయం
* రాజకీయ ఒత్తిళ్లతో సర్వే అంటూ కాకిలెక్కలు: మైసూరా * పోలింగ్కు ముందు ఓటర్లను ప్రలోభ పెట్టే కుయుక్తులని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: తాను రాజకీయాల్లో లేనంటూనే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజకీయ ఒత్తిళ్లకు లొంగి సర్వేల పేరుతో మారీచ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. తెలుగుదేశం పార్టీ ఒత్తిళ్లకు లొంగో, వారితో కుమ్మక్కయ్యో ఆ పార్టీకి ప్రయోజనం కలిగించేలా సర్వే ప్రకటనలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ ఎం.వి.మైసూరారెడ్డి విమర్శించారు. తన సర్వే ఫలితమంటూ కాకి లెక్కలు చెబుతూ, పోలింగ్ ముంగిట్లో పరోక్షంగా ఓటర్లను ప్రలోభ పెట్టే ఈ కుయుక్తులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది అనైతికమే కాకుండా ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని కూడా మైసూరా శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘నీ సర్వే ఏంటి? శాంపిల్ ఎంత? మెథడాలజీ ఏమిటి? ఇవేమీ లేకుండా తెలుగుదేశం పార్టీకి అనుకూలించే ప్రకటనలు చేయడం ఏ రకంగా సమంజసం?’ అని ప్రశ్నించారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఇటువంటి ప్రకటనలు చేయడాన్ని తాము సవాల్ చేస్తామని పేర్కొన్నారు. ‘తెలంగాణలో తెరాస ఆధిక్యత ఉందనేదే నీ సర్వే ఫలితమైతే, 30 తేదీన అక్కడ పోలింగ్ అయిన వెంటనే ఎందుకు చెప్పలేదు?’ అని నిలదీశారు. సర్వేల పేరుతో రాజకీయ దురుద్దేశాల్ని వెల్లడించడం ఆయనకు కొత్తేమీ కాదని, లోగడ ఉప ఎన్నికల సందర్భంగా వైఎస్సార్సీపీ తుడిచిపెట్టుకుపోతుందన్నారని, ఆయన సర్వేలోని విశ్వసనీయత ఎంతో ఆనాటి ఫలితాలతోనే సుస్పష్టంగా తేలిపోరుుందని గుర్తు చేశారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్రలో టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ సొంతంగా ప్రభుత్వాల్ని ఏర్పాటు చేస్తాయని తన సర్వేలో తేలిందని లగడపాటి శనివారం మీడియూ సమావేశంలో చెప్పారు. కేంద్రంలో ఎన్డీయే కూటమి 270కి పైగా సీట్లు సాధిస్తుందని పేర్కొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement