-
గుర్తు తెలియని మృతదేహాలు.. కేసులు మిస్టరీగానే
సాక్షి, మెదక్: గుర్తు తెలియని మృతదేహాల ఆచూకీ అంతుచిక్కడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇలాంటి కేసులు రోజురోజుకూ పెరుగుతుండగా.. పురోగతి మాత్రం కనిపించడం లేదు. అన్ ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ లభ్యం ఘటనలు నెలకు కనీసం ఒకటి, రెండు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేశారు. మృతదేహాన్ని సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మీనాజీపేట రోడ్డు పక్కన అటవీ ప్రాంతంలోని కాల్వలో పడేశారు. ఈ ఘటన ఈ నెల 18న వెలుగు చూసింది. ఇప్పటివరకు ఆ మృతదేహం ఎవరిదో పోలీసులు గుర్తించలేకపోయారు. ముఖం గుర్తు పట్టకుండా చెక్కేయడం.. కనుగుడ్లు పీకేయడంతోపాటు మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో డెడ్బాడీ ఎవరిదో గుర్తించడం కష్టంగా మారినట్లు తెలుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ ఘటన సంచలనం సృష్టించగా.. గుర్తు తెలియని మృతదేహాలకు సంబంధించిన కేసులు మిస్టరీగానే మిగులుతున్నాయి. ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలో ఘటనలు అధికంగా చోటుచేసుకుంటుండటం కలవరపెడుతోంది. గుర్తు తెలియని శవాల ఘటనల్లో 20 నుంచి 40 ఏళ్లలోపు వారే ఉన్నట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్ ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్కు సంబంధించి ఈ ఏడాది ఇప్పటివరకు 28 కేసులు నమోదయ్యాయి. ఇందులో తొమ్మిది గుర్తింపునకు నోచుకోగా, 19 డెడ్బాడీలు ఎవరివో పోలీసులు ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారు. సంగారెడ్డిలో అధికం.. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలు వస్తాయి. ఇందులో సిద్దిపేట కమిషనరేట్గా ఆవిర్భవించింది. సంగారెడ్డిలో 29 లా అండ్ ఆర్డర్, రెండు ట్రాఫిక్, ఒకæ సీసీఎస్, ఒక మహిళా పోలీస్ స్టేషన్.. సిద్దిపేటలో 25 లా అండ్ ఆర్డర్, ఒక ట్రాఫిక్.. మెదక్లో 21 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలో అన్ ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ ఘటనలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి. ఆ తర్వాత వరుసలో సిద్దిపేట, మెదక్ జిల్లాలు ఉన్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు సమీపంలో ఉండడం.. భూమి రేట్లు అమాంతంగా పెరగడంతో సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి నేర ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కారణాలు ఇవే.. గుర్తు తెలియని మృతదేహాల ఘటనలకు సంబం ధించి కారణాలు అనేకం. వివాహేతర సంబం ధాలు, ప్రేమ వివాహాలు, పగ, ప్రతీకార దాడుల్లో హత్యకు గురికావడం.. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందడంతోపాటు పలు కారణాలతో ఇంటికి దూరమై.. ఊరికి దూరమై.. ఎక్కడో నివసిస్తూ అనారోగ్యం పాలై మృత్యువాత పడిన వారిని అన్ ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ కింద పోలీసులు గుర్తించి కేసులు నమోదు చేస్తారు. అదృశ్యం (మిస్సింగ్) కేసుల్లో కొందరు హత్యకు గురైన వారు ఉంటా రని.. కేసు నుంచి తప్పించుకునేందుకు నింది తులు సదరు వ్యక్తి ఆనవాళ్లు లేకుండా చేసిన సం దర్భాలు ఉంటాయని.. వీటిని సైతం అన్ ఐడెంటిఫైడ్ డెడ్బాడీస్గానే పరిగణిస్తామని పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు ఉమ్మడి మెదక్ జిల్లాలో లేవని వెల్లడించారు. జిల్లాల వారీగా ఇలా.. సంగారెడ్డి : గుర్తు తెలియని మృతదేహాలకు సంబంధించి సంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం 20 కేసులు నమోదయ్యాయి. ఇందులో నాలుగు ట్రేస్ అవుట్ కాగా.. 16 పెండింగ్లో ఉన్నాయి. జనవరిలో రెండు కేసులు నమోదు కాగా.. ఒకటి గుర్తింపునకు నోచుకుంది. ఫిబ్రవరిలో ఒక కేసు నమోదు కాగా.. ఇప్పటివరకు ఏమీ తేలలేదు. మార్చిలో అ«ధికంగా ఎనిమిది కేసులు నమోదు కాగా.. ఒక మృతదేహాన్ని గుర్తించారు. ఏప్రిల్లో మూడు కేసులు రిజిస్టర్ కాగా.. ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. మేలో నాలుగు కేసులు నమోదు కాగా.. రెండింటిని ఐడెంటిఫై చేశారు. జూన్లో రెండు కేసులు రిజిస్టర్ కాగా.. వాటిని పోలీసులు ఇప్పటివరకు గుర్తించలేక పోయారు. సిద్దిపేట : ఈ ఏడాది నుంచి ఇప్పటివరకు గుర్తు తెలియని మృతదేహాల ఘటనకు సంబంధించి సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో నాలుగు కేసులు నమోదయ్యాయి. గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు.. ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఘటన చోటుచేసుకుంది. ఇందులో మూడు పురుష, ఒక మహిళ డెడ్బాడీస్ లభ్యమయ్యాయి. గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటనకు సంబంధించి ఒక డెడ్ బాడీ ఆచూకీ మాత్రమే లభించింది. మిగతా మూడు డెడ్బాడీస్ ఆచూకీని పోలీసులు ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారు. మెదక్ : జిల్లా పరిధిలో ఈ ఆరు నెలల్లో సుమారు నాలుగు అన్ ఐడెంటిఫై డెడ్బాడీస్ ఘటలనలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో అన్నీ ట్రేస్ అవుట్ అయ్యాయి. మెదక్ టౌన్ పోలీస్స్టేష న్ పరిధిలో 2017 నుంచి 2019 వరకు గుర్తు తెలి యని శవాలకు సంబంధించిన కేసులు 16 నమో దుకాగా.. అన్నిమృతదేహాల ఆచూకీ లభ్యమైంది. పోలీసుల ఫార్మాలిటీస్.. ముందుగా గుర్తు తెలియని శవాన్ని గుర్తించిన వారితో పోలీసులు ఫిర్యాదు తీసుకుంటారు. ఆ తర్వాత కేసు నమోదు చేసి.. మిగతా తతంగం పూర్తి చేస్తారు. అంటే రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజల సమక్షంలో డెడ్బాడీ పంచనామా నిర్వహిస్తారు. డెడ్ బాడీ ఫొటోను నలుదిక్కులా తీయడంతోపాటు ఫింగర్ ప్రింట్స్, బ్లడ్ శాంపిల్స్, డీఎన్ఏకు సంబంధించి మాంసాన్ని సేకరించి భద్రపరుస్తారు. డెడ్ బాడీకి ఉన్న దుస్తులు, ప్యాకెట్లలో ఏమైనా లభించాయా.. పరిసర ప్రాంతాల్లో ఏమైనా ఆనవాళ్లు కనిపించాయా వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. డాగ్ స్క్వాడ్ను రప్పించి పరిశోధిస్తారు. డెడ్ బాడీ మామూలు స్థితిలో ఉంటే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి భద్రపరుస్తారు. కుళ్లిన స్థితిలో ఉంటే పూడ్చి పెడతారని మెదక్ టౌన్ సీఐ వెంకట్ వివరించారు. డెడ్బాడీస్ గుర్తింపు ప్రయత్నాలు ఇలా.. పంచనామా, ఇతరత్రా ఫార్మాలిటీస్ అనంతరం గుర్తు తెలియని శవాలకు సంబంధించి క్రిమినల్ ఇంటెలిజెన్స్ సిస్టం ద్వారా రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు లుక్అవుట్ నోటీసులు, రేడియం మెస్సేజ్ చేస్తారు. మృతుడి వయసు, ఫొటోలు, దుస్తులు, ఇతర ఆనవాళ్ల ఫొటోలను అప్లోడ్ చేస్తారు. ఈ మేరకు ఎక్కడెక్కడ మిస్సింగ్ కేసులు నమోదైనవి.. అన్ ఐడెంటిఫైడ్ డెడ్బాడీస్లో మిస్సింగ్ అయిన వారు ఎవరైనా ఉన్నారా.. అనేది పరిశీలిస్తారు. పోలీస్ క్రైం రికార్డుల్లోని నేర చరితుల ఫొటోలతో అన్ ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ ఫొటో ట్యాలీ చేస్తామని సీఐ వెంకట్ వెల్లడించారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సింగయ్యపల్లి గ్రామానికి చెందిన బంధారం మల్లయ్య ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని ఈ ఏడాది మే 7న అతడి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సైతం కేసు నమోదు చేశారు. మూడు రోజుల తర్వాత 10న గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అన్ ఐడెంటిఫైడ్ డెడ్బాడీ లభ్యమైంది. మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసులు అన్ని పోలీస్స్టేషన్లకు లుక్అవుట్ నోటీసులు పంపించారు. దోతి, పుట్టుమచ్చల ద్వారా బంధారం మల్లయ్యగా గుర్తించారు. మృతుడు ఆకలితో అలమటిస్తూ మృతిచెందినట్లు తేలింది. -
వీడిన ‘చెరువులో శవం’ మిస్టరీ
నర్సింహులపేట : సుమారు తొమ్మిది నెలల క్రితం మండలంలోని కుమ్మరికుంట్ల చెరువులో తేలిన మృతదేహం మిస్టరీ ఎట్టకేలకు వీడింది. హతుడి భార్య, ఆమె చెల్లెలు కలిసి ఓ హంతక ముఠాకు సుఫారి ఇచ్చి అతడిని హత్య చేయించినట్లు విచారణలో వెల్లడైంది. లైంగిక వేధింపులు భరించలేకనే ఈ పనికి ఒడిగట్టినట్లు నిందితురాలు అంగీకరించింది. ఎస్సై వెంకటప్రసాద్ చేధించిన ఈ కేసు మిస్టరీ వివరాలను తొర్రూరు సీఐ శ్రీధర్రావు స్థానిక పోలీస్స్టేషన్లో మంగళవారం వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఉంగుటూర్ మండలంలోని చింతాయిగూడెం గ్రామానికి చెందిన పులిపాక పెద్దిరాజుకు 1985లో సుబ్బలక్ష్మితో వివాహమైంది. వారికి ముగ్గురు కుమార్తెలు జన్మించగా వారికి వివాహం చేశారు. అయితే పెద్దిరాజుకు స్త్రీ వ్యామోహం ఎక్కువగా ఉండేది. ఈ క్రమంలో అతడు సుబ్బలక్ష్మి చిన్నమ్మ కూతురైన దువ్వ పద్మను లైంగికంగా వేధించసాగాడు. వేధింపులు భరించలేక ఆమె తన అక్క సుబ్బలక్ష్మికి చెప్పింది. చివరికి వారు పెద్దిరాజును హత్య చేయించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా రాజోలుకు చెందిన రవితో కాంట్రాక్ట్ మాట్లాడుకున్నారు. అతడు రూ.10 లక్షలకు మర్డర్ చేసేందుకు ఒప్పుకోగా రెండు ధపాలుగా రూ.3 లక్షల చొప్పున ముట్టజెప్పారు. అనంతరం 2015, ఆగస్టు 15న రవి కొంతమందితో కలసి పెద్దిరాజును ఖమ్మంకు తీసుకొ చ్చి హత్య చేశాడు. మృతదేహాన్ని కుమ్మరికుంట్ల చెరువులో పడేశారు. మృతదేహం మరుసటి రోజు చెరువులో తేలడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జేబుపై పేరుతో కూపీ లాగిన ఎస్సై మృతుడి చొక్కా జేబుపై ఎంవీ రావు, తాడేపల్లిగూడెం అని లభించిన చిన్న క్లూ ఆధారంగా ఎస్సై వెంకటప్రసాద్ విచారణ చేపట్టారు. పలుమార్లు ప్రత్యేక బృందాలను పంపి స్థానికంగా ఫొటో ఆధారంగా విచారణ చేపట్టారు. ఉంగటూరు పోలీస్స్టేషన్లో కొన్నాళ్ల తర్వాత నమోదైన పెద్దిరాజు మిస్సింగ్ కేసు ఆధారంగా కేసు మిస్టరీని చేధించారు. హతుడి భార్య సుబ్బలక్ష్మిని మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో కీలక నిందితులైన రవి, పద్మతోపాటు మరికొందరు పరారీలో ఉన్నట్లు సీఐ వెల్లడించారు. సమావేశంలో ఎస్సై వై. వెంకటప్రసా ద్, సిబ్బంది పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
శబరి మూవీ.. వరలక్ష్మి శరత్కుమార్పై డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్!
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
Advertisement