-
కొంత సంతృప్తి.. మరింత అసంతృప్తి!
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ప్రభుత్వాస్పత్రిలో సేవలపై అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పటల్స్ (ఎన్ఏబీహెచ్) బృందం మూడు రోజుల పాటు తనిఖీలు నిర్వహించి కొంత సంతృప్తి.. అధిక శాతం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న సేవలు, శానిటేషన్, బయోమెడికల్ మేనేజ్మెంట్, అత్యవసర వైద్యం అందుతున్న తీరు, డిజార్డర్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై దృష్టి సారించింది. పలు అంశాలపై సంతృప్తి వ్యక్తం చేయగా, మరికొన్ని విభాగాల్లో లోపాలను గుర్తించారు. ఇలా 80 అంశాలతో కూడిన లోపాలను గుర్తించి వాటిని మూడు నెలల్లో సరిదిద్దుకోవాలని ఆస్పత్రి అధికారులకు సూచించారు. అప్పుడు మళ్లీ తనిఖీలు నిర్వహించి ఎన్ఏబీహెచ్ సర్టిఫికెట్ ఇచ్చే అంశాన్ని పరిశీలించనున్నట్లు తెలిపారు. కేస్షీట్ల నిర్వహణ అస్తవ్యస్తం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగుల కేస్ షీట్ల మెయింటెనెన్స్ అస్తవ్యస్తంగా ఉన్నట్లు ఎ¯Œఏబీహెచ్ బృందం గుర్తించింది. రోగిని ఎవరు చూస్తున్నారు. మందులు ఎవరు రాశారు. ఇన్వెస్టిగేషన్ వివరాలు, వైద్యుని పేరు, డిజిగ్నేషన్ వంటి వివరాలు ఉండాలన్నారు. కానీ అలాంటివేవి లేకపోవడాన్ని గుర్తించారు. ఎన్ఏబీహెచ్ నిబంధనల ప్రకారం ఆస్పత్రిలో చికిత్స పొందిన రోగి డిశ్చార్జి అయ్యేటప్పుడు రోగికి ఇచ్చే డిశ్చార్జి షీట్, ఆస్పత్రిలో కూడా ఒకటి ఉండేలా చూడాలని సూచించారు. కొన్ని కేస్ షీట్లు అస్తవ్యస్తంగా ఉండటాన్ని వారు గమనించారు. సేవలపై అవగాహన లేమి వార్డులో చికిత్స పొందుతున్న రోగికి ప్రాణాపాయం ఏర్పడినప్పుడు ఎలా స్పందిస్తారని నర్సింగ్ సిబ్బందిని ఎన్ఏబీహెచ్ బృందం అడగ్గా కొందరు చెప్పలేకపోయారు. పల్మనరీ కార్డియో రీససిటేష¯Œన్ (పీసీఆర్) విధానం ఎలా చేస్తారని అడగ్గా కొందరు నర్సింగ్ సిబ్బంది చేసి చూపించలేకపోవడాన్ని వారు లోపంగా రాశారు. వార్డులో చికిత్స పొందుతున్న రోగికి మందుల వాడకం, వారి పట్ల వ్యవహరించాల్సిన తీరు వంటి అంశాల్లో కూడా అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా వార్డులో పేషెంట్ కేర్ సరిగ్గా లేదని బృందం సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. వార్డులో ఉండే సిబ్బందికి అన్నింటిపై అవగాహన ఉండాలని సూచించారు. ఈ అంశాల్లో అవగాహన పెంచుకోవాలన్నారు. ల్యాబ్ సరిగ్గాలేదు ల్యాబ్లో బయోమెడికల్ వేస్ట్ అస్తవ్యస్తంగా ఉండటంతో పాటు, పర్యవేక్షణ కూడా సరిగ్గా లేదని ఎన్ఏబీహచ్ బృందం పేర్కొంది. ఇక్కడ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించింది. సూపరింటెండెంట్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. లేబొరేటరీ విభాగాలు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ పర్యవేక్షణలో ఉండటంతో ఈ పరిస్థితి దాపురించింది. గైనిక్, ఎస్ఎన్సీయూ బాగుంది పాత ప్రభుత్వాస్పత్రిలోని న్యూబర్న్ కేర్ యూనిట్ (ఎస్ఎన్సీయూ) నిర్వహణ బాగుందని కితాబిచ్చారు. గైనకాలజీలో ఎక్కువ మంది రోగులు ఉన్నారని, సేవలు కూడా బాగున్నాయన్నారు. పిడియాట్రిక్, ఆర్థోపెడిక్ విభాగాలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఎన్ఏబీహెచ్ బృందం, మెడిసిన్, జనరల్ సర్జరీ విభాగాలపై కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. మూడు రోజుల పాటు ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో తనిఖీలు నిర్వహించిన ఎన్ఏబీహెచ్ బృందంలో డాక్టర్ కృష్ణజ్యోతి గోస్వామి, డాక్టర్ అనిరుద్దముఖర్జీ, డాక్టర్ చిన్మయి షాహ్, షైను వర్గీస్, నిహార్ బాటియా ఉన్నారు. వారి వెంట సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.బాబూలాల్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్.గీతాంజలి, డీసీఎస్ ఆర్ఎంఓ డాక్టర్ శోభ, ఎన్ఏబీహెచ్ స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అరవింద్, కొత్తాస్పత్రి నోడల్ ఆఫీసర్స్ డాక్టర్ ఉష, పాత ఆస్పత్రి నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఉషారాణి, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ విజయలక్ష్మి, అడ్మినిస్ట్రేటర్స్ సౌమ్య, రోష్నారా, హెల్త్ ఇన్స్పెక్టర్లు పాగోలు శ్రీనివాసరావు, పీవీ రామారావు తదితరులు పాల్గొన్నారు. -
డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయా?
అనంతపురం న్యూసిటీ: అంబులెన్స్కు ఇన్సూరెన్స్, రవాణా అనుమతి, మీకు డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయా అంటూ నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్, హెల్త్ కేర్ ప్రొవైడర్ల (ఎన్ఏబీహెచ్) బృందం సభ్యులు డాక్టర్ ప్రశాంత్ కేల్కర్, డాక్టర్ బీనమ్మ ఆస్పత్రి అంబులెన్స్ డ్రైవర్లను ప్రశ్నించారు. శనివారం వారు సర్వజనాస్పత్రిలో తనిఖీలు కొనసాగించారు. ఆస్పత్రిలోని వివిధ వార్డులతో పాటు, కేన్సర్ యూనిట్, ఆస్పత్రి వెనుక వైపు ఉన్న డంప్యార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి అంబులెన్స్ డ్రైవర్లతో మాట్లాడారు. రోగులను తరలించేటప్పుడు తప్పక రవాణాశాఖ నియమాలను పాటించాలని ఆదేశించారు. వ్యర్థాలు ఎక్కపడితే అక్కడ వేస్తే ఎలా? ఆస్పత్రి వెనకున్న డంప్యార్డు, వార్డులలో వ్యర్థాలను వేరు చేసే విధానాన్ని చూసి కేంద్ర బృందం సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేస్తే ఎలాగని హెచ్ఓడీలను ప్రశ్నించారు. సురక్షిత ప్రమాణాలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. పొరపాటున ఇన్ఫెక్షన్స్ సోకితే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. లేబర్, గైనిక్, చిన్నపిల్లల వార్డులలో ఒక మంచంపై ఇద్దరు, ముగ్గురు రోగులుండడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. వైద్యులు సమయపాలన పాటించాలన్నారు. కేంద్ర బృందం వెంట సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథం, ఆర్ఎంఓ డాక్టర్ లలిత, డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ విజయమ్మ, హెచ్ఓడీలు డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వర రావు, డాక్టర్ రామస్వామి నాయక్, డాక్టర్ మల్లీశ్వరి, డాక్టర్ శంషాద్బేగం, నర్సింగ్ సూపరింటెండెంట్లు షాహిదాబేగం, స్వర్ణలత, తదితరులున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement