-
భారత్లో దొరికే రక్తంలో ఎందుకు ఎయిడ్స్?
న్యూఢిల్లీ: భారత్లో రక్తమార్పిడి కారణంగా గత 17 నెలల కాలంలో 2,234 మందికి ప్రాణాంతకమైన ఎయిడ్స్ వ్యాధి సోకినట్లు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (ఎన్ఏసీఓ) బుధవారం నాడు ప్రకటించింది. రక్తదానం తీసుకునే ముందు దాతలకు ఎయిడ్స్ ఉందా, లేదా? అన్న విషయంలో సమగ్ర పరీక్షలు జరుపుతున్నామని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు చెప్పుకుంటున్న దేశంలో ఇంత మందికి రక్తం ఎక్కించడం ద్వారా ఎయిడ్స్ మహమ్మారి సంక్రమించడం నిజంగా షాకింగ్ న్యూస్. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడా ఇలా జరగడం లేదు. మరి మన దగ్గర ఎక్కడ పొరపాటు జరుగుతోంది. రక్తం తీసుకోవడంలో బ్లడ్ బ్యాంకులు నిర్లక్ష్యం వహిస్తున్నాయా, ఎలాంటి పరీక్షలు లేకుండానే వైద్యులు రక్తమార్పిడి చర్యలకు ఒడిగడుతున్నారా. ధనదాహం కోసం కొన్ని బ్లడ్ బ్యాంకులు కక్కుర్తి పడుతున్నాయా? టెక్నీషియన్లకు సాంకేతిక పరిజ్ఞానం లేదా? అన్న ప్రశ్నలు తలెత్తక మానవు. భారత్లో అమలు చేస్తున్న రక్త విధానం నుంచి అన్ని చోట్ల పొరపాట్లు జరుగుతున్నాయి. వీటిని అరికట్టనంతకాలం అమాయకులు ఎయిడ్స్ బారిన పడే ప్రమాదం లేకపోలేదు. వాస్తవానికి ఎయిడ్స్ సోకిన రెండు, మూడు రోజుల్లో రోగి రక్తంలో ఎయిడ్స్ ఉన్న విషయాన్ని కనుగొనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రస్తుతానికి ప్రపంచంలో ఎక్కడా అందుబాటులో లేదు. ఎయిడ్స్ సోకిన వారం రోజుల్లో ఎయిడ్స్ను గుర్తించే రక్త పరీక్షలు ప్రపంచంతోపాటు భారత్కు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆ పరీక్షకు అయ్యే ఖర్చు దష్ట్యా భారత్లో ఎక్కడ కూడా ఎయిడ్స్ను త్వరగా కనుగొనే ఈ పరీక్షను ఉపయోగించడం లేదు. వారం రోజుల్లో ఎయిడ్స్ను కనుగొనేందుకు ‘న్యూక్లిక్ ఆసిడ్ ఆంప్లికేషన్ టెస్ట్’ను నిర్వహించాల్సి ఉంటుంది. దీనివల్ల ఓ యూనిట్ రక్తం ధర 2000 రూపాయల నుంచి 2,500 రూపాయల వరకు పెరుగుతుంది. భారత్లో ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులు ఒక యూనిట్ రక్తాన్ని రూ. 1050, ప్రైవేట్ బ్యాంకులు రూ.1450కి మించి అమ్మకూడదని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ పరిమితి విధించింది. ప్రస్తుతం భారత్లో ‘ఎంజైమ్ లింకిడ్ ఇమ్యునోసార్బెంట్ ఆస్సే (ఈఎల్ఐఎస్ఏ)’ పరీక్ష విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందులోనూ నాలుగోతరం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. దీని వల్ల ఎయిడ్స్ సోకిన మూడు వారాల్లో గుర్తించవచ్చు. ఈ పరిజ్ఞానాన్ని ఒక్క కర్ణాటక ప్రభుత్వం మినహా దేశంలో ఎక్కడా ఉపయోగించడం లేదు. త్వరలోనే ఈ విధానాన్ని తాము కూడా అమలు చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే ప్రకటించింది. దేశవ్యాప్తంగా మూడోతరం టెక్నాలజీనే ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఎయిడ్స్ సోకిన నాలుగు వారాల తర్వాతనే రోగాన్ని గుర్తించగలం. కెనడాలో రక్తమార్పిడి ద్వారా ఎయిడ్స్ సోకిన సంఘటన 1985 నుంచి ఇప్పటివరకు ఒక్కటి కూడా నమోదు కాలేదు. అమెరికాలో 2008 తర్వాత నమోదు కాలేదు. బ్రిటన్లో 2005లోనే ఆఖరి కేసు నమోదైంది. ఎయిడ్స్ సోకిన రెండు, మూడు రోజుల్లో రోగాన్ని కనుగొనే టెక్నాలజీయే ప్రపంచంలో లేనప్పుడు మరి ఆ దేశాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడానికి కారణం ఏమిటన్న ప్రశ్న రావచ్చు. ఆయా దేశాల్లో, ముఖ్యంగా కెనడాలో దాత నుంచి రక్తం తీసుకోవాలంటే పెద్ద ప్రక్రియ ఉంటుంది. ముందు రోగికి కౌన్సిలింగ్ ఇస్తారు. ఇటీవల ఏమైన అస్వస్థతకు గురయ్యారా, లేదా? తెలుసుకుంటారు. లైంగిక సంబంధాల గురించి క్షుణ్నంగా వాకబు చేస్తారు. వారు చెప్పినవన్నీ నిజాలేనని నిర్ధారించుకొని కూడా అఫిడవిట్ మీద సంతకం తీసుకుంటారు. అబద్ధం చెబితే శిక్షార్హులవుతారు. ఆ తర్వాతే దాత నుంచి రక్తం తీసుకుంటారు. మన దేశంలో పేరు, ఊరు, చిరునామా కలిగిన పత్రాలను కూడా సరిగ్గా రాయించుకోరు. మన దేశంలో ఎయిడ్స్, హెపటైటీస్ లాంటివి అరికట్టడం కోసం సుప్రీం కోర్టు ‘ప్రోఫెషనల్ డోనర్స్’ను నిషేధించినా లాభాల కోసం బ్లడ్ బ్యాంకులు వారిని ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. మరీ అత్యవసర పరిస్థితులోతప్ప రక్తమార్పిడిని అనుమతించవద్దని వివిధ దేశాల్లో చట్టాలున్నాయి. మన దగ్గర అలాంటివి లేవు. సమగ్ర రక్త విధానమే లేదు. -
రోజులు గడిచి.. విచారణ మరిచి!
► నీరుగారుతున్న ఎయిడ్స్ కిట్ల కేసు ► సూత్రధారులను తప్పించే ప్రయత్నం ► అక్రమాలపై నోరు మెదపని అధికారులు ► రెండు వారాలుగా ఇదే తంతు ► ఇప్పటికీ మొదలు కాని విచారణ అధికారులు తప్పు చేస్తే తప్పించుకోవడం చాలా తేలిక. అదీ సొంత శాఖ వారయితే.. ఇక అడ్డేముంది. విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటిస్తే సరి.. ఆ తర్వాత షరా మామూలే. చేస్తున్నాం.. చూస్తున్నాం.. అనే మాటలతో నెట్టుకురావడం అధికారులకు కొత్తేమీ కాదనేది ఎయిడ్స్ కిట్ల వ్యవ హారంలో మరోసారి రుజువవుతోంది. ప్రభుత్వం సరఫరా చేసిన ఉచిత హెచ్ఐవీ కిట్లను తిరిగి ప్రభుత్వాసుపత్రికే విక్రయించిన ఉదంతాన్ని ‘సాక్షి’ రెండు వారాల క్రితం వెలుగులోకి తీసుకొచ్చింది. అయితే ఇప్పటికీ విచారణ మొదలు కాకపోవడం తోటి అధికారుల సహకారానికి నిదర్శనం. కర్నూలు(జిల్లా పరిషత్): జిల్లాలో రెండు వారాల క్రితం హెచ్ఐవీ కిట్ల వ్యవహారం తీవ్ర దుమారం రేపిన విషయం విదితమే. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి(నాకో) ద్వారా రాష్ట్రీయ ఎయిడ్స్ నియంత్రణ మండలికి, అక్కడి నుంచి జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి కార్యాలయానికి ఉచితంగా హెచ్ఐవీ కిట్లను సరఫరా చేస్తారు. ఇందుకు సంబంధించి వాకిన్ కూలర్ను సైతం నాకో సరఫరా చేసింది. అయితే ఈ కూలర్ను ఏర్పాటు చేసేందుకు తమ వద్ద స్థలం లేదని చెప్పి, దానిని కర్నూలు మెడికల్ కాలేజీలోని మైక్రోబయాలజి విభాగానికి చేర్చారు. అక్కడి నుంచే జిల్లాలోని ఐసీటీసీ, పీపీటీసీ, ఏఆర్టీ సెంటర్లకు, పీహెచ్సీలకు హెచ్ఐవీ కిట్లు వెళ్తాయి. ఇలా వచ్చిన కిట్లను వైద్యులు, సిబ్బంది, అధికారులతో కొందరు వ్యాపారస్తులు కుమ్మక్కై పక్కదారి పట్టించారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో ఔషధ నియంత్రణ మండలి అధికారులు జిల్లా వ్యాప్తంగా ల్యాబొరేటరీలు, మెడికల్ ఏజెన్సీలు, మెడికల్ దుకాణాలపై దాడులు నిర్వహించారు. కర్నూలులోని రెండు మెడికల్ ఏజెన్సీలలో నాకో సరఫరా చేసిన హెచ్ఐవీ కిట్లను గుర్తించారు. వీటి ఆధారంగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని 24 గంటలు పనిచేసే ల్యాబ్లో, కర్నూలు మెడికల్ కాలేజీలోని మైక్రోబయాలజి ల్యాబ్లో 2వేల దాకా నాకో హెచ్ఐవీ కిట్లు లభించాయి. ఇందుకు సంబంధించి ఔషధ నియంత్రణ అధికారులు పంచనామా చేసి, నివేదికను కోర్టుకు సమర్పించారు. సూత్రధారులు తప్పించుకునేలా విచారణ నాకో సరఫరా చేసిన ఉచిత హెచ్ఐవీ కిట్లు మెడికల్ ఏజెన్సీలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో లభించి రెండు వారాలవుతున్నా విచారణ ప్రారంభం కాకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ నిధుల నుంచి హెచ్ఐవీ కిట్లను కొనుగోలు చేస్తారు. ఇలా వచ్చిన రీకాన్ కంపెనీ హెచ్ఐవీ కిట్లను కాదని.. ఎస్డీ కంపెనీ కిట్లు కావాలని తెప్పించుకున్నారు. ఈ కిట్లు నాకో సరఫరా చేసినవని ఔషధ నియంత్రణ మండలి అధికారుల తనిఖీలో బయటపడింది. ఈ కిట్లను గత డిసెంబర్లో తెప్పించుకున్నా వాడకుండా మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో ఓ మూలన భద్రపరిచారు. మైక్రోబయాలజి ల్యాబ్లో గత మూడు నెలలుగా హెచ్ఐవీ పరీక్షలు చేయడం లేదని సమాచారం. ఒకవైపు ఉన్న కిట్లను మూలనపడేసి, మరోవైపు కిట్ల కొరత ఉందని పేర్కొంటూ 2వేల కిట్లకు ఆర్డర్ పెట్టారు. ఈ మేరకు గత జనవరి 21న టెండర్ దారుడైన స్వాతి ఏజెన్సీ నుంచి కాకుండా స్టార్ ఏజెన్సీ నుంచి వెయ్యి కిట్లు తెప్పించారు. వీటిని కూడా ఇప్పటి వరకు వినియోగించకుండా ఆరోగ్యశ్రీ కార్యాలయానికి పరిమితం చేశారు. హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించకుండా కేవలం కమీషన్ల కోసమే కిట్లను కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలకు ఈ పరిణామం బలాన్ని చేకూరుస్తోంది. పని ఒత్తిడి సాకు.. హెచ్ఐవీ కిట్లకు సంబంధించి విచారణ అధికారిగా సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ వై.శ్రీనివాసులును నియమించారు. రెండు రోజుల అనంతరం రేడియాలజిస్ట్ డాక్టర్ జోజిరెడ్డిని సైతం విచారణాధికారిగా నియమించారు. అయితే వీరిని నియమించి పది రోజులైనా ఇప్పటిదాకా విచారణ ప్రారంభించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామిని ‘సాక్షి’ వివరణ కోరగా పని ఒత్తిడి కారణంగా విచారణ ప్రారంభం కాలేదన్నారు. త్వరగా పూర్తి చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కొట్పాడ్లో త్రిముఖ పోటీ!
కుంద్రా సమితిలో ఫ్లాగ్ మార్చ్
హోమ్ ఓటింగ్కు 4,000 మంది మొగ్గు
బీజేపీ సంకల్ప్ పత్రం ఆవిష్కరణ
భగ్గుమంటున్న సూరీడు
బరంపురంలో ప్రధాని మోదీ పర్యటన నేడు
సోమవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2024
బీజేడీ అప్రవాసి సమాఖ్య ఏర్పాటు
ఐదు చోట్ల అభ్యర్థుల మార్పు
నేడు సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ఇలా..
తప్పక చదవండి
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement