-
భారత్కు ఆ హక్కు లేదు: పాకిస్తాన్
ఇస్లామాబాద్: భారత్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రస్తుతం ఇరుదేశాల మధ్య నెలకొన్న ‘వాతావరణం’ మరింత దెబ్బతింటుందని పాకిస్తాన్ పేర్కొంది. తమ సైనికుల తలలను పాకిస్తాన్ సైన్యమే నరికిందంటూ భారత్ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. రక్షణ మంత్రి అరుణ్జైట్లీ చేసిన విమర్శలపై పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీస్ జకారియా ‘రేడియో పాకిస్తాన్’తో మాట్లాడుతూ, భారత సైనికుల తలలు నరికిన ఘటనంటూ ఏదీ జరగలేదని తాము ఇప్పటికే స్పష్టం చేశామని తెలిపారు. తమపై చేస్తున్న ఆరోపణలను ఐక్యరాజ్యసమితి ముందు పెట్టే హక్కును భారత్ ఎప్పుడో కోల్పోయిందని, యూఎన్కు భారత్ ఎప్పడూ కట్టుబడి ఉండలేదని ఆరోపించారు. యూఎన్ మిలిటరీ అబ్జర్వర్స్ గ్రూప్నకు భారత్ ఎన్నడూ సహకరించలేదన్నారు. కశ్మీర్లో జరుగుతున్న దురాగతాల నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించేందుకు భారత్ ప్రతిసారి ‘పాకిస్తాన్ కార్డ్’ను వాడుకుంటోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. -
మోదీ రెడ్లైన్ దాటారు: పాకిస్తాన్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్లో చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్తామని, అక్కడి ప్రజలకు మద్దతిస్తామన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటనలపై పాక్ నాయకత్వం మండిపడుతోంది. తమ దేశానికి సంబంధించిన బలూచిస్తాన్పై మాట్లాడి నరేంద్రమోదీ 'రెడ్లైన్' దాటారని పాకిస్తాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నఫీజ్ జకారియా గురువారం మండిపడ్డారు. బలూచిస్తాన్ గురించి మాట్లాడటం ద్వారా ఐక్యరాజ్యసమితి(యూఎన్) నియమావళిని మోదీ ఉల్లంఘించారన్నారు. ఈ నేపథ్యంలో రానున్న యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో కశ్మీర్ అంశాన్ని మరింత బలంగా వినిపిస్తామని జకారియా స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజం, మానవహక్కుల సంస్థలు కశ్మీర్ విషయంలో స్పందించి, భారత బలగాలను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో సైతం పీఓకే, బలూచ్ ప్రజలకు మద్దతిస్తామని ప్రకటించి పాక్ విషయంలో దూకుడు పెంచిన విషయం తెలిసిందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement