-
తల్లి పాలు తాగి ఇద్దరు చిన్నారుల మృతి
అన్నానగర్: అమ్మ పాలు అమృతం కంటే తీయనివి. తన రక్తాన్ని పాలుగా మార్చి పిల్లలకు ఇస్తుంది. అలాంటిది ఆ తల్లిపాలు విషం అయ్యాయి. పాలు తాగి పడుకున్న ఆ చిన్నారులు శాశ్వతంగా ఆతల్లిని విడిచివెళ్లారు. తల్లిపాలు తాగి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన నాగర్కోవిల్లో జరిగింది. కుమరి జిల్లా పుత్తన్దుర్ ప్రాంతంలో ఉన్న కాట్రాడిత్తడికి చెందిన కన్నన్(39) భార్య దివ్య (29). వీరికి అనుష్క(02)అనే కుమార్తె ఉంది. దివ్యకి 22వ తేదీన ఇద్దరు కవలలు జన్మించారు. వీరికి ఆమె శుక్రవారం ఉదయం పాలు ఇచ్చి నిద్రపుచ్చింది. అయితే కొద్దిసేపటికే ఆ ఇద్దరు పసికందులు మృతి చెందారు. దీంతో బంధువులు, స్థానికులు సంఘటనా స్థలానికి వచ్చి తల్లిపాలు తాగితే మృతి చెందరని.. ఊపిరి ఆడకుండా మృతిచెంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తరువాత పసికందులను పూడ్చివేశారు. ఈ సంఘటనపై కుమరి జిల్లా పిల్లల రక్షణ అధికారి కుముదాకి అందిన సమాచారం మేరకు దివ్య ఇంటికి వెళ్లి విచారణ చేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న కోట్టూరు పోలీసులు కేసు నమోదు చేసి కన్నన్, దివ్యలను విచారిస్తున్నారు. -
ఇరాన్లో నరకం చూశాం
- చెడిపోయిన చపాతీలే ఆహారం - నిఠారుగా నిలువలేని సెల్లో దుర్భరం - నాగర్కోవిల్ జాలర్ల పరిస్థితి దయనీయం చెన్నై, సాక్షి ప్రతినిధి: ‘చెడిపోయిన చపాతీ, చంటిపిల్లల్లా ఒక ముద్ద అన్నం. నిఠారుగా నిల్చుకునేందుకు కూడా వీలులేని సెల్లో నరకం అనుభవించాం... బద్దశత్రువుకు కూడా ఇలాంటి బాధలు రాకూడదు’ అని తమిళనాడు జాలర్లు తల్లడిల్లిపోయారు. కన్యాకుమారి జిల్లా నాగర్కోవిల్ సమీపం కడియప్పట్టికి చెందిన అంతోనీరాజ్ (38), డేవిడ్(42), హిలారిడన్(51), ప్రభు(33) అనే నలుగురు మత్స్యకారులు చేపలుపట్టే వృత్తిపై 2015 జులైలో దుబాయ్కి వెళ్లారు. తమ దేశ సముద్రపు సరిహద్దుల్లో చేపలవేట సాగిస్తున్నారనే ఆరోపణలతో ఫిబ్రవరి 6 వ తేదీన ఇరాన్ ఈ నలుగురిని అరెస్ట్ చేసింది. నలుగురు జైలుపాలు కావడంతో కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోయాయి. బాధిత కుటుంబాల వారు కన్యాకుమారి జిల్లా కలెక్టరుకు వినతిపత్రం సమర్పించారు. నేషనల్ డొమెస్టిక్ వర్క్స్ మూమెంట్ అనే సంస్థకు సమాచారం చేరవేశారు. వారి ద్వారా ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం చర్చలు జరిపి నలుగురిని విడుదల చేయించింది. ఈ నలుగురు జాలర్లు ఆదివారం దుబాయ్ నుంచి విమానం ద్వారా చెన్నైకి సురక్షితంగా చేరారు. వీరందరినీ తమిళనాడు పునరావాసశాఖ సహాయ కమిషనర్ రమేష్ పరామర్శించి వాం గ్మూలం నమోదు చేసుకున్నారు. ఆ తరువాత బస్సు టిక్కెట్లు కొనుగోలు చేసి నాగర్కోవిల్కు పంపారు. పునరావాస కమిషనర్కు ఇచ్చిన వాంగ్మూలంలో దయనీయమైన పరిస్థితులను వారు వివరించారు. నరకం చూపిన ఇరాన్ విదేశాలకు వెళ్తే అధికంగా సంపాదించవచ్చన్న ఆశతో తాము చేసిన ప్రయత్నం ప్రాణాల మీదకి తెచ్చిందని బాధితులు నలుగురు బావురుమన్నారు. బతికి ఉండగానే ఇరాన్ అధికారులు తమకు నరకం చూపారని వాపోయారు. దుబాయ్ సముద్రంలో ఫిబ్రవరి 6వ తేదీన తాము చేపలవేట సాగిస్తుండగా తమ హద్దుల్లోకి వచ్చారని ఆరోపిస్తూ ఇరాన్ సముద్ర తీర గస్తీదళాలు తమపై కాల్పులు జరిపాయని తెలిపారు. ఒక బుల్లెట్ తన వీపుపై గాయం చేయగా మరో బుల్లెట్ తనను రాచుకుంటూ వెళ్లిందని అంతోనీరాజ్ తెలిపాడు. తీవ్రంగా గాయపడిన తనను ఆసుపత్రిలో చేర్చకుండా నేరుగా అక్కడి జైల్లో పెట్టేశారని చెప్పాడు. తమ నలుగురిని ఒక గుహ వంటి సెల్లో పెట్టారని, ఆ సెల్లో నిఠారుగా నిల్చుకునేందుకు వీలుండే ఎత్తు ఉండదని తెలిపారు. నిరంతరం ఒంగోనే ఉండాలని వాపోయారు. సరైన ఆహారం కూడా పెట్టేవారు కాదన్నారు. ఉదయం పూట చిన్న పిల్లలకు పెట్టినట్లు ఒక ముద్ద అన్నం, రాత్రివేళల్లో చెడిపోయిన చపాతీ ఇచ్చేవారని తెలిపారు. పారవేయాల్సిన ఆహారం తింటూ ఇరాన్ రాక్షసుల నుంచి ప్రాణాలను కాపాడుకున్నామని తమిళనాడు జాలర్లు వాపోయారు. ఒక సెల్ నుంచి మరో సెల్కు తమను మార్చేపుడు కళ్లకు గంతలు కట్టి, చేతులు కట్టివేసి తీసుకెళ్లేవారని అన్నారు. గుడ్డలు మార్చుకునేందుకు కూడా వీలులేక మాసిన గుడ్డలతోనే చెరలో మగ్గిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అదే జైలు నుంచి విడుదలవుతున్న ఇతర ఖైదీలు దయతో ఇచ్చిన గుడ్డలు ధరించి కాలం వెళ్లదీశామని అన్నారు. ఇరాన్ జైలు నుంచి ఇక ఇళ్లకు వెళ్లే అవకాశం లేదని జీవితంపై ఆశలు వదులుకున్నామని, జీవచ్ఛవాలుగా కాలం వెళ్లదీశామని తెలిపారు. తమ కుటుంబ సభ్యులు, అధికారులు తీసుకున్న చర్యల వల్ల బతికి బైటపడ్డామని కన్నీళ్లు పెట్టుకున్నారు. తాము ప్రాణాలతో బైటపడటమే గొప్ప అదృష్టమని, ఇది తమకు పునర్జన్మని వారు పేర్కొన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తీన్మార్ మల్లన్నను అనర్హుడిగా ప్రకటించాలి
51 జంటలకు సామూహిక వివాహాలు
తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
వానొస్తే మునకే!
రైలొచ్చినా రోడ్డుమార్గమే..
కురుస్తున్న పెద్దాస్పత్రి భవనం
రెండో రోజూ కొనసాగిన తనిఖీలు
పోక్సో కేసులో 20ఏళ్ల జైలుశిక్ష
● తాతయ్యగుంట గంగమ్మకు తోటివేషాలతో మొక్కులు ● అమ్మవారికి సేవకు పోటెత్తిన భక్తులు
ఐకేఎస్తో వేదిక్ వర్సిటీ ఒప్పందం
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: యువ పిడికిలి..దీప్సితా ధర్
- Centre for the Study of Developing Societies: ఒపీనియన్లు వేరువేరయా!
- కేసీఆర్ను ఢీకొట్టలేక కవితను జైలుకు పంపారు
- యుద్ధం మిగిలే ఉంది: కేసీఆర్
- Association for Democratic Reforms: ఆస్తుల్లో టాప్ జిందాల్
- Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
- కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
- పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
- విద్యుత్ షాక్తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన డాక్టర్
- T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
Advertisement