-
వేధింపులు భరించలేక..
నిజామాబాద్ అర్బన్: తరచూ దొంగతనాలకు పాల్పడుతూ, డబ్బుల కోసం కుటుంబ సభ్యులను కూడా వేధిస్తుండడంతో కొడుకును కన్న తండ్రే హతమార్చాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హమాల్వాడీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసు కమిషనర్ నాగరాజు మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలు తెలిపారు. కూలి పనులు చేసుకుని జీవించే రవికి ఇద్దరు కుమారులు.. చిన్న వాడైన ఉపేంద్ర (21) తాగుడుకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇంట్లో కూడా డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధించేవాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఉపేంద్ర తన తల్లిని డబ్బులు ఇవ్వాలని.. లేకపోతే చంపేస్తానని మెడపై బ్లేడ్ పెట్టి బెదిరించాడు. తర్వాత తల్లివద్ద నుంచి రూ.100 తీసుకుని వెళ్లాడు. దీనిపై రాత్రి ఇంటికి వచ్చిన ఉపేంద్రను తండ్రి నిలదీయడంతో గొడవ జరిగింది. ఆగ్రహంతో రవి ఇనుప రాడ్తో చితక బాధగా ఉపేంద్ర చనిపోయాడు. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో ఉపేంద్ర మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట వదిలేసి వెళ్లిపోయాడు. ఆస్పత్రి వద్ద డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మృతదేహాన్ని గమనించి మూడో టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఉపేంద్ర మృతదేహాన్ని పరిశీలించి జేబు దొంగతనాలు చేసే పాతనేరస్తుడిగా గుర్తించారు. కు టుంబ సభ్యులకు మృత దేహాన్ని అప్పగించడంతో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, బుధవారం పోలీసులు జరిపిన విచారణలో కొడుకు ఉపేంద్రను తనే చంపినట్లు రవి తెలిపాడు. ఉపేంద్ర తరచుగా దొంగతనాలు చేస్తున్నాడని, తన భార్యను చంపే ప్రయత్నం చేశాడని, అందుకే హతమార్చానని పోలీసులకు చెప్పాడు. పోలీసులు నిందితుడిని అరెస్టుచేసి రిమాండ్కు పంపారు. -
గురుకుల పాఠశాలలను ప్రారంభించాలి: కేఎన్వీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం ఏర్పాటు చేసిన అన్ని రకాల గురుకుల పాఠశాలలను ప్రారంభించాలని కుల నిర్మూలన వేదిక (కేఎన్వీ) అధ్యక్షుడు పాపని నాగరాజు డిమాండ్ చేశారు. అన్ని రకాల విద్యా సంస్థలను ప్రారంభించి కేవలం గురుకుల విద్యా సంస్థలను ప్రారంభించకపోవడంతో బడుగులకు విద్య దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల విద్యా సంస్థలకు మాత్రమే కరోనా వస్తుందా అని ఆయన ప్రశ్నించారు. -
నిరుపేద గూటిలో పరుగుల ధీరుడు
కర్ణాటక, చెళ్లకెరె రూరల్: చెళ్లకెరె తాలూకాలోని పాతప్పనగుడి గ్రామానికి చెందిన ఈ.నాగరాజ్ అనే యువకుడు పేద కుటుంబంలో జన్మించినా ఆటల్లో మేటి. పరుగు పందెంలో రాణించి తాలూకాకు, జిల్లాకు, రాష్ట్రానికే పేరుప్రతిష్టలు సంపాదించాడు. నాగరాజ్ కుటుంబానికి చిన్న పూరి గుడిసే ఆధారం. చిన్న వయస్సు నుంచి పేదరికాన్ని అధిగమించి క్రీడా రంగంలో ఆసక్తి పెంచుకున్నాడు. నేపాల్లో జరుగుతున్న అంతర్జాతీయ అథ్లెటిక్స్లో 5 కిలోమీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానం సాధించి బంగారు పతకాన్ని అందుకుని గ్రామీణ ప్రాంత యువతలో ఉత్సాహాన్ని నింపాడు. అతడు ఇప్పుడు నేపాల్లో ఆటలపోటీల్లో ఉన్నాడు. చినిగిన చెప్పులతో ఎయిర్పోర్టుకు నేపాల్కు వెళ్లడానికి చిత్రదుర్గం నుంచి బెంగళూరు విమానాశ్రయానికి చినిగి పోయిన చెప్పులతోనే నాగరాజు వెళ్లాడు. దీనిని గమనించిన తమ గ్రామానికి చెందిన న్యాయవాది అశోక్ నాగరాజ్కు షూ ఇప్పించాడు. గతనెల 26న నేపాల్ వెళ్లి రావడానికి స్నేహితులు, ఇతరులు రూ.2 వేలు ధనసహాయం చేశారు. అక్కడ గత నెల 29వ తేదీన జరిగిన అథ్లెటిక్స్ క్రీడా పోటీల్లో 24 దేశాల క్రీడాకారులను వెనక్కి నెట్టి ప్రథమ స్థానం సాధించాడు. పేద విద్యార్థి సాధనను తెలుసుకున్న నేపాల్ సైన్యం కూడా అభినందనలు తెలిపింది. చిత్రదుర్గ ప్రభుత్వం కళాశాలలో బీఏ చదువుకున్న నాగరాజు బీసీఎం హాస్టల్లో ఉండి డిగ్రీ చదువుతున్నాడు. చదువుకుంటూ కూలి పని తాలూకాలోని ఓబళాపుర గ్రామ పంచాయితీలోని పాతప్పనగుడి గ్రామానికి చెందిన ఈరణ్ణ, చంద్రమ్మ దంపతుల కుమారుడు నాగరాజ్. గతంలో గోవాలో జరిగిన రాష్ట్రస్థాయి నాలుగవ అఖిల భారత చాంపియన్ షిప్లో పాల్గొని 10 వేల మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో బంగారు పతకం కొట్టేశాడు. నాగరాజ్ తన చదువులు, ఖర్చుల కోసం తల్లిదండ్రుల కష్టం మీద ఆధారపడక, శని, ఆదివారాలలో కళ్యాణ మంటపాల్లో జరిగే వేడుకల్లో భోజనాలు వడ్డించే పని చేస్తాడు. ఆ డబ్బులో కొంత తల్లిదండ్రులకూ పంపుతాడు. మంగళవారం నేపాల్ నుంచి బెంగళూరులో దిగి, అటు నుంచి చెళ్లకెరెకు వస్తున్న నాగరాజ్కు స్థానిక ఎమ్మెల్యే టి.రఘుమూర్తి స్వాగతం పలికి సన్మానిస్తానని తెలిపారు. -
మేకప్ పైకన్నీటిచారలు
♦ అర్ధాకలితో అలమటిస్తున్న మేకప్ కళాకారులు ♦ ఉత్సవాల్లో వేషధారులకు రంగులద్ది జీవనం పెరవలి : ఉత్సవాలలో వేషధారులకు మేకప్ వేసి జీవించే కళాకారుల జీవితాలు దయనీయంగా ఉన్నాయి.ఏడాదిలో 15 రోజులు మాత్రమే వీరికి పని ఉంటోంది. మిగిలిన రోజుల్లో రోడ్లపై కేకులు అమ్ముకుంటూపొట్ట నింపుకుంటారు. కడుపునిండకపోయినా కళపై అభిమానంతో ఇంకా మేకప్నే నమ్ముకుని జీవిస్తున్నామని రాజమండ్రికి చెందిన నాగరాజు డ్రామా డ్రెసెస్ కంపెనీ కళాకారులు తెలిపారు. ఆ వివరాలు ఇలా.. ఈ మేకప్మెన్లు ఉత్సవాల్లో వేసే పౌరాణిక వేషాల దగ్గర నుంచి నాటకాలు, నాటికలకు వేసే వేషాల వరకు అవలీలగా మేకప్ వేస్తారు. ఆడవారిని మగవారిగా మగవారిని ఆడవారుగా మార్చి వేయటంలో అందెవేసిన చేతులు వీరివి. ఉత్సవాల్లో కేవలం మూడు గంటల్లో 30 వేషాలకు మేకప్ వేయగలరు. రాముడు, కృష్ణుడు, ధుర్యోదనుడు, లవకుశ, ఆంజనేయలు, దుర్గామాత వంటి 50 నుంచి 100 వేషాల వరకు వీరు తీర్చి దిద్దగలరు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉత్సవాల్లో వచ్చే ప్రోగ్రాంలు బట్టి వేషాలకు మేకప్లు వేస్తామని చెప్పారు. ఇటీవల వినాయక చవితి ఉత్సవాల్లో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, తణుకు, రాజమండ్రి, అమలాపురం, ఏలూరు, తాడేపల్లిగూడెం వంటి పట్టణాలతో పాటు పలు పల్లెల్లో తాము వేషధారులకు మేకప్లు వేసి మెప్పించినట్టు తెలిపారు. -
అత్తగారి ఇంటి ఎదుట మహిళ ఆందోళన
♦ న్యాయం చేయాలని డిమాండ్ ♦ మద్దతు తెలిపిన మహిళా సంఘాలు నేరేడుచర్ల (హుజూర్నగర్) : తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ వివాహిత తన అత్తగారి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ఈ స సంఘటన మంగళవారం మండలంలోని కల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఆందోళనకు సూర్యాపేటకు చెందిన మహిళా సంఘాలు మద్దతు పలికారు. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండలం సిరికొండ గ్రామానికి చెందిన అరుణకు నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన బుడిగె నాగరాజుతో 1998లో వివాహమైంది. వీరికి ఇద్దరు మగపిల్లలు. పెళ్లయిన కొద్దికాలం వరకు మంచిగానే సాగిన వీరి సంసారంలో విబేధాలు రావడంతో భార్యభర్తలు తరచూ గొడవలు పడుతుండేవారు. 2008లో అదనపు కట్నం కోసం వేధిం చాడని నాగరాజుపై అరుణ కేసు పెట్టి కోర్టును ఆశ్రయిం చింది. ఆనాటి నుంచి అరుణ పుట్టింట్లోనే ఉంటోంది. నాగరాజు పిల్లలిద్దరిని చదివించుకుంటూ మరో మహిళను పెళ్లి చేసుకోవడంతో వారికి ఒక కుమారుడు జన్మించాడు. ఈ నేపథ్యంలో అరుణ మంగళవారం తనను ఆదరిచాలని తన పేరు మీద ఉన్న 3 ఎకరాల భూమిని తన ఇద్దరు కుమారులకు సమానంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారి ఇంటి ఎ దుట బైఠాయించింది. ఈమె ఆందోళనకు మహిళా సం ఘా ల మద్దతు తెలిపాయి. ఆందోళన జరుగుతున్న సమయంలో తన భర్త అందుబాటులో లేడు. విషయం తెలుసుకున్న నేరేడుచర్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆం దోళన చేస్తున్న మహిళలను స్టేషన్కు వచ్చి వివాదం పరిష్కరించుకోవాలని సూచించడంతో స్టేషన్కు తరలివెళ్లారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement