-
క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూ.. వీడియో వైరల్
చటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండు టెస్టు మొదటి రోజు ఆటలో శ్రీలంక పై చేయి సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి లంక 4 వికెట్లు నష్టానికి 314 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్(93), కరుణరత్నే(86), నిషాన్ మదుష్కా(57) హాఫ్ సెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో హసన్ మహ్మద్ రెండు, షకీబ్ ఆల్ హసన్ తలా రెండు వికెట్లు సాధించారు. అయితే తొలి రోజు ఆటలో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో తీసుకున్న ఓ రివ్యూ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. శ్రీలంక ఇన్నింగ్స్ 44 ఓవర్ వేసిన స్పిన్నర్ తైజుల్ ఇస్లాం బౌలింగ్లో మూడు బంతిని కుశాల్ మెండిస్ ఆఫ్ సైడ్ వైపు డిఫెన్స్ ఆడాడు. కానీ బౌలర్, స్లిప్లో ఉన్న బంగ్లా కెప్టెన్ షాంటో బంతి బ్యాట్కు కాకుండా ప్యాడ్కు తగిలిందని భావించి ఎల్బీకి అప్పీల్ చేశారు. అంపైర్ మాత్రం నాటౌట్ అంటూ తలఊపాడు. ఈ క్రమంలో షాంటో బౌలర్తో సంప్రదించి రివ్యూకు వెళ్లాడు. అయితే బంతి బ్యాట్కు స్పష్టంగా తాకుతున్నప్పటికి షాంటో రివ్యూకు వెళ్లడం అందరిని ఆశ్చర్యపరిచింది. రిప్లేలో కూడా బంతి బ్యాట్కు మధ్యలో తాకినట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో అంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత చెత్త రివ్యూ అంటూ కామెంట్లు చేస్తున్నారు. What just happened? 👀 . .#BANvSL #FanCode #CricketTwitter pic.twitter.com/sJBR5jMSov — FanCode (@FanCode) March 30, 2024 -
శ్రీలంకకు ఊహించని షాకిచ్చిన బంగ్లాదేశ్..
బంగ్లాదేశ్తో విజయంతో ఆరంభించింది. ఛటోగ్రామ్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో 6 వికెట్లతో తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం విజయం సాధించింది. 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 44.4 ఓవర్లలో ఛేదించింది. బంగ్లా విజయంతో కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో కీలక పాత్ర పోషించాడు. నజ్ముల్ హుస్సేన్ ఆజేయ సెంచరీతో చెలరేగాడు. 129 బంతుల్లో శాంటో 13 ఫోర్లు, 2 సిక్స్లతో 122 పరుగులు చేశాడు. అతడితో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ ముస్తిఫికర్ రహీమ్(73 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లంక బౌలర్లలో మధుశంక రెండు వికెట్లు పడగొట్టగా.. ప్రమోద్ మధుషాన్, కుమారా తలా వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లంక 48.5 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌటైంది. లంక బ్యాటర్లలో లియాంగే(67) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కుశాల్ మెండిస్(59) పరుగులతో రాణించాడు. బంగ్లా బౌలర్లలో టాస్కిన్ ఆహ్మద్, షోర్ఫుల్ ఇస్లాం, టాన్జిమ్ హసన్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. ఇక ఇరు జట్లు మధ్య రెండో టీ20 ఛటోగ్రామ్ వేదికగా శుక్రవారం జరగనుంది. చదవండి: IPL 2024: ఢిల్లీ జట్టులోకి ఫాస్టెస్ట్ సెంచరీ వీరుడు.. ఎవరంటే? -
శ్రీలంకకు షాకిచ్చిన బంగ్లాదేశ్
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇవాళ (మార్చి 6) జరిగిన రెండో మ్యాచ్లో పర్యాటక శ్రీలంకకు ఆతిథ్య బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. అన్ని విభాగాల్లో తమకంటే మెరుగైన శ్రీలంకను బంగ్లాదేశ్ ఎనిమిది వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ ఆడుతూ పాడుతూ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో అజేయ అర్దసెంచరీతో (53), తౌహిద్ హ్రిదోయ్ అజేయమైన 32 పరుగులతో బంగ్లాదేశ్ను విజయతీరాలకు చేర్చారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్లో లిటన్ దాస్ (36), సౌమ్య సర్కార్ (26) కూడా ఓ మోస్తరుగా రాణించారు. బంగ్లాదేశ్ కోల్పోయిన రెండు వికెట్లు మతీశ పతిరణ ఖాతాలోకి వెళ్లాయి. అంతకుముందు శ్రీలంక ఇన్నింగ్స్లో కనీసం ఒక్క భారీ స్కోర్ కూడా నమోదు కాలేదు. అవిష్క ఫెర్నాండో 0, కుశాల్ మెండిస్ 36, కమిందు మెండిస్ 37, సమరవిక్రమ 7, అసలంక 28, మాథ్యూస్ 32 నాటౌట్, షనక 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, మెహిది హసన్, ముస్తాఫిజుర్, సౌమ్య సర్కార్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో శ్రీలంక గెలుపొందింది. నిర్ణయాత్మక మూడో టీ20 మార్చి 9న జరుగనుంది. -
బంగ్లాదేశ్కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు.. ఎవరంటే?
బంగ్లాదేశ్ పురుషల క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్గా స్టార్ బ్యాటర్ నజ్ముల్ హుస్సేన్ శాంటో ఎంపికయ్యాడు. మూడు ఫార్మాట్లలో తమ జట్టు పగ్గాలను అప్పగిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. కాగా టెస్టు, టీ20ల్లో కెప్టెన్గా ఉన్న షకీబ్ అల్ హసన్ రాజకీయాలపై దృష్టి సారించడంతో.. అతడి రీ ఎంట్రీ అనిశ్చతి నెలకొంది. షకీబ్ ప్రస్తుతం కంటి సమస్యతో కూడా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో త్వరలో జరగనున్న శ్రీలంకతో వైట్బాల్ సిరీస్కు షకీబ్ దూరమయ్యాడు. మరోవైపు స్టార్ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నప్పటకి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతాడన్నది అనుమానమే. కాగా వన్డే వరల్డ్కప్-2023కు ముందు బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్సీ నుంచి తమీమ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షకీబ్ను వన్డే కెప్టెన్గా బీసీబీ నియమించింది. అయితే వరల్డ్కప్ అనంతరం షకీబ్ కూడా బంగ్లా వన్డే, టీ20 జట్టు కెప్టెన్సీకి గుడ్బై చెప్పేశాడు. కేవలం టెస్టుల్లో మాత్రమే కొనసాగతానని షకీబ్ తెలిపాడు. అయితే షకీబ్ ఇప్పటిలో రీ ఎంట్రీ ఇచ్చేలా కన్పించడం లేదు. ఈ నేపథ్యంలోనే శాంటోను మూడు ఫార్మట్లలో ఏడాది పాటు కెప్టెన్గా బీసీబీ నియమించింది. కాగా శాంటోకు కెప్టెన్గా అనుభవం ఉంది. గతేడాది సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో బంగ్లా జట్టుకు శాంటో సారథ్యం వహించాడు. అతడి నాయకత్వంలోని బంగ్లా జట్టు సిరీస్ను 1-1తో డ్రాగా ముగించింది. అంతకుముందు వన్డే వరల్డ్కప్లోనూ షకీబ్ గైర్హజరీలో శాంటో జట్టు పగ్గాలను చేపట్టాడు. అతని సారథ్యంలో బంగ్లాదేశ్ 11 మ్యాచ్లు ఆడగా.. మూడింట గెలిచింది. సొంతగడ్డపై మార్చిలో శ్రీలంకతో బంగ్లాదేశ్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్తో బంగ్లా ఫుల్టైమ్ కెప్టెన్గా శాంటో ప్రయాణం ప్రారంభం కానుంది. -
NZ Vs Ban: ఆకస్మిక వర్షంలో తడిసిముద్దైన ఆటగాళ్లు.. మ్యాచ్ రద్దు
New Zealand vs Bangladesh, 2nd T20I: న్యూజిలాండ్- బంగ్లాదేశ్ మ్యాచ్కు వరణుడు అడ్డుతగిలాడు. మౌంట్ మౌంగనీయ్లో ఇరు జట్ల మధ్య శుక్రవారం జరగాల్సిన రెండో టీ20 వర్షం కారణంగా రద్దైపోయింది. ఈ క్రమంలో మూడు మ్యాచ్ల సిరీస్లో బంగ్లా 1-0తో ఆధిక్యం నిలబెట్టుకోగలిగింది. కాగా నజ్ముల్ హొసేన్ షాంటో కెప్టెన్సీలో బంగ్లాదేశ్ జట్టు కివీస్ పర్యటనకు వెళ్లింది. ఈ యువ బ్యాటర్ సారథ్యంలో మూడు వన్డేల సిరీస్లో ఆఖరి మ్యాచ్లో అనూహ్య విజయం సాధించింది. తద్వారా క్లీన్స్వీప్ గండాన్ని తప్పించుకోవడమే గాకుండా.. న్యూజిలాండ్ గడ్డ మీద తొలి వన్డే గెలుపు నమోదు చేసి చరిత్ర సృష్టించింది. తొలి టీ20 గెలుపు ఇక మూడో వన్డేలో ఆతిథ్య కివీస్ను ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసిన బంగ్లాదేశ్.. ఊహించని రీతిలో టీ20 సిరీస్ను విజయంతో ఆరంభించింది. నేపియర్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్లో శాంట్నర్ బృందంపై ఐదు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఇక కివీస్ గడ్డ మీద బంగ్లాదేశ్కు ఇదే తొలి టీ20 గెలుపు కూడా కావడం విశేషం. ఆకస్మిక వర్షం.. తడిసిపోయిన ఆటగాళ్లు ఈ క్రమంలో రెండో టీ20లోనూ సత్తా చాటాలని భావించిన నజ్ముల్ షాంటో బృందం.. అందుకు తగ్గట్లుగానే టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పేసర్ షోరిఫుల్ ఇస్లాం.. కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్(2)ను పెవిలియన్కు పంపి శుభారంభం అందించాడు. అయితే, 23 బంతుల్లోనే 43 పరుగులు రాబట్టి ప్రమాదకరంగా మారుతున్న మరో ఓపెనర్ టిమ్ సిఫార్ట్ను తంజీం హసన్ సకీబ్ అవుట్ చేశాడు. వీరి స్థానాల్లో క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్ 18(24 బంతుల్లో), గ్లెన్ ఫిలిప్స్ 9(14 బంతుల్లో) పరుగులతో నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. And that's that! Unfortunately, the 2nd @BLACKCAPS v Bangladesh T20I at Bay Oval in Tauranga has been officially called off due to the rain 😢☔ Blackcaps v Bangladesh: 3rd T20I | Sunday from 12.30pm on TVNZ 1 and TVNZ+ pic.twitter.com/TsZoLLfRJm — TVNZ+ (@TVNZ) December 29, 2023 మ్యాచ్ రద్దు అయితే, 11 ఓవర్ల ఆట ముగిసే సరికి ఆకస్మికంగా వర్షం మొదలైంది. అప్పటికి న్యూజిలాండ్ స్కోరు: 72/2. ఇక మధ్యాహ్నం రెండున్నర గంటలు దాటినా తెరిపినివ్వలేదు. ఆ తర్వాత వర్షం మరింత ఎక్కువ కావడంతో న్యూజిలాండ్- బంగ్లాదేశ్ మధ్య రెండో టీ20ని రద్దు చేస్తున్నట్లు అంపైర్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఇరు జట్ల మధ్య డిసెంబరు 31 (ఆదివారం) నిర్ణయాత్మక మూడో టీ20 జరుగనుంది. ఇందులో గనుక బంగ్లాదేశ్ గెలిస్తే కివీస్ గడ్డపై మరో సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం!! Heavy rain still falling at Bay Oval. The latest time play can begin again is 10:28pm #BANvNZ pic.twitter.com/w85rLJjE7F — BLACKCAPS (@BLACKCAPS) December 29, 2023
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మేం ఓటేశాం
ప్రమాదంలో ముస్లిం సమాజం
టీడీపీ మేనిఫెస్టోను కాపులు విశ్వసించటం లేదు
టిఫిన్ కోసం పిడిగుద్దులు
వాహనం ఢీకొని మహిళ దుర్మరణం
ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా.. నేడు ట్రాఫిక్ మళ్లింపు
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
నిర్భయంగా ఓటు హక్కు వినియోగం
కౌంటింగ్, స్ట్రాంగ్ రూములు పరిశీలించిన కలెక్టర్ ఢిల్లీరావు
ఆంధ్రాకు ఏం చేశారని వస్తున్నారు మోదీజీ?
తప్పక చదవండి
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
Advertisement