-
నిలేకని నియామకంపై ఆరోపణలు
సాక్షి, బెంగళూరు: వ్యవస్థాపకులకు, బోర్డుకు మధ్య ఉన్న విభేదాలను చక్కబెట్టడానికి వచ్చిన నందన్ నిలేకని ఎంపికపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్ఫోసిస్ చైర్మన్గా నందన్ నిలేకనిని నియమించే విషయంలో కంపెనీ కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాను ఉల్లంఘించిందని అడ్వజరీ సంస్థ స్టేక్హోల్డర్స్ ఎంపవర్మెంట్ సర్వీసెస్(ఎస్ఈఎస్) ఆరోపించింది. కంపెనీ సీఈవో, ఎండీగా ఉన్న విశాల్ సిక్కా అకస్మాత్తుగా రాజీనామా చేయడంతో, అనంతరం తలెత్తిన పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టులో నందన్ నిలేకని ఇన్ఫోసిస్లోకి పునరాగమనం చేశారు. సరియైన బోర్డు మీటింగ్ నిర్వహించకుండానే నిలేకని ఎంపిక జరిగిందని ఎస్ఈఎస్ పేర్కొంది. చైర్మన్గా ఎంపికైన నిలేకని, బోర్డు మీటింగ్లో పాల్గొన్నారని, అంటే ఆ నిర్ణయం ముందే తీసుకున్నారని ఎస్ఈఎస్ ఎండీ జెఎన్ గుప్తా అన్నారు. బోర్డు రెండు విడత సమావేశంలో నిలేకని నియామకంపై ప్రకటన వచ్చిందని కంపెనీకి చెందిన వర్గాలు చెప్పాయి. తొలి విడత సమావేశం మాజీ చైర్మన్ ఆర్ శేషసాయి సమక్షంలోనే జరిగిందని పేర్కొన్నాయి. విశాల్ సిక్కా, మరో ఇద్దరు బోర్డు సభ్యలు జెఫ్రీ లెమాన్, జాన్ ఎట్చెమెండీ రాజీనామాలు ఆమోదించిన అనంతరం, నిలేకని ఇన్ఫీలో జాయిన్ అయ్యారు. అనంతరం శేషసాయి కూడా బోర్డు చైర్మన్గా తప్పుకున్నారు. కో-చైర్మన్ రవి వెంకటేషన్ కూడా రాజీనామా చేశారు. అయితే ఆయన బోర్డులో కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు. ఈ తతంగమంతా రాజీ పద్ధతిలో జరిగినట్టు ఎస్ఈఎస్ ఆరోపించింది. బోర్డు రూమ్ బయటనే ఇదంతా జరిగిందని పేర్కొంది. బయట తీసుకున్న నిర్ణయాలను, బోర్డు మీటింగ్లో వెల్లడించడం, కార్పొరేట్ గవర్నెర్స్ ప్రమాణాలకు విరుద్ధమని తెలిపింది. అయితే కార్పొరేట్ గవర్నెన్స్ విషయంలోనే ఇన్ఫోసిస్లో వివాదం చెలరేగడం గమనార్హం. -
కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా నందన్ నీలేకని?
‘ప్రధాని అభ్యర్థిని అనువైన సమయంలో ప్రకటిస్తాం’... నాలుగు రాష్ట్రాల్లో చేదు ఫలితాల తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మీడియాకు చెప్పిన మాటలివి. నిజానికి ఎన్నికలకు ముందు ప్రధాని అభ్యర్థి పేరును ప్రకటించే సంస్కృతి కాంగ్రెస్లో ఇప్పటి వరకు లేనే లేదు. కానీ, మేడం మాటలతో ఢిల్లీ రాజకీయ వర్గాల్లో మాత్రం 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రధాని అభ్యర్థిగా ఇన్ఫోసిస్ నిర్మాణకర్తల్లో ఒకరైన నందన్ నీలేకని అంటూ ప్రచారం సాగుతోంది. అయితే నీలేకని ఈ వార్తలను చెత్త అంటూ కొట్టిపడేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ కథనాన్ని కల్పితమైనదిగా అభివర్ణించింది. రాహుల్ గాంధీ లేదా వేరొక నేతను ప్రధాని అభ్యర్థిగా అదిష్టానమే నిర్ణయిస్తుందని కాంగ్రెస్ ప్రతినిధి సందీప్ దీక్షిత్ తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
ఎన్నికల బరిలోకి 'జస్వీర్ సింగ్ గర్హి'.. అక్కడ నుంచే పోటీ
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్ను ఉతికి ఆరేసిన ప్రిన్సిపాల్
రెండేళ్లుగా గప్చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement