-
అనైతిక సంబంధం భర్తకు తెలిసిందనే హత్య
బనశంకరి: కురబరహళ్లి జేసీ నగర్లో గురువారం జరిగిన నరసింహమూర్తి హత్యోదంతం మిస్టరీ వీడింది. తన అనైతిక సంబంధం భర్తకు తెలియడం, దీనిని నిత్యం ప్రశ్నిస్తుండటంతోనే ప్రియుడితో కలిసి నరసింహమూర్తిని అంతమొందించినట్లు భార్య అనిత వెల్లడించిందని పోలీసులు తెలిపారు. వివరాలు... మాగడి ప్రాంతానికి చెందిన అనితకు ఏడేళ్ల క్రితం నరసింహమూర్తి అనే వ్యక్తితో వివాహమైంది. దంపతులకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. అనితకు ఆరునెలల క్రితం టీ.నరసీపుర నివాసి రోషన్తో ఫేస్బుక్లో పరిచయమైంది. రోషన్ కంతూరు చక్కెర ప్యాక్టరీలో ఏసీ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు.ఫేస్బుక్ స్నేహం ఇద్దరిమధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. పసిగట్టిన భర్త నరసింహమూర్తి అనితను వేధించేవాడు. దీంతో భర్తను హత్య చేసి రోషన్ను వివాహం చేసుకోవాలని అనిత కుట్ర పన్నింది. ఇందుకు రోషన్ కూడా అంగీకరించాడు. గురువారం రాత్రి నరసింహమూర్తి భోజనం చేసిన తర్వాత అనిత రోషన్కు ఫోన్ చేసింది. దీంతో రోషన్ తన కంపెనీలోనే పని చేస్తున్న సోమరాజుతో కలిసి అనితా ఇంటికి చేరుకున్నాడు. అనంతరం ముగ్గురూ కలిసి నరసింహమూర్తిని తాళ్లతో బంధించి మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశారు. మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో పెట్టి మంచం కిందికి తోసేశారు. రక్తపుమరకలను శుభ్రం చేశారు. వేకువజామున 4.30 సమయంలో మృతదేహాన్ని తరలించడానికి యత్నించగా కిందిఅంతస్తులో ఉన్న ఇంటి యజమాని నిద్రలేచారు. ఇరుగుపొరుగు వారు వాకింగ్ వెళ్లడంతో దీనితో మృతదేహాన్ని తరలించడం సాద్యం కాలేదు. 6 గంటలకు రోషన్, సోమరాజు ఇంటి నుంచి పారిపోయారు. ఉదయం 8 గంటల సమయంలో అనిత తన అత్త హనుమమ్మ, ఇతరులకు ఫోన్ చేసి భర్త కనబడలేదని తెలిపింది. అనుమానం వచ్చిన హనుమమ్మ మంచం కింద ఉన్న మృతదేహన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించింది. మహాలక్ష్మీలేఔట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనితా, ఆమె పాత ప్రియుడు ప్రవీణ్పై అనుమానం ఉందని హనుమమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడు ప్రవీణ్ పాత్రలేదని విచారణలో తేలింది. అనితను మరింత లోతుగా విచారణ చేయగా రోషన్, మరో వ్యక్తితో కలిసి హత్య చేసినట్లు అంగీకరించింది. దీంతో ముగ్గురినీ అరెస్ట్ చేశారు. -
పద్యం నేర్చుకుంటే మీరూ కేసీఆర్ కావొచ్చు!
నాటి మెదక్ జిల్లా దుబ్బాక ప్రభుత్వ పాఠశాల.. ఓ శనివారం.. ముందు పెట్టుకున్న నిబంధన ప్రకారం ప్రతి విద్యార్థి ఏదో అంశంపై మాట్లాడటమో, కవిత చెప్పటమో చేయాలి.. ఇంతలో బక్క పలచని ఎనిమిదో తరగతి విద్యార్థి లేచి నాటి సామాజిక పరిస్థితిని ఓ పద్యం, కొన్ని మాటల్లో చకచకా వివరించాడు. ఉపాధ్యాయులు చూస్తూ ఉండిపోయారు. ఈ పద్యాలు, ఆ మాటలుæ నీకెక్కడివిరా అనేసరికి.. ‘పద్యమంటే నాకు ఇష్టం, నా మాటలను పద్యంగా చెప్పటం ఇంకా ఇష్టం’ అన్నాడు! 40 ఏళ్లు గడిచాయి... తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. లక్షల సంఖ్యలో జనం ఒకచోటకు చేరారు. భారీ బహిరంగ సభలో ఓ బక్క పలచని వ్యక్తి వేదిక మీదకు వచ్చి పిడికిలి బిగించి చూపేసరికి జనంలో హోరు మొదలైంది. ఆ తర్వాత మాటలు.. వాటిని మించిన పద్యాలు.. ఆ తర్వాత పిట్ట కథలు.. తూటాల్లా పేలేసరికి ఆ ప్రాంగణం చప్పట్లు, ఈలల హోరుతో మార్మోగిపోయింది. ఆ బక్క పలచని వ్యక్తే ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు. ఆయన వాగ్ధాటిలో అడుగడుగునా వినిపించే విరుపులు, పిట్ట కథలు, సూటిగా తాకే తూటాల్లాంటి మాటలు.. ఆ వాగ్ధాటి కొద్దిమందికే సాధ్యం. స్వతహాగా మంచి మాటకారి అయినప్పటికీ, ఆ మాటకు కొత్త పల్లవినిచ్చింది మాత్రం పద్యమే. చిన్నప్పుడు నేర్చుకున్న పద్యాలు, శతకాలు ఓ మంత్ర దండంగా పనిచేసి ఆయన మాటకు వెలుగునిచ్చాయి. ఈ మాట చెబుతోంది ఎవరో కాదు.. కేసీఆర్కు చిన్నప్పుడు తెలుగు సాహిత్యాన్ని బోధించిన గురువు వేలేటి మృత్యుంజయ శర్మ!ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవం రోజున సభ మొదలుపెట్టేముందు వేదికపై ఈ గురువుకు ముఖ్యమంత్రి గురువందనం నిర్వహించారు. చిన్నప్పుడు తనకు పద్యాలు నేర్పింది ఈ గురువే అంటూ పాదాభివందనం చేశారు. తెలుగు భాషను సుసంపన్నం చేసే క్రమంలో గతంలో ఎన్నడూ జరగని రీతిలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలన్న తపన రావటానికి నాడు కేసీఆర్ తెలుగు సాహిత్యం చదవటమే కారణమంటున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే... ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు మంచి మాట అవసరం. ఆ మాట మధురంగా ఉండాలి, అవసరమైతే కఠినంగా వినిపించాలి. కానీ ఎదుటివాడిని ఆకట్టుకునేలా ఉండాలి. గాలివాటం మాట ప్రభావాన్ని చూపదు. ఆ మాటకు ఏదో ఓ మాయ ఉండాలి. అది చేరాలంటే మన నోట సాహిత్యం పలకాలి. సాహిత్యమంటే అర్థం కాని గ్రాంథికమే కావాల్సిన అవసరం లేదు. జనం నోట కమ్మగా వినిపించే పద్యం చాలు. అలాంటి పద్యాలు రావాలంటే తెలుగు సాహిత్యం చదవాలి. ఇదంతా ఓ కృషి. అది ఆసక్తి ఉంటేనే సాధ్యం. కేసీఆర్కు అదే బలం..: తెలుగు మహాసభల ప్రారంభ వేదికపై అలవోకగా కేసీఆర్ నోట వచ్చిన పద్యాలు ఆయన ఇప్పుడు నేర్చుకున్నవి కాదు. చిన్నప్పుడు భాష వెంటపడి ఔపోసన పట్టినవే. అప్పుడు నేర్చిన పద్యాలు ఆయన్ను మాటల మాంత్రికుడిని చేశాయి. అది భాష గొప్పదనం. సాహిత్యం చదివిన వాడు తన మాటతో ప్రపంచాన్నే జయించగలడు. అసాధ్యమనుకున్న తెలంగాణను తెచ్చి చూపిన కేసీఆర్కు ఆ భాషే బలం. సభ తొలిరోజు ఆయన పద్యాలు చదివిన తీరు లక్షల మందిలో కొత్త ఆలోచనను రేకెత్తించి ఉంటాయి. వారూ పద్యాలు నేర్చుకోవాలనే తపన తెచ్చుకుని ఉంటారు. మన అమ్మ భాషలోని కమ్మదనాన్ని ఆస్వాదించిన నాడు, అందులో కొంతలో కొంత వంటపట్టించుకున్న నాడు మనను గుర్తించే సమాజం ఆవిష్కృతమవుతుంది. ఉద్యోగం, వ్యవహారం, వ్యాపారం... ఏదైనా కావచ్చు మనకు కలిసి వస్తుంది. ఎనిమిదో తరగతితో మొదలు..: నేను దుబ్బాక ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసేందుకు వెళ్లినప్పుడు కేసీఆర్ ఎనిమిదో తరగతిలో ఉన్నాడు. ఓ రోజు ఉత్తర గోగ్రహణంలోని ‘భీష్మద్రోణ కృపాదిధన్వినికరాభీలంబు...’ పద్యం చెప్పా. దాన్ని మరుసటి రోజు పుస్తకం చూడకుండా అప్పగించిన వారికి నోటు పుస్తకం బహుమతిగా ఇస్తానన్నా. కానీ ఓ ఐదు సార్లు దాన్ని చదివి అప్పటికప్పుడు కే సీఆర్ అప్పగించటంతో ప్రధానోపాధ్యాయుడి చేతిమీదుగా ఆయనకు పుస్తకం బహుమతిగా ఇచ్చా. ఆ రోజే భాషపట్ల ఆ విద్యార్థికి ఉన్న అనురక్తి గుర్తించా. మా ఇంటికి పాలు తెస్తూ..: ఆయన అప్పట్లో రాఘవరెడ్డి అనే మరో ఉపాధ్యాయుడి వద్ద ఉండి చదివేవాడు. ఆయన ఉన్న ఇంటికి సమీపంలోని ఇంటివారు మాకు పాలుపోసేవారు. ఓసారి కేసీఆర్ ఆ పాలు తీసుకుని మా ఇంటికి ఉదయం ఐదున్నరకు వచ్చాడు. వచ్చేసరికి నేను గ్రంథపఠనంలో ఉన్నాను. కేసీఆర్ ఎంతో ఉత్సాహంగా విన్నాడు. అలా రోజూ రావటం మొదలుపెట్టాడు. ప్రతిరోజు కొత్త విషయాలు, కొత్త పద్యాలు నేర్చుకునేవాడు. అలా రెండేళ్లు మా సాంగత్యం కొనసాగింది. తర్వాత నేను బదిలీపై మరో గ్రామానికి వెళ్లిపోయా. కానీ కేసీఆర్ మాత్రం తెలుగు భాషపై పట్టు పెంచుకుంటూ పోయాడు. సాయంత్రం వేళ చింతమడక గ్రామానికి చేరువలో ఉండే రామసంద్రం ఊరు చెరువు గట్టుపైకి వెళ్లి సొంతంగా పద్యరచన చేసేవాడు. ప్రతి ఒక్కరికి ఉపయోగం: తెలుగులో మాట్లాడ్డమే మర్చిపోతున్న నేటి తరం భాష ప్రాధాన్యాన్ని గుర్తించాలి. ఆంగ్ల మాధ్యమంలో చదివేవారైనా సరే, తెలుగు సాహిత్యంపై కొంత మక్కువ పెంచుకోవాలి. అది తదుపరి రోజుల్లో వారి మాట శుద్ధికి ఉపయోగపడుతుంది. అది వేరే భాషలు నేర్చుకోవటంలోనూ ఉపకరిస్తుంది. పద్యాలు, సామెతలు, పొడుపు కథలు, పలుకుబడులు, జాతీయాలు, మన సాహితీ చరిత్రలను నేర్చుకుంటే మాటతో ముందడుగు వేస్తారు. వారి చుట్టూ జనం చేసి, వారి సాంగత్యం కోసం పరితపించే పరిస్థితి ఉంటుంది. మన తెలుగు భాషకు ఉన్న శక్తి అలాంటిది. దానికి కేసీఆరే నిదర్శనం. – గౌరీభట్ల నరసింహమూర్తి -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ
విజయనగరం జిల్లా: విజయనగరం టూటౌన్ సీఐగా పనిచేస్తున్న నరసింహ మూర్తి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఇటీవల కొంత మంది వ్యక్తులు పేకాటాడుతూ పట్టుబడ్డారు. వారిని కేసు నుంచి తప్పించేందుకు నరసింహమూర్తి రూ.50 వేలు లంచంగా అడిగారు. కాగా, పక్కా సమాచారంతో నిందితుల నుంచి లంచం తీసుకుంటుండగా సీఐని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యను చంపి.. అడ్డొచ్చిన అత్తపై దాడి
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరులో దారుణం చోటుచేసుకుంది. తన పుట్టింట్లో తల్లిదండ్రులతో ఉంటున్న భార్యను విచక్షణ లేకుండా కత్తితో అతి దారుణంగా నరికేశాడో భర్త. ఈ ఘటన కొవ్వూరు 19వ వార్డు దొగ్గువారివీధిలో గురువారం చోటుచేసుకుంది. తన భర్త పెట్టే వేధింపులను భరించలేని భార్య వరలక్ష్మీ కొవ్వూరులోని పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఈ నేపథ్యంలో భర్త నర్సింహమూర్తి ఆమె పుట్టింటికి వెళ్లి ఆమెను కత్తితో పొడిచాడు. అడ్డు వచ్చిన అత్తపై కూడా కత్తితో దాడి చేశాడు. అనంతరం తాను కూడా గొంతుకోసుకున్నాడు. ఈ దాడిలో అత్త అచ్చాయమ్మ తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని, అత్త అచ్చాయమ్మను ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య
పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం రాజవరంలో కౌలు రైతు శుక్రవారం వేకువజామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన మాధవరపు నరసింహమూర్తి (40) తాను సాగు చేస్తున్న పొలంలో పురుగు మందు తాగి మరణించాడు. నరసింహమూర్తి 10 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నాడు. నాలుగేళ్లుగా 8 లక్షల మేర అప్పులు చేశాడు. వరుస నష్టాలు రావడంతో అప్పులు తీర్చే దారిలేక ఇబ్బందులు పడుతున్నాడు. సొమ్ము చెల్లించాలని రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో నరసింహమూర్తి రెండు రోజుల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడని తండ్రి చంద్రయ్య తెలిపాడు. అతని కోసం వెదుకుతుండగా సాగు చేస్తున్న పొలంలోనే శుక్రవారం విగతజీవిగా కనిపించాడు. నరసింహమూర్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement