-
మళ్లీ రెండేళ్ల పీజీ డిప్లొమా
న్యూఢిల్లీ: జిల్లా ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల కొరతను పరిష్కరించడానికి, కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల పీజీ డిప్లొమాను పునరుద్ధరించింది. నీట్–పీజీ పరీక్ష పాస్ అయిన ఎంబీబీఎస్ విద్యార్థులను ఈ కోర్సుల్లో చేర్చుకుంటారు. ఈ డిప్లొమా కోర్సులు ప్రారంభించాలంటే, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్(ఎన్బీఈ) నుంచి అక్రెడిటేషన్ తీసుకొన్న, కనీసం 100 పడకలున్న ఆసుపత్రులకు మాత్రమే అర్హత ఉంటుంది. ఆరోగ్య శాఖ కింద పనిచేసే ఎన్బీఈ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఎనిమిది ప్రధాన విభాగాల్లో రెండేళ్ల పీజీ డిప్లొమా కోర్సులను ప్రారంభించనుంది. అనస్తీషియాలజీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఫ్యామిలీ మెడిసిన్, ఆఫ్తల్మాలజీ, రేడియో డయాగ్నసిస్, ఈఎన్టీ, టీబీ, హృద్రోగ సంబంధిత కోర్సుల్లో పీజీ డిప్లొమా ప్రవేశ పెట్టనున్నారు. 2019లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) దేశంలో బోధనా సిబ్బంది కొరతను అధిగమించడానికి ఈ డిప్లొమా కోర్సులను డిగ్రీ కోర్సులుగా మార్చింది. ఎంసీఐ ఈ కోర్సులను రద్దు చేయడంతో ఏర్పడిన లోటును పూడ్చడానికి ఆరోగ్య శాఖ ఎన్బీఈని వారి పరిధిలో, డిప్లొమా కోర్సులను ప్రారంభించే అవకాశా లను పరిశీలించాల్సిందిగా కోరింది. గ్రామీణ, చిన్న పట్టణాలలో ప్రజలకు వైద్యమందిస్తోన్న ఆసుపత్రులకు వైద్య సిబ్బందిని అందించే లక్ష్యంతో ఈ కోర్సులను ప్రారంభిస్తున్నట్టు ఎన్బీఈ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ పవనేంద్ర లాల్ చెప్పారు. నీతి ఆయోగ్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆరోగ్య శాఖతో వివిధ దఫాలుగా జరిగిన చర్చల అనంతరం ఈ పీజీ డిప్లొమా కోర్సులకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఆయన తెలిపారు. -
నిట్ కోర్సులకు ‘ఎన్బీఏ’ గుర్తింపు
అగ్రదేశాల చెంతన సాంకేతిక కళాశాల ఆనందోత్సవాల్లో విద్యార్థులు, ఫ్యాకల్టీ నిట్ క్యాంపస్ : దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ కళాశాలల్లో బెస్ట్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్గా పేరు సంపాదించిన వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్ బీఏ) గుర్తింపుతో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కాగా, నిట్లోని సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎల క్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) బీటెక్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ఎన్బీఏ గుర్తింపు వచ్చినట్లు ఈనెల 18న నిట్ డెరైక్టర్కు ఫ్యాక్స్ ద్వారా సమాచారం అం దింది. కాగా, ఎన్బీఏ గుర్తింపుతో ఇక్కడ చది విన విద్యార్థులకు వాషింగ్టన్లోని అక్రాడ్ దేశాల్లోని విదేశీ విద్యార్థులతో ఇంజినీరింగ్ విద్య లో లక్ష్యాలను అధిగమించడానికి ఏ విధమైన కృషి చేయాలనే అంశాలను తెలుసుకునే అవకాశం లభించింది. నాలుగు కోర్సులకు గుర్తింపు.. నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్(ఎన్బీఏ) బృందం ఈ ఏడాది అక్టోబర్ 10 నుంచి 12 తేదీ వరకు మూడు రోజుల పాటు నిట్లో పర్యటించింది. కాగా, నిట్లోని అండర్ గ్రా డ్యుయేట్, పీజీ కోర్సులకు సంబంధించి ఎన్బీఏ గుర్తింపు కోసం యాజమాన్యం 2008లో దరఖాస్తు చేసుకుంది. అయితే ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాది ఎన్బీఏ బృందం నిట్లోని అన్ని బీటెక్ విభాగాలను క్షేత్రస్థాయిలో పర్యటించి తనిఖీ చేసింది. ఇందులో భాగంగా తొలి విడతగా బీటెక్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ కోర్సులకు గుర్తింపును ఇవ్వడంతో నిట్ తొలిసారిగా అంతర్జాతీయస్థాయిలో పేరు సంపాదించింది. అగ్రదేశాల సరసన.. వాషింగ్టన్ అక్రాడ్ అనేది ఇంటర్నేషనల్ అం డర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించిన అగ్రిమెంట్. అయి తే ఎన్బీఏ గుర్తింపుతో వరంగల్ నిట్ తాజాగా వాషింగ్టన్ అక్రాడ్లో స్థానాన్ని సంపాదించుకుంది. వాషింగ్టన్ అక్రాడ్ 1989లో ఏర్పాైటైం ది. అయితే ఇంటర్నేషనల్ అండర్ గ్రాడ్యుయే ట్ ప్రోగ్రాంల ద్వారా ఇంజినీరింగ్ విద్యలో నైపుణ్యాలను, జ్ఞానాన్ని, సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడంతోపాటు గ్లోబల్గా క్వాలిటీ ఇంజినీర్లను తయారుచేసి వారికి ఉపాధి అవకాశాలను అందించడం దీని ఉద్దేశం. ఇందులో భాగంగా వాషింగ్టన్ అక్రాడ్ అగ్రిమెంట్పై ఈ ఏడాది జూన్ 13న ఎన్బీఏ(ఇండియా) సంత కం చేసింది. ఇదిలా ఉండగా, వాషింగ్టన్ అక్రాడ్లో ఇండియా 17వ దేశం కావడం విశేషం. కాగా, వాషింగ్టన్ అక్రాడ్లో యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునెటైడ్ కింగ్డమ్ వంటి అగ్రదేశాలు ఉన్నాయి. అలాగే యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునెటైడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, కెనడా, తైవాన్, హంగ్కాంగ్, ఐర్లాండ్, జపాన్, మలేషియా, కొరియా, న్యూ జిలాండ్, రష్యా, సింగపూర్, సౌత్ ఆఫ్రికా, టర్కీ, శ్రీలంక, ఇండియా ఉన్నాయి. ఇదిలా ఉండగా, నిట్కు ఎన్బీఏ గుర్తింపు రావడంతో ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు అంతర్జాతీయంగా ఇంజినీరింగ్లో నైపుణ్యాలు, సామర్థ్యాలు పెంచుకునే అవకాశం లభించింది. డెరైక్టర్కు అభినందనలు తెలిపిన చైర్మన్.. నిట్ డెరైక్టర్ టి.శ్రీనివాసరావుతో పాటు ఫ్యాకల్టీ, స్టూడెంట్స్తో పాటు ఉద్యోగులకు నిట్ బో ర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ కృష్ణా ఎం.ఎల్లా అభినందన సందేహం పంపించారు. ఎన్బీఏ గు ర్తింపు కోసం అహర్నిషలు కృషి చేశారని కొ నియాడారు. ఈ మేరకు ఫ్యాకల్టీ, విద్యార్థులు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు.
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
వాట్సప్లో మారిన రంగులు.. కారణం అదేనంటూ
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Advertisement