-
బినామీల పేరిట నిధుల భోజ్యం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జాతీయ కుటుంబ లబ్ధి పథకం (ఎన్ఎఫ్బీఎస్) అమలులో అక్రమాలకు పాల్పడిన తహసీల్దార్పై వేటు పడింది. పథకం కింద అర్హులకు ఇవ్వాల్సిన సాయాన్ని బినామీల ఖాతాలోకి మళ్లించిన ధారూరు మండల తహసీల్దార్ ఎం.శ్రీనివాస్రావును కలెక్టర్ ఎన్.శ్రీధర్ బుధవారం సస్పెండ్ చేశారు. శ్రీనివాసరావు గతంలో శామీర్పేట్ తహసీల్దార్గా పనిచేసిన సమయంలో ఎన్ఎఫ్బీఎస్ కింద మండలానికి రూ.ఐదు లక్షలు మంజూరయ్యాయి. వీటిని లబ్ధిదారులకు చెల్లించాల్సి ఉండగా.. కేవలం 13 మంది లబ్ధిదారులకు రూ.65వేలు చెక్కుల రూపంలో అందించారు. మిగతా లబ్ధిదారులకు ఈ నిధులు ఇవ్వకుండా బినామీ పేర్లతో ప్రభుత్వ ఖాతా నుంచి దారిమళ్లించారు. రూ.4.35లక్షలు అక్రమంగా డ్రా చేశారు. ఈ అంశంపై జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదులందడంతో మల్కాజిగిరి రెవెన్యూ డివిజన్ అధికారి ప్రభాకర్రెడ్డితో విచారణ చేయించారు. ఆర్డీఓ విచారణ అనంతరం నివేదికను కలెక్టర్కు సమర్పించారు. ఎన్ఎఫ్బీఎస్ పథకం అమలులో అక్రమాలు రుజువు కావడంతో కలెక్టర్ ఎన్.శ్రీధర్ తహసీల్దార్ శ్రీనివాస్రావును సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పది రోజుల వ్యవధిలో ఇద్దరు.. జిల్లా రెవెన్యూ శాఖలో వారం రోజుల వ్యవధిలో ఇద్దరు తహసీల్దార్లు సస్పెన్షన్కు గురికావడం రెవెన్యూ వర్గాలను కలవరపెడుతోంది. మల్కాజిగిరి మండలంలోని ప్రభుత్వ భూమిని కొందరు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే వ్యవహారంలో అప్పటి తహసీల్దార్ నరసింహరావును గత ఆదివారం సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఎన్.శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. రూ.కోట్లు విలువ చేసే సర్కారు భూమిని ప్రైవేటు పర్వం చేయడంలో కీలకభూమిక పోషించిన అంశంపై పత్రికల్లో వార్తలు వచ్చిన నేపథ్యంలో మల్కాజిగిరి ఆర్డీఓ ప్రభాకర్రెడ్డితో విచారణ జరిపించిన కలెక్టర్.. ఆదివారం సస్పెన్షన్ ఉత్తర్వులిచ్చారు. తాజాగా శామీర్పేట మండలంలో ఎన్ఎఫ్బీఎస్ పథకానికి సంబంధించి నిధులను అక్రమంగా బొక్కిన అప్పటి తహసీల్దార్ శ్రీనివాస్రావును సస్పెండ్ చేశారు. తాజా విచారణ కూడా మల్కాజిగిరి ఆర్డీఓ నేతృత్వంలోనే జరిగింది. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు తహసీల్దార్ల అక్ర మభాగోతం బట్టబయలు కావడం రెవెన్యూ వర్గాల్లో వణుకు పుట్టిస్తోంది. అక్రమాలకు కేంద్రంగా మారిన జిల్లా రెవెన్యూ శాఖలో తాజా పరిణామాలు అధికారులకు మింగుడు పడడం లేదు. వరుసగా అధికారుల లీలలు ఒ క్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ క్రమం లో అక్రమాలకు పాల్పడిన మరికొందరు అధికారుల భాగోతం త్వరలో వెలుగుచూడనుందని ఆ శాఖలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. -
ఎన్ఎఫ్బీఎస్ సాయం స్వల్ప పెంపు
ఒంగోలు టౌన్ : దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబ యజమాని మరణిస్తే ఆ కుటుంబానికి తాత్కాలిక ఉపశమనం కలిగేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ కుటుంబ ప్రయోజన పథకం(ఎన్ఎఫ్బీఎస్) నగదును స్వల్పంగా పెంచింది. ఇప్పటివరకు ఈ పథకం కింద ఐదువేల రూపాయల నగదు అందిస్తుండగా, గతేడాది ఏప్రిల్ నుంచి పదివేల రూపాయల సాయం అందేలా చర్యలు తీసుకుంది. అది కూడా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్రం నుంచి ఠంచనుగా నగదు విడుదల అవుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో సక్రమంగా అమలుకాకపోవడంతో ఈ పథకం ఉండీ ఉపయోగం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ పథకం కింద సాయాన్ని పెంచడంతోపాటు నేరుగా బాధిత కుటుంబానికే నగదు జమయ్యేలా చర్యలు చేపట్టింది. రెవెన్యూ డివిజనల్ అధికారి తన డివిజన్ పరిధిలో ఎవరైనా కుటుంబ యజమాని మరణిస్తే దానిని ధ్రువీకరిస్తూ ఆన్లైన్ ద్వారా అతని కుటుంబ వివరాలను సెర్ప్ ఉన్నతాధికారులకు పంపాలి. కేంద్రం సూచనలను ఆధారం చేసుకొని ప్రాధాన్యతా క్రమంలో నగదు అందిస్తారు. ఆ మూడు కేటగిరీల వారికి వర్తించదు కుటుంబ యజమాని మరణిస్తే మూడు కేటగిరిలకు చెందిన వారికి వర్తించదు. ఆమ్ ఆద్మీ బీమా యోజన, జనశ్రీ బీమా యోజన, ఆపద్బంధు పథకం కింద ఏమైనా ఆర్థిక సాయం పొందిన వారికి జాతీయ కుటుంబ ప్రయోజన పథకం వర్తించదు. కలెక్టర్ ఆదేశాలతో క్లియర్ ఎన్ఎఫ్బీఎస్ దరఖాస్తులు గతంలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండేవి. అనేకమంది విసుగు చెంది మిన్నకుండేవారు. ఈ నేపథ్యంలో కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన విజయకుమార్ దీనిపై దృష్టి సారించారు. జిల్లాలో కొన్ని నెలల నుంచి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను గుర్తించి బాధిత కుటుంబాలకు యుద్ధప్రాతిపదికన అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అప్పటికీ కొంతమంది వివరాలు రాకపోతే కొన్నేళ్ల నుంచి మరణించిన కుటుంబ యజమానులను గుర్తించి వారి జాబితాలను సిద్ధంచేసి నగదు అందించారు. 2012 ఆగస్టు నుంచి 2014 ఆగస్టు వరకు ఈ పథకం కింద 13వేల 502మందిని గుర్తించి 5వేల రూపాయల చొప్పున 6కోట్ల 75లక్షల 10వేల రూపాయలు బాధితులకు అందేలా చూశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement