-
World Elephant Day 2021: మనిషి దుర్మార్గానికి ఏమని పేరు పెట్టగలం?
ఏనుగమ్మ ఏనుగు... బాల్యం ఏనుగుతో మొదలవుతుంది. తాతలు, నానమ్మలు వీపు మీద పిల్లలను కూచోబెట్టి ఏనుగాట ఆడతారు. ఏనుగును విఘ్నేశ్వరుడిగా పూజించుకుంటాం. కాని ఏనుగుల గురించి పట్టించుకుంటున్నామా? ప్రపంచంలో 40 వేల ఆసియా ఏనుగులు ఉంటే వాటిలో దాదాపు 27 వేలు మన దేశంలో ఉన్నాయి. వీటిలో మగ ఏనుగుల శాతం దారుణంగా పడిపోయింది. వినోదం కోసం, సాంస్కృతిక ఉత్సవాల కోసం వాటిని బంధించి పెట్టే సంస్కృతి ఉంది. అవన్నీ ఏనుగుల స్వేచ్ఛను హరించేవే అంటారు సంగీతా అయ్యర్. ‘ఏనుగుల రక్షకురాలి’గా పేరుపొందిన సంగీత ఏనుగుల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఏనుగమ్మ అయారు. ఆమె తీసిన 26 భాగాల డాక్యు సిరీస్ నేడు టీవీలో టెలికాస్ట్ కానుంది. డైనోసార్లు అంతరించి పోయాయంటే మన కాలంలో కాదు కనుక కారణాలు కచ్చితంగా తెలియవు కనుక ఏమిటో అనుకోవచ్చు. కాని ఆఫ్రికా ఏనుగులు ‘ప్రమాదం’లో ఉన్నాయని, ఆసియా ఏనుగులు ‘అంతరించిపోయే’ జాబితాలో ఉన్నాయని తెలిస్తే అందుకు కారణం వర్తమానంలో మనిషి తప్పిదం తప్ప, మనిషి నిర్దాక్షిణ్యం తప్ప, మనిషి బాధ్యతారాహిత్యం తప్ప మరొకటి కాదు. అంత పెద్ద జంతువును వేటాడి, వెంటాడి, చంపి, దాని దంతాల కోసం దారుణంగా నిర్మూలించాలని చూసే మనిషి దుర్మార్గానికి ఏమని పేరు పెట్టగలం? అడవుల్లో ఉన్న ఏనుగుల బాధ ఒకవైపు ఉంటే మనిషి తన మాలిమి కోసం వాటిని చేరదీసి, బంధించి వాటికి పెట్టే బాధ మరోవైపు. ఇవన్నీ ఎంతకాలం అని అడుగుతారు సంగీతా అయ్యర్. ‘నేనే గనుక ప్రధానిని అయితే ఈపాటికి దేశంలోని ఏనుగులన్నీ స్వేచ్ఛాగాలులు పీలుస్తూ ఉండేవి’ అంటారామె. బాల్యం నుంచి బంధం కేరళ పాలక్కాడ్ జిల్లాలోని అళత్తూరులో పుట్టి పెరిగిన సంగీత చిన్నప్పుడు తన తాతయ్య, నానమ్మతో దగ్గరిలోని దేవస్థానానికి వెళ్లేవారు. అక్కడ పెద్దలు గుడి దర్శనంలో ఉంటే సంగీత దేవస్థానంలో కట్టేసి ఉన్న ఏనుగును చూస్తుండేవారు. ‘ఏనుగు కాళ్లకు ఉన్న పెద్ద పెద్ద సంకెళ్లను చూసి మా నానమ్మను అవి ఎందుకున్నాయి అని అడగడం మొదలుపెట్టాను. వాళ్లు ఏం చెప్పినా నేను సమాధాన పడలేదు. అప్పుడు మా నానమ్మ నా కాళ్లకు పట్టీలు వేసి ఇప్పుడు నీకూ ఉన్నాయిగా అని చెప్పింది. కాని ఏనుగులకు ఉన్న సంకెళ్లు రెండు కాళ్లను కదలకుండా చేసేలా ఉన్నాయి. నాకు అలా లేవు అని చెప్పాను. అప్పుడే ఏనుగుల గురించి నా మనసులో పడింది’ అంటారు సంగీత. కెనడా నుంచి తిరిగి వచ్చి కాలక్రమంలో సంగీత జర్నలిస్ట్, వీడియోగ్రాఫర్ అయ్యి కెనడాలో స్థిరపడ్డారు. కాని 2013లో భారత్కు వచ్చినప్పుడు కేరళలోని దేవస్థానాలు తిరుగుతున్నప్పుడు దారుణంగా గాయాలైనా సరే సంకెళ్లతో బంధించి ఉన్న ఏనుగులను చూసి చలించిపోయారు. ‘కేరళలో ఉత్సవాల కోసం మగ ఏనుగులను మాలిమి చేస్తారు. కాని అవి వయసులోకి వచ్చినప్పుడు మదంతో ప్రవర్తించకుండా ఉండేందుకు సంకెళ్లతో కట్టి దారుణంగా కడుపు మాడుస్తారు. జబ్బు చేసినా, చూపు మందగించినా ఉత్సవాల్లో నిలబెడతారు. దీని మీద గొంతెత్తాలని నిశ్చయించుకున్నాను’ అంటారు సంగీత. అప్పుడే ఆమె ‘గాడ్స్ ఇన్ షాకల్స్’ డాక్యుమెంటరీ తీశారు. మానవ హింస వల్ల ఆ తర్వాతి కాలంలో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్తో ఏనుగులు ఎలా బాధ పడతాయో ఈ డాక్యుమెంటరీలో చూపించారు. ఆమె తీసిన ఈ డాక్యుమెంటరీ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో స్క్రీన్ అయ్యింది. అంత గొప్పగా ఆమె సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లింది. మనిషే శత్రువు ‘ఏనుగులకు మనిషే శత్రువు. నిజానికి ఏనుగులు మనిషిని ఎంతో ప్రేమిస్తాయి. మనిషికి సాయం చేసేందుకు చూస్తాయి. గిరిజనులకు వాటితో పాటు ఎలా అడవిలో జీవించాలో తెలుసు. కాని నాగరీకులు అడవిగా ఉండాల్సిన దానిని వ్యవసాయంలోకి తెచ్చి ఏనుగులు తిరగాల్సిన భూమిని కుదిస్తున్నారు. వాటి నీటి ఆవాసాలను ఆక్రమిస్తున్నారు. అవి తిరుగాడే స్థలంలో పంటలు వేసి ఆ పంటల్ని అవి తినకుండా కరెంటు తీగలు ఏర్పాటు చేస్తున్నారు. కరెంట్ షాక్ కొట్టి ఏనుగులు చనిపోవడం ఎంత అన్యాయం’ అంటారు సంగీత. ‘ఎక్కడైతే ఏనుగులు తిరగాల్సిన భూమి ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో ఉందో ఆ భూమిని ప్రభుత్వం తిరిగి కొని ఏనుగులకు వదిలిపెడితే సగం సమస్య తీరుతుంది’ అంటారు సంగీత. ‘రైల్వే అధికారులు ఏనుగులు ఉండే ప్రాంతంలో రైళ్ల వేగం అదుపు చేస్తే, ట్రాన్స్పోర్ట్ అధికారులు రోడ్లపై వాహనాల వేగం అదుపు చేస్తే, విద్యుత్ అధికారులు కంచెలకు కరెంట్ లేకుండా అడ్డుకుంటే చాలా ఏనుగులు ప్రాణాలతో మిగులుతాయి’ అంటారు సంగీత. ఆసియన్ ఎలిఫెంట్స్ 101 సంగీత అయ్యర్ తీసిన తాజా డాక్యు సిరీస్ ‘ఏసియన్ ఎలిఫెంట్స్ 101’ మనిషి–ఏనుగు కలిసి చేయాల్సిన సహవాసం గురించి చర్చిస్తుంది. మనిషి బంధనాల్లో దారుణంగా దెబ్బ తిన్న ఏనుగుల కోసం, అడవి నుంచి బయటపడిన ఏనుగు పిల్లల కోసం అస్సాంలో, కర్నాటకలో, కేరళలో రిహాబిలేషన్ సెంటర్లు ఉన్నాయి. అక్కడ వాటి బాగోగులను చూపిస్తుంది. అంతే కాదు వాటి బాగు కోసం పర్యావరణ కార్యకర్తలకు శాంక్చరీలను తెరిచే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. మావటీలకు ఇవ్వాల్సిన శిక్షణ, ఏనుగుల కాళ్లకు అవసరమైన కేరింగ్, వాటి ఆహారం, స్నానం, ప్రాణాంతక జబ్బుల గురించి వైద్యం... వీటన్నింటినీ చర్చిస్తుంది. ఈ సిరీస్లోని కొన్ని భాగాలు నేడు జియో టీవీ ఇండియాలో ప్రసారం కానున్నాయి. ఏనుగుల సంరక్షణ కోసం ‘వాయిస్ ఆఫ్ ఏసియన్ ఎలిఫెంట్స్ సొసైటీ’ అనే సంస్థ నడుపుతున్న సంగీత ఏనుగులకు సిసలైన రక్షకురాలు. కాని ప్రజలు ఇలాంటి వారికి తోడు నిలిచినప్పుడే గజరాజు నిజంగా అడవికి రాజయ్యి మనుగడ సాగిస్తాడు. -
ఇదీ.. బాబు తీరు
పుష్కరాలను ఘనంగా నిర్వహించి, రాష్ట్రానికి గుర్తింపు తేవాలన్న తపనకంటే తనకు పేరు ప్రఖ్యాతులు రావాలన్న తలంపుతో చంద్రబాబు వ్యవహరించిన తీరువల్లే 29 మంది మరణించారు. పుష్కరాల పనుల్లో అడుగడుగునా చంద్రబాబు స్వార్థపూరితంగా వ్యవహరించారు. ఒక మహాకార్యం తలపెట్టినప్పుడు అందరినీ కలుపుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. కాని చంద్రబాబు మాత్రం క్రెడిట్ అంతా తనకే దక్కాలనే అభిప్రాయంతో తానే సర్వస్వంగా వ్యవహరించారు. సమీక్షలు, సమావేశాలు, క్షేత్రస్థాయి పనుల తీరు పరిశీలన.. ఇలా అన్ని పనులను చంద్రబాబే స్వయంగా పర్యవేక్షించారు. దీంతో ఉన్నతాధికారులు ఎవరూ ఏర్పాట్లలో లోపాలను సరిదిద్దడానికి సాహసించలేదు. ఒకవేళ లోపాలను ఎత్తిచూపితే చంద్రబాబు ఆగ్రహిస్తారేమోనని మిన్నకుండిపోయారు. మహాకుంభమేళా తరహాలో పుష్కరాలను నిర్వహించాలని తలచి, రూ.1,685 కోట్లను కేటాయించి, పుష్కరాల కీర్తి అంతా తనకే దక్కాలని భావించి చివరకు దేవాదాయశాఖ మంత్రిని కూడా పక్కనబెట్టారు. గోదావరికి ప్రతి 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాపుష్కరాలు ఇవేనంటూ.. పుష్కరాల్లో స్నానమాచరిస్తే పాపాలన్నీ పోతాయంటూ హడావుడి చేశారు. మూడుకోట్ల మందికిపైగా భక్తులు హాజరవుతారని ప్రకటించారు. సినీ మాయాజాలంతో నిర్వహించిన నిత్యహారతి సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందంటూ పీఠాధిపతులు వ్యక్తం చేసిన అభ్యంతరాలను చంద్రబాబు పట్టించుకోలేదు సరి కదా నిత్యహారతి సక్సెస్ అయ్యిందంటూ హర్షం వ్యక్తం చేశారు. కుంభమేళాకన్నా గొప్పగా గోదావరి పుష్కరాలు నిర్వహించారని, చంద్రబాబు మాత్రమే ఇలాంటివి చేయగలరని ప్రచారం చేసుకోవడానికి పుష్కరాలపై డాక్యుమెంటరీ తీయించి, దాన్ని నేషనల్ జియోగ్రఫీ చానల్లో ప్రసారం చేయించడం ద్వారా దేశ విదేశాల్లో చంద్రబాబు అంటే అబ్బో అనిపించుకోవాలని ఎత్తుగడ వేశారు. ఇలా పుష్కరాలకు సంబంధించిన అన్ని వ్యవహారాల్లో అన్నీ తానై వ్యవహరించిన చంద్రబాబు... ఇప్పుడు జరిగిన దుర్ఘటనతో మాత్రం తనకేమీ సంబంధం లేదని చెప్పడం విడ్డూరంగా లేదూ..?
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
Advertisement