-
విశాఖ తీరంలో మహిళల శారీ వాక్
-
KTR: నేతన్నలకు గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న దేశంలోనే తొలిసారిగా ‘నేతన్నకు బీమా’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు ప్రకటించారు. రైతు బీమా తరహాలో 60 ఏళ్లలోపు వయసున్న నేత కార్మికులకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. ఈ పథకం ద్వారా తెలంగాణలో 80 వేల మంది చేనేత కార్మికులకు లబ్ధి కలుగుతుందన్నారు. నేతన్నకు బీమా పథకం ప్రారంభ ఏర్పాట్లపై మంత్రి కేటీఆర్ సోమవారం ప్రగతి భవన్లో సమీక్షించారు. ఈ సమావేశంలో చేనేత, జౌళి, పరిశ్రమల విభాగం కార్యదర్శి బుద్ధప్రకాశ్తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ పథకం వివరాలను ఇప్పటికే క్షేత్రస్థాయిలో చేనేత కార్మికులకు వివరించడం మొదలుపెట్టినట్లు అధికారులు కేటీఆర్కు చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ చేనేత, మరమగ్గాలపై ఆధారపడిన కార్మికుల కుటుంబాలకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు బీమా పథకాన్ని అమలు చేయబోతున్నామని, లబ్ధిదారులు ఏదైనా కారణంతో మరణిస్తే 10 రోజుల్లో వారి కుటుంబ సభ్యుల ఖాతాలో రూ. 5 లక్షలు జమ చేస్తామన్నారు. చేనేత, జౌళి విభాగంఈ పథకం అమల్లో నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని, ఈ పథకం అమలు కోసం ఎల్ఐసీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. బీమా వార్షిక ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తుందని, నేత కార్మికులు ఎలాంటి వాటా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఈ పథకం అమలు కోసం సుమారు రూ. 50 కోట్లు కేటాయించగా ఇప్పటికే రూ. 25 కోట్లు విడుదల చేశామన్నారు. అర్హులైన చేనేత, మరమగ్గాల కార్మికులకు ప్రయోజనం కలిగేలా ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ చెప్పారు. బీసీ సంక్షేమ శాఖ పద్దు నుంచి రూ. 1,200 కోట్లు గతంలో ఎన్నడూలేని రీతిలో 2016–17 వార్షిక బడ్జెట్ నుంచే చేనేత జౌళి విభాగానికి రూ. 1,200 కోట్లు కేటాయిస్తున్నామని, ఇది సాధారణ బడ్జెట్కు అదనమని మంత్రి కేటీఆర్ తెలిపారు. 2022–23 బడ్జెట్లో సాధారణ పద్దు కింద రూ. 55.12 కోట్ల (బీమా కోసం కేటాయింపు)తోపాటు స్పెషల్ బడ్జెట్ రూపంలో మరో రూ. 400 కోట్లు (ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు) కేటాయించామన్నారు. నేత కార్మికుల సంక్షేమం, ఉపాధి కోసం చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, రుణమాఫీ, బతుకమ్మ చీరల తయారీ వంటి పథకాలను అమలు చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. చేనేత మిత్ర ద్వారా ఇప్పటివరకు 20,501 మంది లబ్ధిదారులకు రూ. 24.09 కోట్ల సబ్సిడీని నేరుగా నేత కార్మికుల ఖాతాల్లో వేశామన్నారు. నేత కార్మికుల త్రిఫ్ట్ ఫండ్ పథకంలో రాష్ట్ర ప్రభుత్వ వాటాను 16 శాతానికి పెంచామని, ప్రస్తుతం ఈ పథకంలో 32,328 మంది చేనేత కార్మికులు చేరినట్లు కేటీఆర్ వివరించారు. రుణమాఫీ పథకం ద్వారా 10,148 చేనేత కార్మికులకు చెందిన రూ. 28.97 కోట్ల రుణాలు మాఫీ చేశామన్నారు. బతుకమ్మ చీరల తయారీలో భాగంగా ఏటా కోటి చీరలు తయారు చేయించడం ద్వారా యూనిట్ యజమానులు, మరమగ్గాల కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. టెస్కోలో ఏర్పాటు చేసిన పరిశోధన, అభివృద్ధి విభాగం ద్వారా చేనేత రంగంలో కొత్త డిజైన్లు, వస్త్రోత్పత్తిపై పరిశోధనలు, మార్కెటింగ్పై అధ్యయనం జరుగుతోందని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో చేనేత రంగం అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి అమలవుతున్న కార్యక్రమాలను ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్ అధికారుల బృందాలు అధ్యయనం చేసినట్లు చెప్పారు. ఇది కూడా చదవండి: ఉద్యమాల పురిటిగడ్డకు వారసులొస్తున్నారు.. ఎమ్మెల్యే రేసులో నేతల పిల్లలు -
నేతన్న పనితీరు అద్భుతం,చేనేత దుస్తులు ధరిద్దాం
చేనేత కార్మికులకు మద్దతునివ్వడానికి ప్రతిఒక్కరూ చేనేత దుస్తులు ధరించాలని, వాటి ఉత్పత్తులను కొనుగోలు చేయాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్రపజలకు పిలుపునిచ్చారు. ప్రోత్సాహకాలకు నేత కార్మికులు అర్హులని, వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభించాలని ఆకాంక్షించారు. శనివారం జాతీయ చేనేత దినోత్సవాన్ని రాజ్ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ పలువురు నేత కార్మికులను సన్మానించారు. 2015లో తమిళనాడులో ప్రధాని మోదీ ప్రారంభించిన తొలి జాతీయ చేనేత దినోత్సవంలో తాను పాల్గొన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. నేత కార్మికులు తమ వృత్తిపై అసాధారణమైన అభిరుచిని ప్రదర్శిస్తున్నారని, అద్భుతమైన డిజైన్లతో ఉత్పత్తులు తీసుకొస్తున్నారన్నారు. నారాయణపేట, సిద్దిపేట, వరంగల్ చేనేత ఉత్పత్తుల ప్రత్యేకతల ను తెలుపుతూ పోస్టల్ కవర్లను ప్రవేశపెట్టిన తెలంగాణ పోస్టల్ సర్కిల్ కృషిని గవర్నర్ ప్రశంసించారు. – సాక్షి, హైదరాబాద్ -
నూలు వడికి..రాట్నం తిప్పిన వైఎస్ జగన్
-
చేనేత రుణాలు మాఫీ చేస్తాం
నెల రోజుల్లో రుణమాఫీ పత్రాలు అందిస్తాం మళ్లీ జనతా వస్త్రాలు ఇస్తాం జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రులు కొల్లు, ప్రత్తిపాటి, దేవినేని విజయవాడ బ్యూరో: చేనేత రంగానికి చేయూతనిచ్చేలా రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో మంత్రులు మాట్లాడారు. చేనేత జౌళి శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో వెయ్యి చేనేత సొసైటీలకు చెందిన 2.80లక్షల మంది కార్మికుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. చేనేత కార్మికులకు రూ.125 కోట్ల రుణాలు రద్దు చేస్తామని, నెలరోజుల్లోగా 25వేల మందికి రుణమాఫీ పత్రాలు అందిస్తామని చెప్పారు. జనతా వస్త్రాల పథకాన్ని మళ్లీ అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వ్యవసాయ మంత్రి ప్రతిపాటి పుల్లారావు చెప్పారు. ఈ సందర్బంగా చేనేతలో విశేష సేవలందించిన కూన మల్లికార్జున్, రామయ్యలను సత్కరించారు. సభకు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement