-
భయమెందుకు?
తప్పు చేయనప్పుడు విచారణకు ఎందుకు జంకుతున్నారు శేషాచలం ఎన్కౌంటర్పై రాష్ట్ర పోలీసుల్ని ప్రశ్నించిన ఎన్హెచ్ఆర్సీ ఘటనలో పాల్గొన్న పోలీసులు, అటవీ అధికారుల వివరాలెందుకు ఇవ్వలేదని నిలదీత ఘటనాస్థలికి ప్రత్యేక కమిటీని పంపాలని కమిషన్ నిర్ణయం హైదరాబాద్: శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో తప్పు చేశామన్న భయం లేనప్పుడు ఫస్ట్క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్తో మెజిస్టీరియల్ విచారణ చేయించకుండా రెవెన్యూ అధికారులతో ఎందుకు చేయిస్తున్నారని జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) రాష్ట్ర పోలీసు అధికారులను సూటిగా ప్రశ్నించింది. ఇలాంటి ఘటనల్లో ఫస్ట్క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్తోనే విచారణ చేయించాలన్న నిబంధనను ఎందుకు పట్టించుకోలేదని నిలదీసింది. తక్షణం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలోని ఫుల్బెంచ్ శేషాచలం ఎన్కౌంటర్ ఘటనలపై గురువారం గంటన్నరకుపైగా విచారించింది. కమిషన్లో జస్టిస్ డి.మురుగేశన్, జస్టిస్ సి.జోసెఫ్లతోపాటు సభ్యుడు ఎస్సీ సిన్హా విచారణలో పాల్గొన్నారు. ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న అటవీ-పోలీసు అధికారుల పూర్తి వివరాలు ఈ నెల 22లోపు సమర్పించాలంటూ 13న జారీచేసిన ఆదేశాలను ప్రస్తావించిన కమిషన్.. ఇప్పటివరకు ఎందుకు పట్టించుకోలేదని తప్పుపట్టింది. ఈ ఘటనపై సంబంధిత వివరాలను ఎక్కడా వెల్లడించవద్దని హైకోర్టు ఆదేశించిందని పోలీసు విభాగం అదనపు డీజీ(లీగల్) వినయ్ రంజన్ రే, డీజీపీ కార్యాలయం ప్రధాన న్యాయసలహాదారు ఎం.నాగరఘు కమిషన్ ముందు చెప్పారు. మెజిస్టీరియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశించాల్సి ఉంటుందని అన్నారు. హైకోర్టు ఉత్తర్వుల్ని పరిశీలించిన కమిషన్ తామడిగిన వివరాలివ్వడంలో న్యాయస్థానానికి అభ్యంతరం లేదని, మీరే ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. ‘‘ఘటన తెల్లవారుజామున జరిగితే ప్రాథమిక సమాచార నివేదిక(ఎఫ్ఐఆర్)ను మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఎందుకు నమోదు చేయలేదు? కూలీల దాడిలో గాయపడిన టాస్క్ఫోర్స్ పోలీసులను ఆరోజు ఉదయం 11 గంటలకే.. అది కూడా ఎఫ్ఐఆర్ లేకుండానే తీసుకెళ్లారా? ఎఫ్ఐఆర్ నమోదుకు పోలీస్స్టేషన్ పరిధి విషయంలో గందరగోళం తలెత్తినప్పుడు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. తర్వాత బదిలీ చేసుకునే అవకాశాన్ని ఎందుకు పట్టించుకోలేదు?’’ అని కమిషన్ పోలీసు అధికారుల్ని ప్రశ్నించింది. ఘటనాస్థలికి ప్రత్యేక కమిటీ...: శేషాచలంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి వారం రోజుల్లోగా కమిషన్ద్వారా ప్రత్యేక కమిటీని ఘటనాస్థలికి పంపాలని ఎన్హెచ్ఆర్సీ నిర్ణయించింది. ఈ కమిటీ ఘటనాస్థలిని సందర్శించిన అనంతరం రెండు వారాల్లోగా నివేదిక సమర్పిస్తుందని పేర్కొంది. పోలీసు అధికారులు రెండువారాల్లోగా ఉదంతానికి సంబంధించిన జనరల్ డైరీ ఎంట్రీ, అధికారుల వాహనాల కదలికలకు సంబంధించిన లాగ్బుక్, మృతదేహల పోస్టుమార్టం, రీ-పోస్టుమార్టం నివేదికలు, వైర్లెస్ కమ్యూనికేషన్ వివరాలు, ఎన్కౌంటర్లో పాల్గొన్న అధికారుల పేర్లు, సెల్ఫోన్ నంబర్లు, వినియోగించిన ఆయుధాల వివరాలు, పోలీసులకైన గాయాల వివరాలు, హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం నమోదు చేసిన 302 కేసు ఎఫ్ఐఆర్ కాపీలను తమ ముందుంచాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా ఈ ఘటనపై వివరిస్తూ ఆరో తేదీ అర్ధరాత్రి(ఇంటర్వెన్షన్ నైట్ ఆఫ్ 6/7) అని అదనపు డీజీ వినయ్ రంజన్రే పేర్కొనగా, మృతుల తరఫున హాజరైన స్వచ్ఛంద సంస్థ పీపుల్స్వాచ్కు చెందిన హెన్రీ టొమంగో.. ‘పోలీసు రికార్డుల ప్రకారం ఎన్కౌంటర్ ఏడో తేదీ తెల్లవారుజామున జరిగినట్లు ఉంది. ఇప్పుడు అధికారులు నోరు జారి అసలు విషయం చెప్పారు. కూలీలను ఒకచోట అదుపులోకి తీసుకుని మరోచోట చిత్రహింసలకు గురిచేసి, విచక్షణారహితంగా కాల్చి చంపారనడానికి ఇది బలాన్నిస్తోంది’’ అని ఆరోపించారు. ఎన్కౌంటర్ చేయించింది చంద్రబాబే: హెన్రీ ఏప్రిల్ 6న ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తిరుపతిలో పర్యటించారు. ఆ రోజు ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ఫోర్స్ డీఐజీ కాంతారావు, పోలీసు ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. ఎన్కౌంటర్ చేస్తేనే ఎర్రచందనం స్మగ్లింగ్కు అడ్డుకట్ట వేయవచ్చునంటూ సీఎం వారికి సూచనలిచ్చారు. ఆ ఒత్తిడి మేరకు ఆరోతేదీ సాయంత్రం తమిళ కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకుని.. హింసించి, కాల్చిచంపారు. కూలీల్ని పోలీసులు హత్య చేయడానికి ప్రధాన కారకుడు చంద్రబాబే. ఇదే అంశాన్ని ఎన్హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్లా. చంద్రబాబు 6న తిరుపతిలో ఉన్నారో లేదో.. సంబంధిత రికార్డుల ద్వారా పరిశీలించాలని కోరా. చంద్రబాబుపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేయాలి. - హెన్రీ టొమంగో, హ్యూమన్ రైట్స్ ఫోరమ్-పీపుల్స్వాచ్ ప్రతినిధి ఏం చేసినా చెల్లుతుందనే.. జస్టిస్ వెంకటాచలయ్య నేతృత్వంలో ఎన్హెచ్ఆర్సీ కమిషన్ 1996లో హైదరాబాద్కు వచ్చినప్పుడు.. ఏపీలో ఎన్కౌంటర్ల అంశాన్ని లేవనెత్తాం. అరెస్టు చేసి, హింసించాక పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపుతున్నారని చెప్పాం. మా వాదనతో ఏకీభవించిన కమిషన్.. ఎన్కౌంటర్ జరిగితే అందులో పాల్గొన్న పోలీసులపై 302 సెక్షన్ కింద కేసు పెట్టి.. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇదే అలుసుగా పోలీసులు ఇష్టారాజ్యంగా ఎన్కౌంటర్లు చేస్తూ మానవహక్కుల్ని ఉల్లంఘిస్తున్నారు. మానవహక్కుల్ని ఉల్లంఘించే వారికి గుణపాఠం చెప్పాలని కమిషన్ను కోరాం. - జీవన్కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ హ్యూమన్ రైట్స్ ఫోరమ్ నిబంధనల మేరకే దర్యాప్తు ఎన్కౌంటర్ చోటుచేసుకున్నాక నిబంధనల మేరకే కేసు దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తును హైకోర్టు స్వయంగా పర్యవేక్షిస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు వివరాలను వెల్లడించలేం. ఇదే అంశాన్ని కమిషన్కు చెప్పాం. - ఆర్పీ ఠాకూర్, అదనపు డీజీ(శాంతిభద్రతలు) కాల్చిచంపారని భావించవచ్చా? ‘‘ఈ ఘటన జాతీయస్థాయిలో సంచలనమైంది. అనేక స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల సంఘాలు కూలీలను పట్టుకుని కాల్చి చంపారని ఆరోపిస్తున్నాయి. దీనిపై పోలీసులవైపు నుంచి స్పందన లేదంటే... మీపై వస్తున్న ఆరోపణలు నిజమేనని భావించవచ్చా?’’ అని కమిషన్ ప్రశ్నించింది. ‘‘ఈ ఘటనలో పోలీసులకైన గాయాల వివరాలెందుకు ఇవ్వలేదు? వారిలో ఒక్కరికైనా తూటా గాయాలయ్యాయా?’’ అని నిలదీసింది. మొత్తం 11 మందికి గాయాలయ్యాయని, వీరిలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయని పోలీసులు చెప్పారు. తీవ్రగాయాలంటే ఏంటో వివరాలు సమర్పించాలని కమిషన్ ఆదేశించింది. ఎన్కౌంటర్ జరగడానికి ముందు-ఆ తర్వాత టాస్క్ఫోర్స్ అధికారులకు సంబంధించిన వైర్లెస్ కమ్యూనికేషన్ అంశాలనూ తమ ముందుంచాలంది. ప్రత్యక్ష సాక్షులు శేఖర్, బాలానందన్, ఎం.ఇలాంగోలను తమిళనాడులో న్యాయమూర్తి సమక్షంలో 164 స్టేట్మెంట్ రికార్డుకు ప్రయత్నాలు చేయాలని పేర్కొంది. -
ఇది మానవ హక్కుల ఉల్లంఘనే
శేషాచలం ఎన్కౌంటర్పై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ కేసును సుమోటోగా విచారణ చేపట్టిన కమిషన్ ఏపీ సీఎస్, డీజీపీలకు నోటీసులు జారీ సమాధానమిచ్చేందుకు రెండువారాల గడువు హైదరాబాద్: శేషాచలం అటవీప్రాంతంలో మంగళవారం జరిగిన భారీ ఎన్కౌంటర్ ఉదంతాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) తీవ్రంగా పరిగణించింది. మీడియా కథనాల ఆధారంగా కేసును సుమోటోగా విచారణ చేపట్టిన కమిషన్ ఇది మానవహక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని వ్యాఖ్యానించింది. ఈ ఎన్కౌంటర్ అంశాన్ని ఎన్హెచ్ఆర్సీ కేరళలోని తిరువనంతపురం పర్యటనలో ఉన్న సభ్యుడు జస్టిస్ డి.మురుగేశన్ దృష్టికి తీసుకువెళ్లింది. ఆయన ప్రాథమిక పరిశీలన ప్రకారం ఎన్కౌంటర్ ఉదంతంలో తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘనలున్నట్టుగా వెలుగులోకి వచ్చినట్టు స్పష్టం చేసింది. మీడియా కథనాల ప్రకారం రాళ్లు, కత్తులు, గొడ్డళ్లతో దాడికి యత్నించిన కూలీలపై పోలీసులు, అటవీశాఖ అధికారులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోందని, ప్రాణ రక్షణ పేరుతో చేపట్టిన చర్యలో 20 మంది కూలీలు ప్రాణాలు కోల్పోవడం న్యాయసమ్మతం కాదని వ్యాఖ్యానించింది. ఈ చర్యలకు సంజాయిషీతోపాటు సమగ్ర నివేదిక కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా జవాబివ్వాలని ఆదేశించింది. ఈ నెల 23న హైదరాబాద్లో జరగనున్న ఎన్హెచ్ఆర్సీ క్యాంప్ సిట్టింగ్లో ఈ ఎన్కౌంటర్పై విచారణ చేపట్టనున్నట్టు కమిషన్ పేర్కొంది. నాలుగు నెలల్లో రెండోసారి... ఎర్రచందనం కూలీలపై రాష్ట్రంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనను ఎన్హెచ్ఆర్సీ తీవ్రంగా పరిగణించడం గడిచిన నాలుగు నెలల్లో ఇది రెండోసారి. గతేడాది డిసెంబర్లో అటవీశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. తమిళనాడులోని ధర్మపురి, వేలూరు, కృష్ణగిరి జిల్లాలకు చెందిన నిరుపేదల్ని స్మగ్లర్లు శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం చెట్లు నరికే కూలీలుగా తీసుకొస్తున్నారు. ఇలా వచ్చిన కొందరిపై అటవీ శాఖ అధికారులుగా పేర్కొంటున్న వ్యక్తులు విచక్షణారహితంగా కొట్టిన వీడియోతోసహా వచ్చిన ఫిర్యాదును ఎన్హెచ్ఆర్సీ గతేడాది డిసెంబర్లో పరిగణనలోకి తీసుకుంది. తాము చేస్తున్నది చట్టవిరుద్ధమని తెలియని నిరుపేదల విషయంలో అటవీశాఖ అధికారుల తీరును కమిషన్ సభ్యుడు జస్టిస్ డి.మురుగేశన్ తప్పుపట్టారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement