-
16 ఏళ్లయినా.. ప్రచారమేది..?
సాక్షి, పాల్వంచ: మైనారిటీ విద్యార్థినులకు ఆర్థికంగా చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2003–04 విద్యా సంవత్సరంలో బేగం హజరత్ మహల్ జాతీయ స్కాలర్షిప్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 1857లో సైనిక తిరుగుబాటు సమయంలో ఈస్టిండియా కంపెనీపై తిరుగుబాటు చేసి, భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బేగం హజరత్ మహల్ పేరుతో కేంద్ర మైనార్టీ మంత్రిత్వ శాఖ నేషనల్ స్కాలర్షిప్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 9, 10, ఇంటర్ ప్రథమ, ద్వితీయ తరగతుల విద్యార్థినుల కోసం రూపొందించిన ఈ స్కీం అమల్లోకి వచ్చి 16 సంవత్సరాలు దాటినా.. సరైన ప్రచారం లేకపోవడంతో జిల్లాలో ఇంతవరకు ఒక్క విద్యార్థిని కూడా దరఖాస్తు చేసుకోలేదు. ఈ పథకం గురించి ప్రచారం కల్పించడంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఘోరంగా విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో అర్హులు సుమారు 14వేల మంది.. మైనారిటీ వర్గాలకు చెందిన ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, బౌద్ధులు, పార్శీ మతాలకు చెందిన 9, 10 తరగతుల పేద విద్యార్థినులకు సంవత్సరానికి రూ. 5వేలు, ఇంటర్ విద్యార్థినులకు రూ.6 వేల చొప్పున స్కాలర్షిప్ అందిస్తారు. జిల్లాలో 9,10 తరగతుల విద్యార్థినులు సుమారు 5 వేల మంది, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన వారు 9 వేల మంది ఉన్నారు. అయితే ఈ పథకం గురించి ప్రచారం చేసే నాథుడు లేకపోవడంతో ఇంతవరకు ఒక్క విద్యార్థిని కూడా దరఖాస్తు చేసుకోలేదు. దీంతో ఎంతోమంది అర్హులైన పేద విద్యార్థినులు నష్టపోతున్నారు. అసలు ఈ పథకం గురించి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు కూడా రాలేదు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు... బేగం హజరత్ మహల్ జాతీయ స్కాలర్ షిప్ పథకానికి అర్హులైన విద్యార్థినులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉపకార వేతనం పొందాలంటే ఆదాయం ఏడాదికి రూ.2 లక్షల లోపు ఉన్నట్టుగా తహశీల్దార్ కార్యాలయం నుంచి జారీ చేసిన ధ్రువీకరణ పత్రం, గత సంవత్సరం పొందిన మార్కుల జాబితా, విద్యార్థిని బ్యాంక్ పాస్పుస్తకం, ఆధార్కార్డు జిరాక్స్, ఫీజు రిసిప్ట్, తమ పేరు, తల్లిదండ్రుల పేర్లు, కులం, చిరునామా, స్కూల్ పేరు, మొబైల్ నంబర్ల వివరాలు తెలియజేస్తూ ఆన్లైన్లో ఆప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మాకు మార్గదర్శకాలు అందలేదు బేగం హజరత్ మహల్ నేషనల్ స్కాలర్షిప్ పథకానికి సంబంధించి రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. వస్తే జిల్లాలో ఈ పథకం గురించి ప్రచారం కల్పిస్తాం. – జి.ముత్యం, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేయాలి మైనార్టీ విద్యార్థినుల కోసం కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న బేగం హజరత్ మహల్ జాతీయ ఉపకార వేతనాల పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయకపోవడం బాధాకరం. పథకానికి సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర మైనార్టీ శాఖ జిల్లా అధికారులకు అందించాలి. ఈ పథకం గురించి ప్రచారం కల్పించాలి. మా సంస్థ తరఫున కూడా జిల్లాలో ప్రచారం చేస్తాం. – ఎం.డి.యాకూబ్పాషా, మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు -
మైనార్టీలకు ఆర్థిక భరోసా
నిడమర్రు: మైనార్టీ కులాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సాంకేతిక, సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ద్వారా ‘జాతీయ ఉపకార వేతనం’ పథకం అందుబాటులో ఉంది. అర్హులైన మైనార్టీ విద్యార్థుల నుంచి 2016–17 సంవత్సరానికి ఆన్లైన్లో కొత్త/ రెన్యూవల్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎంపికైన విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి ఇంజినీరింగ్ వరకు వత్తి, సాంకేతిక విద్య అభ్యసించేందుకు వివిధ మొత్తాల్లో ఏటా ఉపకార వేతనాలు అందిస్తారు. వీటిని పొందేందకు విద్యార్థులు మైనార్టీ (ముస్లిం, క్రిస్టియన్, సిక్, బుద్దిస్ట్, పర్సీ, జైన్) కులాలకు చెందిన వారై ఉండాలి. పథకం వివరాలు మీకోసం. ప్రీ మెట్రిక్ ఉపకార వేతనం అర్హులు: 1 నుంచి 10వ తరగతి విద్యార్థులు. ప్రోత్సాహం ఏడాదికి: 1 నుంచి 5వ తరగతి వరకు రూ.1,000, 6 నుంచి 10వ తరగతి వరకు రూ.5 వేలు. ఆదాయం: తండ్రి/ సంరక్షకుని వార్షిక ఆదాయం రూ.లక్ష లోపు ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 31 పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనం అర్హులు: ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సులు, అండర్ డిగ్రీ కోర్సులు ప్రోత్సాహం ఏడాదికి: ఇంటర్ విద్యార్థికి రూ.7 వేలు, తత్సమాన వత్తి విద్యకు రూ.10 వేలు. ఆదాయం: తండ్రి/ సంరక్షకుని వార్షిక ఆదాయం రూ.2 లక్షల లోపు ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 31 మెరిట్ కమ్ మీన్స్ ఉపకార వేతనాలు అర్హులు: ఇంటర్ తర్వాత వత్తి/సాంకేతిక కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు (ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ తదితర కోర్సులు) ఆన్లైన్లో దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబర్ 31 నగదు ప్రోత్సాహం ఏడాదికి ప్రోత్సాహం రకం హాస్టల్ డేస్కాలర్ మెయింటినెన్స్ అలవెన్స్ రూ.10 వేలు రూ. 5 వేలు కోర్సు ఫీజు రూ.20 వేలు రూ. 20 వేలు మొత్తం రూ.30 వేలు రూ. 25 వేలు కేంద్ర ప్రభుత్వం గుర్తించిన విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ కింద చెల్లిస్తారు. ....................................... ఆన్లైన్ దరఖాస్తులు ఇలా.. అర్హత గల విద్యార్థులు ఠీఠీఠీ.టఛిజిౌlటటజిజీpట.జౌఠి.జీn వెబ్సైట్లో అపై ్ల ఫ్రెష్ వద్ద కొత్త విద్యార్థులు, అపై ్ల ఫర్ రెన్యూవల్ వద్ద రెన్యూవల్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్లో స్కేనింగ్ చేసి పొందుపరచాల్సిన ధ్రువీకరణ పత్రాలు ఆధార్ కార్డు, విద్యార్థి సంతకంతో కూడిన ఫొటో, విద్యార్థి సంతకంతో కూడిన కోర్సుకు ముందు గత విద్యా సంవత్సరంలో పొందిన మార్కులు/ పాస్ సర్టిఫికెట్ ( రెన్యూవల్ విద్యార్థులు గతేడాది మార్కుల జాబితా) –విద్యార్థి ఇచ్చిన సమాచారం పరిశీలించి ధ్రువపరుస్తూ సంబంధిత విద్యా సంస్థ ప్రిన్సిపాల్ ఇచ్చే ధ్రువీకరణ పత్రం, విద్యార్థి సెల్ఫ్ డిక్లరేషన్తో కూడిన ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, సెల్ఫ్ డిక్లరేషన్తో కూడిన కులధ్రువీకరణ పత్రం, విద్యాసంస్థకు ట్యూషన్/ కోర్సు ఫీజు, హాస్టల్ ఫీజు చెల్లించిన రశీదులు., ఏదైనా జాతీయ బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ (స్కానింగ్లో ఫొటో, అడ్రస్, ఐఎఫ్ఎస్సీ కోడ్ తప్పని సరిగా ఉండేలా జాగ్రత్త పడాలి) –10వ తరగతి తర్వాత విద్యార్థులు ఈ ఉపకార వేతనాలకు అర్హత సాధించాలంటే వారు తప్పనిసరిగా సంబంధిత కోర్సులో గత విద్యా సంవత్సరంలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. –ఒక కోర్సులో అడ్మిషన్ పొందిన తర్వాత కోర్సు మార్చుకుంటే వారు అనర్హులు, సమాచారం తప్పని నిర్దారణ అయితే లబ్ధి పొందిన మొత్తాన్ని విద్యార్థి నుంచి వసూలు చేయడంతో పాటు భవిష్యత్లో ఏ ఇతర ఉపకార వేతనం పొందేందుకు వీలు లేకుండా అనర్హుల జాబితాలో చేర్చుతారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement