-
వైట్ కాలర్ ఉద్యోగాలకు డిమాండ్ డౌన్
ముంబై: ఐటీ–సాఫ్ట్వేర్, టెలికం, విద్యా రంగాల్లో నియామకాలు మందగించిన నేపథ్యంలో అక్టోబర్–నవంబర్లో వైట్ కాలర్ ఉద్యోగాలకు హైరింగ్ తగ్గింది. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 12 శాతం క్షీణించింది. నౌకరీ జాబ్స్పీక్ సూచీకి సంబంధించిన నివేదిక ప్రకారం 2022 అక్టోబర్–నవంబర్లో 2,781 జాబ్ పోస్టింగ్స్ నమోదు కాగా ఈసారి అదే వ్యవధిలో 2,433 పోస్టింగ్స్ మాత్రమే నమోదయ్యాయి. నౌకరీడాట్కామ్లో సంస్థలు పోస్ట్ చేసే ఉద్యోగావకాశాలను బట్టి దేశీయంగా ప్రతి నెలా నియామకాల ధోరణిని నౌకరీ జాబ్స్పీక్ ఇండెక్స్ సూచిస్తుంది. మేనేజర్లు, క్లర్కులు, అడ్మిని్రస్టేషన్ సిబ్బంది మొదలైన ఆఫీసు ఆధారిత కొలువులను వైట్ కాలర్ ఉద్యోగాలుగా వ్యవహరిస్తారు. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ► టెలికంలో 18 శాతం, విద్యా రంగంలో 17 శాతం, రిటైలింగ్ రంగంలో 11 శాతం మేర వైట్ కాలర్ నియామకాలు తగ్గాయి. ఆతిథ్య, ట్రావెల్, ఆటో, ఆటో విడిభాగాల రంగాల్లో హైరింగ్లో పెద్దగా మార్పులేమీ లేవు. ►ఇంధన కంపెనీలు వేగంగా కార్యకలాపాలు విస్తరిస్తుండటం, దేశవ్యాప్తంగా కొత్త రిఫైనరీలను ఏర్పాటు చేస్తుండటం వంటి సానుకూల పరిణామాలతో ఆయిల్, గ్యాస్ రంగాల్లో హైరింగ్ 9 శాతం పెరిగింది. ►కొత్త ఉద్యోగావకాశాలు ఫార్మా రంగంలో 6 శాతం, బీమా రంగంలో 5 శాతం పెరిగాయి. ►ఐటీ రంగంలో మొత్తం మీద హైరింగ్ 22 శాతం క్షీణించింది. అయితే అక్టోబర్తో పోలిస్తే నవంబర్లో నియామకాలు 1 శాతం మేర పెరిగాయి. ►ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ సంబంధ మెషిన్ లెరి్నంగ్ ఇంజినీర్లకు అవకాశాలు 64 శాతం మేర, ఫుల్ స్టాక్ డేటా సైంటిస్టులకు కొత్త ఉద్యోగాలు 16 శాతం మేర పెరిగాయి. ►మెట్రోలతో పోలిస్తే నాన్–మెట్రోల్లోనే ఎక్కువగా హైరింగ్ కార్యకలాపాలు ఉన్నాయి. వదోదరలో అత్యధికంగా 9 శాతం కొత్త ఉద్యోగాల పోస్టింగ్స్ నమోదయ్యాయి. ►ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై వంటి మెట్రోల్లో నియామకాలు చెరి 12 శాతం మేర, ఐటీ ప్రధానమైన బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణెలో వరుసగా 20 శాతం, 18 శాతం, 21 శాతం, 18 శాతం మేర హైరింగ్ క్షీణించింది. ►2023 ఆసాంతంలో కనిపించిన ట్రెండ్కి అనుగుణంగా అక్టోబర్–నవంబర్లో కూడా సీనియర్ ప్రొఫెషనల్స్ వైపే కంపెనీలు మొగ్గు చూపాయి. 16 ఏళ్ల పైబడి అనుభవమున్న సీనియర్ నిపుణుల నియామకాలు 26 శాతం పెరిగాయి. ఫ్రెషర్లకు కొత్త ఆఫర్లు 13 శాతం పడిపోయాయి. -
ఐటీ హబ్లు వెలవెల! భారీగా పడిపోయిన నియామకాలు..
ప్రపంచవ్యాప్తంగా జాబ్ మార్కెట్లో ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది. నియామకాలు బాగా నెమ్మదించాయి. భారత్లో ముఖ్యంగా ఐటీ హబ్లు వెలవెలబోతున్నాయి. దేశంలో ఉద్యోగాల క్షీణతకు సంబంధించి తాజాగా ఓ నివేదిక వెల్లడైంది. పుణె, బెంగళూరు, హైదరాబాద్ వంటి భారతీయ ఐటీ హబ్లలో గడిచిన అక్టోబర్ నెలలో ఉద్యోగాల క్షీణత కనిపించిందని నివేదిక వెల్లడించింది. మొత్తం మీద అక్టోబర్లో ఇతర రంగాల కంటే ఐటీ రంగంలో నియామకాలు అత్యధికంగా పడిపోయాయి. మరోవైపు, చమురు, గ్యాస్, విద్యుత్ రంగాల్లో అత్యధిక వృద్ధి కనిపించింది. ఐటీ నియామకాల్లో 14% క్షీణత నౌకరీ జాబ్స్పీక్ నివేదిక ప్రకారం.. గతేడాది అక్టోబర్తో పోల్చితే ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఐటీ రంగం నియామకాల్లో 14 శాతం క్షీణతను చూసింది. నౌకరీ డాట్ కామ్ రెజ్యూమ్ డేటాబేస్పై ఈ నెలవారీ నివేదిక విడుదలైంది. ఇతర నగరాల్లో వృద్ధి కోల్కతాతో పాటు ఐటీ పరిశ్రమ కేంద్రాలుగా ఉన్న బెంగళూరు, హైదరాబాద్, పుణె, చెన్నై వంటి మెట్రో నగరాల్లో నియామకాల్లో 6 నుంచి 11 శాతం క్షీణత ఉండగా మరోవైపు ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై నగరాల్లో మాత్రం కొత్త జాబ్ ఆఫర్లలో వరుసగా 5, 4 శాతాల చొప్పున వృద్ధి నమోదైనట్లు నివేదిక పేర్కొంది. ఇక చెన్నైలో అత్యధికంగా 11 శాతం, బెంగళూరులో 9 శాతం, హైదరాబాద్లో 7 శాతం నియామకాలు పడిపోయాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ అక్టోబర్లో పుణె, కోల్కతాలో నియామకాలు 6 శాతం తగ్గాయి. చిన్న నగరాల విషయానికి వస్తే.. కొచ్చిలో 18 శాతం, కోయంబత్తూరులో 7 శాతం తగ్గింది. మరోవైపు మెట్రో నగరాలైన ఢిల్లీ 5 శాతం, ముంబై 4 శాతం వృద్ధిని సాధించాయి. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో వడోదరలో అత్యధికంగా 37 శాతం వృద్ధి నమోదైంది. ఆ తర్వాత అహ్మదాబాద్లో 22 శాతం, జైపూర్లో 10 శాతం నియామకాల్లో వృద్ధి నమోదైనట్లు నౌకరీ జాబ్ స్పీక్ రిపోర్ట్ పేర్కొంది. ఈ రంగాల్లో జోష్ ఐటీ రంగంలో నియామకాల్లో క్షీణత ఉన్నప్పటికీ కొన్ని ఇతర రంగాల్లో మాత్రం కొత్త నియామకాల్లో జోష్ కనిపించినట్లు తాజా వివేదిక తెలిపింది. చమురు & గ్యాస్/పవర్ రంగం అత్యధికంగా 24 శాతం వృద్ధిని సాధించింది. ఆ తర్వాత ఫార్మా పరిశోధన, అభివృద్ధి (19 శాతం), బ్యాంకింగ్/ఫైనాన్స్/బ్రోకింగ్ (13 శాతం) ఉన్నాయి. ఇక నియామకాల్లో క్షీణత అత్యధికంగా ఉన్న రంగాలలో ఐటీ తర్వాత విద్య (10 శాతం), టెలికాం (9 శాతం) ఉన్నాయి. భారత్లో వైట్ కాలర్ నియామకానికి సంబంధించిన ఇండెక్స్ విలువ ఈ ఏడాది అక్టోబర్లో 2484గా ఉంది. ఇది గతేడాది అక్టోబర్లో 2455గా నమోదైంది. -
గుడ్న్యూస్.. డబుల్ డిజిట్ బాటలో వేతన ఇంక్రిమెంట్లు
దేశీయ కంపెనీల ఉద్యోగులు ఈ సంవత్సరం సగటున 10 శాతం ఇంక్రిమెంట్లు పొందారు. ఆర్థిక అనిశ్చిత భయాలతో లేఆఫ్లు, ఒడిదుడుకులతో 2023 సంవత్సరం ప్రారంభమైనప్పటికీ ఇంక్రిమెంట్లు డబుల్ డిజిట్ శాతం వైపు పయనాన్ని ప్రారంభించాయని నౌకరీ డాట్కామ్ (Naukri.com)నిర్వహించిన సర్వే పేర్కొంది. నౌకరీ డాట్కామ్ సర్వే ప్రకారం.. ఈ ఏడాది ప్రతి 10 మంది ఉద్యోగులలో కనీసం ఆరుగురు 10 శాతం కంటే ఎక్కువగా ఇంక్రిమెంట్లు పొందారు. కనిష్టంగా కాస్త తక్కువే ఉన్నప్పటికీ అసాధారణ పనితీరు ఉన్న ఉద్యోగులు 20 నుంచి 25 శాతం ఇంక్రిమెంట్ పొందారు. ఈ సర్వేలో 2 లక్షల మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. తమ కంపెనీలు ఏప్రిల్ మార్చి మదింపు చక్రాన్ని అనుసరిస్తున్నాయని 56 శాతం మంది చెప్పారు. బ్యాంకింగ్, తయారీ రంగాల్లో అధికంగా.. జాబ్ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం వేతన పెంపు వేవ్ ఆశాజనకంగా ఉందని నౌకరీ డాట్ కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ అన్నారు. ఏప్రిల్-మార్చి వేతన పెంపులో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల ఉద్యోగులదే అత్యధిక వాటా. వీరిలో చాలా మంది 10 నుంచి 20 శాతం ఇంక్రిమెంట్లు అందుకున్నారు. ఇంక్రిమెంట్ల శాతంలో హెల్త్కేర్, రియల్ ఎస్టేట్ రంగాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చాలా మంది ఉద్యోగులు గతేడాది కంటే మెరుగైన వేరియబుల్స్, బోనస్ల చెల్లింపులు ఈ ఏడాది పొందారు. ఇదీ చదవండి: మాదేం లేదు! వర్క్ ఫ్రం ఆఫీస్పై ఇన్ఫోసిస్ సీఈవో కీలక వ్యాఖ్యలు -
నిర్దాక్షిణ్యంగా ఉద్యోగుల తొలగింపు.. ఐటీ రంగంలో వీళ్లకి తిరుగులేదు!
ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో టెక్నాలజీ రంగంలో ఉద్యోగుల తొలగింపులు తక్కువ స్థాయిలో ఉండనున్నట్లు పలు సర్వేలు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ ఆ రంగానికి చెందిన సీనియర్ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి దిగజారిపోతుందన్న భయాలు నెలకొన్న తరుణంలో చిన్న చిన్న కంపెనీల నుంచి బడా కంపెనీల వరకు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. దీంతో మిగిలిన రంగాల పరిస్థితులు ఎలా ఉన్న టెక్నాలజీ రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది. ముఖ్యంగా సీనియర్ స్థాయి ఉద్యోగుల్లో ఈ లేఆఫ్స్ భయాలు ఎక్కువగా ఉన్నాయని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ప్రముఖ దేశీయ ఎంప్లాయిమెంట్ సంస్థ నౌకరీ.. 1400 మంది రిక్రూట్లు, జాబ్ కన్సల్టెన్సీలతో సర్వే నిర్వహించింది. ఆ అధ్యయనంలో 20 శాతం మంది రిక్రూటర్లు సీనియర్ ఉద్యోగుల తొలగింపులు ఎక్కువగా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఫ్రెషర్ల నియామకం ముమ్మరంగా కొనసాగనుందని, లేఆఫ్స్ .. ఫ్రెషర్ల రిక్రూట్ మెంట్పై తక్కువ ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఐటీ రంగంలో 6 నెలలు పాటు అట్రిషన్ రేటు అధికంగా 15 శాతం ఉండనుందని, అదే సమయంలో గ్లోబుల్ మార్కెట్లో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ కొత్త రిక్రూట్మెంట్ భారీగా ఉంటుదని రిక్రూటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అధ్యయనంలో పాల్గొన్న సగం మందికి పైగా 29 శాతంతో కొత్త ఉద్యోగాల రూపకల్పనలో నిమగ్నం కాగా.. 17 శాతం ఉద్యోగులు సంఖ్యను అలాగే కొనసాగించాలని భావిస్తున్నారు. 2023 మొదటి అర్ధభాగంలో (6 నెలలు) నియామక కార్యకలాపాలపై ఆశాజనకంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నందున .. భారతీయ ఉద్యోగులు గణనీయమైన ఇంక్రిమెంట్లను పొందవచ్చని అంచనా. సర్వే చేసిన మొత్తం రిక్రూటర్లలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది సగటు పెరుగుదలను 20 శాతానికి పైగా అంచనా వేస్తున్నారు. ప్రపంచ స్థాయిలో నియామకాల ట్రెండ్లపై ప్రస్తుత అనిశ్చితి పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశీయంగా క్యాంపస్ సెలక్షన్లు ఎక్కువ జరుగుతాయని సమాచారం. -
ఉద్యోగులకు బంపరాఫర్: పర్మినెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్
కోవిడ్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఆఫీస్కి వెళ్లి పనిచేయాలా? అన్న సందిగ్ధంలో ఉన్నారా? అయితే మీకో శుభవార్త. దేశీయ దిగ్గజ కంపెనీలు పర్మినెంట్గా ఇంటి వద్ద నుంచి పనిచేసేలా బంపరాఫర్ ను ప్రకటిస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రముఖ జాబ్ పోర్టల్ నౌకరి స్పష్టం చేసింది. కోవిడ్ కారణంగా వర్క్ కల్చర్ ఆఫీస్నుంచి ఇంటికి మారింది. కానీ గత కొద్దిరోజులుగా పలు ఐటీ దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల్ని కార్యాలయాల్లో పని చేయాలని చెప్పినట్లే చెప్పి మళ్లీ యూటర్న్ తీసుకున్నాయి. ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని, అవసరం అయితే ఉద్యోగుల్ని ఐబ్రిడ్ వర్క్కి ఆహ్వానిస్తామని తెలిపాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ జాబ్ పోర్ట్ నౌకరి వర్క్ ఫ్రమ్ హోమ్లో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. గత 6నెలల్లో నౌకరిలో ప్రకటనలిస్తున్న దిగ్గజ కంపెనీలు శాశ్వతంగా ఇంటి వద్ద నుంచి పనిచేసే ఉద్యోగులకోసం అన్వేషిస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు మరెన్నో ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. ►నౌకరి వెబ్ పోర్టల్లో మనదేశానికి చెందిన సుమారు 32 లక్షల మంది ఉద్యోగులు ఉద్యోగాల కోసం అన్వేషించినట్లు నౌకరి తెలిపింది. అందులో దాదాపు 57శాతం మంది అభ్యర్ధులు పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం వెతికినట్లు వెల్లడించింది. ►నౌకరి తన జాబ్ బోర్డ్లో ప్రత్యేక ఫీచర్ను రూపొందించిన తర్వాత, తన సైట్లో 93,000 శాశ్వత, తాత్కాలిక రిమోట్ ఉద్యోగాల్ని ప్రకటించాయని, పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు 22శాతం ఉన్నాయి. ►మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాలుగా వర్క్ కల్చర్ మారిపోయింది. కార్పోరేట్ కంపెనీలు చాలా వరకు ఉద్యోగుల్ని హైబ్రిడ్ వర్క్ కల్చర్ కి దగ్గర చేయాలని భావిస్తున్నాయి. ►రిక్రూటర్లు ఉద్యోగుల ఎంపిక, వారి పని విధానం విషయంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి అనే విషయంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహమ్మారి కారణంగా ఎక్కువ మంది రిక్రూటర్లు పనితీరు కనబరిచే ఉద్యోగుల కోసం అన్వేషణ, ఎక్కడి నుండైనా పని చేసేందుకు అంగీకరిస్తున్నారు. కార్పొరేట్ స్థాయిలో మానవ వనరులు, మౌలిక సదుపాయాల అవసరాలకు శాశ్వత మార్పులు చేయడం ప్రారంభించారు”అని నౌకరి చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గోయల్ అన్నారు. ►అంతేకాకుండా, కంపెనీలు కొన్ని జాబ్ ప్రొఫైల్లను పర్మినెంట్ వర్క్ హోమ్లో పనిచేసే ఉద్యోగుల కోసం అన్వేషిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ, సాఫ్ట్వేర్, బీపీఓ వంటి రంగాల్లో ఈతరహా ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి. ►పెద్ద, చిన్న కంపెనీలు రెండూ మూడు రకాల ఉద్యోగాలను పోస్ట్ చేశాయి. వాటిలో సాధారణ ఉద్యోగాలు, తాత్కాలిక వర్క్ ఫ్రమ్ హోమ్, శాస్వతంగా రిమోట్ వర్క్ చేసే ఉద్యోగాలు ఉన్నాయి. ►ఐటీ సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ సేవలు, ఐటీఈఎస్, రిక్రూట్మెంట్/సిబ్బంది రంగాలు ఎక్కువ శాశ్వత రిమోట్ ఉద్యోగాలను పోస్ట్ చేస్తున్నాయని నౌకరీ డేటా చూపుతోంది. ►నౌకరీ డేటా ప్రకారం అమెజాన్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్, పిడబ్ల్యుసి, ట్రిజెంట్, ఫ్లిప్కార్ట్, సిమెన్స్, డెలాయిట్, ఒరాకిల్, జెన్సార్, టీసీఎస్, క్యాప్జెమినీ తాత్కాలిక, శాశ్వత రిమోట్ ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement