-
కెనడా నుంచి వచ్చి ఇంట్లో ఉరేసుకుని..
మొయినాబాద్: మూడు నెలల కిందట కెనడా నుంచి వచ్చిన ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మొయినాబాద్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మొయినాబాద్ ఇన్స్పెక్టర్ రాజు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని శ్రీరాంనగర్ గ్రామానికి చెందిన అత్తాపురం చంద్రారెడ్డి, ప్రమద దంపతులకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. కూతురుకు వివాహం కాగా పెద్ద కొడుకు అత్తాపురం నవీన్కుమార్రెడ్డి(29) ఐదేళ్ల కిందట చదువుకోవడానికి కెనడా వెళ్లాడు. చిన్నకొడుకు అనుదీప్రెడ్డి అమెరికాలో ఉద్యోగం చేస్తూ డబ్బులు పంపడంతో తల్లిదండ్రులు మొయినాబాద్ మండల కేంద్రంలో అద్దెకు ఉంటూ కొత్త ఇళ్లు నిర్మిస్తున్నారు. అయితే పెద్ద కొడుకు నవీన్కుమార్రెడ్డి మూడు నెలల క్రితం కెనడా నుంచి తిరిగి ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులతోపాటే మొయినాబాద్ ఉంటున్నాడు. మూడు నెలలుగా ఉద్యోగం దొరక్కపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. ఆదివారం తల్లిదండ్రులు బందువుల వద్దకు వెళ్లడంతో ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. బెడ్రూం తలుపులు పెట్టుకుని ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి 10.30గంటల సమయంలో తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూడగా తలుపులు మూసి ఉన్నాయి. ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో కిటికీలో నుంచి లోపలికి చూడగా నవీన్కుమార్రెడ్డి ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లిచూశారు. అప్పటికే మృతి చెందాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. సోమవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
ఆడపిల్లలు పుట్టారని రెండో పెళ్లి...
బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి ఘనకార్యం నాగోలు: వరుసగా ఆడపిల్లలు పుడుతున్నారని మొదటి భార్యను వేధించి రెండవ వివాహం చేసుకున్న ఓ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగిపై సరూర్నగర్ మహిళా పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. బాధితురాలి కథనం ప్రకారం... సరూర్నగర్ వెంకటేశ్వరకాలనీకి చెందిన పి.నవీన్కుమార్ వనస్థలిపురంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఉద్యోగి. ఆసిఫ్నగర్కు చెందిన విజయలక్ష్మితో 12 ఏళ్ల క్రితం ఇతనికి పెళ్లైంది. వివాహ సమయంలో కట్నం కింద రూ.3.50 లక్షల నగదు, 25 తులాల బంగారం, కొన్ని వెండి ఆభరణాలు ఇచ్చారు. కొంతకాలం బాగానే ఉన్న నవీన్కుమార్ వరుసగా ఆడపిల్లలు పుట్టడంతో విజయలక్ష్మిని మానసిక, శారీరక వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. దీంతో విజయలక్ష్మి తల్లి తమ రెండు ఎకరాల భూమిని కూతురు, అల్లుడు నవీన్కుమార్ల పేరిట రాసింది. ఆ భూమిని అమ్మేయాలని నవీన్కుమార్ మళ్లీ భార్యను వేధిస్తుండటంతో పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా.. నవీన్కుమార్ గత డిసెంబర్లో గుడిమల్కాపురానికి చెందిన ఓ యువతిని యాదగిరిగుట్టలో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న విజయలక్ష్మి భర్తను నిలదీయగా.. ‘‘ నా ఇష్టం.. నీ దిక్కున్న చోట చెప్పుకో’ అని అన్నాడు. దీంతో బాధితురాలు గురువారం సరూర్నగర్ మహిళా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు నవీన్కుమార్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement