-
నా మాటలను ఎంజాయ్ చేశారు: బాలకృష్ణ
హైదరాబాద్ : ఒక సినిమా ఆడియో ఫంక్షన్ లో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడిన సినీ నటుడు బాలకృష్ణ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. సినిమా ఆడియో పంక్షన్ లో తానన్న మాటలను అక్కడున్న వారంతా ఎంజాయ్ చేశారు. అందులో సగం మంది ఆడవాళ్లున్నారు. వాళ్లెవరూ తప్పుపట్టలేదు... అంటూ సమర్థించుకున్నారు. పైగా ఈ మాటలు అన్నది ఎక్కడో కాదు. అసెంబ్లీ సాక్షిగా... అది కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున. సావిత్రి సినిమా ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ బాలకృష్ణ మహిళలను కించ పరిచే విధంగా అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేశారు. మహిళల పట్ల అత్యంత దారుణంగా మాట్లాడటం జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారింది. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. తానన్న మాటలపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో బాలకృష్ణ తరఫున టీడీపీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సినిమా వేడుకల్లో తన చలన చిత్రాల్లో కథాపరమైన సన్నివేశాల గురించి చెబుతూ చేసిన వ్యాఖ్యలను అపార్థం చేసుకోవద్దని కోరారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఎవరైనా నొచ్చుకుంటే మన్నించాలని కోరుతున్నానంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేశారు. ఆ అంశంపై జరిగిన చర్చలో పాల్గొన్న ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న అన్యాయం, మహిళలపై జరుగుతున్న దాడులు, అధికార పార్టీ సభ్యులు ప్రవర్తిస్తున్న తీరును ఎండగట్టారు. ఈ సభలో ఉన్న ఒక సభ్యుడు మహిళల పట్ల ఎంత లోకువగా మాట్లాడారని, దానిపై జాతీయ చానళ్లలో చర్చ జరుగుతోందని, అలాంటి సభ్యులు కూడా ఈ సభలో ఉన్నారని విమర్శించారు. ఈ చర్చ సందర్భంగా హిందూపూర్ ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ జోక్యం చేసుకుని మాట్లాడారు. సినిమా ఆడియో ఫంక్షన్ లో తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూనే తాను ఆ మాటలన్నందుకు ఆ సభలో ఎవరూ తప్పపట్టలేదని చెప్పారు. మహిళలు అంటే తనకు గౌరవం ఉందని, మహిళలను జీవితంలో ఉద్దరించడం, మహిళా యూనివర్సిటీ ఏర్పాటు వంటివి జరుగుతున్నాయని, మహిళలకు ఏ సినిమాల్లో లేని ప్రాముఖ్యత నా సినిమాల్లో ఉంటుందని చెప్పుకొచ్చారు. సినిమాల్లో తన పాత్ర గురించి జనం ఏ కోరుకుంటున్నారు ఆడియో ఫంక్షన్ లో చెప్పాననీ, అక్కడ రెండు రకాలుగా మాట్లాడానని చెప్పారు. నా నుంచి అభిమానులు ఏమాశిస్తారు. నా గురించి ఏం కోరుకుంటారు... దాని గురించే మాట్లాడానన్నారు. ఇదే సందర్భంగా... సినిమా నేపథ్యం గురించి చెబుతూ... తాను అన్న మాటలకు అక్కడున్న అందరూ ఎంజాయ్ చేశారు. సభలో సగం వరకు మహిళలు ఉన్నారు. ఎవ్వరూ తప్పపట్టలేదు. (అసెంబ్లీని చేతులతో చూపిస్తూ) ఈ నాలుగు గోడల మధ్య కాదు.. అందరూ ఎంజాయ్ చేశారు... బయట ఎవ్వరి అభిప్రాయమైనా తీసుకోండి... దాన్ని వాళ్లు ఎలా తీసుకున్నారో... ఎలా అర్థమైందో.. అంటూ ముగించారు. చట్ట సభలో మాట్లాడుతూ, బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన బాలకృష్ణ, తన మాటలపై ఏమాత్రం పశ్చాత్తపం వ్యక్తం చేయకుండా మహిళల పట్ల లోకువగా మాట్లాడిన మాటలను అందరూ ఎంజాయ్ చేశారంటూ అలవోకగా ప్రకటన చేయడం, ఈ నాలుగు గోడల మధ్య ఉండి కాకుండా బయట ఏమనుకుంటున్నారో అభిప్రాయం తీసుకోవాలని ప్రజాప్రతినిధులను ఉద్దేశించి చెప్పడం సర్వత్రా విస్మయపరిచింది. -
హిందూపురంలో బాలయ్య ప్రజాదర్బార్
హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురంలో స్థానిక శాసనసభ్యుడు, నటుడు నందమూరి బాలకృష్ణ బుధవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల నుంచి వివిధ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వినతి పత్రాలు స్వీకరించారు. వాటిని పరిష్కరిస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలపై బాలకృష్ణ ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. ఈ ప్రజాదర్బరు కార్యక్రమం రెండు రోజుల పాటు కొనసాగనుంది. అలాగే హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు చేపట్టాల్సిన పనులపై ప్రజల సమక్షంలోనే బాలకృష్ణ ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. -
డిక్టేటర్ షూటింగ్ 29న ప్రారంభం
హైదరాబాద్: సింహా... లెజెండ్... లయన్ చిత్రాలలో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించిన నందమూరి బాలకృష్ణ ఇప్పుడు డిక్టేటర్గా కనిపించనున్నాడు. బాలకృష్ణ నటిస్తున్న 99వ చిత్రం డిక్టేటర్ షూటింగ్ మే 29వ తేదీన లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఆ చిత్ర దర్శకుడు శ్రీవాస్ శనివారం హైదరాబాద్లో వెళ్లడించారు. కాగా చిత్రం రెగ్యులర్ షూటింగ్ మాత్రం జూన్ 12 నుంచి మొదలవుతుందని తెలిపారు. హైదరాబాద్, ఢిల్లీతోపాటు యూరప్ దేశాలలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుందని చెప్పారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నయనతార నటిస్తుందని చెప్పారు. బాలకృష్ణతో నయనతార నటిస్తున్న మూడో చిత్రం అని శ్రీవాస్ పేర్కొన్నారు. గతంలో బాలకృష్ణ, నయనతార కాంబినేషన్లో సింహా, శ్రీరామరాజ్యం చిత్రాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. తన దర్శకత్వంలో వచ్చిన లక్ష్యం, లౌక్యం చిత్రాలు విజయం సాధించాయి.... అలాగే ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని శ్రీవాస్ స్పష్టం చేశారు. ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారని శ్రీవాస్ తెలిపారు. డిక్టేటర్ చిత్రాన్ని ఈ ఏడాది దసరా పండగకు విడుదల చేస్తామన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement