-
ట్రంప్కి అమెరికా కాంగ్రెస్ షాక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి వీడడానికి కొద్ది రోజుల ముందు అమెరికన్ కాంగ్రెస్ ఆయనకు గట్టి షాక్ ఇచ్చింది. ట్రంప్ వీటో అధికారాలను వినియోగించుకోవడానికి వీల్లేకుండా 74 వేల కోట్ల డాలర్ల వార్షిక రక్షణ విధాన బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. ట్రంప్ హయాంలో అధ్యక్షుడి వీటో అధికారాన్ని తోసిరాజని ఒక బిల్లు చట్ట రూపం దాల్చడం ఇదే తొలిసారి. రిపబ్లికన్ పార్టీకి బలం ఉన్న కాంగ్రెస్లోని ఎగువ సభ అయిన సెనేట్ కూడా ట్రంప్ అధికారాన్ని పక్కకు పెట్టి నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ (ఎన్డీఏఏ)ని 81–13 ఓట్ల తేడాతో ఆమోదించడం గమనార్హం. ఈ పరిణామంతో అధికారానికి దూరమవుతున్న క్షణాల్లో సొంత పార్టీ నుంచి కూడా ట్రంప్కి ఎదురు దెబ్బ తగిలిట్టనయింది. ఈ వారం మొదట్లోనే ప్రతినిధుల సభ ఈ బిల్లుని 322–87 ఓట్లతో ఆమోదించింది. ట్రంప్ రక్షణ బిల్లుని మొదట్నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆ బిల్లులోని కొన్ని అంశాలు దేశ భద్రతకు భంగకరంగా ఉన్నాయన్నది ఆయన వాదన. కానీ అమెరికా ప్రజాప్రతినిధులు మాత్రం ఈ బిల్లుకి ఆమోద ముద్ర వేశారు. సాధారణంగా కాంగ్రెస్లోని రెండు సభలు బిల్లుని ఆమోదించిన తర్వాత అధ్యక్షుడు సంతకం చేస్తే అది చట్టరూపం దాలుస్తుంది. అయితే అధ్యక్షుడు తన వీటో అధికారాన్ని వినియోగించి బిల్లుని తిప్పి పంపడం అరుదుగా జరుగుతూ ఉంటుంది. అధ్యక్షుడు బిల్లుని వీటో చేసే అవకాశం లేకుండా కాంగ్రెస్ మూడింట రెండు వంతుల మెజార్టీతో బిల్లుని చట్టంగా మార్చే అవకాశం ఉంది. ట్రంప్ ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ ఉండడంతో కాంగ్రెస్లో ఉభయ సభలు ఆయన సంతకం అవసరం లేకుండానే బిల్లుని ఆమోదించాయి. దేశ భద్రత, మిలటరీ అవసరాలు, సైనిక కుటుంబాలకు అండగా ఉండడానికి కావల్సిన నిధులను మంజూరు చేసే బిల్లు కావడంతో కాంగ్రెస్ ఎలాంటి అడ్డంకులు రాకుండా ఆమోదించింది. భారత్లో 19 వేల కేసులు న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 19,079 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,03,05,788కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కోవిడ్తో 224 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,49,218కు చేరింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 99,06,387కు చేరిం. రికవరీ రేటు 96.12 శాతానికి చేరింది. యూకే నుంచి భారత్కు వచ్చిన మరో నలుగురికి బ్రిటన్ వేరియంట్ కరోనా సోకింది. దీంతో మొత్తం బ్రిటన్ వేరియంట్ పాజిటివ్ కేసుల సంఖ్య భారత్లో 33కు చేరింది. -
పాక్కు అమెరికా షాక్
► ఉగ్రపోరుపై అమెరికా సంతృప్తి చెందితేనే సైనిక సాయం ► ప్రతినిధుల సభలో 3 సవరణలకు ఆమోదం వాషింగ్టన్: పాకిస్తాన్కు సైనిక సాయం విషయంలో కఠినవైఖరి అవలంబించాలని అమెరికా చట్టసభ నిర్ణయించింది. ఆ మేరకు రక్షణ వ్యయాల బిల్లులో మూడు సవరణల్ని ప్రతినిధుల సభ ఆమోదించింది. ఉగ్రవాదంపై పాక్ పోరు సంతృప్తికరంగా ఉంటేనే నిధులు మంజూరు చేయాలని తాజా సవరణల్లో స్పష్టం చేశారు. 651 బిలియన్ డాలర్ల జాతీయ భద్రతా అధికార చట్టం(ఎన్డీఏఏ)– 2018 ఆమోదం సందర్భంగా ఈ సవరణల్ని ప్రతి పాదించారు. ఈ బిల్లును శుక్రవారం ప్రతినిధుల సభ 344–81 ఓట్ల తేడాతో ఆమోదించగా.. అది అమల్లోకి రావాలంటే ఆ దేశ రక్షణ మంత్రి ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఎన్డీఏఏ యాక్ట్ ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. తాజా సవరణల ప్రకారం ఉత్తర వజిరి స్థాన్లోని హక్కాని నెట్వర్క్పై పాక్ సైన్యం పోరా టం కొనసాగించకపోతే అమెరికా నుంచి వచ్చే 400 మిలియన్ డాలర్ల(దాదాపు రూ. 2,600 కోట్లు) సాయం నిలిపివేస్తారు. పాకిస్తాన్– అఫ్గాన్ సరిహద్దుల వెంబడి ఉగ్రవాదుల కదలికల నియంత్రణకు పాక్ కృషిచేయాలి. అక్టోబర్ 1, 2017– డిసెంబర్ 31, 2018 మధ్య కాలానికి ఈ సాయం వర్తిస్తుంది. బిల్లులో రెండు సవరణల్ని కాంగ్రెస్ సభ్యుడు దానా రోహ్రబచెర్, మరో సవరణను టెడ్ పోయ్ ప్రతిపాదించారు. అమెరికా ఉగ్రవాద జాబి తాలో చేర్చిన వారికి ఎలాంటి సైనిక, ఆర్థిక, ఇతర సాయాల్ని పాకిస్తాన్ అందించడం లేదని రక్షణ శాఖ ధ్రువీకరిస్తే తప్ప సాయం చేయరాదని సవరణలో పోయ్ పేర్కొన్నారు. తన సవరణ ఆమోదంతో అమెరికాను మోసగిస్తున్న పాక్ విషయంలో కాంగ్రెస్ ఒక అడుగు ముందుకు వేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక నుంచి ఇస్లామాబాద్కు సైనిక సాయం చేయాలంటే పాకిస్తాన్ పనితీరుపై పెంటగాన్ సంతృప్తి చెందాల్సి ఉంటుందన్నారు. భారత్–అమెరికా రక్షణ బంధం బలోపేతానికి ఆమోదం మరోవైపు ఈ బిల్లు ద్వారా భారత్ – అమెరికాల మధ్య రక్షణ రంగ సంబంధాలు బలపడను న్నాయి. భారత్తో రక్షణ సంబంధాలు బలోపేతం కోసం భారత–అమెరికన్ కాంగ్రెస్ నేత అమీ బెరా ప్రతిపాదించిన సవరణను ప్రతినిధుల సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ సవర ణను అమెరికా రక్షణ శాఖ మంత్రి ధ్రువీకరించాలి. ప్రపంచంలోనే అతిపురాతనమైన ప్రజాస్వామ్య దేశం అమెరికా, అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశం భారత్ల మధ్య రక్షణ సహకారం మరింత పెరిగేందుకు ఈ సవరణ ఎంతో సాయపడుతుం దని బెరా అభిప్రాయపడ్డారు. నిషేధంపై ‘సుప్రీం’కు వాషింగ్టన్: ఆరు ముస్లిం దేశాల పౌరులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జారీచేసిన ప్రయాణ నిషేధ ఉత్తర్వులను బలహీనపరిచేలా ఉన్న ఫెడరల్ జడ్జి ఆదేశాలను సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అమెరికాలో సన్నిహిత సంబంధీకులు ఉన్నవారు వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చని సదరు జడ్జి ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు హవాయ్ ఫెడరల్ జడ్జి ఆదేశాల రద్దు కోరుతూ ప్రభుత్వ న్యాయ విభాగం సుప్రీంకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలుచేసింది. సుప్రీంకోర్టు ప్రస్తుతం సెలవుల్లో ఉన్నా అత్యవసర కేసుల విచారణను చేపడుతుంది. అమెరికాలో నివసిస్తున్న వారి అమ్మమ్మ, నానమ్మ , తాతయ్య, మనవడు, మనవరాలు, మరదలు, బాబాయ్, పిన్ని, మేనల్లుడు, మేనకోడలు, కజిన్లపై ప్రయాణ నిషేధ ఉత్తర్వులు అమలుచేయొద్దని జడ్జి డెర్రిక్ వాట్సన్ గత వారం ఆదేశించారు. అమెరికా పునరావాస ఏజెన్సీల నుంచి హామీ పొందిన శరణార్థులను కూడా దేశంలోకి అనుమతించాలని కోరారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement