-
కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక
-
మందులు కాదు.. రంగు బిళ్ళలే!
రాష్ట్రంలోని ఔషధాల్లో నాసిరకం ఉత్పత్తులు : 21% అన్ని రాష్ట్రాల్లో కలిపి నాణ్యతా పరీక్షలు చేసిన ఔషధాల నమూనాలు : 8,286 దేశవ్యాప్తంగా సగటున నాణ్యత లేని ఔషధాలు : 11% - 66 కంపెనీలకు చెందిన 946 రకాల మందులు నాసిరకం - కేంద్ర ప్రభుత్వ నివేదికలో వెల్లడి సాక్షి, హైదరాబాద్: జ్వరం దగ్గరి నుంచి తీవ్ర స్థాయి వ్యాధుల దాకా మనం నమ్ముకునేది ఔషధాలనే.. కానీ ఆ నమ్మకాన్ని ఔషధాల కంపెనీలు వమ్ము చేస్తున్నాయి. నాసిరకం మందులు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నాయి. మన రాష్ట్రంలో అయితే ఏకంగా 21 శాతం నాసిరకం మందులే సరఫరా అవుతున్నాయి. సాక్షాత్తు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేకంగా నిర్వహించిన సర్వేలోనే ఈ విస్తుగొలిపే అంశాలు వెల్లడయ్యాయి. అసలు దేశంలో ఔషధాల తయారీకి కేంద్రంగా భావించే హైదరాబాద్లోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉండటం గమనార్హం. ఎన్డీఎస్ పేరుతో.. మార్కెట్లో నాసిరకం ఔషధాలు పెరిగిపోతున్నాయన్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గతేడాది జూలైలో ప్రత్యేకంగా ‘నేషనల్ డ్రగ్ సర్వే (ఎన్డీఎస్)’పేరుతో ఓ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 8,286 ఔషధాల నమూనాల (శాంపిల్స్)ను సేకరించింది. వాటిని కంపెనీలు, బ్యాచ్ల వారీగా జాబితాలు రూపొందించి కోల్కతాలోని జాతీయ డ్రగ్ లేబొరేటరీలో నాణ్యతా పరీక్షలు చేయించింది. నాసిరకంగా తేలిన ఉత్పత్తులు, కంపెనీలతో జాబితాను రూపొందించింది. ఇందులో 66 కంపెనీలకు చెందిన 946 రకాల మందులు నాసిరకంగా ఉన్నట్లు నిర్ధారించింది. ఈ ఫలితాల్లో ఏకంగా 11.41 శాతం ఔషధాలు నాసిరకంగా తేలాయని, ఇది ఆందోళనకరమని స్పష్టం చేసింది. రాష్ట్రంలో అత్యధికంగా.. నాసిరకం ఔషధాల్లో ఎక్కువ శాతం తెలంగాణలో సరఫరా అవుతున్నవే ఉన్నాయని ఎన్డీఎస్ సర్వే నివేదిక పేర్కొంది. ఇక్కడ సేకరించిన ఔషధాల్లోనే అత్యధికంగా 21 శాతం నాసిరకం ఉత్పత్తులను గుర్తించినట్లు తెలిపింది. ఔషధాల నాణ్యత నియంత్రణ పరిస్థితి అధ్వానంగా ఉండటం వల్లే రాష్ట్రంలో ఈ దుస్థితి నెలకొందని వైద్య వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన కంపెనీల్లో తయారయ్యే ఔషధాలకు సంబంధించి ముందస్తు నాణ్యత పరీక్షల పర్యవేక్షణ ఉండటం లేదని పేర్కొంటున్నాయి. ఔషధ నాణ్యత నియంత్రణ విభాగం పనితీరు మెరుగుపడితేనే ప్రజలకు నాణ్యమైన ఔషధాలు అందుతాయని స్పష్టం చేస్తున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement