-
మీ ప్రోత్సాహం మరువలేను
సాక్షి ప్రతినిధి, కడప: పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి కోసం అలుపెరగకుండా శ్రమిస్తూ ప్రజలకు సహకారం అందిస్తున్న వేముల మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా వైఎస్సార్ జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం ఉదయం ఇడుపులపాయ ఆర్కే వ్యాలీలో రూ.1.75 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్, రూ.2.75 కోట్లతో నిర్మించిన జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు. అనంతరం నెమళ్ల పార్కు వద్ద వైఎస్ ఫ్యామిలీ ప్రేయర్ హాలు ప్రాంగణంలో వేముల మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. స్థానికులు, స్నేహితులు, సన్నిహితులను ఒకేచోట కలుసుకున్న సీఎం జగన్ వారిని పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు. వైఎస్సార్ హఠాన్మరణం అనంతరం మీరంతా అందించిన ప్రోత్సాహం, సహకారం, మనోధైర్యంతో ఈరోజు సీఎంగా అందరి మేలు కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. పులివెందుల నియోజకవర్గం, వేముల మండలంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఈ సందర్భంగా చర్చించారు. ‘పాడా’ అభివృద్ధిని వివరించిన కలెక్టర్ పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో అభివృద్ధి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి జగన్కు కలెక్టర్ వి.విజయరామరాజు వివరించారు. వేముల మండల పరిధిలో పాడా, ఇతర శాఖల ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై పాడా ఓఎస్డీ అనిల్కుమార్రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియచేశారు. మండలంలో చేపట్టాల్సిన మరిన్ని అభివృద్ధి పనులతోపాటు వివిధ అంశాలపై పలువురు నాయకులు వినతి పత్రాలను అందించి నేరుగా ముఖ్యమంత్రికి విన్నవించారు. పీబీసీ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్లో లైనింగ్ పనులు చేపట్టాలని వేముల మండల నాయకులు కోరారు. మైక్రో ఇరిగేషన్ పరిధిలో మంజూరైన 76 సంపులను త్వరితగతిన పూర్తి చేస్తే 15 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు దోహదం చేస్తుందని తెలిపారు. పెండ్లూరు చెరువు కాలువల ఆధునికీకరణతో మరో 11 వందల ఎకరాలు ఆయకట్టుకు నీరు అందుతుందన్నారు. గాలేరు–నగరి కెనాల్ నుంచి నారేపల్లి చెరువుకు నీటిని లిఫ్ట్ చేస్తే మరిన్ని ఎకరాలు సాగులోకి వస్తాయని తెలిపారు. ఇవన్నీ పూర్తయితే మెట్ట ప్రాంతంలో 60 శాతం భూమి సాగునీటి పరిధిలోకి వస్తుందని వివరించారు. వేముల సమీపంలో బెరైటీస్, లైమ్ స్టోన్, బెలుకు లాంటి ఖనిజాలున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకునేలా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తే స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని మరికొందరు విన్నవించారు. పత్తికి సీజనల్ క్రాప్ ఇన్సూరెన్స్ వర్తింప జేయాలని, రబీలో మినుములు, పెసర రైతులకు రాయితీలు కల్పించాలని కోరారు. ముఖ్యమంత్రికి ఘనంగా వీడ్కోలు రెండు రోజుల జిల్లా పర్యటన ముగించుకుని గన్నవరం వెళ్లేందుకు మధ్యాహ్నం కడప ఎయిర్పోర్టు చేరుకున్న సీఎం జగన్ దంపతులకు పలువురు ఘనంగా వీడ్కోలు పలికారు. డిప్యూటీ సీఎం అంజాద్బాషా, జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేశ్, డీఐజీ సెంథిల్కుమార్, కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, కడప మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్చంద్, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, కడప మేయర్ కె.సురేశ్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు దాసరి సుధా, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఆర్డీవో మధుసూదన్, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారుడు ఇరగంరెడ్డి తిరుపాల్రెడ్డి తదితరులు వీడ్కోలు పలికారు. భూ పరిహారంపై సమీక్షించండి యూసీఐఎల్ యాజమాన్యం రాచకుంటపల్లె, భూమయ్యగారిపల్లె, తుమ్మలపల్లె ప్రాంతాల పరిధిలో 250 ఎకరాలను తీసుకుని పరిహారం ఇవ్వలేదని, భూములు కోల్పోయినవారికి ఉద్యోగాలు ఇవ్వలేదని స్థానికులు సీఎం జగన్ దృష్టికి తేవడంతో తక్షణమే స్పందించారు. దీనిపై సీఎస్ జవహర్రెడ్డి నేతృత్వంలో సమీక్ష నిర్వహించాలని తన వ్యక్తిగత కార్యదర్శి ధనుంజయరెడ్డిని ఆదేశించారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డితో పాటు ఆయా గ్రామాల రైతులను కూడా సమావేశానికి ఆహా్వనించి సమీక్ష నిర్వహించాలని సూచించారు. కార్యక్రమం చివరలో ఈ నెల 14వతేదీ నుంచి 20 వరకు జరిగే 56వ గ్రంథాలయ వారోత్సవాల పోస్టర్ను ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదల చేశారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్బాషా, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేశ్, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ లింగాల ఉషారాణి, వేముల జడ్పీటీసీ కేవీ బయపురెడ్డి, మండల ఇన్చార్జి నాగెళ్ల సాంబశివారెడ్డి, వేముల మాజీ మండల ఉపాధ్యక్షుడు లింగాల రామలింగారెడ్డి, పొల్యూషన్ బోర్డు మెంబర్ మరకా శివకృష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ మోరంరెడ్డి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులకు అండగా నిలుస్తాం వేముల మండల నాయకులు ప్రస్తావించిన అంశాలను సావధానంగా ఆలకించిన సీఎం జగన్ వీటిపై స్పందిస్తూ గత సర్కారు హయాంలో రైతుల ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్పై అతి తక్కువ ఖర్చు చేశారని, మన ప్రభుత్వం వచ్చాక నాలుగున్నరేళ్లలో రూ.7,800 కోట్లు వ్యయం చేశామని గుర్తు చేశారు. వేముల పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు, రైతుల సమస్యలను పూర్తి వివరాలతో స్వీకరించాలని, పరిష్కార మార్గాలు సంతృప్తి కలిగించాయో లేదో నిర్ధారించుకొని ముందుకు సాగాలని అధికార యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు. వారికి అందాల్సిన పరిహారం ప్రక్రియ నాలుగు నెలల్లో పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. గ్రామ లోగిళ్లలోనే సచివాలయాల ద్వారా ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను సంతృప్తికరంగా ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు. వ్యవస్థ సక్రమంగా నడవాలంటే ఎక్కడా వివక్షకు తావివ్వకూడదని సూచించారు. పరిపాలన పారదర్శకంగా సాగినపుడే వ్యవస్థ పటిష్టంగా సాగుతుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అలుపెరుగకుండా శ్రమిస్తున్న పార్టీ నాయకులు, అధికారులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. -
35 ఏళ్ల తర్వాత హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పునర్వవస్థీకరణ
-
కొత్త పోలీస్స్టేషన్లకు గ్రీన్సిగ్నల్
సాక్షి, ముంబై: రాష్ట్రంలో పెరుగుతున్న వలసలు, జనాభాను దృష్టిలో ఉంచుకుని అదనంగా 120 కొత్త పోలీసులు స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో 64 పోలీసు స్టేషన్ల ఏర్పాటుకు ఇప్పటికే స్థలాలను కూడా ఎంపిక చేసింది. మిగతా వాటి కోసం అధ్యయనం చేస్తున్నారు. నివేదిక రాగానే పోలీసుస్టేషన్ల ఏర్పాటు కార్యక్రమాలు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో పారిశ్రామిక వాడలు పెరిగిపోయాయి. నగరాలు, పట్టణాలు విస్తరించాయి. దీంతో ఉపాధి నిమిత్తం వచ్చే వలస ప్రజల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. పెరిగిన జనాభాను బట్టి శాంతి, భద్రతలు అదుపులో ఉంచడం పోలీసు బలగాలకు ఇబ్బందికరంగా మారింది. రాష్ట్రంలో 10 పోలీసు కమిషనరేట్ కార్యాలయాలు ఉండగా, 35 మంది జిల్లా సూపరింటెండెంట్లు ఉన్నారు. వీరి ఆధీనంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,90,035 మంది పోలీసులు, 19 వేల మంది పోలీసు అధికారులు ఉన్నారు. పెరిగిన జనాభా కారణంగా పోలీసులపై అదనపు పని భారం పడుతోంది. ఈ భారాన్ని తగ్గించేందుకు రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో 61 వేల పోలీసు పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం మంజూరునిచ్చింది. మొదటి దశలో 13 వేల పోస్టులను భర్తీ చేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఒకపక్క కొత్త పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండగానే మరోపక్క పరిధి ఎక్కువగా ఉన్న పోలీసు స్టేషన్లను విడగొట్టి అక్కడ కొత్త పోలీసుస్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఇలా ఐదేళ్ల కాలంలో అదనంగా 120 కొత్త పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి వినీత్ అగర్వాల్ చెప్పారు. పోలీసు స్టేషన్ల సంఖ్య పెంచడంవల్ల నేరాలు అదుపులోకి వస్తాయి. అదేవిధంగా పోలీసు స్టేషన్లు సమీపంలో ఉండడంవల్ల అన్ని రకాల నేరాల నమోదు సంఖ్య పెరుగుతుంది. ఐదేళ్ల కాలంలో పోలీసులు, పోలీసు అధికారుల సంఖ్య 2.70 లక్షలకుపైగా చేరుకుంటుంది. దీంతో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో అత్యధిక శాతం పోలీసు బలగాలున్నట్లు రికార్డు నమోదు కానుందని అగర్వాల్ అన్నారు. కొత్త పోలీసులు విధుల్లోకి రావడంవల్ల అదనపు పని వేళలు తగ్గి పోలీసులకు పని ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో పోలీసులు నేరాలు అదుపుచేయడంలో సఫలీకృతులవుతారని అగర్వాల్ అభిప్రాయపడ్డారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కూటమి చర్యలు అనైతికం
నేడు సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ఇలా..
14 నుంచి తిరుపతి గంగజాతర
ప్రజలకు ఏమి చేశారో చెప్పలేదు పవన్!
ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
● చిత్తూరు నియోజకవర్గంలో యథేచ్ఛగా భూకబ్జాలు ● సుమారు 250 ఎకరాలకు పైగా స్వాహా ● ఇప్పుడు తిరుపతిలో అక్రమాలకు సన్నాహాలు ● రూ.కోట్లు కూడబెట్టుకోవడమే అజెండా ● ఇద్దరు విశ్రాంత అధికారులతో పకడ్బందీ ప్రణాళిక ● తిరునగరిని దోచుకోవడమే లక్ష్యంగా అడుగులు
No Headline
పాలిసెట్ ఫలితాల్లో విశ్వం విజయకేతనం
ఫ్యాను హోరు
No Headline
తప్పక చదవండి
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement