-
మురిసే మురిసే... తెర మెరిసే
2023 సిల్వర్ స్క్రీన్ మురిసేలా చేసింది. మరి.. పదికి పైగా కొత్త తారలు తెరపై మెరిస్తే మురిసిపోవడం సహజం కదా. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ.. ఇలా పలు భాషలకు చెందిన కొత్తమ్మాయిలు ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ కథానాయికల గురించి తెలుసుకుందాం. ► ‘ది సాఫ్ట్వేర్ డెవలప్పర్స్’ (2020) వెబ్ సిరీస్తో నటిగా కెరీర్ను డెవలప్ చేశారు యంగ్ బ్యూటీ వైష్ణవీ చైతన్య. అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో’, నాని ‘టక్ జగదీష్’, అజిత్ ‘వలిమై’ వంటి సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసే అవకాశాలు వచ్చినప్పుడు, అవి తన కెరీర్కు సపోర్ట్ చేస్తాయని నమ్మి, ఆ పాత్రల్లో నటించారు వైష్ణవి. ఆ నమ్మకమే ఆమెను హీరోయిన్ని చేసింది. లీడ్ హీరోయిన్గా ‘బేబీ’ సినిమా చేశారు వైష్ణవి. ఈ సినిమాలో ఎంత బాగా నటించారంటే.. ఇప్పుడు ‘బేబీ’ అంటే దాదాపు కుర్రకారు అంతా టక్కున వైష్ణవీ చైతన్య పేరునే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇక ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ ‘బేబీ’ సినిమాకు సాయి రాజేశ్ దర్శకత్వం వహించగా, ఎస్కేఎన్ నిర్మించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. వైష్ణవీ చైతన్య కెరీర్ కూడా బ్లాక్ బస్టర్ అనేలా మారింది. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ, ఆనంద్ దేవరకొండ హీరోలుగా నటిస్తున్న చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తూ బిజీగా ఉన్నారీ సిల్వర్ స్క్రీన్ బేబీ. మామూలుగా తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావని అంటుంటారు. కానీ వరుస సినిమాలతో జోష్గా ఉన్నారు వైష్ణవీ చైతన్య. ► ఈ ఏడాది సూపర్ హిట్గా నిలిచిన తెలుగు సినిమాల్లో ‘సామజ వరగమన’ ఒకటి. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మలయాళ బ్యూటీ రెబా మోనికా జాన్. సాయిధరమ్ తేజ్ ఓ హీరోగా నటించిన ‘బ్రో’ సినిమా లుక్ టెస్ట్కు వచ్చిన రెబా మోనికాకి ఆ అవకాశం దక్కలేదు. అదే టైమ్లో ‘సామజ వరగమన’ నిర్మాత రాజేశ్ దండాను కలవడం, ఆయన ద్వారా రెబాకి చిత్రదర్శకుడు రామ్ అబ్బరాజు కథ వినిపించడం, ఆమె ఓకే అనడం, ఈ సినిమా హిట్ కావడం అన్నీ చకా చకా జరిగిపోయాయి. నిజానికి ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీ విష్ణుతో అంతకు ముందే ఓ సినిమా చేయాల్సిందట రెబా. కానీ ఆ చాన్స్ చేజారినప్పటికీ ఫైనల్గా శ్రీవిష్ణు ‘సామజ వరగమన’ ద్వారానే టాలీవుడ్కి వచ్చారు రెబా. ► తెలుగు తెరపై ఈ ఏడాది మెరిసిన హరియాణా బ్యూటీ యుక్తీ తరేజ. ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత మోడల్గా కెరీర్ను ఆరంభించారు. 2019లో సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్ పోటీల్లో పాల్గొని నాలుగో స్థానంలో నిలిచి, అందరి చూపూ తనవైపు తిప్పుకున్నారు యుక్తి. ఆ తర్వాత ఇమ్రాన్ హష్మితో కలిసి ఈ బ్యూటీ చేసిన ‘లుట్ గయే..’ సాంగ్ ఇంటర్నెట్లో సంచలనమైంది. అంతే.. వెండితెర అవకాశాలు వచ్చాయి. అలా ‘రంగబలి’ సినిమాతో తెలుగు తెరపై మెరిశారు యుక్తీ తరేజ. తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. నాగశౌర్య హీరోగా పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ‘రంగ బలి’ చిత్రాన్ని నిర్మించారు. ► కేరళలో పుట్టి, తమిళనాడులో పెరిగిన అమ్మాయి ఐశ్వర్యా మీనన్. తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో పలు సినిమాలు చేసిన ఐశ్వర్య యాక్షన్ ఫిల్మ్ ‘స్పై’తో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో చాలా బోల్డ్గా కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు కూడా చేశారు ఐశ్వర్యా మీనన్. ఈ చిత్రంలో నిఖిల్ హీరోగా నటించారు. రానా అతిథి పాత్ర చేశారు. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో కె. రాజశేఖరరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ► రెండు చిత్రాలతో ఈ ఏడాది తెరపై మెరిశారు సాక్షీ వైద్య. ఈ ముంబై మోడల్ నాయికగా టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘ఏజెంట్’. అఖిల్ హీరోగా నటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించిన చిత్రం ఇది. అలాగే సాక్షీ వైద్య హీరోయిన్గా నటించిన మరో తెలుగు చిత్రం ‘గాంఢీవదారి అర్జున’ కూడా ఈ ఏడాదే రిలీజైంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు.వీరే కాదు.. కిరణ్ అబ్బవరం ‘మీటర్’ సినిమాతో తమిళ హీరోయిన్ అతుల్యా రవి, దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయమైన ‘అహింస’తో మధ్యప్రదేశ్ అమ్మాయి గీతికా తివారి, బెల్లంకొండ గణేశ్ ‘నేను స్టూడెంట్ సర్!’తో అలనాటి తార భాగ్య శ్రీ తనయ అవంతికలతో పాటు మరికొందరు హీరోయిన్లు ఈ ఏడాది తెలుగు తెరపై మెరిశారు. నూపుర్ సనన్ గాయత్రీ భరద్వాజ్ ► మ్యూజిక్ వీడియోల్లో అక్షయ్ కుమార్ సరసన నటించి, బాలీవుడ్ను ఆకట్టుకున్నారు నూపుర్ సనన్. అయితే హీరోయిన్గా తొలి సినిమాను మాత్రం తెలుగులో చేశారు. రవితేజ టైటిల్ రోల్ చేసిన ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో నూపుర్ సనన్ ఓ హీరోయిన్గా నటించారు. అలాగే ఈ చిత్రంలో మరో హీరోయిన్గా నటించిన ఢిల్లీ అమ్మాయి గాయత్రీ భరద్వాజ్కు సైతం తెలుగులో తొలి సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. అన్నట్లు మరో మాట.. మహేశ్బాబు, నాగచైతన్య, ప్రభాస్లతో సినిమాలు చేసిన హీరోయిన్ కృతీ సనన్ సోదరే నూపుర్ సనన్. ► బాల నటిగా, ఆ తర్వాత సహ నటిగా తమిళ, మలయాళం భాషల్లో సినిమాలు చేశారు అనిఖా సురేంద్రన్. గత ఏడాది విడుదలైన నాగార్జున ‘ది ఘెస్ట్’ చిత్రంలోనూ ఓ సపోర్టింగ్ రోల్ చేశారు. బాల నటిగా పేరు తెచ్చుకున్న అనిఖా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైన సినిమా ‘బుట్టబోమ్మ’. అర్జున్ దాస్, సూర్య వశిష్ట ఇతర లీడ్ రోల్స్ చేశారు. మలయాళ హిట్ ఫిల్మ్ ‘కప్పెలా’కు తెలుగు రీమేక్గా రూపొందిన ఈ సినిమాకు చంద్రశేఖర్ టి. రమేశ్ దర్శకత్వం వహించగా, సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ► కన్నడ పరిశ్రమలో హీరోయిన్గా నిరూపించుకున్న ఆషికా రంగనాథ్ ‘అమిగోస్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఈ శాండిల్వుడ్ బ్యూటీ నటనకు ఆడియన్స్ ఓకే అన్నారు. ఆషికా కూడా తెలుగులో మరో అవకాశం తెచ్చుకోగలిగారు. ప్రస్తుతం నాగార్జున హీరోగా నటిస్తున్న ‘నా సామి రంగ’లో ఆషిక ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక కల్యాణ్రామ్ హీరోగా రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్∙‘అమిగోస్’ చిత్రాన్ని నిర్మించారు. ► బుల్లితెర నుంచి తమిళ వెండి తెరపై దర్శనమిచ్చి సక్సెస్ ట్రాక్లో కొనసాగుతున్న వారిలో ప్రియా భవానీ శంకర్ ఒకరు. తమిళంలో ఫుల్ ఫామ్లో ఉన్న ఈ బ్యూటీ ‘కళ్యాణం కమనీయం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. సంతోష్ శోభన్ హీరోగా అనిల్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ నిర్మించింది. జనవరిలో సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం విడుదలైంది. ఆ తర్వాత తెలుగులో ఒకట్రెండు సినిమాలు సైన్ చేశారు ప్రియా భవానీ శంకర్. -
కొత్త నటీనటులతో దండనై దూరమిల్లై
నూతన తారలు నటిస్తున్న చిత్రం దండనై దూరమిల్లై. నవ నటుడు ఎడిన్ హీరోగా పరిచయం అవుతూ రోడ్షో ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై సొంతంగా నిర్మిస్తున్న చిత్రం దండనై దూరమిల్లై. ప్రగతి నాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో నిర్మల్, తామరై సెల్వన్, సుభాష్ మణికంళన్, ప్రియాంక, షర్మిళ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీంతోపాటు ఈ చిత్రానికి దర్శకత్వం, కూర్పు బాధ్యతలను సద్దాం హుస్సేన్ నిర్వహిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఐదుగురు యువకులు వాటి నుంచి బయట పడడానికి పని వెతుక్కుంటూ మలేషియా వెళతారన్నారు. అయితే అక్కడ అనుకోకుండా ఒక ముఠా చేతిలో చిక్కుకుని పలు కష్టాలు పడతారని.. వాటి నుంచి వారు బయట పడ్డారా? లేదా? అన్నది అత్యంత సహజత్వంతోనూ, అదే సమయంలో ఉత్కంఠభరితంగానూ తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. చిత్ర నేపథ్యం చాలా కొత్తగానూ, కథ, కథనాలు ఆసక్తిగానూ ఉంటాయని చెప్పారు. దండనై దూరమిల్లై చిత్రం ప్రేక్షకులు కచ్చితంగా కొత్త అనుభూతిని కలిగిస్తుందనే నమ్మకాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement