-
వెబ్ 3.0 అంటే ఏమిటి? వాళ్లకు ఎందుకంత కళ్లమంట?
Elon Musk Jack Dorsey Hates Web 3.0: web3.. మనలో చాలామందికి ఈ పదం తెలిసి ఉండకపోవచ్చు. కానీ, రాబోయే రోజులు మాత్రం వెబ్3 గురించి పదే పదే వినాల్సి రావడం ఖాయం. ఎందుకంటే.. ఇది ఇంటర్నెట్లో ఓ తరం కాబట్టి. అయితే దీనిపై కొందరు టెక్ మేధావులకు తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకు కారణాలేంటో తెలుసుకునే ముందు.. అసలు వెబ్3 అంటే ఏంటో చూద్దాం. టిమ్ బెర్నర్స్ లీ 1989లో వరల్డ్ వైడ్ వెబ్ను లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిని ‘వెబ్ 1’గా పరిగణనలోకి తీసుకోకపోయినా.. జనాల్ని ఆన్లైన్లోని వెళ్లేలా చేసింది మాత్రం ఇదే. కానీ, ఆ తర్వాతి తరంలో వచ్చిన ఇంటర్నెట్కు వెబ్ 2.0 అనే పేరు అధికారికంగా వచ్చింది. 1999 నుంచి ఇది అనేక రకాలుగా యావత్ ప్రపంచం విస్తరించి కోట్ల మందిని ఇంటర్నెట్ బ్రౌజింగ్కు దగ్గర చేసింది. ఇక మూడో తరం ఇంటర్నెట్ పేరే ‘వెబ్ 3.0’. దీనికి బీజం పడింది 2014లోనే!. నో డామినేషన్ 2014లో బ్రిటన్ కంప్యూటర్ సైంటిస్ట్ గావిన్ వుడ్ ‘ఎథెరియం’(క్రిప్టోకరెన్సీ) రూపొందించాడు. ఎథెరియం ప్రకారం.. ఇంటర్నెట్ను వికేంద్రీకరించడమే 3.0 ఉద్దేశం. అంటే.. బ్లాక్చెయిన్ ఆధారంగా ఇంటర్నెట్ను డీసెంట్రలైజ్డ్ చేయడం. తద్వారా గూగుల్, ఫేస్బుక్లాంటి దిగ్గజాల ఆధిపత్యం ఇంటర్నెట్లో నడవదు. ఇంటర్నెట్ యూజర్ కాస్త యజమాని అవుతాడు. ఇందులో భాగంగానే ప్రతీదానికి బ్లాక్చెయిన్స్తో ముడిపడి ఈ తరం ఇంటర్నెట్ నడుస్తోంది. టైం పట్టొచ్చు వెబ్3.0లో ఎలాంటి సేవలు వినియోగించుకోవాలన్నా.. ఎవరి అనుమతులు అక్కర్లేదు. ఎవరూ బ్లాక్ చెయ్యరు. సేవల్ని వినియోగించుకోవడానికి తిరస్కరించరు. టోకెన్స్, క్రిప్టోకరెన్సీల ఆధారంగా చెల్లింపులు చేసే వెసులుబాటు ఉంటుంది. ఒకరకంగా వెబ్ 3.0 వల్లే క్రిప్టో కరెన్సీ, ఎన్ఎఫ్టీలు చాలా ఏళ్ల క్రితమే వాడుకలోకి రాగలిగాయన్నమాట. అయితే ఇది ఇంటర్నెట్ను చూసే తీరును మార్చేస్తుందా? అంటే అవుననే చెప్పొచ్చు. కానీ, అందుకు చాలా టైం పట్టే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే అది ఎక్కువ మందికి రీచ్ కావాలి కాబట్టి అని చెప్తున్నారు. ఎందుకు మెచ్చట్లేదు థర్డ్ జనరేషన్.. ఈ పదం వినడానికే టెక్ దిగ్గజాలు ఇష్టపడడం లేదు. వినడానికే దరిద్రంగా ఉందంటూ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఇంతకు ముందు కామెంట్ చేశాడు. తాజాగా ‘ఎవరైనా చూశారా? నాకైతే కనిపించలేదు. జస్ట్ అదొక మార్కెటింగ్ బజ్వర్డ్’ అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఇక ట్విటర్ మాజీ సీఈవో జాక్ డోర్సే ‘ఇంటర్నెట్ అనేది వెంచర్ క్యాపిటలిస్ట్లకు మాత్రమే సొంతమని, జనాలు దానిని పొందలేర’ని సోమవారం ట్వీట్ చేశాడు. వీళ్లిద్దరిదే కాదు యాపిల్ సీఈవో టిమ్ కుక్ సహా చాలామంది అభిప్రాయమూ ఇదే. ఈ తరహా ఇంటర్నెట్ను సాధారణ పౌరులు ఉపయోగించడం కష్టమని, కాబట్టి, ఇదొక విఫలయత్నంగా అభివర్ణిస్తున్నారు. అయితే థర్డ్జనరేషన్ ఇంటర్నెట్ ద్వారా యూజర్ సులువుగా బిలియనీర్ అయిపోవచ్చు. విపరీతంగా సంపాదించొచ్చు. రిస్క్ రేటు తక్కువే. ఈ కారణం చేతనే కుళ్లుకుంటున్నారని వాదించేవాళ్లు లేకపోలేదు. ఇక 90లో ఫోన్ల రాక సమయంలోనూ ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం అయ్యింది. కట్ చేస్తే.. పరిస్థితి ఏంటో తెలిసిందే కదా. అలా థర్డ్ జనరేషన్ ఇంటర్నెట్ కూడా సక్సెస్ అయ్యి తీరుతుందని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: భార్య చేసిన తప్పు.. వేల కోట్లు చెత్తపాలు! -
ఆంధ్రా బ్యాంక్ నవతరం బ్రాంచ్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ ఆంధ్రాబ్యాంక్ ఏర్పడి 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా 90 నవతరం(నెక్స్ట్ జనరేషన్) శాఖలను ప్రారంభించింది. బుధవారం సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆంధ్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు కె.కె.మిశ్రా, ఎస్.కె.కల్రా లాంఛనంగా ప్రారంభించారు. ఉద్యోగుల సహాయం లేకుండానే రోజులో 24 గంటలు సాధారణ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకునేటట్లు ఈ నెక్స్ట్ జనరేషన్ శాఖలను ఏర్పాటు చేశారు. ప్రధానమైన పట్టణాల్లోని కొన్ని శాఖల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలోని ఆటోమేటిక్ మెషిన్స్ ద్వారా నగదు డిపాజిట్, విత్డ్రా, అకౌంట్ స్టేట్మెంట్ వంటి లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఈ సంవత్సరం ఉగాది నాడు ప్రయోగాత్మకంగా హైదరాబాద్లో ప్రారంభించిన ఈ శాఖలకు ఆదరణ బాగుండటంతో వీటిని విస్తరిస్తున్నట్లు కల్రా తెలిపారు. సొంతంగా లావాదేవీలు నిర్వహించే వారికి సహాయ పడే విధంగా ఫ్లోర్ మేనేజర్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి నెక్స్ట్ జనరేషన్ శాఖల సంఖ్యను 250కి పెంచనున్నట్లు కల్రా తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
రాహుల్గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చల్లని కబురు
అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement