-
సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ పబ్లిక్ ఇష్యూ..33 రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్!
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్, డిజైన్ కంపెనీ సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. ఇష్యూ చివరి రోజు గురువారాని(18)కల్లా దాదాపు 33 రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్ లభించింది. ఐపీవోలో భాగంగా 2,85,63,816 షేర్లను విక్రయానికి ఉంచగా.. 93 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు వెల్తువెత్తాయి. వెరసి షేరుకి రూ. 209–220 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 840 కోట్లు సమకూర్చుకుంది. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) నుంచి 87.6 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 17.5 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో సైతం 5.5 రెట్లు ఎక్కువగా దరఖాస్తులు లభించాయి. ఇష్యూలో భాగంగా రూ. 766 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుండగా.. మరో 33.7 లక్షల షేర్లను వాటాదారులు ఆఫర్ చేశారు. ఇష్యూ ముందు రోజు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 252 కోట్లు సమీకరించింది. ఇష్యూ ద్వారా కంపెనీ రెండున్నర నెలల తదుపరి తిరిగి ప్రైమరీ మార్కెట్కు జోష్ను తీసుకువచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇంతక్రితం అంటే మే 24–26 మధ్య ఏథెర్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూ చేపట్టిన విషయం విదితమే. ఐపీవోకు డ్రీమ్ఫోక్స్ సర్వీసెస్ రెడీ న్యూఢిల్లీ: విమానాశ్రయ సర్వీసుల అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ డ్రీమ్ఫోక్స్ సర్వీసెస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ నెల(ఆగస్ట్) 24న ప్రారంభంకానున్న ఇష్యూ 26న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 23న షేర్లను విక్రయించనుంది. ఐపీవోలో భాగంగా 1.72 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఇవి ఇష్యూ తదుపరి చెల్లించిన మూలధనంలో 33 శాతం వాటాకు సమానం. యూనిఫైడ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ద్వారా ప్రయాణికులకు విమానాశ్రయ సౌకర్యాలను పొందేందుకు డ్రీమ్ఫోక్స్ వీలు కల్పిస్తుంది. ఎయిర్పోర్ట్ లాంజ్లు, ఆహారం, పానీయాలు, స్పా, ట్రాన్సిట్ హోటళ్లు తదితర పలు సర్వీసులను పొందేందుకు వినియోగదారులకు కంపెనీ వీలు కల్పిస్తుంది. -
Army Day 2022: ఇండియన్ ఆర్మీ కొత్త యూనిఫాం ఇదే!
న్యూఢిల్లీ: మన ఆర్మీ యూనీఫాం మారబోతోంది. సౌకర్యవంతమైన, వాతావరణ అనుకూలమైన, డిజిటల్ డిస్రప్టీవ్ ప్యాట్రన్లో కొత్త యూనీఫాంను ఇండియన్ ఆర్మీ శనివారం ఆవిష్కరించింది. కొత్త యూనీఫాంలను ధరించిన ప్యారాచూట్ సైనిక దళం నిన్న (శనివారం) ఆర్మీ డే పరేడ్లో పాల్గొన్నారు. భారత ఆర్మీ కొత్త యూనీఫాం రూపురేఖల విశేషాలు ఇవే.. ►ఆలివ్, మట్టి రంగులతో సహా వివిధ రంగుల సమ్మేళనంతో రూపొందించిన కొత్త యూనిఫాం, దళాల వ్యూహరచన ప్రాంతాలు, వివిధ వాతావరణ పరిస్థితులు వంటి అంశాల దృష్ట్యా రూపొందించడం జరిగింది. ►నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీతో కలిసి వివిధ దేశాల ఆర్మీల యూనిఫాంలను విశ్లేషించిన అనంతరం కొత్త యూనిఫాంలను రూపొందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ►ఈ యూనిఫాం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని, అన్ని రకాల వాతావరణాల్లో ధరించవచ్చని తెలిపారు. కంప్యూటర్ సహాయంతో డిజిటల్ డిస్రప్టివ్ ప్యాటర్న్లో ప్రత్యేకంగా రూపొందించారు. ►కొత్త యూనిఫాంలోని షర్టును, ట్రౌజర్లో టక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఇకపై మన ఆర్మీ డ్రెస్ ఇన్షర్ట్ లేకుండా ఉండబోతుందన్నమాట. ►కొత్త ఆర్మీ యూనిఫామ్లు బహిరంగ మార్కెట్లో అందుబాటులో ఉండవని సంబంధిత వర్గాలు తెలిపాయి. #WATCH | Delhi: Indian Army’s Parachute Regiment commandos marching during the Army Day Parade in the new digital combat uniform of the Indian Army. This is the first time that the uniform has been unveiled in public. pic.twitter.com/j9D18kNP8B — ANI (@ANI) January 15, 2022 -
స్ఫూర్తి మినియేచర్ సృష్టి... మది దోచే మట్టి రూపాలు
చిట్టి పలకా బలపం చిన్నారి చదువుకునే బడి పుస్తకం నోరూరించే నూడుల్స్, పిజ్జా... ఇడ్లీ, దోసె, మిర్చిబజ్జీ అందమైన పూల మొక్కలు.. ఆకట్టుకునే ముఖచిత్రాలు నూటొక్క పూవుల బతుకమ్మ.. నిదురించే చంటిబిడ్డ పూలవనాలు, పండ్ల రాశులు అన్నీ మట్టి రూపాలే.. మనసుదోచే కళారూపాలే! పార్వతి చేతుల్లో ప్రాణం పోసుకున్న పిండిబొమ్మల్లే స్ఫూర్తి చేతుల్లో వెలుగొందుతున్నాయి మట్టి బొమ్మలు ఆమె కళారూపాలు గ్రామ సరిహద్దులను దాటి విదేశీ గడ్డపైనా ముచ్చటగా మెరిసిపోతున్నాయి. తెలంగాణలోని కామారెడ్డి వాసి అయిన స్ఫూర్తి మినియేచర్ సృష్టి... ముచ్చట ఇది.. క్లేతో ఆమె తయారు చేస్తున్న మినియేచర్స్కు దేశ విదేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. కొనుగోలు చేస్తున్నవారు ఆనందం పొందుతుండగా, తయారు చేసి విక్రయించడం ద్వారా ఆమె ఉపాధి పొందుతోంది. కామారెడ్డి పట్టణంలోని కాకతీయనగర్ కాలనీకి చెందిన శ్రీరాం, గంగల కూతురు స్ఫూర్తి దానబోయిన. చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) లో ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ యాక్ససరీస్ విభాగంలో డిగ్రీ పూర్తిచేసింది. కొంత కాలం పోచంపల్లిలో లెదర్ కంపెనీలో హ్యాండ్ బ్యాగ్స్ తయారీలో, అలాగే కోల్కతాలో ఆరు నెలలపాటు ఉద్యోగం చేసింది. విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని ప్రయత్నించింది. అయితే ఆ సమయంలోనే ప్రపంచమంతటా కరోనా మహమ్మారి కమ్ముకోవడంతో పీజీ ఆలోచనను వాయిదా వేసుకుని ఇంటి దగ్గరే ఉండిపోయింది. ఈ సమయంలో క్లేతో మినియేచర్స్ తయారు చేయడం మొదలుపెట్టింది. అలా తయారు చేసిన వస్తువులను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడంతో చాలా మంది అవి తమకు నచ్చాయని, తమకు కూడా కావాలంటూ ఫోన్లు చేయడం, మెసేజ్లు పెట్టడం మొదలై ఇప్పుడు వందలాది ఆర్డర్లు వస్తున్నాయి. గడచిన రెండేళ్లుగా స్ఫూర్తి దాదాపు రూ.3 లక్షల విలువైన ఆర్డర్లు తీసుకుంది. రాత్రింబగళ్లూ క్లేతో వారు కోరిన బొమ్మలను తయారు చేసి, వాటిని పోస్ట్, కొరియర్ సర్వీసుల ద్వారా పంపిస్తోంది. దేశ, విదేశాల నుంచి ఆర్డర్లు మన దేశంలో ఎక్కువగా మెట్రో సిటీలైన ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, సూరత్, లక్నో, తదితర ప్రాంతాల నుంచి ఎక్కువగా ఆర్డర్లు వస్తున్నాయి. వారి ద్వారా విదేశాల్లో ఉన్న వారి వారి బంధువులు కూడా ఆర్డర్లు చేస్తున్నారు. దీంతో వారు కోరుకున్నవి తయారు చేసి పంపిస్తూ ఉపాధి పొందుతోంది. ప్రతి రోజూ ఆర్డర్లు వస్తూనే ఉంటాయని, రూ.150 మొదలుకొని రూ.1200 వరకు వివిధ రకాల మినియేచర్లు తయారు చేస్తున్నట్టు స్ఫూర్తి పేర్కొంది. ఇప్పటివరకు ఇంటి దగ్గర ఉంటూ మినియేచర్స్ తయారీ ద్వారా ఖర్చులన్నీ పోనూ దాదాపు రూ.3 లక్షలు ఆర్జించింది. అలంకార వస్తువులు మినియేచర్స్తోబాటు కొంత మంది మహిళలు తమకు కీచైన్స్ కావాలని, చెవులకు జూకాలు, లాకెట్స్, హెయిర్ క్లిప్లు... ఇలా రకరకాల అలంకార వస్తు సామగ్రి కావాలంటూ ఆర్డర్లు ఇస్తున్నారు. వాళ్లు కోరుకున్నట్టుగా తయారు చేస్తూ వారికి పంపిస్తోంది. స్ఫూర్తి ప్రతిభ దేశ, విదేశాలకు పాకింది. ఆమెకు తల్లిదండ్రులు ప్రోత్సాహం అందిస్తున్నారు. ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఉన్న చోటనే ఉపాధి పొందవచ్చని నిరూపిస్తోంది స్ఫూర్తి. ప్రశంసలే స్ఫూర్తిగా... క్లేతో మినియేచర్స్ తయారు చేస్తున్న స్ఫూర్తి పలువురి నుంచి అభినందనలు అందుకుంది. హైదరాబాద్ ఆర్ట్ ఎగ్జిబిషన్లో ఆమె తయారు చేసిన మినియేచర్స్ను ప్రదర్శించడానికి ఆహ్వానం అందింది. దీంతో తాను తయారు చేసిన మినియేచర్స్ కళను ప్రదర్శించి నిర్వాహకుల నుంచి ప్రశంసలు, బహుమతులు అందుకుంది. అలాగే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రశంసాపత్రం అందుకున్న స్ఫూర్తి.. పేరుకు తగ్గట్టు అందరికీ స్ఫూర్తి ప్రదాత. అందమైన ఎంపిక మినియేచర్స్ తయారు చేయడం ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే వాటి తయారీ మొదలు పెట్టాను, సక్సెస్ అయ్యాను. వివిధ ప్రాంతాలు, దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. చాలా మంది నేను తయారు చేసిన మీనియేచర్లను కానుకలుగా ఎంపిక చేసుకోవడానికి ఇష్టం చూపుతున్నారు. ఆ విధంగానే ఆర్డర్లు ఎక్కువ వస్తున్నాయి. – స్ఫూర్తి – ఎస్.వేణుగోపాలాచారి, కామారెడ్డి, సాక్షి -
ఫ్యాషన్.. యువతకు ఇప్పుడు చక్కటి కెరీర్.. విజయం సాధించండిలా
ఫ్యాషన్.. యువతకు ఇప్పుడు చక్కటి కెరీర్ మార్గంగా నిలుస్తోంది. ఫ్యాషన్ రంగానికి అవసరమైన నైపుణ్యాలు, అర్హతలు ఉంటే.. ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి! ఇలాంటి నైపుణ్యాలు అందించే వేదిక.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్)!! దేశవ్యాప్తంగా ఉన్న నిఫ్ట్ క్యాంపస్ల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో ప్రతి ఏటా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 2022 విద్యా సంవత్సరానికి సంబంధించి నిఫ్ట్ అడ్మిషన్ టెస్ట్–2022 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. నిఫ్ట్ క్యాంపస్ల్లో అందుబాటులో ఉన్న కోర్సులు, అర్హతలు, ప్రవేశ ప్రక్రియ, పరీక్ష విధానం, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం.. హెయిర్ స్టైల్ అదిరిపోవాలి. డ్రెస్సింగ్ ట్రెండీగా ఉండాలి. ఎదుటివాళ్లు కళ్లు తిప్పుకోకూడదు. చివరకు కాళ్లకు తొడిగే ఫుట్వేర్ సైతం వెరైటీగా ఉండాల్సిందే! ఇది నేటి యువత ఫ్యాషన్ ధోరణి!! ఇలాంటి ప్రొడక్ట్స్ను మార్కెట్లో తేవాలంటే..అంత తేలిక కాదు. అందుకు ఫ్యాషన్ నిపుణులు అవసరం ఉంటుంది. ఇదే ఇప్పుడు యువతకు కెరీర్ అవకాశంగా మారుతోంది. నిఫ్ట్ ప్రత్యేకత భారత ప్రభుత్వ టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన విద్యాసంస్థ.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్). ఈ ఇన్స్టిట్యూట్కు దేశ వ్యాప్తంగా 17క్యాంపస్లు ఉన్నాయి. ఫ్యాషన్ రంగానికి సంబంధించి డిజైన్, ఫ్యాషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో.. బ్యాచిలర్, మాస్టర్ స్థాయిలో కోర్సులను అందిస్తున్నారు. నిఫ్ట్ క్యాంపస్లు అందించే ఈ కోర్సులకు ఎంతో గుర్తింపు ఉంది. వీటిల్లో ప్రవేశం పొందాలంటే.. నిఫ్ట్–అడ్మిషన్ ప్రక్రియలో విజయం సాధించాల్సి ఉంటుంది. 2022–23 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. బ్యాచిలర్ స్థాయి డిజైన్ ►బ్యాచిలర్ స్థాయిలో..బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ పేరుతో అందుబాటులో ఉన్న కోర్సులు: బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్; లెదర్ డిజైన్; యాక్ససరీస్ డిజైన్; టెక్స్టైల్ డిజైన్; నిట్వేర్ డిజైన్; ఫ్యాషన్ కమ్యూనికేషన్. ►వీటికి ఏదైనా గ్రూప్తో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు. వయసు 24ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ బ్యాచిలర్ స్థాయిలోనే.. ఫ్యాషన్ విభాగంలో టెక్నికల్ నైపుణ్యాలను అందించే ప్రత్యేక కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. ఇందులో ప్రవేశానికి ఎంపీసీ గ్రూప్తో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. వయసు 24ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. పీజీ ప్రోగ్రామ్లు ►పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో.. మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. ►మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్: అర్హత: బ్యాచిలర్ డిగ్రీ లేదా నిఫ్ట్/నిడ్ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా(కనీసం మూడేళ్లు)ఉత్తీర్ణులు అర్హులు. ►మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ: నిఫ్ట్ అందించే బీ.ఎఫ్.టెక్ ఉత్తీర్ణులు లేదా ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి బీటెక్/బీఈ ఉత్తీర్ణులు అర్హులు. ►పీజీ కోర్సులకు ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు. మూడంచెల ఎంపిక ప్రక్రియ నిఫ్ట్–అడ్మిషన్ ప్రక్రియ మూడంచెల్లో ఉంటుంది. తొలిదశలో క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్(సీఏటీ);జనరల్ ఎబిలిటీ టెస్ట్(జీఏటీ)ను నిర్వహిస్తారు. ఆ తర్వాత దశలో సిట్యుయేషన్ టెస్ట్ ఉంటుంది. చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్లు ఉంటాయి. వీటిలో విజయం సాధిస్తే సీటు ఖరారు చేస్తారు. తొలి దశ జీఏటీ ►బ్యాచిలర్, పీజీ కోర్సుల అభ్యర్థులకు తొలి దశలో జీఏటీ(జనరల్ ఎబిలిటీ టెస్ట్)ను నిర్వహిస్తారు. పరీక్ష ప్రశ్నల క్లిష్టత స్థాయి మాస్టర్ కోర్సుల్లో కాస్త ఎక్కువగా ఉంటుంది. ►బీడిజైన్ కోర్సుకు జీఏటీ పేపర్లో 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు. ►ఎండిజైన్ కోర్సుకు జీఏటీ పేపర్లో 120 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు. ►జీఏటీలోనూ పలు విభాగాల నుంచి నిర్దిష్ట సంఖ్యలో ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు క్వాంటిటేటివ్ ఎబిలిటీ; కమ్యూనికేషన్ ఎబిలిటీ; ఇంగ్లిష్ కాంప్రహెన్షన్; అనలిటికల్ ఎబిలిటీ; జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్యాషన్ టెక్నాలజీ.. ప్రత్యేక పరీక్ష బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ కోర్సులకు తొలి దశ ప్రవేశ పరీక్ష జీఏటీని ప్రత్యేకంగా నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ఈ పరీక్షలో క్యాంటిటేటివ్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీ, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్, అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వీటితోపాటు ఒక కేస్ స్టడీ కూడా ఉంటుంది. మొత్తంగా ఈ పరీక్షలో బీ.ఎఫ్.టెక్, ఎం.ఎఫ్.టెక్లకు సంబంధించి 150 ప్రశ్నలు ఉంటాయి. రెండో దశ.. సీఏటీ నిఫ్ట్ అడ్మిషన్ టెస్ట్ ప్రక్రియలో రెండో దశ పరీక్ష.. సీఏటీ(క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్). అభ్యర్థుల్లోని పరిశీలనాత్మక నైపుణ్యం, సృజనాత్మకత, డిజైన్ సామర్థ్యాలను పరీక్షించే విధంగా ఈ పరీక్ష ఉంటుంది. మూడో దశ.. సిట్యుయేషన్ టెస్ట్ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ అభ్యర్థుల సృజనాత్మక ప్రతిభను పరిశీలించే విధంగా మూడో దశలో నిర్వహించే పరీక్ష.. సిట్యుయేషన్ టెస్ట్. ఇది పూర్తిగా ప్రాక్టికల్ అప్రోచ్తో ఉంటుంది. అభ్యర్థులకు నిర్ణీత మెటీరియల్ అందించి ఏదైనా ఆకృతిని రూపొందించమని సూచిస్తారు. లేదా ఏదైనా ఒక సందర్భాన్ని పేర్కొని.. దానికి తగినట్లుగా ఊహా చిత్రం గీయమని అడుగుతారు. చివరగా.. జీడీ, పీఐ నిఫ్ట్ అడ్మిషన్ టెస్ట్లోని తొలి మూడు దశల్లో విజయం సాధించిన అభ్యర్థులకు చివరగా గ్రూప్ డిస్కషన్(జీడీ), పర్సనల్ ఇంటర్వ్యూ(పీఐ)లు నిర్వహిస్తారు. జీడీ ద్వారా అభ్యర్థి భావవ్యక్తీకరణ, స్పష్టత, ఆలోచన సామర్థ్యాలను పరిశీలిస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ పూర్తిగా ఫ్యాషన్ కెరీర్ పట్ల అభ్యర్థికున్న ఆసక్తి, దానికి సరితూగే తత్వాలను గ్రహించే విధంగా ఉంటుంది. ఇందులోనూ విజయం సాధిస్తే ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు. విజయం సాధించండిలా ►నిఫ్ట్ అడ్మిషన్ ప్రక్రియలో పేర్కొన్న జీఏటీ, సీఏటీ, సిట్యుయేషన్ టెస్ట్లు.. వాటిలో సెక్షన్లు, సంబంధిత సబ్జెక్ట్లలో రాణించడానికి ఆయా అంశాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. ►క్వాంటిటేటివ్ ఎబిలిటీ: ఈ విభాగంలో ప్రశ్నలు పదో తరగతి స్థాయి మ్యాథమెటిక్స్,అర్థమెటిక్స్ నుంచి ఉంటాయి. వర్క్ అండ్ టాస్క్, శాతాలు, నిష్పత్తులు,టైమ్ అండ్ డిస్టెన్స్,టైమ్ అండ్ వర్క్ సంబంధించిన అంశాల్లో పట్టు సాధించాలి. ►కమ్యూనికేషన్ ఎబిలిటీ, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్: ఇంగ్లిష్ భాషలో ప్రాథమిక నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు.అభ్యర్థులు బేసిక్ గ్రామర్ అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ►అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ: విశ్లేషణ సామర్థ్యాన్ని, తార్కిక నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. నిర్దిష్టంగా ఒక అంశంలో ఇమిడి ఉన్న ప్రధాన కాన్సెప్ట్లు, వాటికి సంబంధించి అప్లికేషన్ అప్రోచ్తో ప్రాక్టీస్ చేయడం అలవర్చుకోవాలి. ►జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్: ఈ విభాగానికి సంబంధించిన ప్రశ్నలు హైస్కూల్ స్థాయి సోషల్ స్టడీస్ నుంచి ఉంటాయి. అదే విధంగా ముఖ్యమైన తేదీలు–సందర్భాలు వంటివి కూడా అడుగుతారు. తాజాగా జరిగిన ముఖ్యమైన సంఘటనలు కూడా తెలుసుకోవాలి. ► కేస్ స్టడీ: బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ కోర్సుల అభ్యర్థులకు మాత్రమే నిర్వహించే కేస్ స్టడీ వినూత్నంగా ఉంటుంది. ఒక వాస్తవ సమస్యను ఇచ్చి.. దానికి పరిష్కారం అడుగుతారు. దీనిలో రాణించాలంటే.. అభ్యర్థులు వాస్తవ అన్వయ దృక్పథం, సమస్యను గుర్తించే లక్షణం పెంచుకోవాలి. ఆసక్తి ప్రధానం ఫ్యాషన్ రంగంలో ప్రవేశించాలనుకునే యువతకు ఆసక్తి ఎంతో ప్రధానం. అంతేకాకుండా ఎప్పటికప్పుడు మార్కెట్ పరిస్థితులు,జీవన శైలి,వ్యక్తుల అభిరుచుల్లో మార్పులు గమనిస్తూ.. ప్రొడక్ట్ డిజైన్ చేసే దూరదృష్టి అవసరం. ప్రస్తుతం ఫ్యాషన్ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగావకాశాలకు ఎలాంటి ఢోకా లేదు. –ప్రొ.ఎల్.మదన్ కుమార్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్, నిఫ్ట్, హైదరాబాద్ కోర్సులు–సీట్లు ►జాతీయ స్థాయిలో మొత్తం 17 నిఫ్ట్ క్యాంపస్ల్లో అందుబాటులో ఉన్న కోర్సులు–సీట్ల వివరాలు: బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్: 686, లెదర్ డిజైన్: 168, యాక్ససరీ డిజైన్: 600, టెక్స్టైల్ డిజైన్: 646, నిట్వేర్ డిజైన్: 296, ఫ్యాషన్ కమ్యూనికేషన్: 642,బీఎఫ్టెక్(అపెరల్ ప్రొడక్షన్): 518, మాస్టర్ ఆఫ్ డిజైన్: 171, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్: 650, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ: 140. ►నిఫ్ట్ హైదరాబాద్ క్యాంపస్లో అందుబాటులో ఉన్న కోర్సులు, సీట్ల వివరాలు..బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్: 37, యాక్ససరీ డిజైన్:37, టెక్స్టైల్ డిజైన్: 37, నిట్వేర్ డిజైన్: 37, ఫ్యాషన్ కమ్యూనికేషన్: 37, బీ.ఎఫ్.టెక్(అపరెల్ ప్రొడక్షన్): 37,మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్: 37. n అన్ని క్యాంపస్లలోనూ ఇక్కడ పేర్కొన్న సీట్లతోపాటు ప్రతి కోర్సులో అయిదు సీట్లను అదనంగా.. ఎన్ఆర్ఐ విద్యార్థులు, సార్క్ దేశాల విద్యార్థులు, విదేశీ విద్యార్థుల కోసం కేటాయించారు. ముఖ్య సమాచారం ►దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ►యూజీ/పీజీ కోర్సులకు దరఖాస్తులకు చివరి తేది: 2022 జనవరి మొదటి వారం. ►బ్యాచిలర్ కోర్సులకు రాత పరీక్ష తేదీలు: 2022 ఫిబ్రవరి మొదటి వారం ►వివరాలకు వెబ్సైట్: https://www.nift.ac.in/ -
డిజైన్స్ షో
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement