-
‘మోదీ సారథ్యంలోనే దేశ అభివృద్ధి’
నిర్మల్చైన్గేట్: ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోనే దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధి స్తోందని, ప్రగతిపథంలో దైసుకెళ్తోందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మె రాజు అన్నారు. పట్టణంలో శుక్రవారం ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో నిర్వహించారు. 24వ వార్డులో ప్రచారం నిర్వహించారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో మోదీ పాలన సాగిస్తున్నారని తెలిపారు. పదేళ్లు దేశానికి అవి నీతి రహిత పాలన అందించారని తెలిపారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిసెల అర్జున్, సీనియర్ నాయకులు ఒడిశెల శ్రీనివాస్, ద్యేవరశెట్టి గణేశ్, అనంతుల అభిలాష్, కిశోర్, శరత్, వంశీ, అన్వేష్, శివకుమార్, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారంలో బీజేపీ నాయకులు -
ఆత్రం సుగుణ ఆస్తులు రూ.54.60 లక్షలు
కై లాస్నగర్: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ లక్షాధికారే. శుక్రవారం ఆమె తరఫున దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్లో తనకున్న ఆస్తులతో పాటు అప్పుల వివరాలు పేర్కొన్నారు. చరాస్తులు రూ.12లక్షల 10వేలు ఉండగా, తన భర్త భుజంగ్రావు పేరిట రూ.42వేలు ఉన్నట్లుగా తెలిపారు. స్థిరాస్తులు తన పేరిట రూ.42లక్షల 50వేలు ఉన్నాయి. అలాగే తన పేరిట వివిధ బ్యాంకుల్లో రూ.23లక్షల 49వేల 224 అప్పులు ఉండగా, తన భర్త పేరిట రూ.29లక్షల 76వేల 946 అప్పు ఉన్నట్లుగా వెల్లడించిన ఆమె తనకు సొంత వాహనం లేనట్టుగా పేర్కొన్నారు. కాగా తనపై ఉద్యమ కాలం నాటికి సంబంధించి 50 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లు వెల్లడించారు. -
అమరం.. స్మరణం
బాధను పంచుకోవాలి విద్యార్థులు అన్ని విషయాలను అధ్యాపకులతో పంచుకోవాలని కార్పొరేట్ ట్రైనర్ తిరుమల్రెడ్డి సూచించారు. వాతావరణం ఆకాశం కొంతమేకు మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. వేడి, ఉక్కపోత కొనసాగుతుంది. సాయంత్రం వర్షం పడే అవకాశం ఉంది. 8లోu ఇంద్రవెల్లి: 1981 ఏప్రిల్ 20 జల్..జంగల్...జమీన్ కోసం ఉద్యమించిన అడవిబిడ్డలపై అప్పటి సర్కారు తుపాకీ ఎక్కుపెట్టింది. తూటాల వర్షం కురిపించింది. హక్కుల సాధనలో 15 మంది గిరిజనులు అమరులయ్యారు. వారి రక్తపుటేరులతో తడిసిన పచ్చని వనం ఎరుపెక్కింది. అడవిబిడ్డల అమరత్వం నింగికెగిసిన అగ్ని శిఖలా ఇంద్రవెల్లిలో అమరుల స్తూపమై నిలిచింది. ఈ ఘటనకు 43 ఏళ్లు. అయితే ఇప్పటికీ ఆ స్తూపం వద్ద ఏటా ఆదివాసీలు స్వేచ్ఛగా నివాళులు అర్పించలేని పరిస్థితి. నాడు పూర్తిగా పోలీసు నిఘాలోనే స్తూపం ఉండేది. 2015లో తొలిసారిగా ఆంక్షలతో కూడిన అనుమతి ఇవ్వడంతో ఆదివాసీలు వచ్చి అమరులకు నివాళులర్పిస్తున్నారు. ఈసారి ఉమ్మడి జిల్లా నుంచి ఆదివాసీలతోపాటు జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్, ఆదివాసీ ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరుకానున్నారు. స్తూపం వద్ద ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. 33 ఏళ్లుగా నివాళులకు దూరం నాటి కాల్పుల ఘటన సాక్షిగా ఇంద్రవెల్లి సమీపంలో స్తూపం నిర్మించారు. ఆ రోజు నుంచి ఉమ్మడి రాష్ట్రం పాలన ముగిసే వరకు 33 ఏళ్లుగా అమరులకు నివాళులర్పించడానికి అనుమతి ఇవ్వలేదు. ఏటా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసే వారు. ఈ క్రమంలో 2004 అప్పటి బోథ్ ఎమ్మెల్యే సోయం బాపూరావ్ గిరిజన నాయకులతోపాటు అప్పటి ఎంపీ మధుసూదన్రెడ్డితో కలిసి ఏప్రిల్ 25న నివాళులర్పించారు. అప్పటి నుంచి ఏటా ఆదివాసీ గిరిజనులు అదేరోజున నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదివాసీ సంఘాల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా ఆంక్షలు సడలించి స్తూపం వద్ద ఏప్రిల్ 20న నివాళులు అర్పించేందుకు రెండు గంటల సమయం ఇచ్చింది. దీంతో ఆదివాసీ సంప్రదాయ రీతిలో పూజలు చేసి నివాళులర్పిస్తున్నారు. ఎట్టకేలకు స్మృతి వనం, ఇళ్ల స్థలాలు నాడు హక్కుల కోసం పోరాడిన ఆదివాసీలపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో దాడి చేయించడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతోపాటు గాయాలపాలయ్యారు. అయితే బాధిత కుటుంబాలను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మూడేళ్ల క్రితం అమరుల కుటుంబాలను గుర్తించిన ఎంపీ సోయం బాపూరావు రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం అందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క స్పందించారు. పోలీస్ శాఖలో ఉన్న రికార్డుల ప్రకారం 15 మంది అమరవీరుల కుటుంబాలకు ఇటీవల మండలంలోని ముత్నూర్ సమీపంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. హక్కు పత్రాలతోపాటు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. అమరవీరుల స్తూపాన్ని స్మృతి వనంగా తీర్చదిద్దేందుకు రూ.97 లక్షలు కేటాయించారు. రెండోసారి స్మారక స్తూపం నిర్మాణం. ఆదివాసీల స్మారకార్థం రైతు కూలీ సంఘం ఇంద్రవెల్లిలో 80 అడుగుల స్తూపాన్ని నిర్మించింది. ఆ స్తూపాన్ని 1986 మార్చిలో గుర్తుతెలియని వ్యక్తులు డైనమేట్లతో పేల్చారు. గిరిజనుల ఆందోళనలతో 1987లో ప్రభుత్వం ఐటీడీఏ నిధులతో రెండోసారి స్తూపం నిర్మించింది. పోలీసు బందోబస్తు.. సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇంద్రవెల్లి మండలంలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ఏడుగురు ఎస్సైలతోపాటు 100మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. అసలేం జరిగింది. స్వాతంత్య్రం వచ్చి అప్పటికీ మూడున్నర దశాబ్దాలవుతున్నా ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. ఈ క్రమంలో 1981లో చట్టబద్ధమైన హక్కుల సాధన కోసం పిపుల్స్వార్ ఆధ్వర్యంలో గిరిజన రైతు కూలీ సంఘం పేరిట ఇంద్రవెల్లిలో గిరిజన బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా ఆ రోజు సోమవారం వారసంత కావడంతో ఉదయం నుంచే ఆదివాసీలు భారీగా తరలివచ్చారు. మధ్యాహ్నం 3 గంటల వరకే సభప్రాంగణం గిరి పుత్రులతో కిక్కిరిసిపోయింది. సభా స్థలాన్ని ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా వినకుండా మరికొందరు గిరిజనులు ర్యాలీగా అక్కడికి బయలుదేరారు. వారిని అడ్డుకునే క్రమంలో ముందున్న గిరిజన యువతితో ఓ పోలీసు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె వెంటనే పోలీసుపై దాడి చేయగా ఆయన నెలకొరిగాడు. పరిస్థితి చేయిదాటి పోవడంతో పోలీసులు తూటాల వర్షం కుర్పించారు. రక్తం ఏరులై పారింది. ఈ ఘటనలో 15మంది ఆదివాసీలు మాత్రమే చనిపోయినట్లు ప్రభుత్వ రికా ర్డుల్లో ఉంది. కానీ అప్పుడు తూటాల గాయాలతో తమ ఇళ్లకు వెళ్లి పోలీసుల భయంతో బయటకు రాలేక, వైద్యం అందక 60 మంది వరకు చనిపోయినట్లు పౌరహక్కుల సంఘం నిజనిర్ధారణ కమిటీ తమ నివేదికలో స్పష్టం చేసింది. గాయంతో ఏ పని చేయలేను.. నాడు ఇంద్రవెల్లిలో వారసంత ఉండడంతో నా భర్త శంభుతో కలిసి వెళ్లిన. సంత నుంచి మిటింగ్కు వెళ్లినం. అక్కడ పోలీసుల కాల్పుల్లో నా కుడి చేయికి గాయమైంది. నా భర్త శంభు కూడా బుల్లెట్ల గాయంతో ఇంటికొచ్చి కొద్ది రోజుల తరువాత చనిపోయాడు. చేతి గాయం కారణంగా ఇప్పటికీ నేను ఎలాంటి పని చేయలేకపోతున్నా. ఉన్న ఒక్క కొడుకు కూడా అనారోగ్యంతో చనిపోయిండు. కోడలు వద్ద ఉంటున్న. ఆసరా పింఛన్ కూడా రావట్లేదు. కష్టంగా ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలి. – మడావి జంగుబాయి, కన్నాపూర్ నా భర్తను కోల్పోయిన.. నాటి ఘటనలో నా భర్త కొద్దు మరణించాడు. ఆ తరువాత కూలి పనులు చేసుకుంటూ నా కొడుకును పెంచి పెద్ద చేసిన. ఇప్పటి వరకు ఉండేందుకు ఇల్లు కూడా లేదు. ఇటీవల ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. అయితే ఇందిరమ్మ నిధులతో ఇల్లు కట్టించి ఇవ్వాలి. ఐటీడీఏ ద్వారా రుణం అందించి నా కొడుకుకు ఉపాధి చూపాలి. – సేడ్మకి లచ్చుబాయి, తాటిగూడ ఇంద్రవెల్లి ఘటనకు 43 ఏళ్లు ఎట్టకేలకు అమరులను గుర్తించినరాష్ట్ర ప్రభుత్వం నేడు అమరవీరుల సంస్మరణ దినం ఉమ్మడి జిల్లా నుంచి తరలిరానున్న ఆదివాసీలు -
తొలి ఎంపీ.. సి.మాధవరెడ్డి
● హైదరాబాద్ రాష్ట్రంలో మొదటి ఎన్నికలు ● సోషలిస్టు పార్టీ తరఫున ఆదిలాబాద్ నుంచి పోటీ ● 25 వేల పైచిలుకు అధిక్యంతో విజయం కై లాస్నగర్: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. మహారాష్ట్ర, కర్నాటకలోని పలు ప్రాంతాలను కలుపుకుని హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్న సమయంలో ఏర్పడిన ఈ నియోజకవర్గం జనరల్ స్థానంగా ఉండేది. అప్పట్లో హైదరాబాద్ రాష్ట్రంలో 21ఎంపీ స్థానాలు ఉండగా అందులో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గానికి 1952 మార్చి 27న తొలిసారిగా సాధారణ ఎన్నికలు జరిగాయి. ఇందులో సోషలిస్టు పార్టీ సత్తా చాటింది. ఆ పార్టీ తరఫున సి.మాధవరెడ్డి పోటీ చేయగా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా జేవీ నర్సింగ్రావు బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గ పరిధిలో మొత్తం 3,51,017 మంది ఓటర్లున్నారు. కాగా తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అంతగా అవగాహన లేకపోవడంతో సగానికిపైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగానికి దూరంగా ఉన్నారు. తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో 1,56,907 (44.7శాతం)ఓట్లు పోలయ్యాయి. 1,94,110 మంది ఓటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కాగా ఆ రోజుల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతీ ఓటు చెల్లుబాటు కావడం గమనార్హం. ఆదిలాబాద్ ఎంపీగా.. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగిన తొలి ఎన్నికల్లో చెరుకు మాధవరెడ్డి ఎంపీగా విజయం సాధించి రికార్డు సృష్టించారు. సోషలిస్టు పార్టీ తరఫున పోటీ చేసిన ఆయనకు 90,995 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి నర్సింగ్రావుకు 65,912 ఓట్లు పోలయ్యాయి. దీంతో మాధవరెడ్డి 25,083 ఓట్ల అధిక్యంతో విజయం సాధించి ఆదిలాబాద్ ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. కమ్యూనిస్టుగా రాజకీయ జీవి తాన్ని ప్రారంభించిన మాధవరెడ్డి కాంగ్రెస్, టీడీపీల నుంచి కూడా పదవులు దక్కించుకున్నారు. ఆయన రాజకీయ జీవితం మూడు పార్టీల్లో సాగింది. అనంతరం కాంగ్రెస్లో చేరి 1962లో బోథ్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. టీడీపీ ఆవిర్బావంతో ఆ పార్టీలో చేరిన ఆయన రెండోసారి 1984లో మరోసారి ఎంపీగా విజయంసాధించారు. చెరుకు మాధవరెడ్డి -
ఎన్నికల వ్యయం పకడ్బందీగా నమోదు చేయాలి
● ఎన్నికల వ్యయ పరిశీలకులు జాదావార్ వివేకానంద నిర్మల్చైన్గేట్: ఎన్నికల ప్రచారానికి పార్టీ ద్వారా, అభ్యర్థి తరఫున ఖర్చుచేసే ప్రతీ పైసా ఎన్నికల వ్యయం కింద నమోదు చేయాలని ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు జాదావార్ వివేకానంద అన్నారు. జిల్లా కేంద్రంలోని పెన్గంగ గెస్ట్హౌస్ నుంచి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అధికారులతో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో చేసే ఖర్చుల వివరాలు పక్కాగా నమోదు చేయాలన్నారు. ఎస్ఎస్టీ, వీఎస్టీ, ఎస్ఎస్టీ అకౌంటింగ్ టీం సభ్యులు సమన్వయంతో సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు. అనుమానాస్పద బ్యాంకు ఖాతాలను తనిఖీ చేయాలన్నారు. ఎంసీఎంసీ ద్వారా ఎన్నికల్లో చేసిన ప్రకటనలకు ఈసీ విడుదల చేసిన రేట్ల ప్రకారం ఎన్నికల వ్యయంగా నమోదు చేయాలన్నారు. అలాగే రోజువారిగా దినపత్రికల్లో వచ్చే పెయిడ్ న్యూస్పై దృష్టి సారించాలని, సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. కార్యక్రమంలో నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు అశిష్ సంగ్వాన్, వెంకటేష్ దోట్రే, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. అన్ని టీంలు సిద్ధం.. అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అన్నిరకాల టీమ్లను ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు సీవిజిల్ యాప్లో 5 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిష్కరించామని తెలిపారు. రూ.1.19 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎస్పీ జానకీషర్మిల మాట్లాడుతూ జిల్లాలోని ప్రతీ చెక్ పోస్టుల వద్ద పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని, 16,089 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్రెడ్డి, ఈడీఎం నదీం, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
PrajwalRevannavideo: త్వరలో భారత్కు ప్రజ్వల్ రేవణ్ణ..?
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- హీరో నవీన్ చంద్రకు ప్రతిష్టాత్మక పురస్కారం
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ..!
- సీఐ, ఎస్ఐ వేధిస్తున్నారు.. సూసైడ్ లేఖ రాసి..
- బీజేపీలో చేరిన నటి రూపాలీ గంగూలీ
- షుగర్ పేషెంట్స్ పళ్లు తినకూడదా? తింటే ఏవి తినాలి?
- ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓటరుకు నిరాశే
- వరుస ఓటములు ఎదుర్కొంటున్న హార్దిక్ సేనకు మరో బిగ్ షాక్
Advertisement