-
Jharkhand: హేమంత్ సోరెన్ సతీమణికి సీఎం బాధ్యతలు?
జార్ఖండ్లో రాజకీయలు ఒక్కసారిగా వేడేక్కాయి. రాష్ట్ర సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు హేమంత్ సోరెన్..ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్ట్చేసే అవకాశం ఉన్న క్రమంలో జార్ఖండ్లో సీఎం మార్పు జరగనున్నట్లు తాజాగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోరెన్ సతీమణికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జేఎమ్ఎమ్తోపాటు ఇతర మిత్రపక్ష ఎమ్మెల్యేలు రాంచీకి చేరుకోవాలని సీఎం నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. దీంతో సంకీర్ణ కూటమిలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలంతా లగేజీలతో సోమవారం రాంచీ చేరుకున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై మంగళవారం మధ్యాహ్నం సీఎం నివాసంలో సమావేశమై చర్చించనున్నట్లు తెలుస్తోంది. చదవండి: జార్ఖండ్ సీఎం ఎక్కడ? 18 గంటలుగా మాయం? జార్ఖండ్ రాజకీయ పరిణామలపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హేమంత్ సోరెన్ జేఎమ్ఎమ్, కాంగ్రెస్, ఇతర మిత్రపక్ష ఎమ్మెల్యేలను రాంచీకి పిలిచారని తెలిపారు. తమకు అందిన సమాచారం ప్రకారం.. హేమంత్ తన సతీమణి కల్పనా సోరెన్కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈడీ విచారణతో సీఎం భయపడుతున్నారని, తాను రోడ్డు మార్గంలో దిల్లీ నుంచి రాంచీకి వస్తానని తన పార్టీ నేతలకు సోరెన్ చెప్పినట్లు తెలిసిందని చెప్పారు. ఈ మేరకు దూబే ఎక్స్లో (ట్విటర్) పోస్ట్ చేశారు. భూ కుంభకోణానికి సంబంధించిన నీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సోరెన్ను విచారించేందుకు సోమవారం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఢిల్లీలోని సీఎం ఇంటికి వెళ్లగా అక్కడ ఆయన అందుబాటులో లేరు. దీంతో 13 గంటలపాటు ఆయన నివాసంలోనే ఉండి ఈడీ అధికారులు సోదాలు జరిపారు. సీఎంకు చెందిన రెండు బీఎండబ్ల్యూ కార్లు, 32 లక్షల నగదుతోపాటు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే సోరెన్ జనవరి 27 రాత్రి తన వ్యక్తిగత పనుల నిమిత్తం రాంచీ నుంచి ఢిల్లీ బయల్దేరారని, త్వరలోనే తిరిగి వస్తారని ఆయన పార్టీ నేతలు చెబుతున్నారు. మనీలాండరింగ్ కేసులో జనవరి 29 లేదా జనవరి 31వ తేదీలలో విచారణకు హాజరవ్వాలని ఈడీ సోరెన్కు సమన్లు జారీ చేసింది. మరోవైపు జనవరి 31న రాంచీలోని తన నివాసానికి రావాలని జార్ఖండ్ సీఎం ఇప్పటికే ఈడీ అధికారులకు మెయిల్ చేశారు. బుధవారం మధ్యాహ్నం 1 గంటకు ఆయనను విచారించే అవకాశాలున్నాయి. ఇక తనకందిన తాజా సమన్లను కక్షసాధింపు చర్యగా మెయిల్లో సోరెన్ పేర్కొన్నారు. -
జార్ఖండ్ తదుపరి సీఎం ఆమె? బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తారని.. తదుపరి సీఎంగా ఆయన భార్య కల్పన బాధ్యతలు తీసుకుంటారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే సంచలన వాఖ్యలు చేశారు. తాజాగా జార్ఖండ్ ముక్తి మోర్చా నేత సర్ఫరాజ్ అహ్మద్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో నిశికాంత్ దుబే వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సర్ఫరాజ్ వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తాను పార్టీని, సంకీర్ణాన్ని, సీఎం హేమంత్ సోరెన్ను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. ‘ఎమ్మెల్యేగా సర్ఫరాజ్ అహ్మద్ రాజీనామా కొత్త ఏడాదిలో సోరెన్ కుటుంబానికి బాధ కలిగిస్తుంది. త్వరలో హేమంత్ సోరెన్ కూడా సీఎం పదవికి రాజీనామా చేస్తారు.ఆయన భార్య కల్పన సీఎం పదవిని చేపడతారు’ అని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే ‘ఎక్స్’ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర గవర్నర్.. న్యాయ సలహా తీసుకోవాలని బీజేపీ పేర్కొంది. జార్ఖండ్లో హేమంత్ సోరెన్ ప్రభుత్వం 2019లో కొలుదీరిన విషయం తెలిసిందే. झारखंड के गांडेय विधायक सरफराज अहमद ने विधानसभा से इस्तीफ़ा दिया,इस्तीफ़ा स्वीकार हुआ । हेमंत सोरेन जी मुख्यमंत्री पद से इस्तीफ़ा देंगे,झारखंड की अगली मुख्यमंत्री उनकी पत्नी कल्पना सोरेन जी होंगी । नया साल सोरेन परिवार के लिए कष्टदायक @itssuniltiwari pic.twitter.com/jl06AtXurh — Dr Nishikant Dubey (@nishikant_dubey) January 1, 2024 జేఎంఎం ఎమ్మెల్యే రాజీనామాతో ఖాళీ అయిన సీటుకు జరిగే ఉప ఎన్నికలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారని ఎంపీ నిశికాంత్ దుబే ఆశాభావం వ్యక్తం చేశారు. అవినీతి కేసులో విచారించడానికి ఇప్పటివరకు ఈడీ.. సీఎం హేమంత్ సోరెన్కు ఏడు సార్లు సమన్లు జారీ చేసింది. ఈ సమన్లపై సీఎం హేమంత్ సోరెన్ జార్ఖండ్ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆయన దాఖలు చేసిన పిటిషన్లు తిరస్కరించబడ్డాయి. 2024 పార్లమెంట్ ఎన్నికలను దృష్టి పెట్టుకొని కేంద్రం ప్రతిపక్షాల పైకి దర్యాప్తు సంస్థలను పంపి వాటిని వాడుకుంటోందని మండిపడ్డ విషయం తెలిసిందే. మరోవైపు అవినీతి కేసులో ఈడీ విచారణపై సీఎం హేమంత్ సోరెన్ ఆందోళన పడుతున్నారని తెలుస్తోంది. అయితే సీఎం సోమంత్ సోరెన్ అవినీతి కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, సీఎం పదవిని తన భర్య కల్పనకు అప్పగిస్తారనే చర్చ జోరందుకుంది. చదవండి: Lalan Singh: నేను హిందువునే.. వాళ్లలా కాదు.. -
‘పార్లమెంట్ భద్రత.. ప్రభుత్వ బాధ్యత కాదు’
ఢిల్లీ: పార్లమెంట్ భద్రత వైఫల్యంపై విపక్షాలు పార్లమెంట్లో నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో ప్రధానమంత్రి లేదా కేంద్ర హోం మంత్రి జవాబు చెప్పాలని పెద్ద ఎత్తున పట్టుబడుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం 13 మంది లోక్ సభ సభ్యులు, రాజ్యసభలో ఒక ఎంపీ సస్పెన్షన్కు గురైనారు. అయితే తాజాగా విపక్షాల ఆందోళనలపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యాలు 1974, 1994లో కూడా చోటు చేసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పడు జరిగింది తొలిసారి కాదని అన్నారు. పార్లమెంట్ భద్రత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బాధ్యత కాదని అన్నారు. పార్లమెంట్ భద్రత వైఫల్యంపై ప్రధాని, కేంద్ర హోం మంత్రి మాట్లాడమని విపక్షాలు ఆందోళన చేయడం సరికాదని మండిపడ్డారు. పార్లమెంట్ భద్రతా వ్యవహారం మొత్తం లోక్సభ సెక్యూరిటీకి సంబంధించిందని అన్నారు. 1974లో అయితే ఏకంగా ఓ వ్యక్తి రెండు తుపాకులు చేతిలో పట్టుకొని పార్లమెంట్లోకి వచ్చాడని తెలిపారు. కానీ, ఆనాటీ ప్రతిపక్షమైన జనసంఘ్ దాన్ని ఓ పెద్ద వివాదంగా చేయలేదని అన్నారు. ప్రధాన మంత్రి, హోం మంత్రి బాధ్యత వహించాలని నిరసనలు తెలపలేదని అన్నారు. ఎందుకుంటే పార్లమెంట్ భద్రత.. బాధ్యత లోక్సభ సెక్రటేరియట్కు చెందినదని ఆయన ‘ఎక్స్’ ట్విటర్లో పేర్కొన్నారు. कॉंग्रेसी@INCIndia डूब मरो यह है,११ अप्रैल १९७४ में पिस्तौल के साथ घुसने वाले शख़्स की कहानी,भाजपा/जनसंघ या तत्कालीन विपक्ष ने इसे राजनीतिक मुद्दा नहीं बनाया ।लोकसभा अध्यक्ष का इस्तीफ़ा नहीं मॉंगा? प्रधानमंत्री व गृहमंत्री का तो ज़िक्र तक नहीं किया,क्योंकि संसद की सुरक्षा केवल… pic.twitter.com/lOte3AOVia — Dr Nishikant Dubey (@nishikant_dubey) December 15, 2023 చదవండి: పార్లమెంట్ అలజడి ఘటన: ప్రతిపక్షాల తీరుపై అమిత్ షా ఫైర్ -
‘మహువా మొయిత్రాపై వేటు.. అది విచారకరమైన రోజు’
ఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యురాలు మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మొదటిసారి స్పందించారు. ‘అవినీతి, జాతీయ భద్రత సమస్య విషయంలో ఓ ఎంపీ బహిష్కరణకు గురికావటం తనకు బాధ కలిగిస్తుందని పేర్కొన్నారు. నిన్నటి రోజు(శుక్రవారం) సంతోషకరమైన రోజు కాదని, అదో విచారకరమైన రోజని తెలిపారు. అయితే మొయిత్రా తన లోక్సభ వెబ్సైట్ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ను వ్యాపారవేత్త దర్శన్ హీరా నందానీకి ఇచ్చారని నిశికాంత్ దూబే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. #WATCH | BJP MP Nishikant Dubey on expulsion of TMC leader Mahua Moitra from Parliament "The expulsion of a parliamentarian for corruption and on the issue of national security gives me pain. Yesterday, it was not a happy day, but a sad day." pic.twitter.com/DZoZei5AqF — ANI (@ANI) December 9, 2023 ఆయన ఫిర్యాదుతోనే స్పీకర్ ఈ వ్యవహరాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేయగా.. శుక్రవారం ఎథిక్స్ కమిటి నివేదిక ఆమెను దోషిగా తేల్చటంతో బహిష్కరణ గురయ్యారు. ఇక మొయిత్రాపై వేటుపడిన అనంతరం ఆమెపై ఫిర్యాదు చేసిన ఎంపీ నిశికాంత్ దూబే.. ఇలాంటి వ్యాఖ్యలు చేయటం చర్చనీయాంశంగా మారింది. -
వారి తర్వాత.. కాంగ్రెస్లో బీసీ సీఎం లేరు: నిశికాంత్ దుబే
సాక్షి,న్యూఢిలీ: దేశంలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా లేదని.. కానీ వారికి ఎంతో చేసినట్లుగా ప్రచారం చేసుకుంటుందని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే అన్నారు. ఆయన బుధవారం పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లుపై మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎప్పుడు వెన్నుదన్నుగా లేదని, 1990లో మాజీ ప్రధాని రాజీవ్గాంధీ మండల్ కమిషన్ సిఫార్సులను వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఓబీసీకి చెందిన సీతారం కేసరి గతంలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పని చేశారని తెలిపారు. ఇటీవల జరిగిన రాజస్తాన్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమితో బీపీ ముఖ్యమంత్రులుగా అశోక్ గహ్లోత్, భూపేష్ బాఘేల్ అవకాశం కోల్పోయారని తెలిపారు. వారి తర్వాత కాంగ్రెస్లో బీసీ సీఎం ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రుల ఎంపికలో కూడా బీసీలకు తాము సముచిత స్థానం కల్పిస్తున్నామంటూ కాంగ్రెస్ అసత్యాలు చెబుతోందని నిశికాంత్ అన్నారు. అయితే.. తాజాగా తెలంగాణలో సీఎంగా ప్రకటించిన రేవంత్రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ చెందిన సుఖ్విందర్ సింగ్ సుఖు బీసీలా? అని నిశికాంత్ సూటిగా ప్రశ్నించారు. కాగా.. జమ్ము కశ్మీర్ రిజర్వేషన్(సవరణ) బిల్లు ఆ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తుందని తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రజలకు మంచి చేయడమే లక్ష్యం
ఆర్య కథ వినగానే ఇది నా ఇడియట్ అనిపించింది: అల్లు అర్జున్
చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు
సీఎం జగన్ వెంటే ఉంటాం ●
నగేష్పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
గుత్తి కోటను సందర్శించిన ఎన్నికల పరిశీలకుడు
నయ వంచకుడు చంద్రబాబు
No Headline
జేసీకి భంగపాటు తప్పదు
పల్లె పిలిచింది
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement