-
అస్సలు ఊహించలేదు: చిరాగ్
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఈ స్థాయిలో ఫలితాలు సాధిస్తుందని ఏమాత్రం ఊహించలేదని ఎన్డీయే కూటమిలోని జేఎల్పీ నేత చిరాగ్ పాశ్వాన్ (రావిలాస్ పాశ్వాన్ కుమారుడు) వ్యాఖ్యానించారు. ఎన్డీయే ఓటమికి కారణాలను ఇప్పుడే ఊహించలేమని ఆయన ఆదివారమిక్కడ అన్నారు. స్పష్టమైన మెజార్టీ సాధించిన మహాకూటమి నేతలు నితీష్ కుమార్, లాలు ప్రసాద్ యాదవ్కు ఈ సందర్భంగా చిరాగ్ పాశ్వాన్ అభినందనలు తెలిపారు. ఇప్పటివరకూ మహాకూటమి 35, బీజేపీ 10, ఇతరులు ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. -
'మమ్మల్ని పరిచయం చేసుకున్నాం'
హైదరాబాద్ : బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఆలస్యంగా బరిలోకి దిగడం వల్లే ఆశించిన ఫలితాలు సాధించలేకపోయామని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆయన ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల ద్వారా బిహార్ ప్రజలకు తమని పరిచయం చేసుకున్నామన్నారు. రాబోయే రోజుల్లో బిహార్లో ఎంఐఎంను బలోపేతం చేస్తామన్నారు. ఈ ఫలితాలు నరేంద్ర మోదీకి వ్యక్తిగత ఓటమి అని ఓవైసీ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల ద్వారా ప్రధాని మోదీకి ముస్లింలు గుణపాఠం చెప్పారన్నారు. కాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఆరుగురు అభ్యర్థులను బరిలోకి దించిన విషయం తెలిసిందే. అక్తర్ ఉల్ ఇమాన్(కోచదామన్), తసీరుద్దీన్(కిషన్గంజ్), డాక్టర్ అమిత్ పాశ్వాన్(రాణిగంజ్), గులామ్ సర్వార్(బైసి), నవాజిష్ ఆలం(అమోర్), ఎండీ ఆదిల్ (బల్ రామ్పూర్) పోటీ చేశారు. అయితే ఎంఐఎం మాత్రం ఖాతా తెరవలేకపోయింది. ఒక్క స్థానంలో మాత్రమే కొద్దిసేపు ఆధిక్యం కొనసాగినా తర్వాత పోటీలో నిలబడలేకపోయింది. -
నితీష్కు కేసీఆర్, చంద్రబాబు అభినందనలు
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మహాకూటమి నేతలు నితీష్ కుమార్, లాలుప్రసాద్ యాదవ్ కు అభినందనలు తెలిపారు. మంచి పాలన అందించినందుకే మరోమారు ప్రజలు నితీష్కు పట్టం కట్టారని ఆయన అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నితీష్ కుమార్ను అభినందించారు. కాగా బిహార్ ఎన్నికల్లో జేడీయూ కంటే ఆర్జేడీనే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
మాంఝీ బోణీ కొట్టారు..
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి భాగస్వామి హెచ్ఏఎం నేత జితన్ రాం మాంఝీ బోణీ కొట్టారు. ఇమాంగంజ్ నియోజకవర్గంలో ఆయన విజయం సాధించారు. 18,278 ఓట్ల మెజార్టీతో మాంఝీ గెలుపొందారు. జేడీయూ అభ్యర్థి ఉదయ్ నారాయణ చౌదరికి 10,198 ఓట్లు రాగా, బీఎస్పీ నుంచి పోటీ చేసిన మధురా పాశ్వాన్ కేవలం 576 ఓట్లు పొందారు. మరోవైపు మఖ్దుంపూర్ నియోజకవర్గం నుంచి కూడా బరిలో ఉన్న మాంఝీ అక్కడ మాత్రం వెనకంజలో ఉన్నారు. -
ఢిల్లీ సీఎం జోస్యం నిజమైంది!
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళుతోంది. దీంతో బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధ్యక్షుడు ఆదివారం నితీష్ కుమార్కు అభినందనలు తెలిపారు. ఇది చారిత్రాత్మక విజయం అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కాగా ఢిల్లీ వాసులంతా బీహార్లో ఉన్న తమ బంధుమిత్రులకు ఫోన్ చేసి నితీష్కు ఓటు వేయాలంటూ బిహార్ ఎన్నికల సందర్భంగా కేజ్రీవాల్ విజ్ఞప్తి కూడా చేశారు. అలాగే బిహార్ ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఓటమి తప్పదని, నితీష్ కుమార్ గెలుపు ఖాయమంటూ జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు శివసేన కూడా బిహార్ ఫలితాలపై స్పందించింది. నితీష్ కుమార్ పొలిటికల్ హీరో అంటూ అభివర్ణించింది. బిహార్ ఓటమికి ప్రధాని మోదీ బాద్యత వహించాలని, నితీష్ గొప్ప విజయాన్ని సాధించారని శివసేన వ్యాఖ్యానించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement