-
తీపి కబురు
⇒ ప్రయివేటీకరణ చెర వీడనున్న ఎన్డీఎస్ఎల్ ⇒ సీఎం సమక్షంలో ఎట్టకేలకు వీడిన సందిగ్ధత ⇒ రైతులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం ⇒ చెరుకు ధరపై స్పష్టత ఇచ్చిన కేసీఆర్ ⇒ టన్నుకు రూ. 340 ప్రభుత్వమే భరిస్తుందని హామీ బోధన్: బోధన్ ప్రాంత రైతులు, కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు తీపికబురు అందించారు. ‘నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్’కు ప్రయివేటు చెర విడిపించేందుకు భరోసా ఇచ్చారు. పుష్కర కాలంగా ఈ అంశం పెండింగ్లో ఉంది. ఎన్డీఎస్ఎల్ను ప్రభు త్వ పరం చేస్తామని, ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తెస్తామ ని టీఆర్ఎస్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. ఇపుడు ఆ హామీ నెరవేరేలా ఓ అడుగు ముందుకు పడింది. సోమవారం సీఎం హైదరాబాద్లోని సచివాల యంలో బోధన్, కరీంనగర్ జిల్లా మెట్పల్లి, మెదక్ జిల్లాకు చెందిన ఎన్డీఎస్ఎల్ యూనిట్ల పరిధిలోని రైతులతో సమావేశమయ్యారు. నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీలు కల్వకుంట్ల కవిత, బీ బీ పా టిల్, రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, బోధన్, మెట్పల్లి, మెదక్ ఎమ్మెల్యేలు మహ్మద్ షకీల్, వి ద్యాసాగర్రావు, పద్మాదేవేందర్రెడ్డి ఇందులో పా ల్గొన్నారు. ఈ సందర్భంగా చక్కెర ఫ్యాక్టరీ భవితపై నిర్ణయం తీసుకునేందుకు రైతులతో సమావేశాలు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ విషయా న్ని బోధన్ చెరుకు ఉత్ప త్తిదారుల సంఘం అధ్యక్షు డు కెపీ శ్రీనివాస్రెడ్డి ఫోన్లో ‘సాక్షి’కి తెలిపారు. కొ ద్ది రోజుల క్రితమే ఎమ్మెల్యే షకీల్ నేతృత్వంలో రైతులు ఎంపీ కవితను కలిసి చెరుకు ధర, ఫ్యాక్టరీ భవిత అంశాలపై చర్చించారు. ఆమె చొరవ తీసుకుని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సమావేశాలు ఇలా ఫ్యాక్టరీ భవిత గురించి చర్చించేందుకు మూడు ఫ్యాక్టరీల పరిధిలో రైతులతో సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ సూచించారు. ఈ నెల 7న మెట్పల్లిలో, 10న మెదక్లో, 11న బోధన్లో సమావేశాలు నిర్వహిస్తారు. బోధన్ సమావేశానికి ఎంపీ కవిత హాజరవుతారు. ఫ్యాక్టరీని ప్రభుత్వమే నిర్వహించాలా? రైతుల భాగస్వామ్యంతో నడుపాలా అనే అంశంపై అభిప్రాయాలు సేకరించనున్నారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలో సహకార పద్ధతిన నడుస్తున్న ఫ్యాక్టరీల నిర్వహణపై అధ్యయనం చే యాలని సీఎం సూచించినట్టు రైతు నాయకులు తెలిపారు. ఒక్క పైసా ఖర్చు బరువు పడకుండా ప్రభుత్వం ఫ్యాక్టరీని ఆధునీకరిస్తుందని హామీ ఇచ్చారన్నారు. 2014-15 క్రషింగ్ సీజన్కుగాను ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం టన్నుకు రూ. 2260 ధర చెల్లిస్తామంటోంది. రైతులు రూ. 2600 చెల్లిం చాలని కోరుతున్నారు. దీనికీ సీఎం అంగీకరించి, రెండు మూడు రోజులలో జీఓ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. 12 ఏళ్లుగా నాటకీయ పరిణామాలు ఆసియాలోనే అతి పెద్ద వ్యవసాయాధార పరిశ్రమగా ఖ్యాతి పొందిన బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ నిజాం పాలకులు 1938లో నిర్మించారు. ప్రభుత్వరంగ సంస్థగా ఉండగా ఇది ఓ వెలుగు వెలిగింది. వేలాది మంది కార్మికులకు జీవనోపాధి కల్పించిం ది.రైతులకు లాభసాటి ధర అందించింది. 2002లో చంద్రబాబు దీనిని ప్రయివేటీ కరించారు. వారికే నిర్వహణ అధికారం కట్టబెట్టారు. దీంతో రైతులు, కార్మికులు తీవ్ర కష్టాల పాలయ్యారు. వందలాది మంది కార్మికులను ఉద్యోగాలు కోల్పోయారు. రై తులు లాభసాటి ధర అందక అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ప్రయివేటీకరణను రద్దు చేయాలని రైతులు, కార్మికులు దశాబ్ద కాలం నుంచీ పోరాడుతున్నారు. నిజాం షుగర్స్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఎం అప్పిరెడ్డి, పలువురు రైతు, కార్మిక సం ఘాలు హైకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేశారు. ఇపుడు ఈ పోరాటం ఫలిం చబోతోంది. 2004లో వైఎస్ఆర్ హయాంలో సభా సంఘం 2004లో అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిజాం షుగర్స్ ప్రయివేటీకరణలో అవినీతి,అక్రమాల నిగ్గు తేల్చేందుకు సభా సంఘాన్ని నియమించారు. 2006 ఆగస్టు 31న ఇది నివేదిక ఇచ్చింది. ఫ్యాక్టరీని తిరిగి స్వా దీనం చేసుకోవాలని సిఫారసు చేసింది. ఆయన మరణానంతరం ఈ అంశం కోర్టు విచారణకు వ చ్చిన సందర్భంలో ఉమ్మడి రాష్ట్రం ప్రభుత్వం మీనమేషాలు లెక్కించింది. ఫ్యాక్టరీ స్వాధీనం అంశాన్ని పట్టించుకోలేదు. దాంతో విషయం మరుగున పడిపోయింది. ఎట్టకేలకు సీఎం కేసీఆర్ ఫ్యాక్టరీపై స్పష్టత ఇవ్వడంతో రైతులు, కార్మికులలో హర్షం వ్యక్తం అవుతుంది. సీఎంతో జరిగిన సమావేశంలో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు కెపీ శ్రీనివాస్రెడ్డి,ఉపాధ్యక్షుడు శివరాజ్పాటిల్, ప్రధాన కార్యదర్శి గోపాల్ రెడ్డి, బి. సుబ్బారావు, మారుతీపటేల్, ఆర్ విఠల్, నిజాం షుగర్స్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఎం అప్పిరెడ్డితోపాటు మరో 30 మంది రైతులు, మెట్పల్లి, మెదక్కు చెందిన రైతు నాయకులు పాల్గొన్నారు. -
‘బకాయిల’పై సర్కారు సీరియస్
బోధన్, న్యూస్లైన్ : చెరుకు రైతులకు బకాయిల చెల్లింపులో ఫ్యాక్టరీ యాజమాన్యం జాప్యం చేయడాన్ని సర్కారు తీవ్రంగా పరిగణిస్తోంది. క్రషింగ్కు చెరుకు పంటను తరలించిన రైతులకు డబ్బులు చెల్లించాలని కేన్ కమిషనర్ ఆదేశించారు. పక్షంలోగా డబ్బులు చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్(ఎన్డీఎస్ఎల్) పరిధిలో బోధన్, కరీంనగర్ జిల్లాలోని మెట్పల్లి, మెదక్ జిల్లాలోని ముంబోజిపల్లి యూనిట్లకు రైతులు చెరుకు సరఫరా చేశారు. అయితే రైతులకు బిల్లు లు చెల్లించడంలో ఫ్యాక్టరీలు నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తున్నాయి. ఈ మూడు యూనిట్ల పరిధిలో సుమారు రూ. 45 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. ఒక్క బోధన్ యూనిట్ పరిధిలోనే రూ. 10.50 కోట్ల బకాయిలున్నాయి. ఈ విషయమై చెరుకు రైతులు, బోధన్కు చెందిన నిజాం షుగర్స్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ అప్పిరెడ్డి తదితరులు మంగళవారం హైదరాబాద్లో రాష్ట్ర కేన్ కమిషనర్ బద్రు మల్హోత్ను కలిశారు. రైతుల బాధలు వినిపిం చారు. దీనిపై ఆయన స్పందించి అసిస్టెంట్ షుగర్ కేన్ కమిషనర్లకు ఫోన్ చేశారు. ఎన్డీఎస్ఎల్ యాజమాన్యానికి గతనెల 15వ తేదీన షోకాజ్ నోటీసులు జారీ చేశామని బోధన్ అసిస్టెంట్ కేన్ కమిషనర్ వివరించారు. మే 31 వరకు బకాయిలు చెల్లిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చినా నిలబెట్టుకోలేదని పేర్కొన్నారు. తాజాగా ఆర్ఆర్ఏ ఫాం నెంబర్-1 ప్రకారం ఫ్యాక్టరీ యాజమాన్యానికి మంగళవారం నోటీసులు పంపించామన్నారు. ఈ నోటీసు ప్రకారం పదిహేను రోజుల్లోగా ఫ్యాక్టరీ స్పందించకపోతే చట్ట ప్రకారం ఫ్యాక్టరీ ఆస్తులను సీజ్ చేస్తామని పేర్కొన్నారు. క్రషింగ్ ప్రారంభం నుంచి వివాదమే 2013-14 క్రషింగ్ సీజన్ ప్రారంభం నుంచి బోధన్లోని శక్కర్నగర్ ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం వివాదాస్పదంగా వ్యహరిస్తోంది. 2013 నవంబర్ ఆఖరులో క్రషింగ్ ప్రారంభమవ్వాల్సిన సమయంలో క్రషింగ్ను నిలపివేసింది. రైతులు ఆందోళన చేయడంతో కలెక్టర్ ప్రద్యుమ్న జోక్యం చేసుకున్నారు. దీంతో డిసెంబర్ 7వ తేదీన క్రషింగ్ ప్రారంభమై ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీ వరకు సాగింది. ఈ సీజన్లో లక్షా 72 వేల టన్నుల చెరుకును క్రషింగ్ చేశారు. ధర విషయంలోనూ.. మద్దతు ధర విషయంలోనూ ఫ్యాక్టరీ ఏకపక్షంగా వ్యవహరించింది. టన్ను చెరుకుకు రూ. 3,500 మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరగా 2012-13 సీజన్లో చెల్లించినట్లుగా టన్నుకు రూ. 2,600 ప్రకటించింది. గత్యంతరం లేక రైతులు ఇదే ధరకు చెరుకును విక్రయించారు. చెరుకు సరఫరా చేసిన రైతులకు 15 రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చినా నిలబెట్టుకోలేదు. ముందుగా చెప్పినట్లుగా రూ. 2,600 చెల్లించాల్సి ఉండగా మొదటి నాలుగు రౌండ్లలో రూ. 2,400 చొప్పునే చెల్లించింది. ఐదో రౌంట్లో రూ. 7 కోట్లు చెల్లించాల్సి ఉంది. రైతులకు మొత్తం రూ. 10.50 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ బిల్లులకోసం రైతులు మూడు నెలలుగా ఎదురు చూస్తున్నారు. ఒప్పందాలను ఉల్లంఘించింది శ్రీనివాస్ రెడ్డి, చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు, బోధన్ ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం ఒప్పం దాలను ఉల్లఘించింది. చెరుకు బిల్లులు సరఫరా చేసిన 15 రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. చెరుకు సరఫరా చేసి నాలుగు నెలలు కావస్తున్నా బిల్లులు చెల్లించడం లేదు. తక్షణమే బకాయిలు చెల్లించాలి. ఆర్ఆర్ఏ ప్రకారం నోటీస్ ఇచ్చాం జాన్ విక్టర్, అసిస్టెంట్ కేన్ కమిషనర్, బోధన్ ఆర్ఆర్ఏ ఫాం నెంబర్-1 ప్రకారం ఎన్డీఎస్ఎల్ యాజమాన్యానికి మంగళవారం నోటీసులిచ్చాం. 15 రోజుల్లో ఫ్యాక్టరీ స్పందించాలి. లేకపోతే ఫ్యాక్టరీ ఆస్తులు సీజ్ చేస్తాం.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- నా భార్య హింసిస్తోంది.. రక్షణ కల్పించండి
- పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
- పశుపోషకులకు బాసటగా..
- నేటి నుంచే టెట్.. రోజుకు రెండు షిప్టులుగా నిర్వహణ
- టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వ్యక్తి మృతి
- మార్చినచోటే మారణకాండ
- గాల్లో తేలిపోతూ..కార్లో ఎగిరిపోతూ..
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
Advertisement