-
బీఎండబ్ల్యూలో తండ్రి శవాన్ని ఉంచి..
లాగోస్ : ఎవరైనా మరణిస్తే వారి ఆచార వ్యవహారాలకు అనుగుణంగా భౌతికకాయాన్ని పాతిపెట్టడమో, దహన సంస్కారాలు నిర్వహించడమో చేస్తారు. కానీ నైజీరియాకు చెందిన అజుబుకి అనే వ్యక్తి తన తండ్రి శవాన్ని ఏకంగా బ్రాండ్ న్యూ బీఎండబ్ల్యూ కారులో ఉంచి సమాధి చేశారు. నైజీరియాలోని మారుమూల గ్రామం ఎంబొసిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఫోటో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. బీఎండబ్ల్యూ కారులో ఉంచిన మృతదేహాన్ని సమాధి చేసేందుకు ఆరు అడుగుల లోతున గుంటను తవ్వారు. తాను ఎప్పటికైనా ఖరీదైన కారును కొంటానని అజుబుకి తరచూ తన తండ్రితో చెప్పేవారు. తండ్రి మరణంతో వెనువెంటనే బీఎండబ్ల్యూ కారును కొన్న అజుబుకి మృతదేహాన్ని కారులో ఉంచి సమాధి చేయడం చూపరులకు విస్తుగొలుపుతోంది. మరోవైపు తన తండ్రిని స్వర్గానికి తీసుకువెళ్లేందుకు సహకరించేలా కారులో శాటిలైట్ నావిగేషన్ను ఏర్పాటు చేసినట్టు ది సన్ పత్రిక పేర్కంది. మొత్తానికి అజుబుకి నిర్ణయం ఇంటర్నెట్ను ఊపేస్తోంది. దీనిపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. తండ్రిపై అజుబకి ప్రేమను కొందరు సమర్ధిస్తుండగా, దీనికి ఖర్చు చేసిన మొత్తం పేదలకు సాయపడేందుకు ఉపయోగిస్తే బావుండేదని మరికొందరు వ్యాఖ్యానించారు. -
నైజీరియాలో 69 మంది అగ్నికి ఆహుతి
లాగోస్: నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ పెట్రోలు ట్యాంకర్ అదుపుతప్పి బస్స్టేషన్లోకి దూసుకుపోవడంతో మంటలు చెలరేగి 69 మంది అగ్నికి ఆహుతయ్యారు. అనంబ్రా రాష్ట్రంలోని ఒనిట్షాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రమాదంలో 12 బస్సులతోపాటు పలు వాహనాలు దెబ్బతిన్నాయి. చాలామంది కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు రెడ్క్రాస్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. రవాణాకు కాలం చెల్లిన వాహనాలను వినియోగించడం, రోడ్లు అత్యంత అధ్వానంగా ఉండడంతో నైజీరియాలో ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. -
నైజీరియాలో కాలేజీపై మిలిటెంట్ల దాడి 50 మంది మృతి
అబుజా: నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని ఒక కాలేజీపై ఆదివారం మిలిటెంట్లు జరిపిన దాడిలో 50 మంది మృతి చెందారు. యోబె రాష్ట్రంలోని గుజ్బాలో వ్యవసాయ కళాశాల హాస్టల్పై సాయుధ మిలి టెంట్లు కాల్పులకు తెగబడ్డారు. విద్యార్థులందరూ గాఢనిద్రలో ఉండగా ఈ దాడి జరిగింది. దాడిలో 50 మంది విద్యార్థులు మృతి చెందినట్లు అధికార వర్గాలు ధ్రువీకరించాయి. అయితే, మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పాయి. యోబె రాజధాని దమాతురులోని ఆస్పత్రికి మృతదేహాలను తరలించారు. అకస్మాత్తుగా దాడి జరగడంతో దాదాపు వెయ్యిమంది విద్యార్థులు కళాశాల ప్రాంగణం నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ తర్వాత మిలిటెంట్లు కళాశాలకు నిప్పుపెట్టారని సైనిక ప్రతినిధి లాజరస్ ఎలీ చెప్పారు. ఈ దాడి ‘బోకో హరామ్’ ఇస్లామిక్ మిలిటెంట్ల పనేనని అనుమానిస్తున్నారు
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
ఎన్నికల బరిలోకి 'జస్వీర్ సింగ్ గర్హి'.. అక్కడ నుంచే పోటీ
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్ను ఉతికి ఆరేసిన ప్రిన్సిపాల్
రెండేళ్లుగా గప్చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement