-
కరోనాకు ముగింపు లేదా!?
‘కరోనా కార్చిచ్చులాంటిది.. అడవి మొత్తం తగలబడే వరకు కార్చిచ్చు ఆరదు, అలాగే మానవాళి మొత్తానికి ఒక్కసారైనా సోకే వరకు కరోనా ఆగదు’ అంటున్నారు ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్టులు. మానవాళి మరికొన్ని సంవత్సరాల పాటు కరోనాతో ఇబ్బందిపడక తప్పదని హెచ్చరిస్తున్నారు. కరోనా సోకి ఇమ్యూనిటీ పెరగడం కన్నా టీకాలతో ఇమ్యూనిటీ పెంచడం మంచిదంటున్నారు. వ్యాక్సినేషన్తోనే దీన్ని అరికట్టడం సాధ్యమని మరోమారు గుర్తు చేస్తున్నారు. సంవత్సరన్నరకు పైగా ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనాకు నిజంగా ముగింపు ఉందా? ఉంటే ఎప్పుడు? ఎలా? అనేవి ప్రతిఒక్కరిలో తలెత్తే ప్రశ్నలు. కానీ ఇంతవరకు సైంటిస్టులు దీనికి స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. తాజాగా వచ్చే 3–6 నెలల్లో పరిస్థితులు ఎలా ఉండొచ్చన్న అంశంపై సైంటిస్టులు పరిశోధన జరిపారు. అయితే వచి్చన సమాధానాలు ఏమంత ఆశాజనకంగా లేవని చెప్పారు. రాబోయే కాలంలో మరలా కరోనా ప్రబలవచ్చని, దీనివల్ల స్కూళ్లు మూతపడడం, టీకాలు తీసుకున్నవారిలో కొత్త ఇన్ఫెక్షన్ భయాలు పెరగడం, ఆస్పత్రులు కిటకిటలాడటం జరగవచ్చని హెచ్చరించారు. కరోనాకు నిజమైన ముగింపు వచ్చే లోపు ప్రపంచంలో ప్రతిఒక్కరూ దీని బారిన ఒక్కసారైనా పడటం లేదా టీకా తీసుకోవడం జరుగుతుందన్నారు. కొందరు దురదృష్టవంతులకు రెండుమార్లు కరోనా సోకే ప్రమాదం కూడా ఉండొచ్చన్నారు. అందరికీ కరోనా సోకేవరకు వేవ్స్ రాకడ ఆగకపోవచ్చని అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడం, తిరిగి తగ్గడం గమనించవచ్చని అమెరికా సైంటిస్టు మైకేల్ ఓస్టర్ హామ్ అభిప్రాయపడ్డారు. మ్యుటేషన్లతో ప్రమాదం వైరస్ల్లో వచ్చే మ్యుటేషన్లు(ఉత్పరివర్తనాలు) కొత్త వేరియంట్ల పుట్టుకకు కారణమవుతాయన్నది తెలిసిందే! కరోనాలో మ్యుటేషన్ మెకానిజం ఇతర వైరస్లతో పోలిస్తే మెరుగ్గాఉంది. గత వేరియంట్లలో లోపాలను దిద్దుకొని కొత్త వేరియంట్లు పుట్టుకువస్తున్నాయి. ఇందువల్ల రాబోయే కాలంలో ఫ్లూలాగానే ఎప్పటికప్పుడు కరోనాకు టీకా (బూస్టర్ డోస్లు) టాప్అప్లు తీసుకోవాల్సిరావచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. కొన్ని మ్యుటేషన్ల అనంతరం ఫస్ట్జనరేషన్ వ్యాక్సిన్లను తట్టుకునే వేరియంట్ రావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేకాకుండా కొత్త రకం ఫ్లూ వైరస్ మానవాళిపై దాడి చేసే అవకాశాలు లేకపోలేదని ప్రముఖ శాస్త్రవేత్త కంటా సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ఏదిఏమైనా 5,6 నెలల్లో మాత్రం కరోనా మాయం కాకపోవచ్చని సైంటిస్టుల ఉమ్మడి మాట. ప్రపంచ జనాభాలో 95 శాతం వరకు ఇమ్యూనిటీ(కరోనా సోకి తగ్గడం వల్ల లేదా టీకా వల్ల) వస్తేనే కోవిడ్ మాయం అవుతుందని చెబుతున్నారు. హెర్డ్ ఇమ్యూనిటీకి అత్యుత్తమ మార్గం వ్యాక్సినేషనేనని చెప్పారు. కరోనా ముగింపు ప్రపంచమంతా ఒకేదఫా జరగకపోవచ్చని, ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో(టీకా కార్యక్రమం పూర్తికావడం బట్టి) కరోనా మాయం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఏం జరగవచ్చు ఒకపక్క కోట్లాదిమందికి టీకా అందలేదు, మరోపక్క ఆర్థిక వ్యవస్థలు చురుగ్గా మారుతున్నాయి. ఈ రెండింటి సమ్మేళనంతో మరలా కేసులు పెరగవచ్చని మైకేల్ అంచనా వేశారు. టీకా కార్యక్రమాల వేగం పెరిగినా, వైరస్ బారిన పడే ప్రమాదం ఉన్నవారు(ఉదాహరణకు పసిపిల్లలు, టీకా అందని వారు, బ్రేక్థ్రూ ఇన్ఫెక్షన్ బారిన పడేవారు) ఎప్పుడూ ఉంటారన్నారు. రాబోయే కొన్ని నెలలు ప్రమాదమని, ముఖ్యంగా టీకా నిరోధక వేరియంట్ వస్తే మరింత ప్రమాదమని సైంటిస్టుల అంచనా. 130 ఏళ్ల క్రితం మనిíÙని ఐదుమార్లు వణికించిన ఇన్ఫ్లుయెంజా మహమ్మారి ఉదంతాన్ని గమనిస్తే కరోనా భవిష్యత్పై ఒక అంచనా రావచ్చని భావిస్తున్నారు. వీటిలో ఒక దఫా సుమారు ఐదేళ్లు మానవాళిని పీడించింది. ఆ ఐదేళ్లలో 2–4 వేవ్స్ వచ్చాయి. దీనికన్నా కరోనా ప్రమాదకారని, కనుక థర్డ్వేవ్ తప్పదని లోనే సిమన్సన్ అనే సైంటిస్టు అభిప్రాయపడ్డారు. అధిక వ్యాక్సినేషన్లు, ఆధునిక సౌకర్యాలున్న అగ్రరాజ్యాల్లో సైతం మరలా కేసులు పెరుగుతున్న సంగతి గుర్తు చేశారు. టీకాల వల్ల మరణాలు తగ్గవచ్చని, కానీ కేసులు పెరగడం ఆగకపోవచ్చని చెప్పారు. ముఖ్యంగా టీకాలు పెద్దగా కనిపించని మెక్సికో, ఇరాన్ లాంటి దేశాల్లో డెల్టాతో డేంజర్ పెరగవచ్చని చెప్పారు. టైమ్ గడిచేకొద్దీ వైరస్లు బలహీనపడతాయన్న అపోహ వద్దన్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
నో ఎండ్ లఘుచిత్రానికి జాతీయ స్థాయి అవార్డు
పెద్దాపురం : జాతీయ స్థాయి లఘు చిత్రాల పోటీల్లో పెద్దాపురం మండలం చదలాడ గ్రామానికి చెందిన కోడిగుడ్డు శ్రీరామ్ ఇటీవల చిత్రీకరించిన నో ఎండ్ లఘు చిత్రానికి జాతీయ స్థాయి అవార్డు లభించింది. గత ఏడాది మండలంలోని చదలాడ, పరిసర ప్రాంతాలు, కాకినాడ, కోనసీమ ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని నూతన నటీనటులతో కోడిగుడ్డు త్రిమూర్తులు, అరవపల్లి శ్రీను, అత్తిలి నాగబాబు నిర్మాతలుగా రూపొందించారు. లఘు చిత్రానికి కథానాయకుడిగా శివ, కథానాయికగా హైదరాబాద్కు చెందిన నాగభార్గవిలు నటించగా నటులు సానా నూకరాజునాయుడు, రవి సబ్బసాని తదితరులు వివిధ పాత్రలు పోషించారు. ఇటీవల యూఆర్ ఫిల్మ్స్ (హైదదాబాద్) వారు నిర్వహించిన జాతీయ స్థాయి లఘు చిత్రాల పోటీల్లో ఈ చిత్ర హీరోయిన్ నాగభార్గవికి జాతీయ స్థాయి అవార్డు లభించింది. దీంతో చిత్రబృందం సోమవారం మండలంలోని చదలాడలో సందడి చేసుకుంది. దర్శకుడు శ్రీరామ్ విలేకర్లతో మాట్లాడుతూ మొదటి ప్రయత్నంలో తమ చిత్రానికి జాతీయ అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. నటి భార్గవి మాట్లాడుతూ ఈ క్రెడిట్ దర్శకుడు శ్రీరామ్కే చెందుతున్నారు. అనంతరం చిత్ర బృందాన్ని గ్రామ పెద్దలు రాగాల ఉమామహేశ్వరరావు, సర్పంచ్ మాణిక్యాంబ, ఎంపీటీసీ కోట శ్రీనివాసరావు అభినందించారు. -
హిచ్కాక్ తరహా స్క్రీన్ప్లే
ఆ బంగ్లాలో ఓ ఫ్యామిలీ దిగుతుంది. అక్కడ ఏవేవో వింతలూ విడ్డూరాలూ వాళ్లకు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘నో ఎండ్’. భరత్, స్నేహానాయుడు, ప్రవీణ్, శరణ్య కాంబినేషన్లో మురళి కామేటి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ తరహా స్క్రీన్ప్లేతో ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ వింత అనుభూతిని కలిగిస్తుందని, ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తామని మురళి కామేటి తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రాము అద్దంకి, కెమెరా: రవి.ఎం. మురళీకృష్ణ, సహనిర్మాతలు: సంజీవ కామేటి, నరేశ్ యాదవ్.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement