-
సార్లకు సమయపాలనే లేదు
ఉదయం 10.30 గంటలైనా తెరుచుకోని ప్రభుత్వ కార్యాలయాలు ఇబ్బందులుపడుతున్న కార్యార్ధులు చేజర్ల : చేజర్లలో ప్రభుత్వ కార్యాలయాల అధికారులు, సిబ్బందికి వేళకు రాకపోవడం షరామామూలే అయిపోయింది. దీంతో కార్యార్ధులు పడుతున్న ఇబ్బందులు అన్నిఇన్నీకావు. శుక్రవారం చేజర్లలో ప్రభుత్వ కార్యాలయాలను విజిట్ చేయగా ఈ విషయం మరోమారు బయటపడింది. ఉదయం 10.30 గంటలైనా వెలుగు కార్యాలయం తలుపులు తీయలేదు. అదే సమయానికి వివిధ పనులపై ఈ కార్యాలయానికి అనేకమంది మహిళలు వచ్చారు. దీనిపక్కనే ఉన్న వ్యవసాయాధికారి కార్యాలయం తలుపులు ఉయదం 10:30 గంటలు దాటినా తీయలేదు. ఇన్పుట్ సబ్సిడీ వివరాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలకోసం వచ్చిన రైతులు కార్యాలయం పక్కనే పడిగాపులుకాస్తూ కనిపించారు. మామూలుగా తహసీల్దార్ కార్యాలయం ఉదయం 7, 8 గంటల నుంచే కిటకిటలాడుతూ ఉంటుంది. సిబ్బంది వచ్చేసి ఉంటారు. అయితే చేజర్లలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. 10 గంటలకు అక్కడ ఒక్కరు కూడాలేరు. వివిధ గ్రామాలనుంచి వచ్చిన ప్రజలు రేషన్కార్డుల్లో మార్పులు, చేర్పులు, విద్యార్థులు సర్టిఫికెట్లు వచ్చి ఎదురుచూశారు. వీఆర్వోల కోసం గంటలతరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది అయితే మధ్యాహ్నం 12 గంటలకు కూడా వస్తునేఉన్నారు. అధికారులు, సిబ్బందిలో చాలామంది బయటిప్రాంతాలకు చెందినవారు ఉండటంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రీక్ ఏర్పాటుచేయాలని ప్రజలు కోరుతున్నారు. -
హరీష్తో పంచాయితీ పెట్టుకునే టైం లేదు
- ఇద్దరమూ కష్ట పడుతున్నాం.. ఇద్దరికీ మద్దతుంది - పార్టీపై అనుమానాలు పటాపంచలు చేయగలిగాం - గ్రేటర్లో ప్రజల మద్దతును ఓట్లుగా మలుచుకుంటాం - 'సాక్షి'ముఖాముఖిలో ఐటీ మంత్రి కేటీ రామారావు సాక్షి, హైదరాబాద్: 'మంత్రి హరీష్రావుతో పంచాయితీ పెట్టుకునేంత సమయం నాకు లేదు. పంచాయితీ పెట్టుకోవాల్సిన అవసరమూ లేదు. ఇద్దరమూ 24 గంటలు కష్టపడి పనిచేసినా.. సరిపోనంత పని ఉంది. ఇద్దరమూ కష్టపడి చేస్తున్నం.. ఇద్దరికీ ప్రజల మద్దతు ఉంది' అని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో శనివారం 'సాక్షి'తో మాట్లాడారు. 'రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కొందరు మాపై ఎన్నో అనుమానాలు, అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారు. ఇతర ప్రాంతాల వారిని వెళ్లగొడుతారని, వేరే రాష్ట్ర్రాల వారు వ్యాపారాలు చేసుకునే పరిస్థితి వుండదని రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే శాంతిభద్రతలు ఉండవని దుర్మార్గ ప్రచారం చేశాం. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో హైదరాబాద్లో శాంతిభద్రతలను పరిరక్షించడంతో పాటు.. పేద ప్రజల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లోకి వెళ్లాం. ట్రాఫిక్, తాగునీటి సమస్యలపై మేమేం చేస్తామో ప్రజల్లోకి వెళ్లాం. ప్రజల మనసులను గెలుచుకుని, వారి నుంచి వస్తున్న సానుకూలతను ప్రస్తుత ఎన్నికల్లో ఓట్లుగా మార్చుకుంటాం' అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. విద్యుత్, తాగునీరు వంటి మౌళిక సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం దష్టి పెట్టింది. ప్రజల నుంచి కూడా మద్దతు పెరిగిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆయన వెల్లడించిన మరికొన్ని అంశాలు.. అమరావతి శంకుస్తాపన సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే కేసీఆర్కే ఎక్కువ కరతాళ ధ్వనులు లభించాయని ఓ ఆంధ్ర ప్రాంత మంత్రి అన్న వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర సమితి పేరును తెలుగు రాష్ట్ర సమితిగా మారుస్తామంటూ సరదాగా వ్యాఖ్యానించా. దానిని చిలువలు పలువలు చేయడం సరికాదు. రాజకీయాల్లో మరీ ఇంత సీరియస్గా ఉంటే కష్టం. నగరంలో నలుగురు మంత్రులున్నారు. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మరో మంత్రి మహేందర్రెడ్డి ప్రచార బాధ్యతలు చూస్తారు. ఐటీ మంత్రిగా ఈ రంగంతో ఉన్న అనుబంధం, స్థానికంగా నాకున్న పరిచయాల కారణంగా గ్రేటర్ ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించారు. పార్టీ ఏ పని అప్పగించినా కార్యకర్తగా.. ఆ పని చేయడం నా బాధ్యత. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి పార్టీ మేనిఫెస్టో మరో వారం రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. పార్టీ ముఖ్యులు త్వరలో భేటీ అయి మేనిఫెస్టోకు తుది రూపు ఇస్తారు. అభ్యర్థుల ఎంపిక శాస్త్రీయంగా జరుగుతుంది. అన్ని కోణాల్లో పరిశీలించి విస్తత ఏకాభిప్రాయ సాధన తర్వాతే అభ్యర్థులను ప్రకటిస్తాం. ఇప్పటికే డివిజన్ల వారీగా మూడు సర్వేలు నిర్వహించాం. ఎంత మంది పోటీ పడుతున్నా 150 మందికి మాత్రమే అవకాశం ఇవ్వగలం. గ్రేటర ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ రెండు లేదా మూడు బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశం వుంది. మీడియా ద్వారా ప్రజలతో ముఖాముఖి జరపాలనే ఆలోచన కూడా ఉంది. మేయర్ అభ్యర్థిని ముందే నిర్ణయించే సాంప్రదాయం మా పార్టీలో గతంలో లేదు. ఇప్పుడూ వుండదు. గెలిచిన వారే మేయిర్ ఎవరనేది నిర్ణయిస్తారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
HYD: ఏసీపీ నివాసంలో సోదాలు.. బయటపడుతున్న నోట్ల కట్టలు
శ్యామలపై తప్పుడు కథనాలు.. చట్టపరంగానే ముందుకెళ్తానన్న యాంకర్!
స్టార్క్ సూపర్ డెలివరీ.. హెడ్కు ఫ్యూజ్లు ఔట్
భారీగా పెరిగిన ఫ్లిప్కార్ట్ గ్రోసరీ బిజినెస్
లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు
తెలంగాణ దశాబ్దిపై కేటీఆర్ ట్వీట్..
బిగ్బాస్ బ్యూటీకి చేదు అనుభవం.. నెల రోజులైనా రాలేదు!
Tirupati Gangamma Jatara 2024: తిరుపతిలో ఘనంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)
క్యార్వ్యాన్లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్
నామమాత్రపు స్కోర్కే పరిమితమైన ఎస్ఆర్హెచ్..
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement