-
కూలీ డబ్బులు ఇవ్వలేదని రూ.కోటి కారు తగలబెట్టాడు
నోయిడా: ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఓ వ్యక్తి తనకు కూలీ డబ్బులు ఇవ్వలేదని యజమాని కారు తగలబెట్టి పగ తీర్చుకున్నాడు. సుమారు రూ.2 లక్షల కూలీ పైసలివ్వలేదని యజమానికి చెందిన రూ.కోటి విలువైన మెర్సిడెజ్ బెంజ్ కారును తగలబెట్టేశాడు. ఈ దృశ్యాలు ఇంటి సమీపంలోని సీసీ టీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతన్ని గుర్తించిన యజమాని.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం.. హెల్మెట్ పెట్టుకొని వచ్చి వీధిలో ఎవరూ లేని సమయం చూసి పెట్రోల్ పోసి కారును తగులబెట్టడం అందులో స్పష్టంగా కన్పించింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2020లో ఇంట్లో టైల్స్ వేసిన పనికి సంబంధించి రూ.2 లక్షల కూలీ ఇవ్వకుండా సతాయిస్తున్నాడని అతను ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. Man sets #MercedesBenz on fire in #Noida because the car owner did not pay him money due for tiles installation. #UttarPradesh #ViralVideo pic.twitter.com/4OriOvp1M4 — The Viral Finder (@TheViralFinder) September 14, 2022 ఇదీ చదవండి: Video Viral: మనసుకు నచ్చినోడు.. తాళి కట్టేవేళ పెళ్లికూతురు పట్టరాని సంతోషంతో.. -
అక్కడ గ్యాంగ్రేప్ జరగలేదట!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్య, గ్యాంగ్రేప్ కేసు మరో మలుపు తిరిగింది. ప్రాథమిక విచారణను బట్టి చూస్తే, అసలక్కడ అత్యాచారం అన్నదే జరగలేదని తేలింది. గ్రేటర్ నోయిడాలోని జేవర్ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలపై గ్యాంగ్ రేప్ చేసి, ఒక వ్యక్తిని కాల్చి చంపేశారంటూ దేశవ్యాప్తంగా మీడియాలో సంచలన కథనాలు వెలువడ్డాయి. అయితే, బాధితులని చెబుతున్న మహిళలకు వైద్యపరీక్షలు చేసిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనురాగ్ భార్గవ్ మాత్రం అసలు అత్యాచారం జరిగిన ఆనవాళ్లే లేవని స్పష్టం చేశారు. యమునా ఎక్స్ప్రెస్ వే మీద ఆరుగురు దుండగుల బృందం వారిని పొలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం చేసిందని ఆరోపణలు వచ్చాయి. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన వ్యక్తిని కాల్చి చంపారన్నారు. దీనిపై నోయిడా జిల్లా కలెక్టర్ బీఎన్ సింగ్, సీనియర్ ఎస్పీ లవ్ కుమార్, డాక్టర్ భార్గవ్ కలిసి సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. మహిళలకు ఎలాంటి గాయాలు కాలేదని, అలాగే వీర్యం ఆనవాళ్లు కూడా ఏమీ లేవని డాక్టర్లు నిర్ధారించినట్లు భార్గవ్ చెప్పారు. వారి దుస్తులు, టిష్యూ శాంపిళ్లను లక్నోలోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి, తదుపరి పరీక్షలు చేయిస్తామన్నారు. రెండు మూడు వారాల్లో ఆ పరీక్ష ఫలితాలు వస్తాయి. ప్రాథమిక దర్యాప్తులో గ్యాంగ్ రేప్ జరగలేదని చెబుతున్నా, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక వచ్చేవరకు ఆ కేసులో ఆ ఆరోపణలు అలాగే ఉంటాయని లవ్ కుమార్ చెప్పారు. పొరుగు రాష్ట్రాల పోలీసులను కూడా రంగంలోకి దించి కేసును తేల్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రస్తుతం వరకు అందిన వివరాలను బట్టి ఇది కేవలం దోపిడీయే అయి ఉండొచ్చని వివరించారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement