-
ఇరాన్తో అణు ఒప్పందం
అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా, జర్మనీలతో చరిత్రాత్మక అగ్రిమెంట్ అణ్వస్త్ర తయారీని నిలిపేందుకు ఇరాన్ అంగీకారం ఆర్థిక ఆంక్షల తొలగింపునకు అగ్రరాజ్యాల సంసిద్ధత దేశంలోని అణుకేంద్రాల తనిఖీకి ఇరాన్ ఓకే అమానవీయ, నిరంకుశ ఆంక్షల తొలగింపుపై ఇరాన్ హర్షం చారిత్రక తప్పిదమన్న ఇజ్రాయెల్ వియెన్నా/వాషింగ్టన్: పశ్చిమ దేశాల ఆంక్షల ఫలితంగా తీవ్రస్థాయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇరాన్ ఆరు అగ్ర రాజ్యాలతో అణు ఒప్పందం కుదుర్చుకుంది. అణ్వాయుధ సాధన కార్యక్రమాన్ని నిలిపేందుకు సిద్ధమయింది. ప్రతిగా.. ఇరాన్పై విధించిన ఆర్థిక ఆంక్షలను తొలగించేందుకు ఆరు అగ్ర రాజ్యాలు.. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, చైనా, రష్యా అంగీకరించాయి. ఆస్ట్రియా రాజధాని వియెన్నాలో 18 రోజుల పాటు అవిచ్ఛిన్నంగా సాగిన కీలక చర్చల అనంతరం మంగళవారం ఈ చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో అగ్ర రాజ్యాలతో ఇరాన్ వైరానికి విరామం లభించినట్లైంది. ఈ అణు ఒప్పందం ప్రపంచానికి ఒక ఆశావహ నూతనాధ్యాయమంటూ ఇరాన్, యూరోపియన్ యూనియన్ సహా పలు దేశాలు గొప్పగా ప్రశంసించగా.. ఇది చరిత్రాత్మక తప్పిదమంటూ ఇరాన్ శత్రుదేశం ఇజ్రాయెల్ అభివర్ణించింది. ఈ ఒప్పందం ఇరాన్ అణుబాంబు తయారు చేయకుండా ఆపలేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వ్యాఖ్యానించారు. ఇరాన్పై సైనిక చర్యకు కట్టుబడి ఉన్నామన్నారు. ఈ ఒప్పందం కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తుందన్న ఆశాభావాన్ని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ వ్యక్తం చేశారు. దేవుడు తమ ప్రార్థనలను ఆలకించాడని అన్నారు. ఈ ఒప్పందంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసిన అత్యంత ఆమానవీయ, నిరంకుశ ఆంక్షలు తొలగిపోతాయన్నారు. ‘ఇది పరస్పర ప్రయోజనకర ఒప్పందం. మా లక్ష్యాలు నెరవేరాయి. ఆర్థిక ఆంక్షలు తొలగుతాయి. పౌరఅణు కార్యక్రమం కొనసాగుతుంది’ అని ఇరాన్ అధికారిక టీవీలో ప్రకటించారు. ‘ఈ రోజు ప్రపంచం గొప్ప ఉపశమనం పొంది ఉంటుంది’ అని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందిస్తూ.. ‘ఇరాన్ అణు బాంబు తయారుచేయబోదన్న విశ్వాసంపై కాకుండా.. మరో 15 ఏళ్ల పాటు ఇరాన్ అణ్వాయుధ తయారీకి ఉపక్రమించబోదని పరిశీలించి, నిర్ధారించుకున్న తరువాతే ఈ ఒప్పందం కుదుర్చుకున్నాం’ అని స్పష్టం చేశారు. ఈ ఒప్పందాన్ని అడ్డుకునే ఏ చర్యనైనా వీటో చేస్తానని కాంగ్రెస్ను హెచ్చరించారు. ఇరాన్పై ఆంక్షలను దశలవారీగా తొలగిస్తామన్నారు. ఒప్పందానికి సంబంధించిన అన్ని నిబంధనలను ఐరాస భద్రతామండలి తీర్మానంలో పొందుపరుస్తామన్నారు. ఈ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘిస్తే తక్షణమే ఆంక్షలను తిరిగి విధిస్తామని స్పష్టం చేశారు. ప్రతిపక్ష రిపబ్లికన్లు మెజారిటీగా ఉన్న కాంగ్రెస్కు ఈ ఒప్పందాన్ని సమీక్షించేందుకు రెండు నెలల గడువు ఉంటుంది. ఈ గడువులోగా ఇరాన్పై విధించిన ఆంక్షలను తొలగించడం ఒబామాకు వీలుకాదు. ఒబామా హెచ్చరిస్తున్న వీటోను అతిక్రమించేలా ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా కాంగ్రెస్లో మూడింట రెండువంతుల మెజారిటీ సాధించి, ఈ ఒప్పందం రద్దు అయేలా చూసేందుకు పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించాలని రిపబ్లికన్లు భావిస్తున్నారు. మరోవైపు, ఇరాన్ పార్లమెంటు, ఐక్యరాజ్య సమితి భద్రతామండలి కూడా ఈ ఒప్పందాన్ని ఆమోదించాల్సి ఉంది. మీరు పిడికిలి వదులు చేస్తే..: ‘ఇరాన్ తన పిడికిలిని వదులు చేస్తే.. మా వైపు నుంచి స్నేహ హస్తం అందిస్తాం’ అంటూ ఆరేళ్ల క్రితం ఒబామా చేసిన శాంతి వ్యాఖ్యల అనంతరం ఈ ఒప్పందానికి సంబంధించి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అలాగే, 35 ఏళ్లపాటు అంతర్జాతీయ సమాజంలో ఏకాకిగా ఉంటూ, ఇబ్బందులు పడుతున్న ఇరాన్ను కష్టాల నుంచి ఒడ్డున పడేయాలన్న ఆ దేశాధ్యక్షుడు రౌహనీ సంకల్పం కూడా ఇందుకు తోడైంది.అమెరికా నేతృత్వంలో బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా, జర్మనీ దేశాలు ఇరాన్తో వియోన్నా, జెనీవాల్లో 20 నెలల పాటు సాగించిన లోతైన చర్చోపచర్చల అనంతరం ఒప్పందం ముసాయిదా సిద్ధమైంది. గత 18 రోజుల చర్చల తర్వాత ఒప్పందం తుది రూపునకు వచ్చింది. రెండేళ్ల కష్టం..: ‘దశాబ్దాల శత్రుత్వం సాధించలేని దాన్ని అమెరికాతో పాటు మన మిత్రదేశాలు రెండేళ్ల పాటు సాగించిన చర్చల ద్వారా సాధించాం. అదే అణుబాంబు తయారీని నిరోధించేలా ఇరాన్తో కుదిరిన సమగ్ర దీర్ఘకాలిక ఒప్పందం’ అని ఒబామా వాషింగ్టన్లో విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. మరో 15 ఏళ్ల పాటు ఇరాన్ అణుబాంబును తయారు చేయలేదు’ అని ఉపాధ్యక్షుడు జో బిడెన్ పక్కనుండగా సగర్వంగా ప్రకటించారు. ఒబామా ప్రసంగాన్ని ఇరాన్ అధికారిక టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయడం విశేషం. ‘ఇరాన్ విషయంలో మొదటి నుంచి మేం కోరుకుంటున్న అణ్వస్త్ర తయారీ నిరోధాన్ని మొత్తంమీద సాధించాం’ అని అసాధారణంగా మంగళవారం వేకువజామున్న విడుదల చేసిన ప్రకటనలో ఒబామా పేర్కొన్నారు. అణుబాంబు తయారీ అసాధ్యం ఇరాన్ అణు కార్యక్రమాలపై ఈ ఒప్పందం పదేళ్ల పాటు కఠిన పరిమితులను విధిస్తుంది. ఐరాస నిశిత పరిశీలనకు అవకాశమిస్తుంది. దీనివల్ల అణుబాంబు తయారీ ఇరాన్కు అసాధ్యమవుతుంది. ఇరాన్ ఆయుధాలు సమకూర్చుకోవడాన్ని నిరోధించే అంతర్జాతీయ ఆయుధ నిషేధాజ్ఞలు మరో ఐదేళ్లు అమల్లో ఉంటాయి. అయితే, ఐరాస భద్రతామండలి నుంచి ప్రత్యేక అనుమతితో ఇరాన్ అవసరమైన ఆయుధాలను సమకూర్చుకోవచ్చు’ అని రష్యా తెలిపింది. ఇరాన్లోని సైనిక స్థావరాలను, ఆయుధ కేంద్రాలను ఐరాస అణ్వాయుధ నిఘా సంస్థ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ) పరిశీలించేందుకు ఇరాన్ అంగీకరించిందని ఆ దేశ ఉన్నతాధికారి తెలిపారు. రహస్యంగా అణుబాంబు తయారీకి ఇరాన్ ప్రయత్నిస్తోందా? అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు ఇరాన్ అణుకేంద్రాలను, సైనిక స్థావరాలను ఐఏఈఏ పరిశీలించడానికి ఇరాన్ అంగీకరించాలనేదే ఇన్నాళ్లూ సాగిన చర్చల్లో పశ్చిమ దేశాల ప్రధాన డిమాండ్. అయితే, తనిఖీల పేరుతో తమ సైనిక రహస్యాలను తెలుసుకునే అవకాశం ఆయా దేశాలకు లభిస్తుందనేది ఇరాన్ అనుమానం. అగ్రరాజ్యాల ఆర్థిక ఆంక్షల వల్ల ఇరాన్ ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతులు దారుణంగా పడిపోయాయి. ఈ ఒప్పందం వల్ల చమురు ఎగుమతులు పెరిగి, అగ్రరాజ్యాలతో పాటు ఇతర దేశాల నుంచి వివిధ అవసరాలకు నిధులు పొందే అవకాశం ఇరాన్కు లభిస్తుంది. ఈ ఒప్పందం కింద.. ఇరాన్ తన అపకేంద్ర యంత్రాల(సెంట్రిఫ్యుజెస్) సంఖ్యను 19 వేల నుంచి 6,104కి తగ్గించాల్సి ఉంటుంది. ఈ యంత్రాలు అణుబాంబు తయారీకి అవసరమైన అత్యంత శుద్ధి చేసిన యురేనియంను ఉత్పత్తి చేస్తాయి.మరో పదేళ్ల పాటు తమ దగ్గరున్న ఆధునిక అపకేంద్ర యంత్రాలను యురేనియం ఉత్పత్తికి ఇరాన్ ఉపయోగించరాదు.తమ వద్ద ఇప్పటికే ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వల్లో 98% నిల్వలను తొలగించాలి.తమ దేశంలోని అణు కేంద్రాలను, సరఫరా వ్యవస్థను, యురేనియం గనులను, యురేనియం ఉత్పత్తి, నిల్వ కేంద్రాలను, ప్రయోగ కేంద్రాలను.. అన్నింటినీ అంతర్జాతీయ సమాజం ఎప్పుడైనా తనిఖీ చేసేందుకు ఇరాన్ అంగీకరించాలి.అణ్వాయుధ తయారీకి ఉపయోగపడే ఫ్లుటోనియం ఉత్పత్తిని నిలిపేయాలి.ఈ ఒప్పందంలోని కొన్ని పారదర్శక నిబంధనలు 25 ఏళ్ల పాటు అమల్లో ఉంటాయి. భారత్ హర్షం ఇరాన్తో ఆరు అగ్రదేశాలు కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని భారత్ స్వాగతించింది. అణు సంబంధ వివాదాలను శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నదే భారత్ అభిమతమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ పేర్కొన్నారు. ఈ ఒప్పందంతో ఇరాన్ ఆర్థిక రంగం తిరిగి గాడిన పడుతుందని భారత్ ఆశిస్తోందన్నారు. -
చిరకాల శత్రువుల కరచాలనం
ప్రమాదంలోనూ ఓ సుగుణం ఉంది. ఊహింపశక్యంకాని కూటములకు అది దారితీస్తుంది. ఐఎస్ఐఎస్ విషయంలో అమెరికా, ఇరాన్ల మధ్య కుదిరిన మౌన ఒప్పందం అలాంటిదే. అమెరికా వైమానిక దళం మద్దతుతో ఇరాన్కు చెందిన అల్ కుద్స్ సైనికాధికారులు, సైన్యమూ తిక్రిత్లో ఇరాకీ భూతల ప్రతిఘటనా దాడికి నేతృత్వం వహించారు. అణు ఒప్పందం కుదిరితే ఇరాన్పై ఆంక్షల సడలింపు గురించి ఇప్పటికే ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి సమాలోచనలు జరుపుతున్నది. పౌరులకు సౌఖ్యంగా అనిపించేలా చేయడానికి దేశాలు కనిపెట్టిన భ్రమే స్థిరత్వం. ప్రభుత్వాల నియంత్రణకు మించిన గురుత్వాకర్షణ శక్తి ఈడ్చుకు పోతుంటే దేశాలు మునిగిపోతాయి. లేదంటే మంచిగా ఒక్కొక్క మెట్టే పైకి పోతాయి. గమన వేగం తరచుగా మెల్లగానూ, కొన్నిసార్లు అదృశ్యంగానూ సాగుతుంది. అంతేగానీ సమాజం ఎన్నటికీ స్థిరంగా ఉండదు. 21వ శతాబ్ది మొదటి పదిహేనేళ్లలో ఆఫ్రికా ఖండపు అట్లాంటిక్ తీరప్రాంతాల నుంచి పసిఫిక్ మహాసముద్రంలోని జపాన్ తీరం వరకు ఉన్న ప్రాంతం ఒక వాలు గా మారింది. అందులోని పశ్చిమ భాగం ఊబిలోకి దిగజారిపోతుండగా, భారత్ మొదలు తూర్పు భాగం ఒక్కొక్క అంగుళమే పైకి లేస్తోంది. ఇది ఒక సరిసమాన వాస్తవం కాకపోవచ్చు. కొన్ని మినహాయింపులు దీనికి ఉన్నాయి. ఒంటరిగా, విడిగా ఉన్న భూభాగంగా ఇజ్రాయెల్ దీనికి మినహాయింపు కాదు. ఆ దేశ రాజధాని టెల్ అవీవ్లోని రియల్ ఎస్టేట్ ధరలే ఉదాహణ. శతఘు్నల గురికి అందుబాటులో, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆ నగరంలో కంటే మీరు యూరప్లోనే అపార్ట్మెంట్ను కొనుక్కోవ చ్చు. కానీ అక్కడా ఇక్కడా రియల్ ఎస్టేట్ ధరలు ఒకేలా ఉంటాయి. ఇజ్రాయెల్ను చట్టుముట్టి ఉన్న దేశాల రాజకీయాల వల్ల ఆ దేశ భౌగోళిక- రాజకీయాలు మారాయి. ఇజ్రాయెల్ ప్రథమ శ్రేణి దేశంగానే ఉంటున్నా... పలు యుద్ధాలు వ్యాపించి ధ్వంసమైన ఆ ప్రాంతంలో దాని అస్తిత్వం నేడు అనుబంధమై నదిగా మారింది. ఇజ్రాయెల్ నేత బెంజమిన్ నెతన్యాహూ ఊకదంపుడు ఉపన్యాసాలు దంచుతూనే ఉండి ఉండొచ్చు. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఏకాకి గా ఉండటం ద్వారానే తన భద్రతను అత్యుత్తమంగా పరిరక్షించుకుంటోంది. వివేకంతో దగ్గరగా నిలచి జాగ్రత్తగా గమనిస్తున్న వీక్షక పాత్రధారిగా మారిం ది. ఇజ్రాయెల్ తన శత్రువులను బలహీనపర్చాల్సిన పనే లేదు. అవి వాటికవే తమను తాము బలహీనపరచుకుంటున్నాయి. ఇజ్రాయెల్ చుట్టూ వ్యాపించిన సంఘర్షణ అంచులు ఇక ఎంత మాత్రమూ జాతీయ సరిహద్దుల వెంబడి సాగడం లేదు. అట్టోమన్ సామ్రా జ్య పతనంతో మొదలైన జాతీయ సరిహద్దుల విచ్ఛిన్నం వలస పాలనలో సుదీర్ఘంగా కొనసాగింది. వారి ఆదేశాల ఫలితంగానే పలు దేశాల సరిహద్దు లు సాధారణ సరళ రేఖలుగా మారాయి. అందుకే ఉద్రిక్తతల రేఖలు భౌగోళి కమైనవి కావు, జనాభాపరమైనవి. పాత శత్రుత్వాలకు సంబంధించినవి. ప్రజాభీష్టానుసారం, ప్రజల ఇచ్ఛకు అనుగుణంగా, ప్రజలకు మంచి యైన దాన్ని చేయడానికి మౌలిక ఆవశ్యకత జాతీయ రాజ్యాల ఏర్పాటే. కానీ అరబ్బు, అరబ్బేతర ప్రాంతాల్లోని చాలా సున్నీ ముస్లిం దేశాలు జాతీయ రాజ్యాలను ఏర్పరచుకోవడంలో విఫలమై అంతర్యుద్ధాల్లోకి దిగజారాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ క్షీణత మరమ్మతులకు వీలుకానంతగా దిగజారినట్టనిపి స్తోంది. చరిత్ర శిథిలాలు, తప్పిదాల శకలాల అతుకుల బొంతగా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఆవిర్భావం అందుకు గొప్ప ఉదాహణ. ఈ తీవ్రవాద భూతం తమ శత్రువులను నాశనం చేస్తుందనే ఆశ తో ప్రాంతీయ, ప్రపంచ శక్తులు దానికి ఆర్థిక వనరులను సమకూర్చాయి. అది తన పోషకులకు కూడా అంతే విధ్వంసకారి అని ఇప్పుడు వాటికి అర్థమైంది. ప్రమాదంలో కనీసం ఓ సుగుణం ఉంది. ఒకప్పుడు ఊహింపశక్యంకాని కూటములను అది పెంపొందింపజేస్తుంది. అమెరికా, ఇరాన్ల మధ్య ఐఎస్ఐఎస్ విషయంలో కుదిరిన మౌన ఒప్పందం కచ్చితంగా అలాంటి వాటి లోకెల్లా ఆసక్తికరమైనది. అవి రెండూ ఆ కూటమిలోకి భిన్న దృక్పథాలతో వచ్చినవి. విభిన్నమైన యుద్ధానంతర పరిస్థితులు వాటికవే సమస్యాత్మక దశ కు ఊపిరిపోస్తాయి. కానీ ఇప్పటికైతే అవి తమ పరిమిత ఒప్పందాన్ని సమం జసమైనదిగా చేసే దారి కోసం అన్వేషిస్తున్నాయి. అమెరికా వైమానిక దళం మద్దతుతో ఇరాన్కు చెందిన అల్ కుద్స్ సైనికాధికారులు, సైన్యమూ ఇరాకీ భూతల ప్రతిఘటనా దాడికి నేతృత్వం వహించాయి. సహకారం వల్ల తక్షణ వ్యూహాత్మక లాభాల అనుభవమూ, విశాల ప్రయోజనకరమైన అంశాలు కలసి అమెరికా, ఇరాన్ల మధ్య అణు ఒప్పందం కుదరడాన్ని అనివార్యం చేశాయి. దీనికి కూడా అవాంతరాలు త లెత్తే అవకాశం ఉంది. అయితే అణు ఒప్పందం కుదిరితే ఇరాన్పై ఆంక్షల సడలింపు గురించి ఇప్పటికే ఐరాస భద్రతా మండలి సమాలోచనలు జరుపుతున్నది. అంతా అనుకున్నట్టే జరిగితే అమెరికా, ఇరాన్లు రెండూ ఇరాక్ హింసాగ్ని గుండాన్ని చల్లార్చడానికి కలిసి ప్రయత్నించడం ప్రారంభమవుతుంది. రెండిటిలో ఏదీ ఈ పనిని ఒంటరిగా చేయలేదు. ఇరాక్ భూభాగంపై ఇరాన్ కాల్బలం కవాతు చేయగలిగిన స్థితిలో ఉంది, అమెరికా సేనలు అక్కడ కాలు మోపే పరిస్థితి లేదు. తాత్కాలికమే అయినా అదీ ఉన్న స్థితి. ఐఎస్ఐఎస్ ఒక వ్యాధిలాగా తీవ్ర పర్యవసానాలతో ప్రబలి...అల్కాయిదా సమస్యను నల్లి కాటులా అనిపించేలా చేసే ప్రమాదకర అత్యవసర పరిస్థితిని రెంటిలో ఏదీ తక్కువగా అంచనా వేయడం లేదు. మనం మాట్లాడుతున్నది ఆత్మాహుతి దాడులకు పంపే ఉగ్రవాదుల గురించి కాదు.... అరబ్బు ప్రాంతాల్లోనూ, వాటిని దాటి కూడా విఫల పరిపాలన సృష్టించిన శూన్యాన్ని భర్తీ చేస్తూ దేశాలను ఆక్రమించడానికి జిహాద్ పేరిట సిద్ధంగా ఉన్న సేనల గురించి. ఈ పెద్ద లక్ష్యంతో పోలిస్తే ఇతరత్రా సమాం తర ప్రయోజనాలు ఏవైనా సాపేక్షంగా తక్కువ మూల్యం చెల్లించాల్సినవే. ఐఎస్ఐఎస్ కేంద్రంగా నెలకొనే అరాచక పరిస్థితులకు చెల్లించాల్సి మూల్యం అంచనాకు అందేది కాదు. ఇది అధ్యక్షుడు బరాక్ ఒబామా పదవీ కాలంలోని మిగతా భాగం గడిచేలోగా పూర్తయ్యే పనేమీ కాదు. అయితే ఆయన దీన్ని ప్రారంభించకపోతే ఆయన వారుసునిగా వచ్చేవారు కూడా ఆ పని చే యలేరు. 1979లో అమెరికా, ఇరాన్ల మధ్య విభేదాలు తలెత్తడం, అదే ఏడాది సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్థాన్పై దాడి చే యడంతో అంతవరకు ఉన్న ప్రయోజనాల పరస్పర అనుసంధానాల సంతులనం తలకిందులైంది. పశ్చి మ ఆసియాలో జరిగిన మూడు అరబ్బు-ఇజ్రాయెల్ యుద్ధాలను, లెబనాన్ సంక్లిష్ట కల్లోలాన్ని, పాలస్తీనా కోసం సాగిన బహుముఖ యుద్ధాలను ఆ సంతులనం తట్టుకుని నిలిచింది. షియా-సున్నీ శాంతికి హామీని కల్పిం చింది. సుదీర్ఘమైన ఈ డ్రామాలోని ఉప ఇతివృత్తం ఆ షియా-సున్నీ సంబం ధాలే. సోవియట్ సేనలు నిష్ర్కమించాయి, వారి యూనియన్ మరణిం చింది. కానీ పర్యవసానాలు ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. అమెరికా- ఇరాన్ అణు ఒప్పందం సైతం వారి మధ్య చెప్పుకోదగినంతటి సౌహార్ద్రతకు దారితీస్తుందని చెప్పలేం. ఆదర్శవంతమైన దాని కోసం అన్వేషణలో మంచి దాన్ని విడనాడవద్దనేది అంతర్జాతీయ జీవితంలోని మౌలిక నియమం. ఇప్పటికిదే ఉత్తమం. - ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే ముస్లిం కోటా రద్దు: అమిత్ షా
బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే ముస్లిం కోటా రద్దు: అమిత్ షా
49 కేసుల్లో రూ.37,63,170 సొత్తు స్వాధీనం
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటే అందరి లక్ష్యం
జగన్ను మళ్లీ సీఎం చేద్దాం
పద్మనాభంలో టీడీపీకి భారీ షాక్
No Headline
8 నుంచి 13 వరకు అప్పన్న ఆర్జిత సేవలు రద్దు
రెండో రోజూ చందనం అరగదీత
ఈవీఎంల వినియోగంపై అవగాహన తప్పనిసరి
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement