-
WC 2023: అర్థం చేసుకునే వాళ్లకు ఒక్క సైగ చాలు.. ఇంతకంటే: ధోని
ICC WC 2023- MS Dhoni Comments: టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఘనత మహేంద్ర సింగ్ ధోని సొంతం. టీ20 ఫార్మాట్లో 2007లో తొలిసారిగా ప్రవేశపెట్టిన వరల్డ్కప్ ట్రోఫీ గెలచిన ఈ మిస్టర్ కూల్ కెప్టెన్.. 2011లో భారత్కు రెండో వన్డే ప్రపంచకప్ అందించాడు. ఆ తర్వాత మళ్లీ చాంపియన్స్ ట్రోఫీ రూపంలో 2013లో మరోసారి ప్రతిష్టాత్మక టైటిల్ సాధించాడు. ధోని శకం ముగిసిన తర్వాత టీమిండియా మళ్లీ ఇంత వరకు ఐసీసీ టోర్నీ గెలిచిన సందర్భాలు లేవు. పదేళ్ల తర్వాత అయితే, పదేళ్ల తర్వాత సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023 రూపంలో మరోసారి టైటిల్ గెలిచే అవకాశం ముంగిట నిలిచింది భారత్. ట్రోఫీ గెలిచే దిశగా ఇప్పటికే అద్భుతమైన విజయాలతో రోహిత్ శర్మ సారథ్యంలోని జట్టు ముందుకు సాగుతోంది. వరుసగా ఐదు విజయాలతో అజేయంగా పూర్తి సమతూకంగా కనిపిస్తున్న భారత జట్టు ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్లలో ఐదూ గెలిచి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. తొలుత ఆస్ట్రేలియాను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. ఆ తర్వాతి మ్యాచ్లలో అఫ్గనిస్తాన్(8 వికెట్లు), పాకిస్తాన్(7 వికెట్లు), బంగ్లాదేశ్(7 వికెట్లు), న్యూజిలాండ్(4 వికెట్లు)పై వరుస విజయాలు సాధించింది. అన్నీ మంచి శకునములే ఈ నేపథ్యంలో హాట్ ఫేవవరెట్గా బరిలోకి దిగిన రోహిత్ సేన ఈసారి కప్పు కొట్టడం ఖాయమనే అభిప్రాయాలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఐసీసీ టైటిళ్ల ధీరుడు, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఈ విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులుగా.. ‘‘ఈ జట్టు చాలా బాగుంది. సమతూకంగా కనిపిస్తోంది. ప్రతి ఒక్క ఆటగాడు తమ పని తాము సమర్థవంతంగా పూర్తి చేస్తున్నారు. అన్నీ మంచి శకునాలే ఎదురవుతున్నాయి. ఒక్క సైగ చాలు ఇంతకంటే ఎక్కువ నేనేం చెప్పలేను. అర్థం చేసుకునేవాళ్లకు ఒక్క సైగ చాలు కదా!’’ అంటూ టీమిండియా ఈసారి ట్రోఫీని ముద్దాడుతుందని చెప్పకనే చెప్పాడు ధోని. ఈ మేరకు ధోని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. వరల్డ్కప్-2023లో టీమిండియా అక్టోబరు 29న ఇంగ్లండ్తో తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది. చదవండి: WC 2023: పొరపాటు చేయలేదు.. మా ఓటమికి కారణాలివే! అయినా..: బట్లర్ WC 2023: ఎవరు ఏం చెప్పినా వినాలి.. కెప్టెన్గా నేనున్నాంటే: రోహిత్ శర్మ MS Dhoni said, "India has a great balanced team in the World Cup. Everything is looking very good at this stage, I won't say more than this. A nod is as good as a wink". (Rigi). pic.twitter.com/yW8XlOZNVr — Mufaddal Vohra (@mufaddal_vohra) October 27, 2023 Hello Lucknow 👋#TeamIndia are here for their upcoming #CWC23 clash against England 👌👌#MenInBlue | #INDvENG pic.twitter.com/FNF9QNVUmy — BCCI (@BCCI) October 25, 2023 -
ఈ వరల్డ్కప్లోనే కోహ్లి.. సచిన్ సెంచరీల రికార్డు బ్రేక్ చేస్తాడు!
ICC WC 2023- Kohli Eyes On Big Records: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిని ఉద్దేశించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్కప్-2023 సందర్భంగా రన్మెషీన్.. భారత దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ సెంచరీల రికార్డును బ్రేక్ చేయగలడని పేర్కొన్నాడు. ఆరంభ మ్యాచ్లో ఆసీస్ మీద కోహ్లి అద్భుతంగా ఆడాడన్న రిక్కీ పాంటింగ్.. సెంచరీ చేజారిన లోటును తదుపరి మ్యాచ్లలో తీర్చుకుంటాడని అభిప్రాయపడ్డాడు. ఈ టోర్నీలో కనీసం రెండు శతకాలైనా బాదుతాడని ధీమా వ్యక్తం చేశాడు. కోహ్లి, రాహుల్ పట్టుదలగా నిలబడి కాగా చెన్నైలోని చెపాక్లో తొలి మ్యాచ్లోనే రోహిత్ సేన కష్టమ్మీద గెలిచిన విషయం తెలిసిందే. టాస్ ఓడి తొలుత ఫీల్డింగ్ చేసిన భారత్ కంగారూ జట్టును 199 పరుగులకే కట్టడి చేసింది. అయితే, స్వల్ప లక్ష్య ఛేదనలో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కోహ్లి(85), కేఎల్ రాహుల్(97- నాటౌట్) పట్టుదలగా నిలబడి అద్భుత ఇన్నింగ్స్తో జట్టుకు విజయం అందించారు. కాగా అంతర్జాతీయ వన్డేల్లో కోహ్లి ఇప్పటి వరకు 47 శతకాలు బాదాడు. మరో మూడు సెంచరీలు చేస్తే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పేరిట ఉన్న రికార్డు(49) బద్దలు కొట్టాలంటే కోహ్లి మరో మూడు సెంచరీలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో.. ది ఐసీసీ రివ్యూ పాడ్కాస్ట్లో ఇందుకు సంబంధించిన ప్రస్తావన రాగా.. ఆసీస్ లెజెండ్ రిక్కీ పాంటింగ్ స్పందిస్తూ.. ‘‘ఈసారి కోహ్లి కచ్చితంగా కనీసం రెండు సెంచరీలు చేస్తాడు. కనీసం రెండు శతకాలు ఖాయం ఒకవేళ అంతకు మించి రాణిస్తే కథ వేరేలా ఉంటది. కోహ్లికి ఇదే చివరి వన్డే వరల్డ్కప్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ అదే మైండ్సెట్తో గనుక బరిలోకి దిగితే పరుగుల దాహం తీర్చుకోకుండా వెనుదిరగడు. ప్రస్తుతం కోహ్లి మంచి ఫామ్లో ఉన్నాడు. సచిన్ రికార్డును సమం చేస్తాడు లేదంటే బ్రేక్ చేసినా చేస్తాడు. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేసి ఈ వరల్డ్కప్ను చిరస్మరణీయం చేసుకుంటాడు’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: వెళ్లి ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడుకో పో బాబర్.. పాక్ కెప్టెన్పై ఫ్యాన్స్ ట్రోల్స్ -
పాక్, కివీస్లకు అంత సీన్ లేదు.. సెమీస్లో ఆ 4 జట్లే! ఫైనల్లో: ఆండర్సన్
ICC WC 2023 Winner Prediction: వన్డే వరల్డ్కప్-2023లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ టైటిల్ నిలబెట్టుకుంటుందని ఆ జట్టు వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ ధీమా వ్యక్తం చేశాడు. ఐసీసీ ఈవెంట్ ఫైనల్లో ఈసారి టీమిండియాను ఓడించి ట్రోఫీ గెలుస్తుందంటూ అతి విశ్వాసం ప్రదర్శించాడు. కాగా 2019 ప్రపంచకప్ హీరో బెన్ స్టోక్స్ రాకతో ఇంగ్లిష్ జట్టు మరింత పటిష్టంగా మారిన విషయం తెలిసిందే. అయితే, ప్రపంచకప్-2023లో భారత్ వేదికగా ఆడిన తొలి మ్యాచ్కే స్టోక్సీ దూరం కావడం ఇంగ్లండ్పై ప్రభావం చూపింది. ఆరంభ మ్యాచ్లో కివీస్ చేతిలో చిత్తుగా ఓడి ఈ నేపథ్యంలో న్యూజిలాండ్తో ఈవెంట్ ఆరంభ మ్యాచ్లో ఏకంగా 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది బట్లర్ బృందం. -2.149 రన్రేటుతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం అట్టడుగున పదో స్థానంలో ఉంది. ఈ క్రమంలో మంగళవారం ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్తో మ్యాచ్కు సన్నద్ధమవుతోంది. రెండో మ్యాచ్లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ టెస్టు క్రికెటర్గా కొనసాగుతున్న ఆండర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్కప్ 13వ ఎడిషన్లో సెమీస్ చేరే జట్లు, టైటిల్ విన్నర్పై తన అంచనాను తెలియజేశాడు. ఆండర్సన్(PC: X) సెమీస్లో ఆ 4 జట్లే.. ఇక ఫైనల్లో ‘‘ఇంగ్లండ్, ఇండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఈసారి సెమీ ఫైనలిస్టులుగా నిలుస్తాయి. ఆసీస్తో ఇటీవలి సిరీస్లో సౌతాఫ్రికా(3-2తో గెలుపు) అదరగొట్టింది. నిజానికి ప్రస్తుతం ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. బౌలింగ్లోనూ మంచి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక.. పాకిస్తాన్, న్యూజిలాండ్ కూడా సెమీస్ దిశగా పయనిస్తాయి. కానీ.. టాప్-4లో నిలవలేవు. నా అంచనా ప్రకారం.. హోరాహోరీ ఫైనల్లో ఇంగ్లండ్ టీమిండియాను ఓడించి టైటిల్ గెలుస్తుంది’’ అని దిగ్గజ బౌలర్ ఆండర్సన్ బీబీసీ టెస్టు మ్యాచ్ స్పెషల్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా నవంబరు 19న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. చదవండి: నువ్వెందుకు ఉన్నట్లు? అయినా రాహుల్ను ఎందుకు ఆడించట్లేదు: యువీ -
'కోహ్లి, రోహిత్ కాదు.. వరల్డ్కప్ టాప్ రన్ స్కోరర్ అతడే'
వన్డే ప్రపంచకప్-2023లో తొలి మ్యాచ్ ఆడేందుకు టీమిండియా సిద్దమైంది. ఆదివారం చెన్నై వేదికగా ఐదు సార్లు వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మ్యాచ్కు ముందు టీమిండియా యువ ఓపెనర్ శుబ్మన్ గిల్పై భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఏడాది వరల్డ్కప్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా గిల్ నిలుస్తాడని జహీర్ ఖాన్ జోస్యం చెప్పాడు. కాగా గిల్ ప్రస్తుతం వన్డే క్రికెట్లో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. తన గత 20 వన్డేల్లో ఏకంగా 1230 పరుగులు సాధించాడు. వన్డేల్లో అతడి సగటు ఏకంగా 72.35 ఉండటం గమనార్హం. ఈ ఏడాడి అతడు ఏకంగా ఆరు సెంచరీలు సాధించాడు. ఈ నేపథ్యంలో జహీర్ ఇండియా టూడేతో మాట్లాడుతూ.. వన్డే క్రికెట్లో గిల్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు గిల్ అదరగొట్టాడు. అతడు ఈ ఫార్మాట్లో సెంచరీలు, డబుల్ సెంచరీ సాధించాడు. కచ్చితంగా ఈ మెగా టోర్నీలో టాప్ రన్ స్కోరర్గా నిలుస్తాడని చెప్పుకొచ్చాడు. తొలి మ్యాచ్కు డౌటే.. కాగా గిల్ ప్రస్తుతం డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. తొలి మ్యాచ్కు అతడి అందుబాటుపై సందేహం నెలకొంది. అయితే అతడి ఆరోగ్యం కాస్త మెరుగపడినట్లు భారత హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. చదవండి: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా బ్యాటర్.. ఏబీ డివిలియర్స్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బద్దలు -
WC 2023: ఆసీస్తో టీమిండియా తుదిజట్టుపై ఫ్యాన్స్ స్పందన ఇలా!
వన్డే వరల్డ్కప్-2023లో టీమిండియా ఆరంభ మ్యాచ్కు కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. అక్టోబరు 8(ఆదివారం)న ఆస్ట్రేలియాతో మ్యాచ్తో చెన్నై వేదికగా రోహిత్ సేన ఈ ఐసీసీ టోర్నీని ఆరంభించనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ తదితర 15 మంది సభ్యులతో బీసీసీఐ జట్టును ఖరారు చేసింది. ఇందులో ఆస్ట్రేలియాతో మ్యాచ్లో తుది జట్టు(Playing XI)లో ఎవరు ఉండాలని మీరు భావిస్తున్నారు? అన్న సాక్షి.కామ్ ప్రశ్నకు అభిమానుల నుంచి స్పందన ఇలా.. 1.రోహిత్ శర్మ- 91.1% 2.విరాట్ కోహ్లి-90.9% 3.జస్ప్రీత్ బుమ్రా-89.3% 4.రవీంద్ర జడేజా-88.3% 5.కేఎల్ రాహుల్--86.7% 6.హార్దిక్ పాండ్యా- 85.2% 7.మహ్మద్ సిరాజ్- 78.6% 8.కుల్దీప్ యాదవ్-71.6% 9.రవిచంద్రన్ అశ్విన్- 69.3% 10.శుబ్మన్ గిల్-66.9% 11. శ్రేయస్ అయ్యర్- 66.1% (Note: This content is neither created nor endorsed by Google)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement